ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు.
జగన్ అఫిడవిట్లో మాయాజాలం
విలువైన వాణిజ్య, నివాస భవనాల ఊసే లేదు
20 ఏళ్లలో రూ.1.74 కోట్ల నుంచి రూ.757 కోట్లకు చేరిన ఆస్తులు
ఈనాడు, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. వివిధ సంస్థల్లో వాటాలు చూపినా, ఆ సంస్థల వాస్తవ విలువలను పేర్కొనలేదు. ఇంద్రభవనం లాంటి లోటస్పాండ్ ఇల్లు, బెంగళూరులో అతిపెద్ద వాణిజ్య భవనాల ఊసెత్తలేదు. సోమవారం దాఖలు చేసిన అఫిడవిట్లో కుటుంబ ఆస్తులు రూ.757.65 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. అఫిడవిట్లో చూపించిన ఆస్తులు, పెట్టుబడుల వాస్తవ విలువ లెక్కించినా కొన్నివేల కోట్లు ఉంటుందని తెలుస్తోంది. సాక్షి దినపత్రికలో ఆయన కుటుంబానికి వాటాల విషయాన్ని ప్రస్తావించలేదు. వాస్తవానికి సాక్షిలో ఆయన కుటుంబసభ్యుల సంస్థదే మెజారిటీ వాటా.
కార్మెల్లో రూ.8లక్షల షేర్ల అసలు విలువ ఎంతంటే..
జగన్ తన అఫిడవిట్లో సాక్షి దినపత్రిక, సాక్షి టెలివిజన్ను తమ ఆస్తులుగా పేర్కొనలేదు. కానీ ఈ రెండు సంస్థల్లో మెజారిటీ వాటా ఆయనదే. సాక్షి దినపత్రికను ప్రచురించే జగతి పబ్లికేషన్స్లో 69.05% వాటా కార్మెల్ ఏషియా హోల్డింగ్ సంస్థకు ఉంది. జగతి పబ్లికేషన్స్ ప్రారంభ పెట్టుబడి రూ.73.56 కోట్లను ఈ సంస్థ సమకూర్చింది. వాస్తవానికి కార్మెల్లో జగన్ పెట్టుబడి రూ.8 లక్షలు. కానీ మిగతాది మొత్తం వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కొందరికి చేసిన మేళ్లకు ప్రతిఫలం. బెంగళూరులో జగన్ ఇంటి చిరునామాతో కార్మెల్ సంస్థను 2005 నవంబరు 13న ప్రారంభించారు. తాను రూ.8 లక్షలు, తనకు సంబంధించిన సండూర్ పవర్ నుంచి రూ.12 కోట్లు పెట్టుబడి పెట్టారు. అయితే సండూర్ పవర్ నుంచి వచ్చిన రూ.12 కోట్లు వ్యాపారం చేసి సంపాదించింది కాదు. మారిషస్కు చెందిన ప్లూరీ ఎమర్జింగ్, 2ఐ కేపిటల్ నుంచి వచ్చిన రూ.124.6 కోట్ల నుంచి కార్మెల్లోకి మళ్లించారు. కార్మెల్ ఏషియాలో ఒక్కో షేరు ముఖవిలువ రూ.10. కానీ తండ్రి నుంచి మేళ్లు పొందిన వివిధ కంపెనీలు రూ.252 ప్రీమియం చెల్లించి మొత్తం రూ.82.14 కోట్లు సమర్పించుకున్నాయి. కార్మెల్ నుంచి జగతిలోకి ప్రారంభ పెట్టుబడి కింద ఇలా రూ.73.56 కోట్లు వెళ్లాయి. జగతిలో ప్రారంభ పెట్టుబడి కింద ఒక్కో షేరు రూ.10 చొప్పున జగన్ తీసుకున్నారు. తర్వాత జగతిలోకి అక్రమ వసూళ్లు చేశారు. ఒక్కోషేరు రూ.360 చొప్పున (రూ.350 ప్రీమియంతో) వసూలు చేశారు. ఇలా సాక్షిలోకి మొత్తం రూ.1,246 కోట్లు రాబట్టారు.
ప్రస్తుతం జగతి పబ్లికేషన్స్లో తాజా వివరాల ప్రకారం మొత్తం షేర్లు 10,65,58,481. ఇందులో కార్మెల్ ఏషియాకు ఉన్న షేర్లు 7,35,81,022. అంటే జగతి పబ్లికేషన్స్లో కార్మెల్ ఏషియా వాటా 69.05%. ఒక్కోషేరు విలువ రూ.360 లెక్కన జగతి పబ్లికేషన్స్లో కార్మెల్ ఏషియా సంస్థ వాటా విలువ రూ.2,648.91 కోట్లు అవుతుంది.
రెండు దశాబ్దాల్లో ఎన్ని రెట్లో!
జగన్ ఆస్తులు 20 ఏళ్లలో గణనీయంగా పెరిగాయి. 2004లో సమర్పించిన ఐటీ రిటర్నులో నికర ఆస్తుల విలువ రూ.1.74 కోట్లుగా చూపించారు. 2009 నాటికి దాన్ని రూ.77.39 కోట్లుగా చూపించారు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు జగన్ భారీగా ఆస్తులు కూడబెట్టారు. తండ్రి అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని ప్రజావనరులను కొందరికి దోచిపెట్టి, వారినుంచి ప్రతిఫలంగా కంపెనీల్లోకి పెట్టుబడులు పెట్టించారు. అక్రమ ప్రతిఫలాలతో చేసిన వ్యాపారాలతో ఆస్తుల విలువ 2011 నాటికి రూ.445 కోట్లకు చేరింది. 2019 నుంచి సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత ఆస్తుల విలువ రూ.510 కోట్ల నుంచి రూ.757 కోట్లకు చేరింది. ఈ అయిదేళ్లలో ఆయన ఆస్తులు 48.45% పెరిగాయి.
క్లాసిక్ రియాల్టీ నుంచి ఏడాదికి రూ.52.72 కోట్ల లాభం
బెంగళూరు బన్నేరుఘట్ట రోడ్డులో జగన్కు అయిదెకరాల స్థలంలో 7 అంతస్తుల్లో భారీ వాణిజ్య భవనం ఉంది. ఈ భవనం అప్పట్లో వైఎస్ఆర్ చేసిన మేళ్లకు ప్రతిఫలంగా చౌక ధరకే జగన్ పరమైంది. క్లాసిక్ రియాల్టీ పేరిట ఉన్న ఈ భవనంలో 99.99% వాటా జగన్ దంపతులదే. ఈ క్లాసిక్ రియాల్టీలో జగన్ పెట్టుబడి విలువ రూ.65.19 కోట్లు, భారతిరెడ్డి పెట్టుబడి విలువ రూ.4.55 కోట్లు కలిపి మొత్తం పెట్టుబడి విలువ సుమారు రూ.70 కోట్లు ఉన్నట్లు చూపించారు. అయితే క్లాసిక్ రియాల్టీ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ గడిచిన ఏడాదికి రూ.52 కోట్లకు పైగా లాభాన్ని చూపింది. 2011 నాటికే ఈ భవనం విలువ రూ.400 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. గడిచిన 13 ఏళ్లలో బెంగళూరులో స్థిరాస్తి ధరలు భారీగా పెరిగాయి. ఈ లెక్కన ఈ భవనం విలువ ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ