కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’
వంశధార నిర్వాసితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు
ఉద్దానానికి ఉపరితల జలాలంటూ ప్రచారానికే పరిమితం
పనులు పూర్తికాకుండానే పథకం ప్రారంభం
ఎన్నికల ప్రచారం కోసం నేడు శ్రీకాకుళం జిల్లాలో జగన్ పర్యటన
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’
ప్రతిపక్ష నేత హోదాలో, ముఖ్యమంత్రిగా శ్రీకాకుళం జిల్లాకొచ్చిన ప్రతిసారి జగన్మోహన్రెడ్డి హామీలివి.
ఈనాడు డిజిటల్ శ్రీకాకుళం, న్యూస్టుడే- సోంపేట, శ్రీకాకుళం అర్బన్, టెక్కలి, హిరమండలం: వంశధార నిర్వాసితుల ఆశలపై ముఖ్యమంత్రి జగన్ నీళ్లు చల్లారు. కాలువల ఆధునికీకరణనే మరిచారు. ఉద్దానం ప్రజలు కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా వంశధార ఉపరితల జలాలు అందిస్తున్నామంటూ అసలు ప్రాజెక్టు పనులు పూర్తికాకుండానే ప్రారంభించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, సమస్యలు తీర్చకుండా సిక్కోలు ప్రజలను అడుగడుగునా వంచించిన జగన్.. ఓట్లు అడగడానికి బుధవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఉద్దానం ప్రాంతానికి వంశధార నుంచి ఉపరితల జలాలు అందించేందుకు తలపెట్టిన వైఎస్ఆర్ సుజలధార పథకంలో భాగంగా ఇచ్ఛాపురం మండలం బూర్జపాడు పరిధిలో ట్యాంకు పనులను ఇప్పటికీ చేపట్టలేదు. కంచిలి మండలం జలంత్రకోట వద్ద నిర్మిస్తున్న గ్రౌండ్లెవెల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు కొలిక్కి రాలేదు. ఇక్కడ ఓవర్హెడ్ ట్యాంకు పనులు పూర్తి కాలేదు. గొట్టా బ్యారేజీ నుంచి ఇచ్ఛాపురం వరకు వంశధార జలాలు తీసుకొచ్చేందుకు చేపట్టిన 866.08 కి.మీ.మేర అంతర్గత పైపులైన్ నిర్మాణం పూర్తికాలేదు. పలాస, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం, మెళియాపుట్టిలలో కొన్ని గ్రామాలకు ఈ పథకం ద్వారా ఇంటింటికీ మంచినీరు అందడం లేదు.
అనంతగిరి, కేదారిపురం, మామిడిమెట్టు, రఘునాథపురం, పాలవలస, సోంపేట, బలియాపుట్టి, జలంత్రకోట, సహలాలపుట్టుగ, ఇచ్ఛాపురం క్లస్టర్లుగా విభజించి ఆయా ప్రాంతాల్లో నీటి నిల్వకు ఆరు గ్రౌండ్లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, మరో ఆరు ఓవర్హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు నిర్మించారు. క్లస్టర్ ప్రాంతం నుంచి గ్రామాల్లో నీటి సరఫరాకు 807 ఓవర్హెడ్ రిజర్వాయర్లు అవసరం. 400 వరకు పాత ట్యాంకులు వినియోగిస్తూ నీటి సరఫరాకు చర్యలు చేపట్టారు. అవి 3, 4 దశాబ్దాల కిందట నిర్మించినవి. బిల్లుల చెల్లింపులో జాప్యం వల్ల గుత్తేదారు పనులు పూర్తి చేయలేదు. గడువు దాటిన ఏడాదిన్నర తరువాత ఎన్నికల నేపథ్యంలో పనులు పూర్తి కాకుండానే జగన్ గతేడాది డిసెంబరు 14న పథకాన్ని హడావుడిగా ప్రారంభించారు. అన్ని గ్రామాలకు సుజలధార అందించాలంటే 388 ట్యాంకులు, 308 గ్రామాలకు ఇంటింటా కుళాయిలు ఏర్పాటుచేయాలి. ట్రయల్రన్లో భాగంగా లీకేజీలు, ఇతర సమస్యలు కనిపించాయి. అవి పరిష్కరించకుండానే పథకం ప్రారంభమైందని అనిపించేశారు.
వంశధార నిర్వాసితులను నిండా ముంచేశారు..
వంశధార నిర్వాసితులకు ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారమిస్తామని చెప్పి అధికారం చేపట్టాక ఆ మాటే మరిచారు. అదనపు పరిహారం కింద రూ.216 కోట్లు విడుదల చేసినప్పటికీ మండల, గ్రామస్థాయి వైకాపా నాయకులు సిఫార్సు చేసిన వారికే పరిహారం దక్కింది. అర్హులకు మొండిచేయే మిగిలింది. భూములు కోల్పోయిన రైతులకు రూ.లక్ష చొప్పున అదనపు పరిహారం ఇవ్వాల్సి ఉండగా ఇంకా రూ.12.16 కోట్ల బకాయిలున్నాయి. సాంకేతిక కారణాలతో మరో రూ.1.15 కోట్ల చెల్లింపులు నిలిచాయి. యువ ప్యాకేజీ కింద ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున ఇవ్వాల్సి ఉండగా.. రూ.11.98 కోట్ల బకాయిలున్నాయి. మరో రూ.1.31 కోట్లు సాంకేతిక కారణాలతో అందలేదు.
రూపాయీ విదల్చలేదు...
1.48 లక్షల ఎకరాలకు సాగునీరందించే వంశధార ఎడమ ప్రధాన కాలువ దారుణంగా తయారైంది. ఆధునికీకరణకు రూ.వెయ్యి కోట్లతో ప్రతిపాదనలు పంపినా రూపాయి విదల్చలేదు. టెక్కలి డివిజన్లో శివారు ప్రాంతాలకు నీరందక గతేడాది నందిగాం మండల రైతులు వంశధార ఈఈపై దాడి చేశారు. వజ్రపుకొత్తూరు మండలంలో నీటి కోసం రైతులు తరచూ రోడ్డెక్కుతున్నారు.
కరకట్టలపై కనికరం లేదు..
వంశధార నదికి ఎడమ, కుడి వైపున వరద ప్రభావిత ప్రాంతాల్లో కరకట్టల పనులను నాలుగు ప్యాకేజీలుగా విభజించారు. 2007లో అప్పటి ప్రభుత్వం రూ.177 కోట్లతో చేసిన అంచనా విలువను వైకాపా ప్రభుత్వం రూ.865 కోట్లకు పెంచింది తప్ప పనులు ముందుకు తీసుకెళ్లలేదు.వరదల సమయంలో నదీపరివాహక ప్రాంతాలవారు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. -
మడ అడవుల పరిరక్షణకు ప్రత్యేక విభాగం
మడ అడవుల పరిరక్షణ కోసం వెంటనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆసక్తి, అనుభవం ఉన్న అధికారులను ఎంపిక చేసి ప్రత్యేకాధికారులుగా నియమించాలని సూచించారు. -
పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటరు నమోదుకు షెడ్యూల్ ఖరారు
తూర్పు-పశ్చిమగోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి