జలభగ్నం
‘‘పోలవరం సహా గాలేరు-నగరి, హంద్రీనీవా, వంశధార, వెలిగొండ తదితర అన్ని ప్రాజెక్టులను జలయజ్ఞంలో భాగంగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత తాగు, సాగునీటి కలలను నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం.
జగన్ ఏలుబడిలో సాగునీటి ప్రాజెక్టులకు అన్యాయం
సమస్యల సుడిగుండంలో పోలవరం
వెలిగొండ, వంశధార, గాలేరునగరి సహా అన్నీ మూలకే
మొత్తం పథకాలకు కావాల్సిన నిధులు రూ.1,64,815 కోట్లు
ఐదేళ్లలో ఖర్చు చేసింది రూ.35,268 కోట్లే
ఈనాడు, అమరావతి
నాడు ఊరూరా తిరిగారు...
జలయజ్ఞం చేస్తానన్నారు...
కాలువల్లో నీరు పారిస్తానన్నారు...
పొలాలను తడిపేస్తానన్నారు...
పీఠమెక్కాక మాటలనే ఇటుకలుగా పేర్చి,
హామీలను సిమెంటుగా పూసి,
ప్రాజెక్టులన్నీ పాడుపెట్టారు...
వందిమాగధులకు వండిపెట్టారు...
జలయజ్ఞానికి జెల్లకొట్టారు...!
‘‘పోలవరం సహా గాలేరు-నగరి, హంద్రీనీవా, వంశధార, వెలిగొండ తదితర అన్ని ప్రాజెక్టులను జలయజ్ఞంలో భాగంగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత తాగు, సాగునీటి కలలను నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం. రాష్ట్రానికి జలకళ తీసుకొస్తాం’’ అంటూ 2019 జనవరి 10న ఇచ్ఛాపురంలో నిర్వహించిన ప్రజాసంకల్ప యాత్ర ముగింపు సభలో జగన్ ప్రకటించారు. గత ఎన్నికల ముందు నవరత్నాల పేరిట జగన్ ఇచ్చిన హామీల్లో జలయజ్ఞం ముఖ్యమైంది. జలయజ్ఞం అంటే కేవలం ఏదో ఒక్క ప్రాజెక్టు కాదు. పోలవరంతో సహా గాలేరు-నగరి, హంద్రీనీవా, వెలిగొండ తదితర అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని ఊరూవాడా ప్రచారం చేశారు. నమ్మిన ఓటర్లు గెలిపించారు. ఆయన అధికారంలోకి వచ్చే సరికి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలంటే అప్పటి అంచనాల ప్రకారం కావాల్సిన మొత్తం రూ.74,183 కోట్లు. జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక తనంతట తానుగా కొత్తగా చేపడతామన్న ప్రాజెక్టుల అంచనా విలువ రూ.90,632 కోట్లు. జగన్ సర్కారు లెక్కల ప్రకారం... అన్నింటికీ కలిపి మొత్తం కావాల్సిన నిధులు రూ.1,64,815 కోట్లు.
అధికారంలోకి వచ్చాక చేసిందిదీ...
ఐదేళ్లు అధికారాన్ని అనుభవించిన జగన్ సర్కారు... జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోయామని శాసనసభ సాక్షిగా చేతులెత్తేసింది. పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామో తెలియదని జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పదేపదే చెప్పారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను 2024 తర్వాతే పూర్తి చేయగలమని అసెంబ్లీలో లిఖిత పూర్వకంగా సర్కారు సమాధానం ఇచ్చింది. అంటే తాము అధికారం చెలాయించిన ఐదేళ్లలో జలయజ్ఞం ప్రాజెక్టులను పట్టించుకోలేదని సర్కారే ప్రకటించింది. వాస్తవాలు ఇలా ఉంటే... ఎన్నికల ముంగిట్లో సీఎం జగన్ అబద్ధాలు వల్లెవేస్తున్నారు. ప్రతి సభలోనూ జలయజ్ఞంపై ప్రజల ముందు ఏమాత్రం జంకూ లేకుండా పదేపదే పచ్చి అబద్ధాలు చెబుతున్నారు.
- ప్రజలు ఎంతగానో నమ్మి జగన్కు 151 సీట్లు అప్పగిస్తే సాగునీటి ప్రాజెక్టులన్నింటీనీ మూలన పడేశారు. రాష్ట్రానికి అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు వైకాపా సర్కారు నిర్లక్ష్యంతో సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది.
- వెలిగొండ రెండో టన్నెల్ను మాత్రమే పూర్తిచేసి ఏకంగా ప్రాజెక్టే పూర్తయిందన్నంతగా సీఎం జగన్ హడావుడి చేశారు.
- ఆ టన్నెల్ నిర్మాణంతో ఆయకట్టు సాగులోకి రాదు. వెలిగొండ కింద కనీసం తొలిదశ ఆయకట్టు సాగులోకి రావాలన్నా మరో రెండేళ్ల సమయం పడుతుందని జలవనరులశాఖ అధికారులే
- చెబుతున్నారు.
- 2019 నాటికే 70% పూర్తయిన నెల్లూరు, సంగం బ్యారేజీల నిర్మాణాలను అతికష్టం మీద పూర్తి చేశారు.
- అవుకు టన్నెల్ ఒకటి పూర్తి చేశారు. ఇప్పటికే గండికోటలో ఉన్న నీటిని ఆయకట్టుకు ఇచ్చే దిక్కులేదు. కొత్తగా అవుకు ద్వారా మరింత నీరు పంపి సాధించేదీ ఏమీ లేదు.
- నిధులను తక్షణ అవసరమైన ప్రాజెక్టులపై వెచ్చించలేదు. జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) నిర్మాణాలు ఆపాలని ఆదేశించిన ప్రాజెక్టులకు, ఇప్పట్లో నీళ్లు అందుబాటులోకి రాని ఎత్తిపోతల పథకాలకు రూ.వేల కోట్ల బిల్లులను చెల్లించేసి నిధుల దుర్వినియోగం చేశారు.
కేటాయింపులే కొంత... అందులోనూ ఖర్చు అంతంతే!
ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కావాలన్నా, భవిష్యత్తులో అవి భారంగా మారకుండా ఉండాలన్నా చాలినన్ని నిధులు ఇవ్వాలి. రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టుకు ఎన్ని నిధులు కేటాయిస్తే ఎప్పటికి పూర్తవుతుందనే అంచనా ఉన్నా... అందుకు తగ్గట్టుగా బడ్జెట్ కేటాయింపులు లేవు. ఆ అరకొర కేటాయింపుల్లో సగమైనా ఖర్చు చేసిన దాఖలాలూ లేవు. మొత్తం ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన నిధుల్లో 20% మాత్రమే ఖర్చు చేసింది. ఆయన పూర్తి చేస్తానన్న 26 సాగునీటి ప్రాజెక్టులకు ఐదేళ్లలో రూ.61,573 కోట్లు ఇస్తామంటూ బడ్జెట్లో ప్రతిపాదించి... చేసిన ఖర్చు రూ.35,268 కోట్లు మాత్రమే. ఇందులో ఉద్యోగుల జీతాలు, ఇతర నిర్వహణకు పనులు కలిపే ఉండటం గమనార్హం. అంటే నికరంగా ప్రాజెక్టులపై వ్యయం చేసిన మొత్తం మరింత తగ్గిపోతుంది. ప్రతిపక్షనేత హోదాలో ఏ ఊరు వెళ్లినా ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేస్తానని ఘనంగా చెప్పిన జగన్... ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెబుతారు?
అత్యంత ప్రాధాన్యమున్న వాటికీ దిక్కు లేదు
పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యమైంది. వైకాపా సర్కారు వచ్చాక వేగంగా సాగుతున్న పనులకు బ్రేక్ పడింది. ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణాన్ని ఆలస్యం చేసింది. ఫలితంగా వరదల సమయంలో తీవ్ర నష్టం వాటిల్లింది. ఎగువ కాఫర్ డ్యాం గ్యాప్లను సకాలంలో పూడ్చకపోవడంతోనే పోలవరం సంక్షోభంలో చిక్కుకుందని కేంద్రమూ తేల్చింది. పోలవరం గుత్తేదారులను మార్చితే సంక్షోభంలోకి వెళ్లిపోవచ్చని కేంద్ర జల్శక్తి శాఖ హెచ్చరించినట్లే జరిగింది.
- వంశధార రెండో భాగం రెండో దశ పనులకు కూడా నాలుగేళ్లలో కేవలం రూ.400 కోట్లే ఖర్చు చేశారు. మరో రూ.500 కోట్లు వెచ్చిస్తే తప్ప ప్రాజెక్టు పూర్తి కాదు.
- వెలిగొండ తమకెంతో ముఖ్యమైందని, 2024 చివరికి పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. మరో రూ.4,000 కోట్లు ఉంటే తప్ప దీన్ని పూర్తి చేయలేమని అధికారులు అంచనాలు రూపొందించారు. మరోవైపు 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.101.47 కోట్లు మాత్రమే కేటాయించారు. ఖర్చు చేసింది రూ.26 కోట్లు మాత్రమే.
- వంశధార, నాగావళి అనుసంధానాన్ని వచ్చిన ఏడాదిలోగా పూర్తి చేస్తామన్నారు. ఇంతవరకు ఆ ఊసే లేదు.
- నిధుల కొరత కారణంగా తోటపల్లి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రాయలసీమ ఎత్తిపోతల, హంద్రీనీవా సుజల స్రవంతి డిస్ట్రిబ్యూటరీలు, గాలేరు-నగరి రెండో దశ, డిస్ట్రిబ్యూటరీలు... ఇలా చెబుతూ పోతే ఏ ప్రాజెక్టూ పూర్తి కాలేదు.
భవిష్యత్తులో ఎంత భారం!
జగన్ సర్కారులో సాగునీటి రంగానికి వాటిల్లిన నష్టం నుంచి కోలుకోవాలంటే ఎన్నేళ్లు పడుతుందోనని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నిర్మాణ రంగంలో ఎప్పటికప్పుడు ధరలు పెరిగిపోతుంటాయి. కట్టడాలను ఎంత త్వరగా పూర్తి చేసుకుంటే అంత మేలు జరుగుతుంది. అలాంటిది ఈ ఐదేళ్ల శాపం కారణంగా ఆయా ప్రాజెక్టుల అంచనా వ్యయం అంతకంతకూ పెరిగిపోయే ప్రమాదముంది. ఇప్పటికే జగన్ ప్రభుత్వంలో తన సొంత మంత్రులకు, ఎమ్మెల్యేలు, ఎంపీల కంపెనీలకు పనులు అప్పగించేందుకు వీలుగా పాత కాంట్రాక్టులను రద్దు చేసి, అనేక ప్రాజెక్టుల్లో అంచనాలను పెంచేశారు. తన వారికి ఆయా పనులను అప్పగించేశారు. ఎక్కడైతే తన మనుషులు గుత్తేదారులుగా ఉన్నారో అక్కడే నిధులను విడుదల చేశారు. ఇతరచోట్ల నిధులు కేటాయించక, చేసిన పనులకు బిల్లులూ ఇవ్వకపోవడంతో గుత్తేదారులు గుండె గుబిల్లుమంది. దాంతో వారంతా తమ యంత్రాలను, మానవ వనరులను ఇతర రాష్ట్రాలకు తరలించేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం