అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది.
ఏమీ తెలియనట్లు అడిగిన జగన్
వైకాపా మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడితే.. అప్పుడు విశాఖ ఉక్కు గురించి చూస్తానన్న సీఎం
మూడేళ్ల తర్వాత తనను కలిసేందుకు కార్మిక సంఘాలకు అనుమతి
మిగులు భూములు అమ్ముకోవాలని ఉచిత సలహా
వామపక్షాల అభ్యర్థిని విత్డ్రా చేయించి అమర్నాథ్ను గెలిపించాలట!
ఈనాడు, విశాఖపట్నం: విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. ఆర్థికసాయం, సెయిల్లో విలీనం గురించి చెప్పేందుకు మూడేళ్లుగా కార్మిక, అధికారసంఘాల ప్రతినిధులు జగన్ను కలవాలని ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదు. కానీ, ఎన్నికల వేళ మంత్రి అమర్నాథ్ ద్వారా స్టీలుప్లాంటు కార్మికసంఘాల నేతలను పిలిపించారు. బస్సుయాత్రలో భాగంగా విశాఖలోని ఎండాడలో జగన్ బసచేసిన శిబిరం వద్ద ఉక్కు పరిరక్షణ పోరాటసమితి, అధికార సంఘం ప్రతినిధులు కొందరు ఆయనను మంగళవారం కలిశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... జగన్ స్టీలుప్లాంటు వ్యవహారంపై స్పందించిన తీరుకు కార్మిక నేతలు నివ్వెరపోయారు. ‘తెదేపా-భాజపా-జనసేన కూటమిని ఓడించి గాజువాకలో అమర్ను గెలిపించండి. వైకాపా మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడితే అప్పుడు స్టీలుప్లాంటు సంగతి చూస్తా’ అని జగన్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. గాజువాకలో వామపక్షాల అభ్యర్థి జగ్గునాయుడితో విత్డ్రా చేయించి అమర్నాథ్కు మెజారిటీ తెప్పించి అప్పుడు ప్లాంటు గురించి అడగాలని సూచించినట్లు సమాచారం.
రాష్ట్రంలో స్టీలుప్లాంటుకు ఉన్న గర్భాం మాంగనీస్ గనులు, సారపల్లిలోని సిలికాన్ శాండ్ అనుమతుల గడువు పెంచాలని కార్మికసంఘాల నేతలు జగన్ను కోరారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘స్టీలుప్లాంటులో ఇనుప ఖనిజం ఎక్కువ వాడతారు. తక్కువ వాడే మాంగనీస్, సిలికాన్ గురించి ఎందుకు? అది చిన్న అంశం’ అంటూ గనుల లీజు పొడిగింపుపై ఏమీ చెప్పకుండా దాటేశారు. వైకాపా అధికారంలోకి వస్తే.. స్టీలుప్లాంటుకు అవసరమైన ఇనుప ఖనిజం ఒడిశా నుంచి తెప్పించవచ్చని జగన్ తెలిపారు.
అధికారంలోకి వస్తే ఒడిశా, ఛత్తీస్గఢ్ సీఎంలతో మాట్లాడి ప్రత్యేక గనులు కేటాయించేలా చేస్తానని పాదయాత్ర సమయంలో జగన్ హామీ ఇచ్చారు. జీవీఎంసీ ఎన్నికల సమయంలో వైకాపా నేత విజయసాయిరెడ్డి... స్టీలుప్లాంటు కోసం పాదయాత్ర చేశారు. గతేడాది ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ప్రైవేటీకరణ ఆపడానికి ఎంపీలతో సంతకాలు చేయించామంటూ ఓ లేఖను వెలుగులోకి తెచ్చి వైవీ సుబ్బారెడ్డి డ్రామాలాడారు. గత 1,300 రోజులుగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ఆర్థికసాయం చేయాలని, సెయిల్లో విలీనం చేయాలంటూ కార్మిక సంఘాలు ఉద్యమం చేస్తున్నాయి. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ద్వారా రాష్ట్రప్రభుత్వం రూ.2వేల కోట్ల ఆర్థికసాయం చేయాలని జగన్ను కోరాయి. ఇవన్నీ తెలిసి కూడా... కార్మిక సంఘాలు ‘ప్లాంటులో జీతాలివ్వని పరిస్థితి నెలకొంది’ అని కార్మికసంఘాలు చెప్పగానే.. ‘అయ్యో... స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ తిరిగి ప్రశ్నించడం అక్కడున్నవారిని ఆశ్చర్యానికి గురిచేసింది. మిగులుభూములు అమ్ముకుంటే నష్టాల నుంచి ప్లాంటు గట్టెక్కుతుందని ఒక ఉచిత సలహా సైతం ఇచ్చారట.
విద్యుత్ బిల్లులు చెల్లించాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని, వాయిదాల పద్ధతిలో ఆర్ఐఎన్ఎల్ బకాయిలు చెల్లిస్తుందని, దానికి సహకరించాలని జగన్ను కార్మిక, అధికారసంఘ ప్రతినిధులు కోరారు. ‘డిస్కంకు రూ.లక్ష కోట్ల అప్పు ఉంది. మీరు కట్టకపోతే ఎలా?’ అంటూ జగన్ స్పందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎస్టీగా నా హక్కులు హరించారు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు..!
-
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
-
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
-
ఎన్టీఆర్కు ఒక్క సెకను.. నాకు 10 రోజులు: జాన్వీకపూర్
-
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
-
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్