గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది.
అదేం భాషండీ. వయసుకు గౌరవం ఇవ్వాలనే జ్ఞానం లేదు. పెద్దాచిన్నా.. అందర్నీ ఒకేగాటన కట్టేసి మాట్లాడే వాళ్లని ఏమనాలి? నోరు తెరిస్తే చాలు బూతులే. పక్కనే కూర్చున్న పిల్లలతో కలిసి అతని మాటలు వినాలంటే సిగ్గేస్తోంది.’
పెంజెండ్ర గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అంతరంగం
‘ఈ ఏడాది పండిన వరి పంటను సంక్రాంతి పండగ సమయంలో ఆర్బీకే ద్వారా మచిలీపట్నంలోని బియ్యం మిల్లులకు తరలించాం. ట్రాక్టరు కిరాయికి తీసుకొని వెళ్లి రెండ్రోజులు ఉన్నాక క్వింటాకు 5-6 కిలోల తరుగు తీశారు. 10 రోజుల్లో డబ్బు మా బ్యాంకు ఖాతాల్లో వేస్తామన్నారు. మూడునెలలు దాటినా ఇప్పటికీ అతీగతీ లేదు. సొంతూళ్లో అమ్ముకునే అవకాశం లేకుండా చేసి ఇబ్బంది పెట్టారు. ఇలాంటి దిక్కుమాలిన ప్రభుత్వాన్ని ఇంత వరకూ చూడలేదు. రైతు ప్రభుత్వమని చెప్పుకొనే సర్కారులో కొడాలి నాని రెండున్నరేళ్లు పౌరసరఫరాల మంత్రిగా పనిచేసినా నోరుమెదపలేకపోయారు’
గుడ్లవల్లేరు మండలంలోని అయిదుగురు రైతుల ఆవేదన ఇది.
‘గుడివాడ పట్టణం నుంచి రోజూ కళాశాలలకు బస్సుల్లో వెళుతుంటాం. నాలుగేళ్లుగా గోతుల మార్గాల్లోనే రాకపోకలు సాగిస్తున్నాం. మొదట్లో బాధ అనిపించేది. రాన్రాను అలవాటైంది. ఇదంతా మా జగన్ మామయ్య ఇచ్చిన బహుమతులని అనుకుంటూ నవ్వుకుంటాం. ఇంత ప్రధానమైన రహదారిని బాగు చేయాలనే కనీస స్పృహలేని నాయకుడిని గెలిపించి తప్పుచేశామని మా తల్లిదండ్రులు అంటుంటారు. అందుకే మేం ఈసారి మా ఓటుతో మామయ్యకు రిటర్న్ గిఫ్టు ఇద్దామనుకుంటున్నాం’
గుడివాడ చుట్టు పక్కల గ్రామాలకు చెందిన 8 మంది ఇంజినీరింగ్ విద్యార్థుల నుంచి వచ్చిన సమాధానం.
‘ఈ అయిదేళ్లలో ఏం అభివృద్ధి జరిగిందని చెప్పాలి. కరెంట్ బిల్లు రూ.150 నుంచి రూ.350కి పెరిగింది. ఒక్కఛాన్స్ అంటూ వచ్చి మధ్యతరగతి కుటుంబాలను నిలువునా ముంచేశారు.
గుడివాడలో చెప్పులు కుట్టే వ్యక్తి మాటలు.
ఈనాడు, అమరావతి: కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ గెలుపు ఎవరిని వరించనుంది?.. ఎంత మెజారిటీ వస్తుందనే దానిపై ఇప్పటికే భారీఎత్తున బెట్టింగులు మొదలయ్యాయి. అంతటి కీలకమైన నియోజకవర్గంలో ప్రజలు మార్పుకోరుకుంటున్నట్లు చెబుతున్నారు. పంటచేలు, విద్యాలయాలకు నెలవుగా ఉన్న ఈ ప్రాంతాన్ని జూదశాలలకు చిరునామాగా మార్చడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ‘ఈనాడు ప్రత్యేక ప్రతినిధి’ సోమ, మంగళవారాలు గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు, నందివాడ, గుడివాడ రూరల్ మండలాల్లోని మల్లయ్యపాలెం, పెంజెండ్ర, మోటూరు, చిత్రం, గుడ్లవల్లేరు, నందిపాడు, తుమ్మలపల్లి, రామాపురం, ఐనంపూడి, జొన్నవాడ, విన్నకోట తదితర గ్రామాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లోని రైతుకూలీలు, విద్యార్థులు, మహిళలు, రైతులు, వ్యాపారులను నియోజకవర్గ అభివృద్ధి, రహదారుల నిర్మాణం, రాజకీయ పరిస్థితులపై ప్రశ్నించినప్పుడు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. 2024 ఎన్నికల్లో తాము చరిత్రాత్మక మార్పును కోరుకుంటున్నామని వెల్లడించారు.
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరు..
నియోజకవర్గంలో ఏ దారి చూసినా గుంతలు. రోజూ సుమారు 25,000-30,000 మంది వివిధ ప్రాంతాల నుంచి గుడివాడ పట్టణానికి రాకపోకలు సాగిస్తుంటారు. ఇంతటి కీలకమైన కేంద్రాన్ని కలిపే దారులన్నీ మరమ్మతులు లేక దెబ్బతిన్నాయి. కంకిపాడు-గుడివాడ ప్రధాన రహదారితోపాటు పట్టణంలోని అంతర్గత మార్గాలు, గ్రామీణ ప్రాంతాల్లోని రహదారులు అధ్వానంగా ఉన్నాయంటూ పలు గ్రామాల ప్రజలు ఆవేదన వెలిబుచ్చారు. కార్లు, ద్విచక్రవాహనాలపై కొత్తగా వచ్చిన వారిలో 80శాతం మంది ప్రమాదాలకు గురవుతుంటారని గుడివాడకు చెందిన న్యాయవాది తెలిపారు. కంకిపాడు-గుడివాడ మార్గంలో రాత్రిళ్లు ఎంతోమంది వాహనదారులు ప్రమాదాల బారినపడి మృతిచెందారని, కొందరు వికలాంగులుగా మారినట్లు వివరించారు. దొండపాడు, వలివర్తి, లింగవరం, పోలుగూడ, గుడివాడ నుంచి నందివాడ వెళ్లే వైపు జనార్దనపురం, తుమ్మలపల్లి, కుదరవల్లి, రామాపురం రహదారులు గుంతలు పడ్డాయి. ఎన్నికల సమయంలో జనం నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో రోడ్లు తవ్వి వదిలేశారు. వాటిని పూడ్చేందుకు తారు కొరత ఉందని చెబుతున్నారని నందివాడకు చెందిన పచారీ దుకాణ యజమాని తెలిపారు. ‘తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు బాగు చేసిన రోడ్లే. నాలుగేళ్లలో గోతులు పడి జనం ఇబ్బందులు పడుతున్నా మా ఎమ్మెల్యే కన్నెత్తి చూసిన పాపానపోలేదు’ అంటూ తుమ్మలపల్లికి చెందిన ఒక వ్యక్తి వివరించారు. ‘విజయవాడ-గుడివాడ రోజూ అయిదు ట్రిప్పులు వేస్తుంటాం. ఒంటి నొప్పులతో నిద్రకూడా పట్టదు. మా కళ్లెదుటే చాలాసార్లు ప్రమాదాలు జరిగాయి. ఇలాంటి రోడ్లలో ఇంధనం కూడా ఎక్కువ ఖర్చవుతుంది. డబ్బులు వస్తున్నాయని ఆశపడి తప్పటడుగు వేస్తే ప్రతిఫలం ఇలానే ఉంటుందని ప్రజలు గమనించాలి’ అని ఆర్టీసీ కండక్టర్ తెలిపారు.
రైతుల గోడు పట్టదు.. తాగునీరు రాదు
వైకాపా హయాంలో రైతులకు రాయితీల్లేవు. పంటకాల్వల్లో పూడిక తీయక ఏళ్లవుతోంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా పంట కొనుగోళ్లు చేపట్టినా లాభం లేదు. ఆక్వా సాగుచేసే వారికి గత ప్రభుత్వం ఇచ్చిన విద్యుత్ రాయితీ తీసేశారని విన్నకోట గ్రామానికి చెందిన రైతు తెలిపారు. ఆరుగాలం పండించిన పంటకు తరుగు, తాలు అంటూ తీస్తున్నారు. తమ పంటను తామే అమ్ముకోకుండా నిబంధనలు విధించారంటూ నందివాడకు చెందిన ఇద్దరు రైతులు వాపోయారు. నందివాడ, గుడివాడల్లో తాగునీటి ఎద్దడి పెరిగిందంటున్నారు. తాగేందుకు నీళ్లు కూడా రోజుకు రూ.30 ఇచ్చి కొంటున్నామని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన మహిళ తెలిపారు. ప్రతి గ్రామంలో 20 మందితో మాట్లాడితే 12-15 మంది ప్రభుత్వ పనితీరుపై పెదవి విరిచారు. అమరావతి రాజధానిని తరలించడాన్ని అందరూ వ్యతిరేకించారు. ‘45 ఏళ్లు దాటిన నా భార్యకు డబ్బులిస్తున్నారు. మా అమ్మకు పింఛన్ ఇవ్వడం మంచిదే. ఇంజినీరింగ్ చేసిన నా బిడ్డ ఉద్యోగం చేయాలంటే బెంగళూరు, హైదరాబాద్ వెళ్లాలా? ఇన్నేళ్లలో ఒక్క ఐటీ కంపెనీ, పరిశ్రమ తెస్తే ఉపాధి ఇక్కడే దొరికేది కదా’ అంటూ చిత్రం గ్రామానికి చెందిన ఒకరు ప్రశ్నించారు. ఏటా రూ.10వేలు తీసుకుంటున్న ఆటోడ్రైవర్లలోనూ నిరాశే కనిపించింది. గుడివాడ, గుడ్లవల్లేరులో పలకరించిన 10 మంది ఆటోడ్రైవర్లలో 8 మంది.. డీజిల్ ధర పెంచడం వల్ల ఏటా రూ.12,000 నష్టపోతున్నామని, ప్రభుత్వం ఇచ్చేది రూ.10వేలైతే.. తాము రూ.12 వేలు చెల్లిస్తున్నట్లు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ