ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది.
మరోసారి వృద్ధుల ఉసురు పోసుకుంటారా?
ధనుంజయరెడ్డి, జవహర్రెడ్డి, మురళీధర్రెడ్డికి ఇంకా వైకాపా ప్రయోజనాలే ముఖ్యమా?
మే నెల పంపిణీకి మరో వారమే గడువు.. దిద్దుబాటు చర్యలేవీ?
సీఈఓ మీనా దృష్టి పెడితేనే లబ్ధిదారులకు మేలు
ఈనాడు - అమరావతి
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. 66 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళల జీవితాలతో వికృతక్రీడకు సిద్ధమవుతోంది. ఏప్రిల్లో అమలుచేసిన ఆదేశాల్నే.. మే నెలలోనూ కొనసాగించే ఆలోచన చేస్తోంది. సీఎం ముఖ్యకార్యదర్శి ధనుంజయరెడ్డి, సీఎస్ జవహర్రెడ్డి, సెర్ప్ సీఈఓ మురళీధర్రెడ్డి తదితరులంతా వైకాపా కుటిల రాజకీయానికి వంతపాడుతున్నారు. వృద్ధులు నానాకష్టాలు పడుతున్నా.. ఏప్రిల్లో 30 మందికి పైగా మరణించినా వీరి మనసు కరగడం లేదు. వారంలో మే నెల పింఛన్ల పంపిణీ ప్రారంభించాల్సి ఉన్నా.. ఇంటి దగ్గరే పంపిణీపై స్పష్టత ఇవ్వట్లేదు. ఏప్రిల్లో పింఛన్ల పంపిణీ సందర్భంగా వృద్ధుల్ని మండుటెండల్లో సచివాలయాలకు రప్పించి నరకయాతన పెట్టారు. ఇప్పుడూ అలాగే వృద్ధుల జీవితాలతో ఆటలాడుతూ.. మానసిక ఆందోళనకు గురిచేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎన్నికల సంఘమూ జోక్యం చేసుకోవట్లేదు.
వృద్ధుల్ని నరకయాతన పెట్టడమే ధనుంజయరెడ్డి లక్ష్యమా?
పాలనలో ప్రతి చిన్న విషయంలో జోక్యం చేసుకునే సీఎం ముఖ్య కార్యదర్శి ధనుంజయరెడ్డి.. ఇప్పుడు ఏం చేస్తున్నారు? సచివాలయాలకు నడవలేక రాష్ట్రంలో లక్షలమంది వృద్ధులు నరకయాతన పడుతున్నా నిర్ణయాల్ని ఎందుకు సమీక్షించడం లేదు? మళ్లీ మే నెలలోనూ వాటినే కొనసాగించి.. తెలుగుదేశం పైకి నెపం నెట్టే ప్రయత్నమా? ఆయనకు ఇంకా వైకాపా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా?
జవహర్రెడ్డికి జగన్ ప్రయోజనాలే ముఖ్యమా?
తమ నిర్ణయాల వల్లే.. ఏప్రిల్లో పింఛన్ల కోసం తిరిగి వృద్ధులు మరణించారని సీఎస్ జవహర్రెడ్డి ఇప్పటికీ గుర్తించలేకపోయారా? గుర్తిస్తే సమీక్షించి పరిస్థితుల్ని చక్కదిద్దాల్సిన బాధ్యత ఆయనది కాదా? వృద్ధుల కష్టాలు ఆయనకు కనిపించడం లేదా? పింఛనుదారుల ఇబ్బందులకు కారణమైన సీఎస్ను పదవి నుంచి తప్పించాలని ప్రతిపక్షాలు డిమాండు చేస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి వినతిపత్రాలూ ఇచ్చాయి. ఇప్పటికైనా పింఛనుదారుల కష్టాలు తీర్చాలని ఆయన ఎందుకు భావించడం లేదు? లక్షల మంది వృద్ధుల కంటే జగన్ ప్రయోజనాలే ముఖ్యమా?
మురళీధర్రెడ్డి వైకాపా ముద్ర వీడరా?
సజావుగా సాగాల్సిన పింఛన్ల పంపిణీలో.. ఇన్ని సమస్యలకు కారణం మురళీధర్రెడ్డి నిర్ణయాలే. ప్రతిపక్షాలు, వివిధ ప్రజాసంఘాలూ ఆయనవైపే వేలెత్తి చూపిస్తున్నాయి. వృద్ధుల్ని సచివాలయాలకు రప్పించాలనే ఆలోచన చేసిందీ సీఎం ముఖ్య కార్యదర్శి ధనుంజయరెడ్డి, మురళీధరరెడ్డిలే. అదే 30 మందికి పైగా వృద్ధుల మరణాలకు దారితీసింది. కనీసం మే నెలలో అయినా ఇళ్లవద్దే పంపిణీ చేస్తే తమపై పడిన మచ్చను వారు కొంతైనా తుడిచేసుకునే అవకాశం లభిస్తుంది. అలా కాకుండా ఇప్పటికీ వైకాపా సేవే ముఖ్యం అనుకుంటే మరింత మంది వృద్ధుల ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టిన పాపం ఆయనదే అవుతుంది.
సీఈఓ మీనాకు బాధ్యత లేదా?
ముదిరిన ఎండలు, పెరిగిన వడగాలుల తీవ్రత నేపథ్యంలో కిలోమీటర్లు నడిస్తే.. వృద్ధుల ప్రాణాలకే ప్రమాదమని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) మీనాకు చెప్పాల్సిన పనిలేదు. ఆ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించి ఎందుకు జోక్యం కోరడం లేదు? ఏప్రిల్లో పింఛను కష్టాలు, మరణాలు ఆయనకు తెలుసు కదా? అయినా వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ వద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులిచ్చిందని.. సరిదిద్దాల్సిందీ వారేనని, తనకేమీ సంబంధం లేదని ఎలా తప్పించుకుంటారు? వృద్ధుల్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్న నేతల తీరును సీఈసీ దృష్టికి తీసుకెళ్లారా? రాష్ట్రంలో వాలంటీరు వ్యవస్థను రద్దుచేశారంటూ ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి.. ఎన్నికల సంఘం ఆదేశాలను వక్రీకరిస్తున్నా దానిపైనా ఎందుకు నోరు మెదపరు?
వృద్ధుల జీవితాలతో రాజకీయమా.. జగన్కు ఇదేమి ఆనందం?
ఇంటి దగ్గర పింఛన్ల పంపిణీని తెదేపా అడ్డుకుంటోందని, వైకాపాకు ఓటేయకపోతే ఇంటి దగ్గరకు పింఛన్లు అందవని తాము పదేపదే చెబుతున్న అబద్ధాలు నిజమే అని నమ్మించాలంటే.. మే నెలలోనూ సచివాలయాలకు నడిపించడం, పంపిణీలో జాప్యం చేయడమే మార్గంగా వైకాపా భావిస్తోంది. మే నెలలో నాలుగైదు రోజుల పాటు వృద్ధుల్ని ఇబ్బందులు పెడితే తప్పంతా తెదేపా మీదకు నెట్టేయొచ్చని, ఓట్లు దండుకోవచ్చనేది ఆ పార్టీ వ్యూహం. మంచాలపై వృద్ధుల్ని తరలించడం ద్వారా కార్యకర్తలు ఎవరైనా తప్పుదారిలో నడుస్తుంటే అడ్డుకోవాల్సిన జగన్.. తానే శవ రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబే తన మనిషి నిమ్మగడ్డ రమేశ్ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేయించి.. వాలంటీరు వ్యవస్థను రద్దుచేయించారని, ఇంటి దగ్గర పింఛను ఇవ్వకుండా అడ్డుకున్నారని ప్రచారం చేస్తున్నారు.
ఇంటింటి పంపిణీకి సరిపడా ఉద్యోగులున్నా..
ఎన్నికలు తప్ప ఇప్పుడు అత్యవసర పనులేవీ లేవు. నాలుగురోజుల పాటు అందరినీ వినియోగించుకోవచ్చు. రాష్ట్రంలో 66 లక్షల మంది పింఛనుదారులు ఉన్నారు. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు, వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శులు, ఇతర పంచాయతీ సిబ్బంది కలిపితే 1.30లక్షల మంది పైనే ఉంటారు. సగటున ఒక్కొక్కరు 40-50 మందికి ఇవ్వాల్సి వస్తుంది. రాష్ట్రప్రభుత్వం సాకు చెబుతున్నట్లు ఎండాకాలంలో వ్యవసాయ అనుబంధ సహాయకులకు అంత పని ఒత్తిడేమీ ఉండదు. అత్యవసర సర్వీసుల్లోని సిబ్బందిని పక్కన పెట్టినా.. ఇంటింటి పంపిణీకి అవసరమైన ఉద్యోగులు ఉన్నా.. ప్రభుత్వం కావాలనే వృద్ధుల్ని ఇబ్బందులకు గురిచేస్తోంది.
పింఛను సొమ్ము అందుబాటులో ఉంటుందా?
మే నెలలో పింఛను పంపిణీకి సొమ్ము అందుబాటులో ఉంటుందా.. లేదా? అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. వివిధ పథకాలకు సంబంధించి సీఎం జగన్ ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే రూ.8,200 కోట్లకు బటన్ నొక్కినా ఇప్పటికీ ఖాతాల్లో జమకాలేదు. ఏప్రిల్ 30 నుంచి చేయూత, ఇతర పథకాల నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో పడతాయని సచివాలయ, వాలంటీర్ల గ్రూపుల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. వీటికోసం పింఛను చెల్లింపులు నిలిపేసే అవకాశం ఉందని, ఆ నెపాన్నీ తమపై నెట్టేసి తెదేపా వల్లే పింఛను అందట్లేదని ప్రచారం చేస్తారని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?