ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది.
జగన్ జమానాలో వాడవాడలా.. గంజాయి, డ్రగ్స్
చాక్లెట్లు కొనుక్కోగలిగేంత సులువుగా అందుబాటు
బాధితులుగా లక్షల మంది యువత...వందల మంది ఆత్మహత్యలు
ఈనాడు, అమరావతి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రపంచ ఐటీకి బ్రాండ్.. విభజన తర్వాత రూపుదిద్దుకుంటున్న అమరావతి మన బ్రాండ్...
జగన్ జమానాలో మాత్రం ఏపీ అంటే డ్రగ్స్, గంజాయికి బ్రాండ్గా ముద్ర పడింది.
‘ఆడుదాం ఆంధ్రా’ కాదు... ‘డ్రగ్స్ వాడుదాం ఆంధ్ర’ అన్నంతలా పరిస్థితులు దిగజారిపోయాయి.
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లోకి చేరేసరికి దీని విలువ రూ.25 వేల కోట్ల్ల పైనే ఉంటోంది. ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా వ్యవస్థీకృత దందా ఇంత భారీగా సాగుతుంటే ఉక్కుపాదం మోపి అణచి వేయాల్సిన జగన్... నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు. ఎప్పుడో ఒకసారి మొక్కుబడి సమీక్షలు, అమలుకు నోచుకోని ప్రకటనలివ్వడం తప్ప గత ఐదేళ్లలో గంజాయిని అరికట్టే కఠినచర్య ఒక్కటంటే ఒక్కటీ తీసుకోలేదు. మత్తు ముఠాలపై నిఘా లేదు. కింగ్పిన్ల ఆచూకీ కనిపెట్టలేదు. ఇతర రాష్ట్రాల్లోకి వెళ్లి దాడులు నిర్వహించలేదు. స్మగ్లర్ల ఆస్తులు గుర్తించి జప్తు చేయలేదు. ఈ మత్తు మాఫియాలో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ అష్ట దిగ్బంధనం చేయడం, లభ్యతే లేకుండా చూడటం వంటి వాటిపై అసలు దృష్టి పెట్టిందే లేదు. గంజాయి కట్టడిపై పనిచేసేలా ప్రత్యేకంగా ఒక విభాగమైనా ఏర్పాటు చేయలేదు. పర్యవసానంగా ఏపీతో పాటు సరిహద్దు రాష్ట్రాలకూ గంజాయి ఇప్పుడు పెనుసవాల్గా మారింది.
గంజాయి ఇచ్చి... బదులుగా డ్రగ్స్ తెచ్చి
విశాఖ మన్యంలో సాగయ్యే గంజాయికి అంతర్జాతీయంగా గిరాకీ ఉంది. దీంతో మత్తు ముఠాలు కొన్నేళ్లుగా ఇక్కడ తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో తొలుత స్థానిక యువతకు అలవాటు చేసి వారినే సరఫరాదారులుగా మార్చుకుంటున్నాయి. పక్కదారి పట్టిన యువత ఈ రాకెట్లలో భాగస్వాములవుతున్నారు. గంజాయిని గోవా తదితర ప్రాంతాలకు పంపి అక్కడి నుంచి ఎల్ఎస్డీ వంటివి తెస్తున్నారు. తెలిసిన నైజీరియన్ ముఠాల ద్వారా బెంగళూరు సహా ఇతర నగరాలకు సరఫరా చేస్తున్నారు. ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి మత్తు మాత్రలు, ఇంజక్షన్లు తెప్పించుకుని సరఫరా చేస్తున్నారు. విశాఖలో ఎల్ఎస్డీ, ఎండీఎంఏ గుళికలు, కొకైన్ తదితర మత్తు పదార్థాలు పట్టుబడిన సందర్భాలెన్నో. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి లెహంగాల పార్సిల్లో మాదకద్రవ్యాలను పెట్టి ఆస్ట్రేలియాకు తరలిస్తుండగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో బెంగళూరులో పట్టుకుంది. గంజాయే కాకుండా ఇలా ఖరీదైన మాదకద్రవ్యాలు ఏపీ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతున్న ఉదంతాలున్నాయి.
ఇదీ మత్తు లెక్క!
కేంద్ర సామాజిక న్యాయ సాధికారిత మంత్రిత్వ శాఖ స్థాయీ సంఘం గతేడాది పార్లమెంట్కు సమర్పించిన నివేదిక ప్రకారం...
ఆంధ్రప్రదేశ్లో మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డవారు 20.19 లక్షలు
మాదకద్రవ్యాలు వాడేవారిలో బాలలు: 3.17 లక్షలు (15.70 శాతం)
గంజాయికి బానిసలు:4.64 లక్షలు
ఏపీలో మాదకద్రవ్యాలు వినియోగిస్తున్న 20.19 లక్షల మందిలో 22.98 శాతం మంది గంజాయి వాడుతున్నారు.
10-17 ఏళ్ల మధ్య వయసున్న 3.17 లక్షల మంది బాలలు మాదకద్రవ్యాలకు అలవాటుపడగా.. వారిలో 21 వేల మంది (6.62 శాతం) గంజాయికి బానిసలయ్యారు.
సియొర్రా లియోన్...
పశ్చిమ ఆఫ్రికాలోని ఓ చిన్న దేశం..
అంతర్గత కలహాలు, జాతుల మధ్య ఘర్షణలు నిత్యకృత్యాలు...
యువతకు ఉపాధి అవకాశాలు లేవు...
ఈ పరిస్థితుల్లో ఆరేళ్ల క్రితం ఆ దేశంలోకి ప్రవేశించిందో భూతం...
దాని పేరు ‘‘కుష్’’... ఓ మాదకద్రవ్యం.
అస్తవ్యస్త పరిస్థితుల్లో దాన్ని ఒంటపట్టించుకున్న సియొర్రా లియోన్ ఇప్పుడా మత్తులో ఊగిపోతోంది.
నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా యువత ‘‘కుష్’’ ఊబిలో కూరుకుపోయారు. వేలమంది
మరణిస్తున్నారు. దేశమంతా అతలాకుతలమైపోతోంది. దాన్ని అరికట్టలేక, దిక్కుతోచని పరిస్థితుల్లో ఇటీవల అక్కడ అత్యవసర స్థితి విధించారు.
ఆంధ్రప్రదేశ్...
ఐదేళ్ల క్రితం.. ఒకేఒక్క అవకాశం అంటూ వచ్చాడో మాయలమారి.. అంతే... రాష్ట్రం అల్లకల్లోలమైంది
అభివృద్ధి ఆగిపోయింది... పరిశ్రమలు పారిపోయాయి.. ఉపాధి ఊసులేకుండాపోయింది
రాష్ట్రం గంజాయి, మాదకద్రవ్యాల అడ్డాగా మారిపోయింది.
వీధివీధిలో, సందు సందులో ఎక్కడ చూసినా అవే!
చిల్లర కొట్టుకి వెళ్లి చాక్లెట్లు కొన్నంత సులువుగా గంజాయి కొనొచ్చిక్కడ విద్యాసంస్థలనూ ఈ మత్తు కమ్మేసింది.
ఆ మత్తులో నేరాల సంఖ్యా పెరిగింది.
దీన్ని ఉక్కుపాదంతో అణిచేయాల్సిన జగన్ సర్కారు పట్టించుకోకపోవటంతో రాష్ట్రం అతలాకుతలమైపోయింది. మరికొన్నాళ్లు ఇలాగే కొనసాగితే.. సియొర్రా లియోన్ మాదిరిగానే ఏపీలోనూ అత్యవసర పరిస్థితి విధించాల్సిన పరిస్థితులొస్తాయేమో!
ఓపియెడ్స్, ఇన్హెలెంట్స్, సెడిటివ్స్కు సంబంధించిన మాదకద్రవ్యాల వినియోగం 17 ఏళ్ల లోపు బాలల్లోనూ, 18 ఏళ్లు దాటిన వారిలోనూ ఎక్కువగానే ఉంది.
రాష్ట్రంలో అత్యధికంగా 9.86 లక్షల మంది ఓపియెడ్స్కు బానిసలుగా మారారు. వీటి తర్వాత గంజాయి వినియోగమే ఏపీలో అధికంగా ఉంది.
నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 272 జిల్లాల్లో మాదకద్రవ్యాల వినియోగం, ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సహకారంతో (ఎన్సీబీ) ఈ జిల్లాలను గుర్తించాయి. ఆ జాబితాలో మన రాష్ట్రంలోని ఉమ్మడి విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలున్నాయి. వీటిల్లో విశాఖ మన్యం గంజాయి సాగు, సరఫరాకు కేంద్రంగా ఉంది.
జగన్ నివాసం సమీపంలోనే..
- ముఖ్యమంత్రి జగన్ నివసించే తాడేపల్లికి సమీపంలోని వడ్డేశ్వరంలో మాదకద్రవ్యాలు విక్రయిస్తూ ఇద్దరు యువకులు గతేడాది పట్టుబడ్డారు. బెంగళూరు నుంచి ఆర్టీసీ బస్సులో డ్రగ్స్ తెచ్చి విజయవాడలో విక్రయించేందుకు యత్నిస్తూ ముగ్గురు కొన్నాళ్ల క్రితం పట్టుబడ్డారు.
- గుంటూరు జిల్లాకు చెందిన వైకాపా ప్రజాప్రతినిధి బంధువు మాదకద్రవ్యాలు సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కాడు. అయినా ఆయన్ని కేసులో నిందితుడిగా చేర్చకపోవటంతో కొన్నాళ్ల క్రితం లాలాపేట పోలీసుస్టేషన్ పరిధిలోని సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఆ విషయంలో మొదటి స్థానం...
పాలకులు ఎవరైనా తన రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతి, మానవాభివృద్ధి సూచికలు, మౌలికవసతుల్లో అగ్రగామిగా నిలపాలని భావిస్తారు. ఏ రాష్ట్రమైనా.. కేంద్రప్రభుత్వ శాఖలు విడుదల చేసే వివిధ రకాల ప్రగతి నివేదికల్లో, ఉద్యోగ, ఉపాధి కల్పనల్లో ముందువరసలో ఉండాలని అనుకుంటుంది. కానీ జగన్ జమానాలో ఏపీ మాదకద్రవ్యాల స్మగ్లింగ్లో ముందంజలో నిలిచింది. రాష్ట్రంలో మూలమూలకూ గంజాయి, డ్రగ్స్ వ్యాపించాయి. అందులో ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు పట్టుకుంటున్నది 2 శాతమైనా లేదు. ఆ మాత్రానికే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ (డీఆర్ఐ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) తదితర విభాగాలు విడుదల చేసే నివేదికల్లో మాదకద్రవ్యాల స్మగ్లింగ్లో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది.
- అత్యధికంగా గంజాయి పట్టుబడ్డ రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 2019, 2021 సంవత్సరాల్లో మొదటిస్థానంలో, 2020లో రెండోస్థానంలో ఉంది. మాదకద్రవ్యాల నియంత్రణ కోసం పనిచేసే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) 2021లో దేశవ్యాప్తంగా 7,49,761 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోగా... అందులో అత్యధికంగా 2,00,588 కిలోలు (26.75%) ఆంధ్రప్రదేశ్లోనే పట్టుబడింది. 2020లో దేశవ్యాప్తంగా 5,81,644 కిలోల గంజాయి పట్టుకోగా.. అందులో 97,826 కిలోలు (16.81%), 2019లో దేశవ్యాప్తంగా 3,42,044.87 కిలోలు పట్టుకోగా అందులో 70,229.77 కిలోలు (20.53%) ఏపీలోనే స్వాధీనం చేసుకున్నారు.
- 2021-22 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఆర్థికశాఖ ఆధ్వర్యంలోని డీఆర్ఐ అధికారులు దేశవ్యాప్తంగా 34,002.60 కిలోల మాదకద్రవ్యాల్ని స్వాధీనం చేసుకోగా.. అందులో సగం 18,267.84 (53%) ఏపీలోనే దొరికాయి. పట్టుకున్న వాటిలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు ఉన్నాయి.
- 2019 నుంచి 2022 మధ్య మొత్తం 30,483 మంది ఆత్మహత్యలు చేసుకోగా... వారిలో గంజాయి, మాదకద్రవ్యాలు, మద్యం, ఇతర మత్తుపదార్థాలకు బానిసలుగా మారి బలవన్మరణాలకు పాల్పడిన వారు 1,638 మంది ఉన్నారు. రాష్ట్రం డ్రగ్స్, గంజాయికి కేంద్రంగా మారిన ఫలితంగానే ఈ బలవన్మరణాలు చోటుచేసుకుంటున్నాయి.
ఉడ్తా ఆంధ్రా
డ్రగ్స్ పేరు చెబితే ఒకప్పుడు ఎవరికైనా గుర్తొచ్చే పేరు పంజాబ్. అలాంటిది ఆ రాష్ట్రంలో నాలుగేళ్లలో 306 మంది మత్తుబానిసలు ఆత్మహత్యలు చేసుకోగా... ఏపీలో అంతకు అయిదున్నర రెట్లు అధికంగా బలవన్మరణాలు జరిగాయి. విస్తీర్ణం, జనాభాపరంగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ప్రదేశ్లోనూ నాలుగేళ్లలో 464 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో కంటే ఏపీలోనే ఎక్కువ ఆత్మహత్యలు జరగడం ఇక్కడ మాదకద్రవ్యాల వినియోగం, వ్యాప్తి తీవ్రతకు నిదర్శనం. వీరిలో ఎక్కువమంది యువతే ఉండడం ఆందోళన కలిగించే పరిణామం.
రెండేళ్లలో 292.57 శాతం పెరుగుదల...
మాదకద్రవ్యాలకు అలవాటుపడి, బానిసలుగా మారిన వారిని దాన్నుంచి విముక్తి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ (ఎన్ఏపీడీడీఆర్)
కార్యక్రమం అమలు చేస్తోంది. ఇందులో ఏపీ నుంచి 2018-19లో 1,752 మంది నమోదవగా.. 2020-21 నాటికి వారి సంఖ్య ఏకంగా 6,878కు పెరిగింది. కేవలం రెండేళ్ల వ్యవధిలో 292.57 శాతం మంది నమోదుదారులు పెరిగారు. 2019-20తో పోలిస్తే 2020-21లో ఏకంగా 233.39 శాతం మంది పెరిగారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం, వాటి బారిన పడుతున్న వారి సంఖ్య ఎంత వేగంగా పెరుగుతుందో ఈ గణాంకాలే చెబుతున్నాయి.
పట్టుబడింది రూ.800 కోట్లు పైనే.. అది 2 శాతమైనా ఉండదు
జగన్ గద్దెనెక్కినప్పటి నుంచి 2022 వరకూ డీఆర్ఐ, ఎన్సీబీ, పోలీసు, సెబ్ తదితర విభాగాలన్నీ కలిపి 5,33,620 కిలోల గంజాయి పట్టుకున్నాయి. దీని విలువ రూ.800 కోట్ల పైమాటే. విశాఖ మన్యం నుంచి ఏటా లక్షల కిలోల గంజాయి ఏపీతో పాటు వివిధ రాష్ట్రాలకు తరలిపోతోంది. అందులో పట్టుబడుతున్నది 2% కూడా లేదు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువే ఇన్ని వందల కోట్లలో ఉందంటే...ఈ స్మగ్లింగ్ రాకెట్ ఎంత భారీగా విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. -
జగన్ను గెలిపించినందుకు లెంపలేసుకుంటున్నాం
గత ఎన్నికల్లో జగన్కు ఓట్లు వేసి గెలిపించినందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నామని ఆంధ్రా పెన్షనర్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు ఆత్మబంధువైన చంద్రబాబును గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. -
మధ్యస్థంగా నీట్ పేపర్
దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ-2024 ప్రవేశపరీక్షలో భౌతికశాస్త్రంలో మొత్తం 50 ప్రశ్నలకు 10 కష్టంగా ఉన్నాయని నిపుణులు వై.శారదాదేవి అన్నారు. -
సినీ నటుడు నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు. -
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
రాయలసీమలోని మూడు జిల్లాల రైతాంగానికి జీవనాధారమైన తుంగభద్ర హైలెవెల్ కెనాల్(హెచ్చెల్సీ)ను అధ్వాన స్థితికి చేర్చింది జగన్ సర్కారు. -
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో.. నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు నియమితులయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
జనాలకు డొక్కు.. జగన్కు హై‘టెక్కు’
రాష్ట్రంలో రహదారులన్నీ అడుగుకో గుంతతో ప్రమాదకరంగా మారగా.. ఆ రోడ్లపైన కాలం చెల్లిన ఆర్టీసీ డొక్కు బస్సుల్ని నడిపిస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు సీఎం జగన్. ‘ఆర్టీసీలో 12 లక్షల కి.మీ.కుపైగా తిరిగిన 3,600 బస్సులను వెంటనే మార్చాలి. -
కామధేనువునూ కుళ్లబొడుస్తున్నారు!
ఎన్నో ఆశయాలు.. మరెన్నో లక్ష్యాలతో.. ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన కంపెనీలు తిరుపతి సమీప రేణిగుంటలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లో తమ యూనిట్లను నెలకొల్పాయి. -
ఇసుక మాఫియా విధ్వంసానికి ఇదే సాక్ష్యం!
వైకాపా పాలనలో ఇసుక మాఫియా ‘అందినంత తీసుకో.. దొరికినకాడికి దోచుకో’ అన్న సిద్ధాంతాన్ని పాటిస్తోంది. అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతూ దోచుకుంటోంది. -
యువతకు లక్ష విదేశీ ఉద్యోగాలు
రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన దిశగా తెదేపా కసరత్తు ప్రారంభించింది. దీనికి వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారు, పారిశ్రామికవేత్తలూ మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. -
ఉద్యోగాలు సృష్టించేవారినే ఎన్నుకోవాలి
‘ఉద్యోగాలు సృష్టించేవారినే అమెరికాలో ఎన్నుకుంటారు. విదేశీ పెట్టుబడులు రావడానికి ఆ దేశంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అందుకే అమెరికా అన్ని రంగాల్లో ముందుంది. -
సమస్యలపై ప్రశ్నించినందుకు నిండు గర్భిణిపై వైకాపా నేతల దాడి
స్థానిక సమస్యలపై ప్రశ్నించడంతో గర్భిణి అని కూడా చూడకుండా వైకాపా నేతలు ఓ మహిళపై దాడికి పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన మేరకు.. ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ కుటాగులోళ్లపల్లిలో తంబళ్లపల్లె వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్రెడ్డి... -
వైకాపా బంటులైన డీఎస్పీలపై వేటు
అధికార వైకాపాకు అనుకూలంగా పనిచేస్తూ.. ప్రతిపక్ష పార్టీల శ్రేణులను వేధించడం, అణచివేయడమే లక్ష్యంగా పేట్రేగిపోతున్న ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
నిన్న ఎగ్గొట్టి.. రేపు ఇస్తారట!
2019 ఎన్నికలప్పుడు జగన్ చెప్పిందేంటి? అన్నదాతలకు వడ్డీ లేని పంట రుణాలిస్తామనే కదా? మరి గద్దెనెక్కాక చేసిందేమిటి..? రూ.లక్షలోపు పంట రుణాలకేనంటూ నిబంధన పెట్టారు -
దళితులు జగన్ను ఓడించి.. తమను తాము రక్షించుకోవాలి
దళితులు, ముఖ్యంగా మాలల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్.. తన ఐదేళ్ల పాలనలో వారిని రాజకీయంగా, సామాజికంగా అథఃపాతాళానికి తొక్కారని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు ధ్వజమెత్తారు. -
బూతులు మాట్లాడే వారికి ఓటుతోనే సమాధానం చెప్పండి
ఓటు హక్కు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ తప్పక వినియోగించుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్టులో స్వయం ఉపాధి శిక్షణ పూర్తిచేసుకున్న యువతీ యువకులకు ఆయన ప్రశంసా పత్రాలను అందజేశారు. -
సామాన్యుల ఆస్తులకు రక్షణేదీ?
‘రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022) వల్ల సామాన్యులు, నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు పడతారు. -
భూ యాజమాన్య హక్కు చట్టం.. ప్రమాదకరం
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టంలో సెక్షన్ 64 కింద భూములు, ఆస్తులకు సంబంధించి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి (టీఆర్వో)కి సమాచారం ఇవ్వకపోతే బాధ్యులైన హక్కుదారులకు 6 నెలల వరకు జైలుశిక్ష లేదా రూ.50 వేల వరకు జరిమానా విధించొచ్చు. -
ప్రజల ఆస్తులపై వైకాపా పడగ నీడ
రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక భూకబ్జాలు పెరిగాయి. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అధికార పార్టీ నాయకుల భూదాహానికి అంతే లేకుండా పోయింది. -
చేదోడని.. ‘చెయ్యిచ్చి’!
‘నా బీసీలు, నా పేదలు’ అంటూ నిత్యం సీఎం జగన్ ఊదరగొడుతుంటారు. తమది పేదల ప్రభుత్వమంటూ.. వారికి ఎంతో చేశామంటూ మాటలు చెబుతారు. కానీ జగన్ పేదల విషయంలో ఎంత కఠినమైన హృదయంతో ఉన్నారనేది ‘చేదోడు’ పథకం అమలు చూస్తేనే అర్థమైపోతుంది.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లైన నాలుగు రోజులకే.. నవ వధువును ఇంటికి పంపిన వరుడు
-
జగనాసురుడి భూదందా... జనం ఆస్తులు గోవిందా..!
-
ఏ ఒత్తిడీ మమ్మల్ని ఆపలేదు.. ఒంటరిగా వెళ్లడానికైనా సిద్ధం: నెతన్యాహు
-
‘కాళేశ్వరం’ విచారణలో ఇక నోటీసులు!
-
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
-
కుమారుడిపై మరుగుతున్న నూనె పోసి హతమార్చిన తల్లి, పెద్దమ్మ