సాగర్‌ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది.

Published : 24 Apr 2024 06:34 IST

ఈనాడు, హైదరాబాద్‌: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. ఈ మేరకు ఏపీ జల వనరుల శాఖ ఈఎన్సీకి బోర్డు సభ్యుడు బీఆర్‌ శంఖ్వా లేఖ రాశారు. ఈ నెల 12న జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో నిర్ణయించినట్లు ఆ రోజు నుంచి 23వ తేదీ రాత్రి 8 గంటల వరకు కుడి కాలువ ద్వారా ఏపీకి 5.50 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని