మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు.
పది పరీక్షల్లో లాంగ్వేజీల్లోనూ వంద మార్కులు
అసర్, బేస్లైన్ సర్వేల్లో మాత్రం భిన్న ఫలితాలు
చిన్నచిన్న ఆంగ్ల పదాలు చదవలేక తడబాటు
ఈనాడు, అమరావతి: పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. తాజాగా ఈ ఏడాది రాష్ట్రంలో 86.69% మంది ఉత్తీర్ణత సాధించగా, వారిలో ఎక్కువ మంది విద్యార్థులు లాంగ్వేజీల్లోనూ గరిష్ఠ స్థాయిలో మార్కులు తెచ్చుకున్నారు. సాధారణంగా ఏ పరీక్షల్లోనైనా ప్రథమ శ్రేణి సాధించిన వారు తక్కువగా ఉంటారు. కానీ, పది ఫలితాల్లో ఇందుకు భిన్నంగా పాసైన వారిలో 69.26% మంది విద్యార్థులకు 60% కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. ద్వితీయ, తృతీయ శ్రేణుల్లో పాసైన వారు 17.43% మాత్రమే. తెలుగు, హిందీ, ఆంగ్లం వంటి భాషా సబ్జెక్టుల్లోనూ గరిష్ఠ మార్కులు సాధించిన వారూ ఉన్నారు. ఇదేలా సాధ్యమన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి గరిష్ఠంగా ఓ బాలికకు 599 మార్కులు రాగా, 597 వచ్చినవారూ ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. చాలామంది తెలుగు, హిందీ, ఆంగ్లం భాషా పరీక్షల్లోనూ 99 మార్కులు సాధించారు. లాంగ్వేజీ పేపర్లలోనూ గరిష్ఠ మార్కులు వేస్తున్నందున మూల్యాంకనంలో నాణ్యతపై ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అత్యధిక మార్కులు వస్తున్న జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయిస్తున్న దాఖలాలు లేవు. గణితం, సామాన్యశాస్త్రాల్లో విద్యార్థి బాగా రాస్తే వందకు వంద రావడం సహజం. కానీ, భాషా సబ్జెక్టుల్లో అనేక ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలు రాయాల్సి ఉంటుంది. వీటిలో విద్యార్థి అవగాహన, విశ్లేషణ, అభిప్రాయాల వ్యక్తీకరణను పరీక్షించే ప్రశ్నలుంటాయి. మూల్యాంకనం చేసే ఉపాధ్యాయులు ఇదే పరిపూర్ణ సమాధానమని ఎలా అంచనాకు వస్తున్నారన్నది ప్రశ్న. లాంగ్వేజీల్లో బిట్ పేపర్ విధానం కూడా లేదు. 1, 2, 4, 8 మార్కుల ప్రశ్నలు మాత్రమే ఇస్తున్నారు. అన్నింటికీ సమాధానాలు రాయాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్నేసి మార్కులు ఎలా వస్తున్నాయని విద్యావేత్తలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
సర్వేల్లో ఎందుకు వెనుకబాటు?
పదో తరగతిలో ఎక్కువ మందికి ఫస్ట్ క్లాస్ మార్కులు వస్తున్నప్పటికీ, అభ్యసన సామర్థ్యాలపై నిర్వహించే సర్వేల్లో ఫలితాలు ఘోరంగా ఉంటున్నాయి. పబ్లిక్ పరీక్షల్లో ఎక్కువ మార్కులు వస్తున్నప్పుడు సర్వేల్లోనూ అది ప్రతిఫలించాలి కదా? కేరళను మించిన ఫలితాలు రావాలి కదా? ఎందుకీ వ్యత్యాసం? అని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.
- ప్రథమ్ సంస్థ నిర్వహించిన అసర్ సర్వే నివేదిక-2022 ప్రకారం ‘క్యాట్, రెడ్, సన్, న్యూ, ఫ్యాన్, బస్’ వంటి ఆంగ్ల పదాలను ఒకటో తరగతి లోపే పిల్లలు నేర్చుకుంటారు. కానీ, ప్రభుత్వ బడుల్లో మూడో తరగతి ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్న వారిలో 24.3% విద్యార్థులు ఈ పదాలను చదవలేకపోతున్నట్లు 2022 జనవరిలో విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.
- ‘ఐ లైక్ టు రీడ్, వేర్ ఈజ్ యువర్ కౌ?, దిస్ ఈజ్ ఏ బిగ్ షాప్’ వంటి చిన్నచిన్న ఆంగ్ల వాక్యాలను 14-16 ఏళ్ల విద్యార్థుల్లో 28.9%, 17-18 ఏళ్ల వారిలో 23.6% మంది చదవలేకపోయారు. గతేడాది జనవరి 17న విడుదలైన అసర్ సర్వే నివేదిక-2023లో ఇది బహిర్గతమైంది.
- ‘మా పొలం చాలా పెద్దది. నాన్న రోజూ పొలానికి వెళ్తారు. మా పొలంలో వరి వేశాం. ఈ సంవత్సరం ధాన్యం బాగా పండింది’ ఇలా తెలుగులో ఇచ్చిన చిన్న పేరాను సైతం ప్రభుత్వ బడుల్లోని 4, 5 తరగతుల విద్యార్థుల్లో 65.04% మంది తప్పుల్లేకుండా చదవలేకపోయారు. ఇదే పేరాను 6, 7, 8 తరగతుల వారిలో 41.58% మంది చదవలేదు. ఈ బేస్లైన్ సర్వే చేసింది.. సాక్షాత్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ. 2022లో ప్రథమ్ సంస్థతో కలిసి రూపొందించిన ప్రశ్నపత్రాలతో పరీక్ష నిర్వహిస్తే ఈ వాస్తవాలు వెలుగుచూశాయి. కానీ, ఈ ఏడాది పదో తరగతి ఆంగ్ల పరీక్షలో 98.52% మంది ఉత్తీర్ణత సాధించారు. ఆంగ్ల మాధ్యమంలో 92.32% ఫలితాలు వచ్చాయి. పబ్లిక్ పరీక్షల్లో ఇంతలా రాణిస్తుంటే ప్రథమ్ సంస్థ సర్వేల్లో చిన్నచిన్న పదాలను ఎందుకు చదవలేకపోయారన్నది ప్రశ్న? మాతృ భాష తెలుగులో వాక్యాలను చదవలేకపోతున్నా, తెలుగులో 90-100 మార్కులు సాధిస్తున్న వారి సంఖ్య భారీగానే ఉంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే