‘ప్రోగ్రెస్ కాదు..’ అంతా బోగస్!
పరీక్షల్లో సున్నా మార్కులొచ్చే కొందరు మొద్దబ్బాయిలు... వాటికి ముందు 10 పెట్టేసి 100 మార్కులు వచ్చాయంటూ ప్రోగ్రెస్ రిపోర్టును మార్చేసి తల్లిదండ్రుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తారు. తెలిసీ తెలియని వయసులో చిన్నపిల్లలు చేసే పనులవి.
రైతు భరోసా హామీలపై ఇదీ రిపోర్ట్
అడుగడుగునా కోతలు... పైగా బాకాలు
పథకాలపై రాయితీలు ఎత్తేసి మోసం
వ్యవసాయాన్ని ఉద్ధరించామంటూ ప్రగల్భాలు
ఎన్నికల ప్రచారంలో కపట నాటకాలు
ఈనాడు, అమరావతి
విద్యార్థి ఏడాది చదువుకు ప్రోగ్రెస్ రికార్డు ఎలానో...
పాలకుడి ఐదేళ్ల పాలనకు ప్రగతి నివేదిక అంతే...
పిల్లాడు... మార్కులతో తల్లిదండ్రులను,
నాయకుడు... అభివృద్ధితో పౌరులను మెప్పించాలి!
కానీ, ఎన్నికల్లో మరోసారి ఓట్లు కొట్టేసేందుకు...
జగన్ తాను చేయని పనులను దాచేస్తున్నారు!
గోరంత చేసిన వాటిపై కొండంత ముచ్చట చెబుతున్నారు!
పరీక్షల్లో సున్నా మార్కులొచ్చే కొందరు మొద్దబ్బాయిలు... వాటికి ముందు 10 పెట్టేసి 100 మార్కులు వచ్చాయంటూ ప్రోగ్రెస్ రిపోర్టును మార్చేసి తల్లిదండ్రుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తారు. తెలిసీ తెలియని వయసులో చిన్నపిల్లలు చేసే పనులవి. అలాంటి పనే 51 ఏళ్ల వయసున్న సీఎం చేస్తే ఏమనాలి? ఎందుకంటే ఓ అన్నా.. అక్కా.. అవ్వా... ఇదిగో నా ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటూ జగన్ చేస్తున్న ఎన్నికల ప్రసంగాలన్నీ సున్నా ముందు పది చేర్చి చెబుతున్నవే మరి. నవరత్నాలలోని రైతు భరోసా కింద ఇచ్చిన హామీల అమలునే పరిశీలిస్తే... తాను చెప్పేది అబద్ధమని తెలిసినా విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతుల చేయి పట్టుకుని నడిపిస్తున్నామంటూ ప్రోగ్రెస్ రిపోర్టుకు మోసపు రంగులను అద్దుతున్నారు. హామీలను వంద శాతం అమలు చేసినట్లు బాకాలు ఊదుతున్నారు.
రైతు భరోసాకు కోత పెట్టేశారు
చెప్పింది: ఒక్కో రైతుకు ఏడాదికి రూ.12,500 చొప్పున నాలుగేళ్లకు రూ.50 వేలు ఇస్తామన్నారు.
చేసిందేంటి?: ఏడాదికి రూ.7,500 చొప్పున అయిదేళ్లకు రూ.37,500 (1.07లక్షల మంది కౌలు రైతులకే ఏడాదికి రూ.13,500 చొప్పున). మాత్రమే ఇచ్చారు.
ఎగ్గొట్టిన సొమ్మెంత?: ఐదేళ్లలో రూ.9,800 కోట్లు.
మూడు కోట్ల ఎకరాలకు పంటల బీమా పోయింది
చెప్పింది: పంటల బీమాపై రైతులు ఆలోచించాల్సిన పనిలేదని, సాగు చేసిన ప్రతి ఎకరానికి ఉచిత పంటల బీమా అమలు చేస్తామన్నారు.
చేసిందేంటి?: కొన్ని పంటలకే.. అదీ ఈ-క్రాప్లో నమోదైతేనే అన్నారు. అధిక శాతం రైతులకు పరిహారం ఇవ్వకుండా మొండిచేయి చూపారు.
జరిగింది: ఐదేళ్లలో 3 కోట్ల ఎకరాలకు పంటల బీమా లేకుండా చేశారు.
వడ్డీలేని పంట రుణాలా... తూచ్!
చెప్పింది: రైతన్నలకు వడ్డీలేని పంట రుణాలను ఇస్తామన్నారు.
చేసిందేంటి?: గెలిచాక రూ.లక్ష వరకే అని నిబంధన పెట్టారు. అదీ వడ్డీతో సహా ముందే కట్టిస్తున్నారు. కొర్రీలపై కొర్రీలేసి.. కొందర్ని తప్పించి ఏడాది తర్వాత ఎప్పటికో ఇస్తున్నారు. పావలా వడ్డీని ఎత్తేశారు.
రైతన్నలే ‘బోరు’మనేలా చేశారు
చెప్పిందేంటి?: రైతులకు ఉచితంగా రెండు లక్షల బోర్లు వేయిస్తామన్నారు.
చేసిందేంటి?: రాష్ట్రవ్యాప్తంగా తవ్వించింది ఐదేళ్లలో 25 వేల బోర్లు మాత్రమే. (ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదంటూ.. రైతుల నుంచే డీజిల్ సొమ్ములను వసూలు చేస్తున్నారు. తవ్విన బోర్లకు విద్యుత్తు కనెక్షన్లు, మోటార్లూ ఇవ్వడం లేదు.)
పేరుకే వెలుగులు.. రైతులకు కోతలు!
చెప్పిందేంటి?: వ్యవసాయానికి పగటిపూటే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తు ఇస్తామన్నారు.
చేసిందేంటి?: సేద్యానికి చేస్తోంది 7 గంటల విద్యుత్తు సరఫరానే. అదీ పగలు, రాత్రి రెండు, మూడు దఫాలుగా. అయిదేళ్లలో రాత్రిపూట మోటార్లు వేయడానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన రైతన్నలెందరో ఉన్నారు. ఇదిచాలదన్నట్లు అన్నదాతల మెడపై కత్తి పెట్టి వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారు.
ఆక్వా కరెంటు... అంతే సంగతులు
చెప్పింది: ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్తును రూ.1.50 చొప్పునే సరఫరా చేస్తామన్నారు.
చేసిందేంటి?: ఆక్వా రైతులు 62 వేల మంది వరకు ఉంటే... వారిలో సగటున 55 వేల మందికి మూడేళ్లపాటు మాత్రమే పథకం అమలు చేశారు. 2022-23 నుంచి ఆక్వా జోన్లో పదెకరాల వరకే విద్యుత్తు రాయితీ అనే కొత్త నిబంధన తీసుకొచ్చారు. అర్హుల సంఖ్యను 41 వేలకు కుదించారు. ఏడాదికి ఏకంగా రూ.400 కోట్లు మిగుల్చుకుంటున్నారు.
తెదేపాలోనే రద్దు.. అయినా మోసపు పద్దు
చెప్పింది: వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ను, టోల్ట్యాక్స్ను రద్దు చేస్తామన్నారు.
చేసిందేంటి?: గత తెలుగుదేశం ప్రభుత్వమే వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ రద్దు చేసింది. అయినా పాత పద్దుకు మోసాలద్దారు.
దోచుకునే వారికే మద్దతు!
చెప్పింది: రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. పంట వేసే ముందు రేట్లు ప్రకటిస్తామన్నారు. గిట్టుబాటు ధరలకు గ్యారంటీ ఇస్తామన్నారు.
చేసిందేంటి?: ధరల స్థిరీకరణ నిధికి ఏడాదికి రూ.500 కోట్లే ఇచ్చారు. వాటిని కూడా బడ్జెట్ పత్రాలకే పరిమితం చేశారు. పంటలకు ధరల్లేవంటూ రైతులు ఆర్బీకేలకు వెళ్లినా... ఇదిగో, అదిగో అంటూ పంటకాలం పూర్తయ్యాక ఎప్పటికో నామమాత్రంగా కొంటున్నారు. అప్పటికే చాలామంది రైతులు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. గిట్టుబాటు ధరకు గ్యారంటీ అనేదే లేదు. మద్దతు ధరపై ధాన్యం కొనాలంటే క్వింటాకు 20 కిలోల ధాన్యమో, రూ.400 వరకు నగదునో ఎదురు ముట్టజెప్పాల్సిన దుస్థితి నెలకొంది.
2019లో చిరుధాన్యాలతోపాటు మిరప, పసుపు, బత్తాయి, అరటి, ఉల్లికి మద్దతు ధరలు ప్రకటించారు. 2024 వచ్చినా అవే ధరలు కొనసాగుతున్నాయి. కేంద్రం ఏటా పెంచుతున్నా.. రాష్ట్రం మాత్రం పాత ధరల్నే తిప్పితిప్పి చెబుతోంది. సాగుకు పెట్టుబడుల ఖర్చు ఏటా 20% పెరుగుతున్నా మద్దతు ధర మాత్రం పెంచడం లేదు.
కర్షకులను విపత్తులకు వదిలేశారు
చెప్పిందేంటి?: రాష్ట్రంలో రూ.4 వేల కోట్లతో విపత్తుల సహాయ నిధి ఏర్పాటు చేస్తామన్నారు.
చేసిందేంటి?: 2019 నుంచి వరసగా వరదలు వస్తున్నాయి. గత రెండేళ్లుగా కరవు సైతం వెంటాడుతోంది. అయినా ఉదారంగా చేయూతనివ్వలేదు. వరదలతో నిండా మునిగితే 10% మందికైనా సాయం అందలేదు. నిరుడు కరవుతో రైతులు అల్లాడుతుంటే... ఖరీఫ్, రబీలో కలిపి 190 కరవు మండలాలను ప్రకటించి అన్నదాతలకు తీరని ద్రోహం చేశారు. విపత్తు సాయంలోనూ ఉదారత లేదు. 2014లో అప్పటి తెదేపా ప్రభుత్వం నిర్ణయించిన సాయమే ఇప్పటికీ అమలవుతోంది. వాటిలోనూ కొన్నింటికి కోత పెట్టారు.
అటకెక్కిన ఆహార శుద్ధి పరిశ్రమలు
చెప్పింది: ప్రతి నియోజకవర్గంలో శీతల గిడ్డంగులను, గోదాములను నిర్మిస్తామన్నారు. అవసరం మేరకు ప్రతి మండలానికి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు.
చేసిందేంటి?: కొత్త శీతల గిడ్డంగి ఏర్పాటు లేదు. గతంలో అనుమతిచ్చిన వాటిని కూడా నిలిపేశారు. రాయలసీమలో టమోటా పండించే చోట మండలానికి ఒక టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ తెస్తామన్న హామీకి నీళ్లొదిలారు. ఆక్వా సాగు చేసే చోట శీతలీకరణ వసతుల కల్పనకూ మొండిచేయి చూపారు.
పాడి రైతుకు బోనస్... తుస్!
చెప్పింది: మొదటి ఏడాది సహకార రంగాన్ని పునరుద్ధరిస్తామన్నారు. రెండో ఏడాది నుంచి సహకార డెయిరీలకు పాలు పోస్తే ప్రతి పాడి రైతుకు లీటరుకు రూ.4 చొప్పున బోనస్ ఇస్తామన్నారు.
చేసింది: ఒంగోలు సహా... ఇతర సహకార డెయిరీలను మూసేశారు. వాటిని అమూల్కు నామమాత్రపు లీజుకు అప్పనంగా అప్పగించారు. రూ.6వేల కోట్లతో పాల సేకరణ కేంద్రాలు, బల్క్మిల్క్ యూనిట్లు, ఇతర మౌలిక వసతులను కల్పించి అమూల్కు పాలను సేకరించి ఇస్తున్నారు. లీటరుకు రూ.4 బోనస్ అనే మాటే లేదు.
బాధిత కుటుంబాలకు మోసం
చెప్పింది: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వైఎస్ఆర్ బీమా ద్వారా రూ.7 లక్షల చొప్పున ఇస్తామన్నారు. ఆ డబ్బు అప్పుల వాళ్లకు చెందకుండా... చట్టం తెచ్చి, బాధితులకు అండగా ఉంటామన్నారు.
చేసేదేంటి?: వ్యవసాయంలో వరసగా అయిదేళ్లుగా నష్టాలే. రాష్ట్రంలో సగటున రోజుకో రైతు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అయినా వారిలో 10% మందికి కూడా ప్రభుత్వ సాయం అందడం లేదు. రెవెన్యూ, పోలీసు, వ్యవసాయాధికారుల కమిటీలు వారి ఇళ్లకు వెళ్లి పరిశీలించడం లేదు. అప్పులకు వ్యవసాయం కారణం కాదంటూ తిరస్కరిస్తున్నారు. వారి కుటుంబాల గోడు పట్టించుకునే నాథుడే లేరు. కౌలు రైతుల కుటుంబాల్లో అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటే... కొర్రీలతో సాయానికి మోకాలడ్డుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు