గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది.
అదేం భాషండీ. వయసుకు గౌరవం ఇవ్వాలనే జ్ఞానం లేదు. పెద్దాచిన్నా.. అందర్నీ ఒకేగాటన కట్టేసి మాట్లాడే వాళ్లని ఏమనాలి? నోరు తెరిస్తే చాలు బూతులే. పక్కనే కూర్చున్న పిల్లలతో కలిసి అతని మాటలు వినాలంటే సిగ్గేస్తోంది.’
పెంజెండ్ర గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అంతరంగం
‘ఈ ఏడాది పండిన వరి పంటను సంక్రాంతి పండగ సమయంలో ఆర్బీకే ద్వారా మచిలీపట్నంలోని బియ్యం మిల్లులకు తరలించాం. ట్రాక్టరు కిరాయికి తీసుకొని వెళ్లి రెండ్రోజులు ఉన్నాక క్వింటాకు 5-6 కిలోల తరుగు తీశారు. 10 రోజుల్లో డబ్బు మా బ్యాంకు ఖాతాల్లో వేస్తామన్నారు. మూడునెలలు దాటినా ఇప్పటికీ అతీగతీ లేదు. సొంతూళ్లో అమ్ముకునే అవకాశం లేకుండా చేసి ఇబ్బంది పెట్టారు. ఇలాంటి దిక్కుమాలిన ప్రభుత్వాన్ని ఇంత వరకూ చూడలేదు. రైతు ప్రభుత్వమని చెప్పుకొనే సర్కారులో కొడాలి నాని రెండున్నరేళ్లు పౌరసరఫరాల మంత్రిగా పనిచేసినా నోరుమెదపలేకపోయారు’
గుడ్లవల్లేరు మండలంలోని అయిదుగురు రైతుల ఆవేదన ఇది.
‘గుడివాడ పట్టణం నుంచి రోజూ కళాశాలలకు బస్సుల్లో వెళుతుంటాం. నాలుగేళ్లుగా గోతుల మార్గాల్లోనే రాకపోకలు సాగిస్తున్నాం. మొదట్లో బాధ అనిపించేది. రాన్రాను అలవాటైంది. ఇదంతా మా జగన్ మామయ్య ఇచ్చిన బహుమతులని అనుకుంటూ నవ్వుకుంటాం. ఇంత ప్రధానమైన రహదారిని బాగు చేయాలనే కనీస స్పృహలేని నాయకుడిని గెలిపించి తప్పుచేశామని మా తల్లిదండ్రులు అంటుంటారు. అందుకే మేం ఈసారి మా ఓటుతో మామయ్యకు రిటర్న్ గిఫ్టు ఇద్దామనుకుంటున్నాం’
గుడివాడ చుట్టు పక్కల గ్రామాలకు చెందిన 8 మంది ఇంజినీరింగ్ విద్యార్థుల నుంచి వచ్చిన సమాధానం.
‘ఈ అయిదేళ్లలో ఏం అభివృద్ధి జరిగిందని చెప్పాలి. కరెంట్ బిల్లు రూ.150 నుంచి రూ.350కి పెరిగింది. ఒక్కఛాన్స్ అంటూ వచ్చి మధ్యతరగతి కుటుంబాలను నిలువునా ముంచేశారు.
గుడివాడలో చెప్పులు కుట్టే వ్యక్తి మాటలు.
ఈనాడు, అమరావతి: కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ గెలుపు ఎవరిని వరించనుంది?.. ఎంత మెజారిటీ వస్తుందనే దానిపై ఇప్పటికే భారీఎత్తున బెట్టింగులు మొదలయ్యాయి. అంతటి కీలకమైన నియోజకవర్గంలో ప్రజలు మార్పుకోరుకుంటున్నట్లు చెబుతున్నారు. పంటచేలు, విద్యాలయాలకు నెలవుగా ఉన్న ఈ ప్రాంతాన్ని జూదశాలలకు చిరునామాగా మార్చడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ‘ఈనాడు ప్రత్యేక ప్రతినిధి’ సోమ, మంగళవారాలు గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు, నందివాడ, గుడివాడ రూరల్ మండలాల్లోని మల్లయ్యపాలెం, పెంజెండ్ర, మోటూరు, చిత్రం, గుడ్లవల్లేరు, నందిపాడు, తుమ్మలపల్లి, రామాపురం, ఐనంపూడి, జొన్నవాడ, విన్నకోట తదితర గ్రామాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లోని రైతుకూలీలు, విద్యార్థులు, మహిళలు, రైతులు, వ్యాపారులను నియోజకవర్గ అభివృద్ధి, రహదారుల నిర్మాణం, రాజకీయ పరిస్థితులపై ప్రశ్నించినప్పుడు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. 2024 ఎన్నికల్లో తాము చరిత్రాత్మక మార్పును కోరుకుంటున్నామని వెల్లడించారు.
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరు..
నియోజకవర్గంలో ఏ దారి చూసినా గుంతలు. రోజూ సుమారు 25,000-30,000 మంది వివిధ ప్రాంతాల నుంచి గుడివాడ పట్టణానికి రాకపోకలు సాగిస్తుంటారు. ఇంతటి కీలకమైన కేంద్రాన్ని కలిపే దారులన్నీ మరమ్మతులు లేక దెబ్బతిన్నాయి. కంకిపాడు-గుడివాడ ప్రధాన రహదారితోపాటు పట్టణంలోని అంతర్గత మార్గాలు, గ్రామీణ ప్రాంతాల్లోని రహదారులు అధ్వానంగా ఉన్నాయంటూ పలు గ్రామాల ప్రజలు ఆవేదన వెలిబుచ్చారు. కార్లు, ద్విచక్రవాహనాలపై కొత్తగా వచ్చిన వారిలో 80శాతం మంది ప్రమాదాలకు గురవుతుంటారని గుడివాడకు చెందిన న్యాయవాది తెలిపారు. కంకిపాడు-గుడివాడ మార్గంలో రాత్రిళ్లు ఎంతోమంది వాహనదారులు ప్రమాదాల బారినపడి మృతిచెందారని, కొందరు వికలాంగులుగా మారినట్లు వివరించారు. దొండపాడు, వలివర్తి, లింగవరం, పోలుగూడ, గుడివాడ నుంచి నందివాడ వెళ్లే వైపు జనార్దనపురం, తుమ్మలపల్లి, కుదరవల్లి, రామాపురం రహదారులు గుంతలు పడ్డాయి. ఎన్నికల సమయంలో జనం నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో రోడ్లు తవ్వి వదిలేశారు. వాటిని పూడ్చేందుకు తారు కొరత ఉందని చెబుతున్నారని నందివాడకు చెందిన పచారీ దుకాణ యజమాని తెలిపారు. ‘తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు బాగు చేసిన రోడ్లే. నాలుగేళ్లలో గోతులు పడి జనం ఇబ్బందులు పడుతున్నా మా ఎమ్మెల్యే కన్నెత్తి చూసిన పాపానపోలేదు’ అంటూ తుమ్మలపల్లికి చెందిన ఒక వ్యక్తి వివరించారు. ‘విజయవాడ-గుడివాడ రోజూ అయిదు ట్రిప్పులు వేస్తుంటాం. ఒంటి నొప్పులతో నిద్రకూడా పట్టదు. మా కళ్లెదుటే చాలాసార్లు ప్రమాదాలు జరిగాయి. ఇలాంటి రోడ్లలో ఇంధనం కూడా ఎక్కువ ఖర్చవుతుంది. డబ్బులు వస్తున్నాయని ఆశపడి తప్పటడుగు వేస్తే ప్రతిఫలం ఇలానే ఉంటుందని ప్రజలు గమనించాలి’ అని ఆర్టీసీ కండక్టర్ తెలిపారు.
రైతుల గోడు పట్టదు.. తాగునీరు రాదు
వైకాపా హయాంలో రైతులకు రాయితీల్లేవు. పంటకాల్వల్లో పూడిక తీయక ఏళ్లవుతోంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా పంట కొనుగోళ్లు చేపట్టినా లాభం లేదు. ఆక్వా సాగుచేసే వారికి గత ప్రభుత్వం ఇచ్చిన విద్యుత్ రాయితీ తీసేశారని విన్నకోట గ్రామానికి చెందిన రైతు తెలిపారు. ఆరుగాలం పండించిన పంటకు తరుగు, తాలు అంటూ తీస్తున్నారు. తమ పంటను తామే అమ్ముకోకుండా నిబంధనలు విధించారంటూ నందివాడకు చెందిన ఇద్దరు రైతులు వాపోయారు. నందివాడ, గుడివాడల్లో తాగునీటి ఎద్దడి పెరిగిందంటున్నారు. తాగేందుకు నీళ్లు కూడా రోజుకు రూ.30 ఇచ్చి కొంటున్నామని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన మహిళ తెలిపారు. ప్రతి గ్రామంలో 20 మందితో మాట్లాడితే 12-15 మంది ప్రభుత్వ పనితీరుపై పెదవి విరిచారు. అమరావతి రాజధానిని తరలించడాన్ని అందరూ వ్యతిరేకించారు. ‘45 ఏళ్లు దాటిన నా భార్యకు డబ్బులిస్తున్నారు. మా అమ్మకు పింఛన్ ఇవ్వడం మంచిదే. ఇంజినీరింగ్ చేసిన నా బిడ్డ ఉద్యోగం చేయాలంటే బెంగళూరు, హైదరాబాద్ వెళ్లాలా? ఇన్నేళ్లలో ఒక్క ఐటీ కంపెనీ, పరిశ్రమ తెస్తే ఉపాధి ఇక్కడే దొరికేది కదా’ అంటూ చిత్రం గ్రామానికి చెందిన ఒకరు ప్రశ్నించారు. ఏటా రూ.10వేలు తీసుకుంటున్న ఆటోడ్రైవర్లలోనూ నిరాశే కనిపించింది. గుడివాడ, గుడ్లవల్లేరులో పలకరించిన 10 మంది ఆటోడ్రైవర్లలో 8 మంది.. డీజిల్ ధర పెంచడం వల్ల ఏటా రూ.12,000 నష్టపోతున్నామని, ప్రభుత్వం ఇచ్చేది రూ.10వేలైతే.. తాము రూ.12 వేలు చెల్లిస్తున్నట్లు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
విద్యుత్ బకాయిల్ని వెంటనే చెల్లించకపోతే వారి ఫ్లాట్లకు కరెంట్ కట్ చేస్తామని రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తూ ఉచిత వసతి సదుపాయాన్ని వినియోగించుకుంటున్న ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. -
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
జగన్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులపై 1,500కుపైగా కేసులు పెట్టారని, చివరికి ధర్నా చేశారంటూ 80ఏళ్ల వయసుపైబడిన పెన్షనర్లపైనా కేసులు నమోదు చేశారని అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?ఉన్నత విద్యామండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) ప్రవేశాల కౌన్సెలింగ్ను ఉన్నత విద్యామండలి ఏడాది పొడవునా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
బ్యాంకుల్లో నగదు జమకాని వారికి.. 4న ఇంటింటికీ పింఛన్ పంపిణీ
బ్యాంకు ఖాతాలు మనుగడలో లేని కారణంగా పింఛను నగదు జమకాని వారికి మే 4వ తేదీన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్కుమార్ వెల్లడించారు. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై సీఎం వెనక్కి తగ్గరు: మంత్రి పెద్దిరెడ్డి
ల్యాండ్ టైటిలింగ్ యాక్టును సీఎం జగన్ కచ్చితంగా అమలు చేసి తీరుతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
అన్నం ముద్దపైనా అక్కసే!
అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టుగా.. విపక్షాలపైన తనకున్న ఉక్రోషాన్ని.. నిర్భాగ్యులమీద చూపారు జగన్... గత తెదేపా ప్రభుత్వం తెచ్చిన అన్న క్యాంటీన్లను వచ్చీరాగానే మూసేయించారు... రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఆ క్యాంటీన్లు.. రోజూ వేల మంది క్షుద్భాద తీర్చేవి. దీనిపై విమర్శలు పెరిగాక.. ‘ఆహా’ క్యాంటీన్లు తెచ్చినా... జగన్ పాలనలానే.. దిక్కూదివానం లేనట్లుంది వాటి పరిస్థితి. -
‘అన్నపూర్ణ’ అప్పుల కుప్ప
అద్భుత రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి... 70 శాతం పూర్తయిన పోలవరం... ఆశతో దూసుకొచ్చిన వందలాది ఐటీ పరిశ్రమలతో... ... కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన బిడ్డలా... ఐదేళ్ల కిందట జగన్ చేతికొచ్చింది ఆంధ్రావని! -
‘భీమ్లీ’ ఖల్ నాయక్!
‘‘నాయక్ నహీ.. ఖల్ నాయక్ మై హూ..!’’ అంటూ ఆయన చేసే హడావుడి అంతాఇంతా కాదు. ‘‘ఏం చేస్తున్నావ్? యూనిఫామ్ తీసేయ్..!’’ అంటూ పోలీసులపైనే రుసరుసలాడతారు. -
అంతా.. ఆ ఏడు చేపలకే!
వడ్డించే వాడు జగన్ అయితే... కేటాయింపులు ఇలాగే ఉంటాయి మరి. తన తండ్రి హయాంలోనే కంపెనీలతో రూ.లక్షల కోట్ల ‘క్విడ్ప్రోకో’ లావాదేవీలకు తెరతీసిన ఆయన... తాను గద్దెనెక్కాక ‘గంపగుత్త’ సూత్రాన్ని అనుసరించారు. -
వైకాపా హయాంలో ఎస్సీ కమిషన్ నిర్వీర్యం
వైకాపా హయాంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు ధ్వజమెత్తారు. సమతా సైనిక్దళ్ ఆధ్వర్యంలో గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
14 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్
అత్యంత సమస్యాత్మకమైన 14 నియోజకవర్గాల పరిధిలో మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ పెడతామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
పథకాలకు గండికొట్టి.. గొంతెండబెట్టి!
ధ్వంసరచనే తప్ప దార్శనికత లేని జగన్ పాలనలో పట్టణాల్లో గుక్కెడు తాగునీళ్లూ కరవయ్యాయి. తెదేపా తెచ్చిందన్న ఏకైక కారణంతో రూ.వేల కోట్ల పథకాలను ఎండబెట్టిన ఈ నీరో చక్రవర్తి ఎండల్లో జనం గొంతెండి అలమటిస్తుంటే... తాడేపల్లి ప్యాలెస్లో ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నారు... కేవలం తన పంతం కోసం జనం సంక్షేమాన్ని వదిలేసిన ఈ ప్రభుత్వాధినేతను ఏమని పిలవాలి? -
పార్టీలకు కొమ్ముకాస్తున్న కొందరు ఐఏఎస్ అధికారులు
‘ప్రజలకు మేలు చేయాల్సిన కొందరు ఐఏఎస్లు... తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలకు కొమ్ముకాస్తున్నారు. అలాంటి వారిని రాజద్రోహులుగా ప్రకటించాలి’ అని ఆర్థిక నిపుణుడు, ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ డిమాండ్ చేశారు. -
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887కు చేరింది. ఈ ఏడాది జనవరి 22న విడుదల చేసిన తుది జాబితాలో 4,08,07,356 మంది ఓటర్లు ఉన్నారు. -
ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
భగభగ మండే ఎండలతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కర్నూలు, కావలి, నంద్యాల, ఆరోగ్యవరం తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు పెరిగాయి. -
ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్పై వింత నాటకం
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేసే ఎన్నికల సంఘం.. ఉద్యోగులపై మాత్రం కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. -
బకాయిలు చెల్లించకపోతే వైద్యం అందించలేం
బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 4 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) నగదు రహిత సేవలను నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆశా) ప్రకటించింది. -
కేజీబీవీ సిబ్బంది సేవల్లో ప్రభుత్వం కొత్త మెలిక
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల ఒప్పంద ఉపాధ్యాయినుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన స్టార్క్.. ముంబయిపై కోల్కతా విజయం
-
119 కోట్లకు టెలికాం సబ్స్క్రైబర్లు.. జియోకు ఎంతమందంటే?
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు