50,000 → 10,117 → 3,350
‘‘మాట తప్పను.. మడమ తిప్పను.చెప్పింది చేస్తాం.. చెప్పనిదీ చేస్తాం..’’‘మీట’ల మాస్టర్ జగన్ ‘బ్రాండ్’ మాటలు ఇవి.కానీ, మాట మీద నిలబడే మనిషి కాదు కదా జగన్..!
ఒప్పంద ఉద్యోగులపై.. క్రమబద్ధీకరణ పేరిట జగన్ సర్కారు కాకి లెక్కలు
మ్యానిఫెస్టోలో చెప్పింది ఒకటి.. ఆచరణలో పెట్టింది మరొకటి..
ఎన్నికల షెడ్యూల్కు రెండు రోజుల ముందు ఉత్తర్వులు
కోడ్ కారణంగా చేయలేకపోయామని కపట నాటకం
ఈనాడు, అమరావతి
‘‘మాట తప్పను.. మడమ తిప్పను.
చెప్పింది చేస్తాం.. చెప్పనిదీ చేస్తాం..’’
‘మీట’ల మాస్టర్ జగన్ ‘బ్రాండ్’ మాటలు ఇవి.
కానీ, మాట మీద నిలబడే మనిషి కాదు కదా జగన్..!
అందుకే మాట ‘తిప్పారు’!
అధికారంలోకి వచ్చాక ఒప్పంద ఉద్యోగుల కొలువులను క్రమబద్ధీకరించి వారి సంఖ్యను ‘తగ్గిస్తా’నన్న జగన్..
తన మాట నిలబెట్టుకున్నారు!
ఎలా..
క్రమబద్ధీకరించాల్సిన ఉద్యోగాల సంఖ్యను ‘తగ్గించేశారు!’
మ్యానిఫెస్టోలో ఏం చెప్పారు
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఒప్పంద(కాంట్రాక్టు) ఉద్యోగులను వారి అర్హత, సర్వీసును పరిగణనలోకి తీసుకుని వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేస్తాం. క్రమేణా ఇలా క్రమబద్ధీకరిస్తూ ఒప్పంద ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తాం.
సీఎం అయ్యాక ఏం చేశారు
క్రమబద్ధీకరించాల్సిన ఉద్యోగుల సంఖ్యను ఎలా తగ్గించాలనే దానిపైనే కసరత్తు చేశారు. రకరకాల నిబంధనలు తీసుకొచ్చి అర్హుల సంఖ్యకు కత్తెర వేశారు. పంచపాండవులు ఎంత మంది అంటే.. మంచం కోళ్లలాగ ముగ్గురు అని రెండు వేళ్లను చూపిన సామెతలా వ్యవహరించారు. రాష్ట్రంలో 50 వేలకుపైగా ఒప్పంద ఉద్యోగులు ఉంటే 10,117 మందిని రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించి కేవలం 3 వేలమంది ఉద్యోగులనే క్రమబద్ధీకరించారు. అదీ.. ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి రెండు రోజుల ముందే..!
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. వీలైనంత ఎక్కువ మంది ఒప్పంద ఉద్యోగుల ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని ఊరించారు. క్రమబద్ధీకరణకు చట్టం తీసుకొచ్చి, ఉత్తర్వులు ఇచ్చి వారితో క్షీరాభిషేకం చేయించుకున్నారు. తర్వాత రకరకాల సాకులు చూపుతూ రెగ్యులరైజ్ చేయాల్సిన ఒప్పంద ఉద్యోగుల సంఖ్యను తగ్గించేశారు. కొందరి ఉద్యోగాలనే క్రమబద్ధీకరించారు. అదీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి కొన్నిరోజుల ముందే. ‘కోడ్’ వచ్చేసిందంటూ మిగిలినవారి ఆశలను అడియాసలు చేసి తన మాయమాటలతో మోసగించారు.
నిబంధనలతో కాలం గడిపేసి..
ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుంచి జగన్.. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశానికి సంబంధించి రకరకాల నిబంధనలను తెరపైకి తీసుకొచ్చారు. వడపోతలపై వడపోతలు చేసి సాగదీశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చేంత వరకు ఇదే ధోరణిని ప్రదర్శించి.. ఇక రెగ్యులరైజ్ చేయలేమంటూ చేతులెత్తేశారు. ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఇష్టం లేని జగన్.. రెగ్యులరైజ్ సంఖ్యను తగ్గించడానికి మొదట 2014 జూన్ నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారే అర్హులనే నిబంధన విధించారు. దీనిపై ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రావడంతో కొంతకాలం సాగదీసి మాట మార్చారు. 2014 జూన్ నాటికి పనిచేస్తూ ఉండేవారే అర్హులు అన్న నిబంధన తీసుకొచ్చారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వారినే క్రమబద్ధీకరిస్తామని మరొక నిబంధన పెట్టారు. దీంతో విద్య, వైద్య, ఆరోగ్య, అటవీ, సాంకేతిక విద్యా శాఖ తదితరాల్లో మినహా.. సొసైటీలు, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న వారు అనర్హులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 50 వేలకుపైగా ఒప్పంద ఉద్యోగులు పనిచేస్తుండగా.. జగన్ సర్కారు విధించిన నిబంధనలతో కేవలం 10,117 మంది మాత్రమే క్రమబద్ధీకరణకు అర్హత సాధించారు. వారిలో 3,350 మంది ఉద్యోగాలను మాత్రమే రెగ్యులరైజ్ చేశారు.
తలాతోక లేని తలతిక్క నిబంధనలు
ఉద్యోగుల రెగ్యులరైజేషన్కు సంబంధించి మ్యానిఫెస్టోలో ఎలాంటి నిబంధనలు పేర్కొనని జగన్.. క్రమబద్ధీకరణకు వచ్చేసరికి మాత్రం సవాలక్ష షరతులు పెట్టారు. ఒప్పంద ఉద్యోగులతో ఓ ఆట ఆడుకున్నారు! ఆ నిబంధనలు ఇలా..
- ఒప్పంద ఉద్యోగి పనిచేస్తున్న పోస్టు.. ప్రభుత్వం మంజూరు చేసినదై ఉండాలి.
- ఉద్యోగంలో చేరిన నాటి నుంచి క్రమబద్ధీకరించే సమయానికి మంజూరు పోస్టులోనే పనిచేస్తూ ఉండాలి.
- ఉద్యోగ నియామకానికి ప్రకటన జారీ కావాలి. ఆ పోస్టుకు రిజర్వేషన్ రోస్టర్ అమలవ్వాలి.
- ఏపీపీఎస్సీ ద్వారా భర్తీకి నోటిఫై చేసిన పోస్టు కాకుండా ఉండాలి.
ఇలా అంతూపొంతులేని నిబంధనలు తెరపైకి తీసుకొచ్చి ఒప్పంద ఉద్యోగుల సంఖ్యను తగ్గించేశారు. విద్యాశాఖలో సబ్జెక్టుకు సంబంధించి క్లియర్ వేకెన్సీ ఉండాలన్న నిబంధనతోనూ చాలా మంది అర్హత కోల్పోయారు. ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టుల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నా సబ్జెక్టుల విషయంలో తేడా ఉంది. అన్ని విభాగాల్లోని ఉద్యోగాల క్రమబద్ధీకరణకు కసరత్తు చేస్తున్నట్లు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చే వరకు కపటనాటకం ఆడిన వైకాపా సర్కారు.. కోడ్ వచ్చిన తర్వాత కుదరదు అంటూ మోసం చేసింది. ఇప్పుడు.. మరోసారి క్రమబద్ధీకరణ జపం పఠిస్తూ ఒప్పంద ఉద్యోగులను మభ్యపెట్టేందుకు జగన్ ‘సిద్ధం’ అయ్యారు.
ప్రభుత్వ తప్పులకు ఉద్యోగులు బలి
ఇంటర్మీడియట్ విద్యలో గత కొన్నేళ్లుగా 3,593 మంది ఒప్పంద ప్రాతిపదికన అధ్యాపకులుగా కొనసాగుతున్నారు. వారిలో ఒక్కరినీ రెగ్యులరైజ్ చేయలేదు వైకాపా సర్కారు. అందుకు ఏవేవో కారణాలు చూపింది.
- రాష్ట్రంలోని 82 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అసలు లెక్చరర్ పోస్టులే మంజూరు కాలేదు. వాటిలో కాంట్రాక్ట్ లెక్చరర్లతోనే నెట్టుకొస్తున్నారు. వైకాపా ప్రభుత్వం వారందర్నీ క్రమబద్ధీకరించాలనుకుంటే పోస్టులు మంజూరు చేయొచ్చు. కానీ, జగన్ ఈ విషయాన్ని పట్టించుకోలేదు.
- 2021లో ఏపీపీఎస్సీ ద్వారా 180 మంది అధ్యాపకులు నియమితులయ్యారు. వారి కోసం అప్పటికే మంజూరైన పోస్టుల్లో పనిచేస్తున్న 175 మంది ఒప్పంద ఉద్యోగులను నాన్ శాంక్షన్డ్ పోస్టులోకి నెట్టేసింది. ఇది ప్రభుత్వం చేసిన తప్పైనా దానికి ఒప్పంద ఉద్యోగులనే బాధ్యులుగా చేసింది.
- శాంక్షన్డ్ పోస్టులు లేని జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 475 మంది అధ్యాపకులకు జీతాల సమస్య రావడంతో 2020లో వారిని మంజూరు పోస్టుల్లోకి మార్చింది. తెలుగు, సివిక్స్ సబ్జెక్టులకు మంజూరు పోస్టులు లేవని 51 మందిని నాన్ శాంక్షన్డ్ పోస్టుల్లోనే వదిలేసింది. వీరందరినీ అనర్హులుగా తేల్చింది. ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన ఈ తప్పిదానికి అమాయకులైన లెక్చరర్లను బలి చేసింది.
- డిగ్రీ కళాశాలల్లో 650 అర్హులైన వారు ఉండగా.. వారిలో ఒక్కరి ఉద్యోగాన్ని కూడా క్రమబద్ధీకరించలేక పోయింది వైకాపా సర్కారు
‘పాలిటెక్నిక్’లో..
రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో 309 మంది ఒప్పంద ఉద్యోగులు పనిచేస్తుండగా.. ఇద్దరి ఉద్యోగాలను మాత్రమే క్రమబద్ధీకరించారు. మిగిలినవారికి మొండిచేయి చూపారు. వర్క్షాపుల్లో 140 మంది అటెండర్లు పనిచేస్తుంటే.. కేవలం 22 మందినే రెగ్యులరైజ్ చేశారు. వీరిలో కొందరికి ఎన్నికల కోడ్ వచ్చిన రోజు ఉదయమే పీఓ ఇచ్చారు. కమిషనర్ నియామక ఉత్తర్వులు ఇచ్చేలోపు కోడ్ రావడంతో
నియామకాలు నిలిచిపోయాయి.
వైద్య ఆరోగ్య శాఖలో..
వైద్య ఆరోగ్య శాఖలో 2014 జూన్ 2కు ముందు విధుల్లో చేరిన సుమారు వెయ్యి మంది ఒప్పంద ఉద్యోగులను ప్రభుత్వం.. కోర్టు కేసులను సాకుగా చూపి పక్కన పెట్టింది. ఈ శాఖలో ఒప్పంద విధానంలో పనిచేస్తున్న 3,821 మందికి క్రమబద్ధీకరణ అర్హత ఉందని గుర్తించారు. వీరిలో మల్టీపర్సస్ హెల్త్ అసిస్టెంట్లు(మేల్) వెయ్యి మంది వరకు ఉన్నారు. 2002లో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. 2003లో వీరు పోస్టింగులు పొందారు. ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలపై కోర్టుల్లో పిటిషన్లు దాఖలు కావడంతో కొందరిని విధుల నుంచి తప్పించారు. తుది తీర్పు వచ్చిన తర్వాత విధుల్లోకి తీసుకున్నారు. కానీ, ప్రభుత్వం వీరి ఉద్యోగాలను ఇంతవరకు క్రమబద్ధీకరించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్.!
విద్యుత్ బకాయిల్ని వెంటనే చెల్లించకపోతే వారి ఫ్లాట్లకు కరెంట్ కట్ చేస్తామని రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తూ ఉచిత వసతి సదుపాయాన్ని వినియోగించుకుంటున్న ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. -
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
జగన్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులపై 1,500కుపైగా కేసులు పెట్టారని, చివరికి ధర్నా చేశారంటూ 80ఏళ్ల వయసుపైబడిన పెన్షనర్లపైనా కేసులు నమోదు చేశారని అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
బ్యాంకుల్లో నగదు జమకాని వారికి.. 4న ఇంటింటికీ పింఛన్ పంపిణీ
బ్యాంకు ఖాతాలు మనుగడలో లేని కారణంగా పింఛను నగదు జమకాని వారికి మే 4వ తేదీన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్కుమార్ వెల్లడించారు. -
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) ప్రవేశాల కౌన్సెలింగ్ను ఉన్నత విద్యామండలి ఏడాది పొడవునా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై సీఎం వెనక్కి తగ్గరు: మంత్రి పెద్దిరెడ్డి
ల్యాండ్ టైటిలింగ్ యాక్టును సీఎం జగన్ కచ్చితంగా అమలు చేసి తీరుతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
అన్నం ముద్దపైనా అక్కసే!
అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టుగా.. విపక్షాలపైన తనకున్న ఉక్రోషాన్ని.. నిర్భాగ్యులమీద చూపారు జగన్... గత తెదేపా ప్రభుత్వం తెచ్చిన అన్న క్యాంటీన్లను వచ్చీరాగానే మూసేయించారు... రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఆ క్యాంటీన్లు.. రోజూ వేల మంది క్షుద్భాద తీర్చేవి. దీనిపై విమర్శలు పెరిగాక.. ‘ఆహా’ క్యాంటీన్లు తెచ్చినా... జగన్ పాలనలానే.. దిక్కూదివానం లేనట్లుంది వాటి పరిస్థితి. -
‘అన్నపూర్ణ’ అప్పుల కుప్ప
అద్భుత రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి... 70 శాతం పూర్తయిన పోలవరం... ఆశతో దూసుకొచ్చిన వందలాది ఐటీ పరిశ్రమలతో... ... కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన బిడ్డలా... ఐదేళ్ల కిందట జగన్ చేతికొచ్చింది ఆంధ్రావని! -
‘భీమ్లీ’ ఖల్ నాయక్!
‘‘నాయక్ నహీ.. ఖల్ నాయక్ మై హూ..!’’ అంటూ ఆయన చేసే హడావుడి అంతాఇంతా కాదు. ‘‘ఏం చేస్తున్నావ్? యూనిఫామ్ తీసేయ్..!’’ అంటూ పోలీసులపైనే రుసరుసలాడతారు. -
అంతా.. ఆ ఏడు చేపలకే!
వడ్డించే వాడు జగన్ అయితే... కేటాయింపులు ఇలాగే ఉంటాయి మరి. తన తండ్రి హయాంలోనే కంపెనీలతో రూ.లక్షల కోట్ల ‘క్విడ్ప్రోకో’ లావాదేవీలకు తెరతీసిన ఆయన... తాను గద్దెనెక్కాక ‘గంపగుత్త’ సూత్రాన్ని అనుసరించారు. -
వైకాపా హయాంలో ఎస్సీ కమిషన్ నిర్వీర్యం
వైకాపా హయాంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు ధ్వజమెత్తారు. సమతా సైనిక్దళ్ ఆధ్వర్యంలో గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
14 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్
అత్యంత సమస్యాత్మకమైన 14 నియోజకవర్గాల పరిధిలో మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ పెడతామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
పథకాలకు గండికొట్టి.. గొంతెండబెట్టి!
ధ్వంసరచనే తప్ప దార్శనికత లేని జగన్ పాలనలో పట్టణాల్లో గుక్కెడు తాగునీళ్లూ కరవయ్యాయి. తెదేపా తెచ్చిందన్న ఏకైక కారణంతో రూ.వేల కోట్ల పథకాలను ఎండబెట్టిన ఈ నీరో చక్రవర్తి ఎండల్లో జనం గొంతెండి అలమటిస్తుంటే... తాడేపల్లి ప్యాలెస్లో ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నారు... కేవలం తన పంతం కోసం జనం సంక్షేమాన్ని వదిలేసిన ఈ ప్రభుత్వాధినేతను ఏమని పిలవాలి? -
పార్టీలకు కొమ్ముకాస్తున్న కొందరు ఐఏఎస్ అధికారులు
‘ప్రజలకు మేలు చేయాల్సిన కొందరు ఐఏఎస్లు... తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలకు కొమ్ముకాస్తున్నారు. అలాంటి వారిని రాజద్రోహులుగా ప్రకటించాలి’ అని ఆర్థిక నిపుణుడు, ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ డిమాండ్ చేశారు. -
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887కు చేరింది. ఈ ఏడాది జనవరి 22న విడుదల చేసిన తుది జాబితాలో 4,08,07,356 మంది ఓటర్లు ఉన్నారు. -
ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
భగభగ మండే ఎండలతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కర్నూలు, కావలి, నంద్యాల, ఆరోగ్యవరం తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు పెరిగాయి. -
ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్పై వింత నాటకం
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేసే ఎన్నికల సంఘం.. ఉద్యోగులపై మాత్రం కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. -
బకాయిలు చెల్లించకపోతే వైద్యం అందించలేం
బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 4 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) నగదు రహిత సేవలను నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆశా) ప్రకటించింది. -
కేజీబీవీ సిబ్బంది సేవల్లో ప్రభుత్వం కొత్త మెలిక
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల ఒప్పంద ఉపాధ్యాయినుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది.