కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’
వంశధార నిర్వాసితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు
ఉద్దానానికి ఉపరితల జలాలంటూ ప్రచారానికే పరిమితం
పనులు పూర్తికాకుండానే పథకం ప్రారంభం
ఎన్నికల ప్రచారం కోసం నేడు శ్రీకాకుళం జిల్లాలో జగన్ పర్యటన
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’
ప్రతిపక్ష నేత హోదాలో, ముఖ్యమంత్రిగా శ్రీకాకుళం జిల్లాకొచ్చిన ప్రతిసారి జగన్మోహన్రెడ్డి హామీలివి.
ఈనాడు డిజిటల్ శ్రీకాకుళం, న్యూస్టుడే- సోంపేట, శ్రీకాకుళం అర్బన్, టెక్కలి, హిరమండలం: వంశధార నిర్వాసితుల ఆశలపై ముఖ్యమంత్రి జగన్ నీళ్లు చల్లారు. కాలువల ఆధునికీకరణనే మరిచారు. ఉద్దానం ప్రజలు కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా వంశధార ఉపరితల జలాలు అందిస్తున్నామంటూ అసలు ప్రాజెక్టు పనులు పూర్తికాకుండానే ప్రారంభించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, సమస్యలు తీర్చకుండా సిక్కోలు ప్రజలను అడుగడుగునా వంచించిన జగన్.. ఓట్లు అడగడానికి బుధవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఉద్దానం ప్రాంతానికి వంశధార నుంచి ఉపరితల జలాలు అందించేందుకు తలపెట్టిన వైఎస్ఆర్ సుజలధార పథకంలో భాగంగా ఇచ్ఛాపురం మండలం బూర్జపాడు పరిధిలో ట్యాంకు పనులను ఇప్పటికీ చేపట్టలేదు. కంచిలి మండలం జలంత్రకోట వద్ద నిర్మిస్తున్న గ్రౌండ్లెవెల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు కొలిక్కి రాలేదు. ఇక్కడ ఓవర్హెడ్ ట్యాంకు పనులు పూర్తి కాలేదు. గొట్టా బ్యారేజీ నుంచి ఇచ్ఛాపురం వరకు వంశధార జలాలు తీసుకొచ్చేందుకు చేపట్టిన 866.08 కి.మీ.మేర అంతర్గత పైపులైన్ నిర్మాణం పూర్తికాలేదు. పలాస, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం, మెళియాపుట్టిలలో కొన్ని గ్రామాలకు ఈ పథకం ద్వారా ఇంటింటికీ మంచినీరు అందడం లేదు.
అనంతగిరి, కేదారిపురం, మామిడిమెట్టు, రఘునాథపురం, పాలవలస, సోంపేట, బలియాపుట్టి, జలంత్రకోట, సహలాలపుట్టుగ, ఇచ్ఛాపురం క్లస్టర్లుగా విభజించి ఆయా ప్రాంతాల్లో నీటి నిల్వకు ఆరు గ్రౌండ్లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, మరో ఆరు ఓవర్హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు నిర్మించారు. క్లస్టర్ ప్రాంతం నుంచి గ్రామాల్లో నీటి సరఫరాకు 807 ఓవర్హెడ్ రిజర్వాయర్లు అవసరం. 400 వరకు పాత ట్యాంకులు వినియోగిస్తూ నీటి సరఫరాకు చర్యలు చేపట్టారు. అవి 3, 4 దశాబ్దాల కిందట నిర్మించినవి. బిల్లుల చెల్లింపులో జాప్యం వల్ల గుత్తేదారు పనులు పూర్తి చేయలేదు. గడువు దాటిన ఏడాదిన్నర తరువాత ఎన్నికల నేపథ్యంలో పనులు పూర్తి కాకుండానే జగన్ గతేడాది డిసెంబరు 14న పథకాన్ని హడావుడిగా ప్రారంభించారు. అన్ని గ్రామాలకు సుజలధార అందించాలంటే 388 ట్యాంకులు, 308 గ్రామాలకు ఇంటింటా కుళాయిలు ఏర్పాటుచేయాలి. ట్రయల్రన్లో భాగంగా లీకేజీలు, ఇతర సమస్యలు కనిపించాయి. అవి పరిష్కరించకుండానే పథకం ప్రారంభమైందని అనిపించేశారు.
వంశధార నిర్వాసితులను నిండా ముంచేశారు..
వంశధార నిర్వాసితులకు ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారమిస్తామని చెప్పి అధికారం చేపట్టాక ఆ మాటే మరిచారు. అదనపు పరిహారం కింద రూ.216 కోట్లు విడుదల చేసినప్పటికీ మండల, గ్రామస్థాయి వైకాపా నాయకులు సిఫార్సు చేసిన వారికే పరిహారం దక్కింది. అర్హులకు మొండిచేయే మిగిలింది. భూములు కోల్పోయిన రైతులకు రూ.లక్ష చొప్పున అదనపు పరిహారం ఇవ్వాల్సి ఉండగా ఇంకా రూ.12.16 కోట్ల బకాయిలున్నాయి. సాంకేతిక కారణాలతో మరో రూ.1.15 కోట్ల చెల్లింపులు నిలిచాయి. యువ ప్యాకేజీ కింద ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున ఇవ్వాల్సి ఉండగా.. రూ.11.98 కోట్ల బకాయిలున్నాయి. మరో రూ.1.31 కోట్లు సాంకేతిక కారణాలతో అందలేదు.
రూపాయీ విదల్చలేదు...
1.48 లక్షల ఎకరాలకు సాగునీరందించే వంశధార ఎడమ ప్రధాన కాలువ దారుణంగా తయారైంది. ఆధునికీకరణకు రూ.వెయ్యి కోట్లతో ప్రతిపాదనలు పంపినా రూపాయి విదల్చలేదు. టెక్కలి డివిజన్లో శివారు ప్రాంతాలకు నీరందక గతేడాది నందిగాం మండల రైతులు వంశధార ఈఈపై దాడి చేశారు. వజ్రపుకొత్తూరు మండలంలో నీటి కోసం రైతులు తరచూ రోడ్డెక్కుతున్నారు.
కరకట్టలపై కనికరం లేదు..
వంశధార నదికి ఎడమ, కుడి వైపున వరద ప్రభావిత ప్రాంతాల్లో కరకట్టల పనులను నాలుగు ప్యాకేజీలుగా విభజించారు. 2007లో అప్పటి ప్రభుత్వం రూ.177 కోట్లతో చేసిన అంచనా విలువను వైకాపా ప్రభుత్వం రూ.865 కోట్లకు పెంచింది తప్ప పనులు ముందుకు తీసుకెళ్లలేదు.వరదల సమయంలో నదీపరివాహక ప్రాంతాలవారు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రివర్స్’ పాలనతో వచ్చిన తిరకాసు!
ప్రతి మెడికల్ కళాశాలకు ఆసుపత్రి అత్యవసరం. అలాంటిది ఆసుపత్రి నిర్మాణం పూర్తి కాకుండానే కళాశాల భవనం, హాస్టల్ గదులకు 2023 సెప్టెంబరులో సీఎం జగన్ హడావుడిగా ప్రారంభోత్సవం చేసేశారు. -
వరదాయినికి జగన్ శాపం
ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారో మంత్రి... ‘పర్సంటా అరపర్సంటా..’ అంటూ ఊగిపోయారు ఇంకో మంత్రి... 2021 జూన్ నాటికే అందుబాటులోకి తెస్తామన్నారు ముఖ్యమంత్రి... మార్చి పోతే సెప్టెంబరు తరహాలో.. ఆరు నెలలు, ఏడాది కాదు.. ఐదేళ్లు గడిచినా... పోలవరాన్ని పూర్తి చేయకపోగా నష్టం చేకూర్చారు! -
1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన అంతమై.. ఆంధ్రుల స్వర్ణాంధ్ర కల సాకారమవ్వాలని రాజధాని రైతులు ఆకాంక్షించారు. గడిచిన ఐదేళ్లలో అమరావతితో పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జగన్ కుట్రకు మరో ఏడుగురి బలి
నెలనెలా కొండంత ఆసరానిచ్చే పింఛను పంపిణీ విషయంలో ప్రభుత్వ కుట్ర అభాగ్యుల ఉసురు తీస్తోంది. జగన్ నిరంకుశ వైఖరి పదుల కొద్దీ ప్రాణాలను బలి తీసుకుంటోంది. -
వసూల్ బ్రదర్స్
ఏ నియోజకవర్గానికైనా.. ఒక ప్రజాప్రతినిధి ఉంటారు.. కానీ ఆ నియోజకవర్గానికి ఇద్దరు! ఒకరు గిల్లితే.. మరొకరు జోల పాడినట్లు నటిస్తారు. ఇద్దరి దారి ఒకటే... అక్రమార్జన. ఇందులో సొంత పార్టీ, ప్రత్యర్థి పార్టీలనే తేడా లేదు. -
రైతన్న నెత్తిన శని.. జగనన్న!
రైతు భరోసా లేదు.. పంట బీమా లేదు.. మద్దతు ధరల్లేవు... కరవు సాయం లేదు.. ఉన్నదల్లా ఒక్కటే... మీ బిడ్డనంటూ ఊకదంపుడు.. నోరు తెరిస్తే... అబద్ధాలు దంచుడు! -
పంచాయతీల్లో పందేరానికి.. ‘నరేగా’ నిధులు
పోలింగ్కు తొమ్మిది రోజుల ముందు అస్మదీయులైన సర్పంచులకు జగన్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ‘మెటీరియల్’ నిధులు గుమ్మరిస్తోంది. -
ఎక్కడా లేని చట్టం ఇక్కడే ఎందుకు?
దేశంలోని ఏ రాష్ట్రం ఇంతవరకూ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేయలేదు. చాలా రాష్ట్రాలు ఈ తరహా చట్టాన్ని చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినా, పౌరుల స్థిరాస్తి హక్కులకు భంగం కలుగుతుందన్న అనుమానంతో విరమించాయి. -
7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో ఈనెల 7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ సంస్థ పేర్కొంది. -
ఇక్కడి ఘటనలు చూసి అమెరికాలో చలించిపోతున్నాం
‘ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఘటనలు చూసి అమెరికాలో ఉండి కూడా మేం చలించిపోతున్నాం. రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో రైతుల బలవన్మరణాలు ఎక్కువయ్యాయి. -
జగన్ మార్కు కట్టుకథలు..!
అణువణువునా అతిశయం, అహంభావం.. నోరు తెరిస్తే అబద్ధం.. మూర్తీభవించిన ఫ్యూడల్ స్వభావం.. సంక్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు గోడమీద పిల్లివాటం... కొన్ని ప్రశ్నలకు మౌనం, విచిత్ర హావభావాలే సమాధానం..!. -
రోడ్డు గుంతలో పడి సైనికుడికి గాయాలు
సెలవును సంతోషంగా గడిపి దేశ రక్షణ కోసం సరిహద్దులకు బయలుదేరిన సైనికుడిని గుంతల రోడ్డు గాయాలపాలు చేసింది. -
తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం
గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీఎం నివాసానికి కిలోమీటరు దూరంలోనే డ్రగ్స్ పట్టుపడటం కలకలం రేపింది. -
జిల్లాల వారీగా సీఎఫ్డీ ఎన్నికల పరిశీలకులు
ఎన్నికల్లో అక్రమాలు, క్షేత్రస్థాయిలో సమస్యల్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరఫున 13 ఉమ్మడి జిల్లాలకు ఎన్నికల పరిశీలకుల్ని నియమించినట్లు సీఎఫ్డీ ఛైర్మన్ జస్టిస్ భవానీప్రసాద్ తెలిపారు. -
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఒకరోజు సెలవు
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలట్ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఒక రోజు ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి
-
నిజం చెప్పటమే నేరమా..? 572 మంది ఉపాధ్యాయులకు నోటీసులు
-
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత