కరవు సీమలో ‘అవినీతి’ సిరి!
రాయలసీమలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు వసూళ్ల పంటను బ్రహ్మాండంగా పండించింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రజాప్రతినిధి మరిది, బావ, వియ్యంకుడు, కుమారుడు.. నాలుగు మండలాలను పంచుకుని మరీ దందాలను పర్యవేక్షిస్తున్నారు.
కబ్జాలు, సెటిల్మెంట్లు, ఇసుక, మట్టి మాఫియా..
ప్రభుత్వ, దళితుల భూములనూ వదల్లేదు
కమీషన్ ఇవ్వకుంటే కాంట్రాక్టర్లను తన్ని తరిమేయడమే..
కర్నూలు జిల్లాలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి సకుటుంబ అక్రమాలు, దౌర్జన్యాల బాగోతమిదీ..
ఈనాడు, అమరావతి
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టుగా..
తమ పార్టీ అధికారంలో ఉండగానే.. ఆస్తులు కూడబెట్టుకోవాలనుకున్నారా ప్రజాప్రతినిధి!
రెండు చేతులతో అయితే సరిపోదని.. తోడుగా నలుగురు మనుషుల్నీ పెట్టుకున్నారు
తమ ముఖ్య నాయకుడి స్ఫూర్తితో, తోటి ప్రజాప్రతినిధుల ప్రేరణతో ఐదేళ్లుగా నియోజకవర్గాన్ని పీల్చి పిప్పిచేశారు!
రాయలసీమలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు వసూళ్ల పంటను బ్రహ్మాండంగా పండించింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రజాప్రతినిధి మరిది, బావ, వియ్యంకుడు, కుమారుడు.. నాలుగు మండలాలను పంచుకుని మరీ దందాలను పర్యవేక్షిస్తున్నారు. వీరికి చుట్టమని చెప్పుకొనే ఒక జడ్పీటీసీ కూడా ఆయన పరిధిలో వసూళ్లు చేసి ఈ కుటుంబానికి ముట్టజెబుతున్నారు. మొదట నియోజకవర్గ కేంద్రంలో ప్రజాప్రతినిధి పుత్రరత్నం సెటిల్మెంట్లలో దుందుడుకుగా వ్యవహరించారు.
పరిస్థితి చేయి దాటడంతో ఆయనని తమ సొంత మండలం వెల్దుర్తికి పంపారా ప్రజాప్రతినిధి. అక్కణ్నుంచే దందాల్ని పర్యవేక్షిస్తున్నాడాయన. జనం కరవుతో అల్లాడుతుంటే.. ప్రజాప్రతినిధి కుటుంబం సెటిల్మెంట్లు, భూకబ్జాలు.. ఇసుక, మట్టి మాఫియాలతో రూ.కోట్లు దండుకుంటోంది. ఈ ప్రజాప్రతినిధి సొంత మండలం జాతీయ రహదారి-44కు పక్కనే ఉంది. అక్కడ స్థిరాస్తి వ్యాపారులు వెంచర్లు వేసుకోవాలంటే వీరు నిర్ణయించినంత మొత్తం కప్పంగా కట్టాల్సిందే.
కమీషన్ ఇవ్వకుండా పనులు చేస్తే..
మద్దికెర-బేతంచెర్ల మధ్య రైల్వే పనులకు సంబంధించి కాంట్రాక్టు పొందిన ఒక గుత్తేదారును వీరు కమీషన్ అడిగారు. పని మొదలు పెట్టినప్పుడు ఆ పని ఆధారంగా కమీషన్ ఇస్తామని గుత్తేదారు చెప్పగా.. గంపగుత్తగా ఒకేసారి ఇవ్వాలని పట్టుబట్టారు. ఇంకా మొదలు పెట్టని, చెయ్యని పనులకు మామూళ్లు ఎలా ఇచ్చేదంటూ ఆ గుత్తేదారు చెప్పారు. దీంతో ప్రజాప్రతినిధి మనుషులు మద్దికెర రైల్వేస్టేషన్లో ఆయన చేయిస్తున్న వంతెన పనులను అడ్డుకున్నారు.. అడ్డొచ్చిన కూలీలలోపాటు గుత్తేదారుపైనా దాడి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా అధికార పార్టీ పెద్దల ఒత్తిడితో నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాడి చేయడమే కాకుండా గుత్తేదారు వినియోగించే కారు, కంకర మిషన్ను ఎత్తుకెళ్లారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో వాహనాలను ఎత్తుకెళితే కేసుకు బలం చేకూరుతుందనే భావనతో వాటిని మధ్యలో వదిలేసి వెళ్లారు.
- కృష్ణగిరి టోల్ప్లాజా వద్ద వీరి వాహనాలను ఉచితంగా వదిలేయలేదని.. ఈ ప్రజాప్రతినిధి అనుచరులు అక్కడి సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు..
- ‘చెప్పినట్లు పనిచేయకపోతే ప్రజాప్రతినిధికి చెప్పి ఇక్కడి నుంచి బదిలీ చేయిస్తాం.. సస్పెండ్ చేయిస్తాం’ అంటూ ప్రభుత్వ ఉద్యోగుల్ని బెదిరిస్తారు. ‘నేను చెప్పినట్లుగా బిల్లులు చెల్లించకపోతే నీ అంతు చూస్తాం’ అంటూ ఓ పంచాయతీరాజ్ ఏఈని మండల స్థాయి ప్రజాప్రతినిధి భర్త హెచ్చరించారు. ఆ విషయాన్ని ఏఈ పైఅధికారులకు చెప్పినా.. వారూ ఏం చేయలేక ‘ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం ఇలాంటి బాధలు తప్పవ’ని సర్దిచెప్పినట్లు తెలిసింది.
ఇసుకా మాదే.. మట్టీ మాదే..
ఈ ప్రజాప్రతినిధి అనుచరులు పత్తికొండ మండలంలో హంద్రీ నది నుంచి నిత్యం వందల ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నారు. కొత్తవారెవరైనా ఇసుక కోసం అక్కడకు వచ్చారంటే చాలు అధికారులు వాలిపోయి వాహనాలను సీజ్ చేసి జరిమానా విధిస్తారు. మండలంలోని వంకలు, వాగుల నుంచి రాత్రి సమయాల్లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. నియోజకవర్గ కేంద్రంలోని చెరువుకు అవతలి వైపు నల్ల కాలువకు ఆనుకొని ఉన్న గుట్ట నుంచి అక్రమంగా ఎర్ర మట్టి తరలిస్తున్నారు. చక్కరాళ్ల రోడ్డు సమీపంలోని బూడిదగుండ్లు నుంచి యథేచ్ఛగా ఎర్ర మట్టిని దోచేస్తున్నారు. గతంలో బొందిమడుగుల సమీపంలోని వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలించి సొమ్ము చేసుకున్నారు.
ప్రజాప్రతినిధి వెంటే వసూళ్ల ‘గణం’
ఈ ప్రజాప్రతినిధికి వసూళ్లు చేసిపెట్టే బ్యాచ్.. ఎప్పుడూ ఆ నేతతోపాటే పయనిస్తూ ఉంటారు. ఒక ప్రధాన అనుచరుడు ఎక్కడెక్కడ కాంట్రాక్టు పనులు జరుగుతున్నాయో తెలుసుకుంటాడు. ఆపై బ్యాచ్తో అక్కడకు వెళ్లి పనిస్థాయిని బట్టి కమీషన్ మొత్తాన్ని నిర్ణయించి, ఆ మేరకు వసూలు చేసుకొస్తారు. నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టే ఎలాంటి అభివృద్ధి పనులనైనా ఈ ప్రజాప్రతినిధి వర్గానికి చెందిన నాయకులకే ఇవ్వాలి. నాణ్యత లేకుండా వారు ఆ పనులను చేసినా పర్యవేక్షక ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది ప్రశ్నించడానికి వీళ్లేదట. ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరుడొకరు ఎంపీ నిధులతో చేపట్టిన పనులు నాసిరకంగా ఉన్నాయని గడప గడపకు.. కార్యక్రమంలో అదే ప్రజాప్రతినిధి ముందు వారి పార్టీ నాయకులే ఫిర్యాదు చేశారు. కృష్ణగిరి మండల పరిధిలోని హంద్రీనీవా కాలువ గట్టు రాళ్లనూ వైకాపా నాయకులకు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
ఉద్యోగాల పేరుతో వసూళ్లు...
సబ్స్టేషన్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి ఒక్కో అభ్యర్థి నుంచి రూ.10 లక్షల వరకు ఈ ప్రజాప్రతినిధి అనుచరులు వసూలు చేశారు. అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టులకు రూ.10లక్షలు, కార్యకర్త పోస్టుకైతే రూ.3లక్షల వరకు వసూలు చేయగా.. వీరిలో కొంతమందికి ఉద్యోగాలు రాలేదు.. కట్టిన డబ్బు తిరిగి రాలేదు. అంగన్వాడీ ఆయా పోస్టులనూ అమ్మకానికి పెట్టడం గమనార్హం.
- ప్రజాప్రతినిధి నియోజకవర్గంలో జరిగిన ఓ అవినీతి వ్యవహారంపై ఓ టీవీ ఛానెల్లో కథనం వచ్చినందుకు ఆ మీడియా ప్రతినిధిపై వీరి మనుషులు దాడి చేశారు.
భూ‘మంతర్’
పత్తికొండ చెరువు ముందున్న తూము ప్రాంతాన్ని(రూ.కోట్లు విలువజేసే సుమారు 2 ఎకరాలు) ఈ ప్రజాప్రతినిధి అనుచరుడు మట్టితో పూడ్చి ఆక్రమించారు. అడ్డుకున్న రైతులపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యల్లేవు. ఈ వ్యవహారంపై ‘ఈనాడు’లో కథనాలు రావడంతో మైనర్ ఇరిగేషన్ అధికారులు ఆక్రమణలను తొలగించారు. కానీ, అదే రోజు రాత్రి ఆక్రమణదారుడు అక్కడ షెడ్లు వేయించారు. ఇరిగేషన్ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆక్రమణదారుడిని జైలుకు పంపారు. అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులతో కలిసి నియోజకవర్గ కేంద్రం చుట్టుపక్కల ప్రాంతాల్లోని అనేక ప్రభుత్వ, పోరంబోకు భూములను ఆక్రమించే యత్నం చేశారు.
- పత్తికొండ శివారులోని హంద్రీనీవా కాల్వ సమీపంలో ఓ విలేకరి కుటుంబానికి చెందిన స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితులు జిల్లా కలెక్టర్ను, కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ స్థలంలో కొంత కాలంగా నిర్మాణ పనులు నిలిచిపోయాయి.
- ప్రజాప్రతినిధి బంధువు అండతో తుగ్గలి మండలం శభాష్పురంలో బూజుగుండ్ల రంగస్వామి మాన్యం భూమిని వైకాపా నాయకుడొకరు ఆక్రమించారు. దీనిపై గ్రామస్థులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
- ఒక దళిత కుటుంబం పొలాన్ని ఈ ప్రజాప్రతినిధి ప్రధాన అనుచరుడు ఆక్రమించుకుని, అక్కడ అక్రమంగా వెంచర్ వేసేందుకు ప్రయత్నించారు. అడ్డుకునేందుకు వెళ్లిన వారిపైన దాడులు చేశారు. బాధితుల తరఫున దళితులు ధర్నాలు, ఆందోళనలు చేపట్టడంతో విధిలేక పోలీసులు కలగజేసుకుని ఆ అనుచరుడిపై కేసు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్లో.. బిల్ గేట్స్ అల్లుడి పోటీ
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు