మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు.
పది పరీక్షల్లో లాంగ్వేజీల్లోనూ వంద మార్కులు
అసర్, బేస్లైన్ సర్వేల్లో మాత్రం భిన్న ఫలితాలు
చిన్నచిన్న ఆంగ్ల పదాలు చదవలేక తడబాటు
ఈనాడు, అమరావతి: పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. తాజాగా ఈ ఏడాది రాష్ట్రంలో 86.69% మంది ఉత్తీర్ణత సాధించగా, వారిలో ఎక్కువ మంది విద్యార్థులు లాంగ్వేజీల్లోనూ గరిష్ఠ స్థాయిలో మార్కులు తెచ్చుకున్నారు. సాధారణంగా ఏ పరీక్షల్లోనైనా ప్రథమ శ్రేణి సాధించిన వారు తక్కువగా ఉంటారు. కానీ, పది ఫలితాల్లో ఇందుకు భిన్నంగా పాసైన వారిలో 69.26% మంది విద్యార్థులకు 60% కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. ద్వితీయ, తృతీయ శ్రేణుల్లో పాసైన వారు 17.43% మాత్రమే. తెలుగు, హిందీ, ఆంగ్లం వంటి భాషా సబ్జెక్టుల్లోనూ గరిష్ఠ మార్కులు సాధించిన వారూ ఉన్నారు. ఇదేలా సాధ్యమన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి గరిష్ఠంగా ఓ బాలికకు 599 మార్కులు రాగా, 597 వచ్చినవారూ ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. చాలామంది తెలుగు, హిందీ, ఆంగ్లం భాషా పరీక్షల్లోనూ 99 మార్కులు సాధించారు. లాంగ్వేజీ పేపర్లలోనూ గరిష్ఠ మార్కులు వేస్తున్నందున మూల్యాంకనంలో నాణ్యతపై ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అత్యధిక మార్కులు వస్తున్న జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయిస్తున్న దాఖలాలు లేవు. గణితం, సామాన్యశాస్త్రాల్లో విద్యార్థి బాగా రాస్తే వందకు వంద రావడం సహజం. కానీ, భాషా సబ్జెక్టుల్లో అనేక ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలు రాయాల్సి ఉంటుంది. వీటిలో విద్యార్థి అవగాహన, విశ్లేషణ, అభిప్రాయాల వ్యక్తీకరణను పరీక్షించే ప్రశ్నలుంటాయి. మూల్యాంకనం చేసే ఉపాధ్యాయులు ఇదే పరిపూర్ణ సమాధానమని ఎలా అంచనాకు వస్తున్నారన్నది ప్రశ్న. లాంగ్వేజీల్లో బిట్ పేపర్ విధానం కూడా లేదు. 1, 2, 4, 8 మార్కుల ప్రశ్నలు మాత్రమే ఇస్తున్నారు. అన్నింటికీ సమాధానాలు రాయాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్నేసి మార్కులు ఎలా వస్తున్నాయని విద్యావేత్తలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
సర్వేల్లో ఎందుకు వెనుకబాటు?
పదో తరగతిలో ఎక్కువ మందికి ఫస్ట్ క్లాస్ మార్కులు వస్తున్నప్పటికీ, అభ్యసన సామర్థ్యాలపై నిర్వహించే సర్వేల్లో ఫలితాలు ఘోరంగా ఉంటున్నాయి. పబ్లిక్ పరీక్షల్లో ఎక్కువ మార్కులు వస్తున్నప్పుడు సర్వేల్లోనూ అది ప్రతిఫలించాలి కదా? కేరళను మించిన ఫలితాలు రావాలి కదా? ఎందుకీ వ్యత్యాసం? అని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.
- ప్రథమ్ సంస్థ నిర్వహించిన అసర్ సర్వే నివేదిక-2022 ప్రకారం ‘క్యాట్, రెడ్, సన్, న్యూ, ఫ్యాన్, బస్’ వంటి ఆంగ్ల పదాలను ఒకటో తరగతి లోపే పిల్లలు నేర్చుకుంటారు. కానీ, ప్రభుత్వ బడుల్లో మూడో తరగతి ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్న వారిలో 24.3% విద్యార్థులు ఈ పదాలను చదవలేకపోతున్నట్లు 2022 జనవరిలో విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.
- ‘ఐ లైక్ టు రీడ్, వేర్ ఈజ్ యువర్ కౌ?, దిస్ ఈజ్ ఏ బిగ్ షాప్’ వంటి చిన్నచిన్న ఆంగ్ల వాక్యాలను 14-16 ఏళ్ల విద్యార్థుల్లో 28.9%, 17-18 ఏళ్ల వారిలో 23.6% మంది చదవలేకపోయారు. గతేడాది జనవరి 17న విడుదలైన అసర్ సర్వే నివేదిక-2023లో ఇది బహిర్గతమైంది.
- ‘మా పొలం చాలా పెద్దది. నాన్న రోజూ పొలానికి వెళ్తారు. మా పొలంలో వరి వేశాం. ఈ సంవత్సరం ధాన్యం బాగా పండింది’ ఇలా తెలుగులో ఇచ్చిన చిన్న పేరాను సైతం ప్రభుత్వ బడుల్లోని 4, 5 తరగతుల విద్యార్థుల్లో 65.04% మంది తప్పుల్లేకుండా చదవలేకపోయారు. ఇదే పేరాను 6, 7, 8 తరగతుల వారిలో 41.58% మంది చదవలేదు. ఈ బేస్లైన్ సర్వే చేసింది.. సాక్షాత్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ. 2022లో ప్రథమ్ సంస్థతో కలిసి రూపొందించిన ప్రశ్నపత్రాలతో పరీక్ష నిర్వహిస్తే ఈ వాస్తవాలు వెలుగుచూశాయి. కానీ, ఈ ఏడాది పదో తరగతి ఆంగ్ల పరీక్షలో 98.52% మంది ఉత్తీర్ణత సాధించారు. ఆంగ్ల మాధ్యమంలో 92.32% ఫలితాలు వచ్చాయి. పబ్లిక్ పరీక్షల్లో ఇంతలా రాణిస్తుంటే ప్రథమ్ సంస్థ సర్వేల్లో చిన్నచిన్న పదాలను ఎందుకు చదవలేకపోయారన్నది ప్రశ్న? మాతృ భాష తెలుగులో వాక్యాలను చదవలేకపోతున్నా, తెలుగులో 90-100 మార్కులు సాధిస్తున్న వారి సంఖ్య భారీగానే ఉంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ను గెలిపించినందుకు లెంపలేసుకుంటున్నాం
గత ఎన్నికల్లో జగన్కు ఓట్లు వేసి గెలిపించినందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నామని ఆంధ్రా పెన్షనర్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు ఆత్మబంధువైన చంద్రబాబును గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. -
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. -
మధ్యస్థంగా నీట్ పేపర్
దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ-2024 ప్రవేశపరీక్షలో భౌతికశాస్త్రంలో మొత్తం 50 ప్రశ్నలకు 10 కష్టంగా ఉన్నాయని నిపుణులు వై.శారదాదేవి అన్నారు. -
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు. -
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
రాయలసీమలోని మూడు జిల్లాల రైతాంగానికి జీవనాధారమైన తుంగభద్ర హైలెవెల్ కెనాల్(హెచ్చెల్సీ)ను అధ్వాన స్థితికి చేర్చింది జగన్ సర్కారు. -
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో.. నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు నియమితులయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
జనాలకు డొక్కు.. జగన్కు హై‘టెక్కు’
రాష్ట్రంలో రహదారులన్నీ అడుగుకో గుంతతో ప్రమాదకరంగా మారగా.. ఆ రోడ్లపైన కాలం చెల్లిన ఆర్టీసీ డొక్కు బస్సుల్ని నడిపిస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు సీఎం జగన్. ‘ఆర్టీసీలో 12 లక్షల కి.మీ.కుపైగా తిరిగిన 3,600 బస్సులను వెంటనే మార్చాలి. -
కామధేనువునూ కుళ్లబొడుస్తున్నారు!
ఎన్నో ఆశయాలు.. మరెన్నో లక్ష్యాలతో.. ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన కంపెనీలు తిరుపతి సమీప రేణిగుంటలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లో తమ యూనిట్లను నెలకొల్పాయి. -
ఇసుక మాఫియా విధ్వంసానికి ఇదే సాక్ష్యం!
వైకాపా పాలనలో ఇసుక మాఫియా ‘అందినంత తీసుకో.. దొరికినకాడికి దోచుకో’ అన్న సిద్ధాంతాన్ని పాటిస్తోంది. అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతూ దోచుకుంటోంది. -
యువతకు లక్ష విదేశీ ఉద్యోగాలు
రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన దిశగా తెదేపా కసరత్తు ప్రారంభించింది. దీనికి వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారు, పారిశ్రామికవేత్తలూ మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. -
ఉద్యోగాలు సృష్టించేవారినే ఎన్నుకోవాలి
‘ఉద్యోగాలు సృష్టించేవారినే అమెరికాలో ఎన్నుకుంటారు. విదేశీ పెట్టుబడులు రావడానికి ఆ దేశంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అందుకే అమెరికా అన్ని రంగాల్లో ముందుంది. -
సమస్యలపై ప్రశ్నించినందుకు నిండు గర్భిణిపై వైకాపా నేతల దాడి
స్థానిక సమస్యలపై ప్రశ్నించడంతో గర్భిణి అని కూడా చూడకుండా వైకాపా నేతలు ఓ మహిళపై దాడికి పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన మేరకు.. ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ కుటాగులోళ్లపల్లిలో తంబళ్లపల్లె వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్రెడ్డి... -
వైకాపా బంటులైన డీఎస్పీలపై వేటు
అధికార వైకాపాకు అనుకూలంగా పనిచేస్తూ.. ప్రతిపక్ష పార్టీల శ్రేణులను వేధించడం, అణచివేయడమే లక్ష్యంగా పేట్రేగిపోతున్న ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
నిన్న ఎగ్గొట్టి.. రేపు ఇస్తారట!
2019 ఎన్నికలప్పుడు జగన్ చెప్పిందేంటి? అన్నదాతలకు వడ్డీ లేని పంట రుణాలిస్తామనే కదా? మరి గద్దెనెక్కాక చేసిందేమిటి..? రూ.లక్షలోపు పంట రుణాలకేనంటూ నిబంధన పెట్టారు -
దళితులు జగన్ను ఓడించి.. తమను తాము రక్షించుకోవాలి
దళితులు, ముఖ్యంగా మాలల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్.. తన ఐదేళ్ల పాలనలో వారిని రాజకీయంగా, సామాజికంగా అథఃపాతాళానికి తొక్కారని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు ధ్వజమెత్తారు. -
బూతులు మాట్లాడే వారికి ఓటుతోనే సమాధానం చెప్పండి
ఓటు హక్కు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ తప్పక వినియోగించుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్టులో స్వయం ఉపాధి శిక్షణ పూర్తిచేసుకున్న యువతీ యువకులకు ఆయన ప్రశంసా పత్రాలను అందజేశారు. -
సామాన్యుల ఆస్తులకు రక్షణేదీ?
‘రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022) వల్ల సామాన్యులు, నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు పడతారు. -
భూ యాజమాన్య హక్కు చట్టం.. ప్రమాదకరం
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టంలో సెక్షన్ 64 కింద భూములు, ఆస్తులకు సంబంధించి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి (టీఆర్వో)కి సమాచారం ఇవ్వకపోతే బాధ్యులైన హక్కుదారులకు 6 నెలల వరకు జైలుశిక్ష లేదా రూ.50 వేల వరకు జరిమానా విధించొచ్చు. -
ప్రజల ఆస్తులపై వైకాపా పడగ నీడ
రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక భూకబ్జాలు పెరిగాయి. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అధికార పార్టీ నాయకుల భూదాహానికి అంతే లేకుండా పోయింది. -
చేదోడని.. ‘చెయ్యిచ్చి’!
‘నా బీసీలు, నా పేదలు’ అంటూ నిత్యం సీఎం జగన్ ఊదరగొడుతుంటారు. తమది పేదల ప్రభుత్వమంటూ.. వారికి ఎంతో చేశామంటూ మాటలు చెబుతారు. కానీ జగన్ పేదల విషయంలో ఎంత కఠినమైన హృదయంతో ఉన్నారనేది ‘చేదోడు’ పథకం అమలు చూస్తేనే అర్థమైపోతుంది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు