అయినవాళ్లకే భద్రత
ఏ ప్రభుత్వమైనా సరే ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులకు వారికున్న ముప్పు ఆధారంగా భద్రత కల్పిస్తుంది. కానీ వ్యవస్థల విధ్వంసానికి తెగబడుతున్న జగన్ ప్రభుత్వం మాత్రం ఆ భద్రతనూ తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోంది.
వైకాపా నాయకుడైతే చాలు భద్రత కేటాయింపు
తెదేపా వారికి ముప్పున్నా పట్టించుకోరు
భద్రతనూ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న జగన్ ప్రభుత్వం
ఈనాడు, అమరావతి: ఏ ప్రభుత్వమైనా సరే ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులకు వారికున్న ముప్పు ఆధారంగా భద్రత కల్పిస్తుంది. కానీ వ్యవస్థల విధ్వంసానికి తెగబడుతున్న జగన్ ప్రభుత్వం మాత్రం ఆ భద్రతనూ తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోంది. వైకాపా నాయకులైతే చాలు.. అదే ఏకైక అర్హత అన్నట్లుగా అడ్డూ అదుపులేకుండా సాయుధులైన భద్రతా సిబ్బందిని కేటాయించేస్తోంది. అదే ప్రతిపక్ష పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులకు ముప్పున్నా సరే తగినంత భద్రత కల్పించకుండా వారి ప్రాణాలతో చెలగాటమాడుతోంది. వైకాపా నాయకుల ఆదేశాలే చట్టమన్నట్లుగా పనిచేస్తున్న ఏపీ నిఘా, పోలీసు విభాగాలు పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయి. అధికార పక్ష నాయకులకైతే ఓ న్యాయం.. విపక్షాల వారికి మరో న్యాయం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి.
తెదేపా అభ్యర్థికి ప్రాణహాని ఉన్నా ఇవ్వరు..
ఈ ఎన్నికల్లో వైకాపా తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తుంటే చాలు వారికి ఉదారంగా సాయుధ భద్రత కేటాయిస్తున్నారు. అదే తెదేపా నుంచి బరిలో ఉండే అభ్యర్థులకు ప్రాణహాని, ముప్పు ఉన్నా సరే సవాలక్ష నిబంధనల సాకులు చూపించి భద్రత ఇవ్వట్లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై పులివెందులలో తెదేపా తరఫున పోటీ చేస్తున్న బీటెక్ రవికి అసలు భద్రత ఇవ్వలేదు. తనకు ముప్పు ఉందని ఆయన తెలిపినా పట్టించుకోవట్లేదు. అసలు గన్మన్ల కేటాయింపునకు ఓ ప్రాతిపదిక ఉండదా? వైకాపా నేతలు కావడమే భద్రతకు ప్రాతిపదికా?
- జగన్ పాలనలో చంబల్లోయలా మారిపోయిన పల్నాడు జిల్లా మాచర్లలో తెదేపా అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డికి నిరంతరం ముప్పు పొంచే ఉంటోంది. కానీ ఆయనకు మాత్రం గన్మన్లను కేటాయించలేదు. ప్రైవేటుగా భద్రత ఏర్పాటు చేసుకున్నారు. మరో అరాచక సామ్రాజ్యమైన పుంగనూరులో తెదేపా తరఫున పోటీ చేస్తున్న చల్లా రామచంద్రారెడ్డి(బాబు)కి భద్రత కల్పించలేదు.
- అనంతపురం జిల్లా మడకశిర, శింగనమల నియోజకవర్గాల వైకాపా అభ్యర్థులు ఈరలక్కప్ప, వీరాంజనేయులకు వారి అభ్యర్థిత్వం ఖరారైన వెంటనే 1 ప్లస్ 1 గన్మన్లను కేటాయించారు. అవే నియోజకవర్గాల నుంచి తెదేపా తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు మాత్రం అసలు భద్రతే కల్పించలేదు.
- విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న తలే రాజేష్కు 1 ప్లస్ 1 గన్మన్ కేటాయించారు. అదే స్థానంలో తెదేపా నుంచి పోటీ పడుతున్న కోండ్రు మురళీమోహన్కు భద్రతే ఇవ్వలేదు.
ఇలా రాజీనామా.. అలా భద్రత వెనక్కు
తెదేపా సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా, అది ఆమోదం పొందిన వెంటనే భద్రతను ఉపసంహరించేశారు. కానీ తెదేపా తరఫున ఎమ్మెల్యేగా గెలిచి వైకాపాలోకి ఫిరాయించిన వాసుపల్లి గణేశ్కుమార్, వల్లభనేని వంశీమోహన్లపై అనర్హత వేటు పడినా సరే వారికి భద్రతను కొనసాగిస్తున్నారు. వంశీకైతే ఏకంగా 4 ప్లస్ 4 భద్రత.. వాసుపల్లి గణేశ్కుమార్కు 1 ప్లస్ 1 కొనసాగిస్తున్నారు.
వైకాపాను వీడితే గన్మన్ తొలగింపు..
మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఇటీవల వైకాపాను వీడి జనసేనలో చేరారు. అప్పటివరకూ ఆయనకు 2 ప్లస్ 2 భద్రత కల్పించిన ప్రభుత్వం.. పార్టీ మారటమే తరువాయి.. దాన్ని కుదించేసింది.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే భద్రత కట్
నెల్లూరులో ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిలు వైకాపాలో కొనసాగినంత కాలం వారికి 2 ప్లస్ 2 భద్రత కల్పించారు. వారు గతేడాది వైకాపా ప్రభుత్వ తీరును ఎండగడుతూ తిరుగుబాటు జెండా ఎగరేసిన వెంటనే 1 ప్లస్ 1కు కుదించేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆ భద్రత వద్దని వారు అప్పట్లో నిరాకరించారు. ప్రస్తుతం వీరిద్దరికీ భద్రత కల్పించలేదు.
కోర్టును ఆశ్రయిస్తేనే..
ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్, తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్కు 1 ప్లస్ 1 భద్రత ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల ఫోన్ల ట్యాపింగ్కు పాల్పడుతోందని ఆయన ఆరోపించిన అనంతరం ఆయనకున్న భద్రతను లాగేశారు. చివరికి ఆయన భద్రత కోసం హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.
ఎర్రచందనం స్మగ్లరైనా ‘భద్రమే’
చిత్తూరు నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయానందరెడ్డిపై ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులున్నాయి. గతంలో పీడీ యాక్ట్ కూడా ప్రయోగించారు. ఆయనకు 1 ప్లస్ 1 గన్మన్ కేటాయించారు.
అచ్చెన్న, నిమ్మలకు 1 ప్లస్ 1 నానీలకు మాత్రం 4 ప్లస్ 4 భద్రత
తెదేపా శాసనసభా పక్ష ఉపనేతలైన అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడుకు 1 ప్లస్ 1 భద్రతే కేటాయించారు. వీరిద్దరూ సీనియర్ ఎమ్మెల్యేలు. అచ్చెన్నాయుడు ఏపీ తెదేపా అధ్యక్షుడు, మాజీ మంత్రి కూడా. వారికి నామమాత్రపు భద్రత కల్పించిన పోలీసులు.. ప్రతిపక్ష నాయకులపై దుర్భాషలతో నోరేసుకుని పడిపోవటంలో ముందుండే కొడాలి నాని, పేర్ని నానిలకు ఏకంగా 4 ప్లస్ 4 భద్రత కల్పించారు. దేవినేని అవినాష్ కనీసం ఎమ్మెల్యే కూడా కాదు. విజయవాడ తూర్పు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జి మాత్రమే. ప్రస్తుతం ఆ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఆయనకూ 2 ప్లస్ 2 గన్మన్లు ఉన్నారు. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలైతే వారికి తక్కువ భద్రతిస్తారా? అదే అధికార పార్టీ నాయకులైతే ఎంతమంది సిబ్బందినైనా కేటాయిస్తారా? ఇదేం భద్రతా సమీక్ష? ఇది అధికారపక్షానికి కొమ్ముకాయటం కాదా!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం