ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు.స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం.
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు.
స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. వంకపెట్టలేని పనితీరుతో ప్రజావిశ్వాసాన్ని పొందాల్సిన ఖాకీల వెన్నెముకలను జగన్మోహన్రెడ్డి విరిచేశారు. వారిని వైకాపా సేవకులుగా మార్చేశారు. ప్రజలను పీడించడం తప్ప ప్రేమించడం తెలియని జగన్- ఏపీ పోలీస్ యంత్రాంగాన్నీ తనలానే కర్కశంగా తయారుచేసి, జనానికి కనీస రక్షణ లేకుండా చేశారు. ప్రతిపక్షాలూ అసమ్మతివాదులను అనుక్షణం వెంటాడి వేధించే దుర్మార్గపు పనికి ఖాకీలను వాడుకున్నారు. రాజ్యాంగం, చట్టాలను కాలదన్ని తమ మాటే శాసనంగా చలామణీ చేసుకున్నారు.
నోరెత్తితే చావబాదుడే...
ప్రజల భావప్రకటనా స్వేచ్ఛకు రాజ్యాంగం హామీ ఇస్తోంది. శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కు సైతం రాజ్యాంగదత్తమైనదే. కానీ, జగన్ అరాచక రాజ్యంలో వీటికి చోటులేదు. ప్రభుత్వ పనితీరును విమర్శించడం, నిరసన ప్రదర్శనలు నిర్వహించడం వంటివి అంటేనే వైకాపా అధినేతకు ఒళ్లు మంట. అందుకే గడచిన అయిదేళ్లలో ఎవరు రోడ్డెక్కినా ఆయన పోలీసులను ఉసిగొల్పారు. ఎయిడెడ్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసించిన విద్యార్థులను చావబాదించారు. పోరుబాట పట్టిన ఉపాధ్యాయులపైనా ఉక్కుపాదం మోపారు. పంచాయతీల పీకనులమవద్దన్న సర్పంచ్లను అష్టదిగ్బంధనం చేశారు. అసమ్మతివాదులపై తప్పుడు కేసులు మోపుతున్నారని ఏపీ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి బాధ్యులు గవర్నర్కే మొరపెట్టుకున్నారు. జగన్ ఏకపక్ష ఏలుబడిలో న్యాయంకోసం నిలదీసిన లక్షలాది మందిపై లాఠీలు విరిగాయి. ముక్కారు పంటలు పండే పచ్చటి భూములను రాష్ట్రంకోసం నిస్వార్థంగా వదులుకున్న అమరావతి రైతులపైనైతే పోలీసులతో దండయాత్రలు చేయించారు జగన్. ‘‘మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామన్న విషయం మీకు గుర్తుందా’’ అని రాష్ట్ర హైకోర్టు ఆగ్రహించేంతగా రాజధాని గ్రామాల్లో భయోత్పాతం సృష్టించారు. ఇక తెలుగుదేశం, జనసేన నేతలూ కార్యకర్తలనైతే ఎక్కడికక్కడ రాచిరంపాన పెట్టించారు. కదిలితే కేసు, మెదిలితే సంకెళ్లు అన్నట్లు గృహ నిర్భందాలూ అరెస్టులకు పాల్పడి తానెంతటి నిరంకుశుణ్నో జగన్ నిరూపించుకున్నారు.
ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా పోలీసులు చాలామంది జగన్ సేవలోనే తల మునకలయ్యారు. ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై వైకాపా గూండా గుంపులు దాడులు చేస్తుంటే అడ్డు కోవాల్సిన ఖాకీలు ఏం చేస్తున్నారు? ఆ రక్కసి మూకలకే జీ హుజూర్ అంటూ, వాటికే రక్షణ కల్పిస్తున్నారు. పోలీసులను పక్కనపెట్టుకుని రౌడీ రాజకీయాలు చేస్తున్న జగన్ పార్టీ - రాష్ట్రంలో ప్రజాస్వామ్య హంతకిగా తయారైంది. తాచెడ్డ కోతి వనమెల్లా చెరిచింది అన్నట్లు రాజ్యాంగ నిబంధనలకు పూచికపుల్ల పాటి విలువ ఇవ్వని జగన్ - వ్యవస్థలనూ అలాగే పాడుచేశారు. తన ఖాకీ భక్తులతో కలిసి రాష్ట్రంలో మానవ హక్కులకు నిప్పెట్టారు. జగన్ పార్టీతో జుగ ల్బందీ చేసిన కొందరు అధికారులపై వేటు పడింది. అయినప్పటికీ జగన్ చేతుల్లో తోలుబొమ్మలై ఆడుతున్న పోలీసుల్లో ఎంతమాత్రం మార్పు రావట్లేదు.
కొందరు పోలీసు అధికారుల పక్కతాళం
ఆత్మగౌరవం లేనివారు నియంతలను ఆరాధిస్తారు. కిరాతక నేతల చెప్పుచేతల్లో మసులుతూ ప్రజాస్వామ్య ప్రమాణాలను పూడ్చిపెడతారు. ఏపీలో ఆ పని పోలీసు బాసులే చేశారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అమరావతి ప్రాంతంలో పర్యటించినప్పుడు రౌడీమూకలు కొన్ని ఆయన కాన్వాయ్పై రాళ్లు విసిరాయి. దాన్ని ‘రాజ్యాంగబద్ధమైన భావప్రకటన స్వేచ్ఛ’గా అభివర్ణించిన నాటి డీజీపీ గౌతమ్ సవాంగ్- జగన్ సేవే జనం సేవ అని తమ సిబ్బందికి సంకేతాలిచ్చారు. మాచర్లలో తెదేపా కార్యాలయం, ఆ పార్టీ నేతల నివాసాలను వైకాపా గూండాలు తగలబెట్టినప్పుడు- బాధితులమీదే తాడెత్తున లేచారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. తెదేపా కేంద్ర కార్యాలయంపై జగన్ పిశాచగణాలు దాడికి దిగినప్పుడూ పోలీసులు స్వామిభక్తితో కళ్లూచెవులూ మూసుకున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతిచోటా వైకాపా విధ్వంసాలూ బెదిరింపులూ బరితెగింపుల పర్వాలకు ఖాకీలు పక్కతాళాలు వాయించారు. కరోనా రోజుల్లో మాస్కులైనా లేకుండా ఎలా పనిచేయాలని నిలదీసిన దళిత డాక్టర్ సుధాకర్ను జగన్ సర్కారు అమానుషంగా వేటాడింది. నడిరోడ్డు మీద పోలీసులతో కొట్టించి, ఆయనపై పిచ్చివాడన్న ముద్ర వేసింది. ఆఖరికి సుధాకర్ ప్రాణాలను బలితీసుకుంది. తన అధ్వాన పాలనను వేలెత్తిచూపించినందుకు సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజునూ జగన్ వదల్లేదు. పోలీసులను పురమాయించి ఆయనను అరెస్టు చేయించారు. ఎంపీని నిర్బంధించి అతిదారుణంగా హింసించారు. విమర్శకుల నోళ్లను లాఠీలతో మూయించడమే కాదు- విపక్ష నేతల కార్యక్రమాలకు అడుగడుగునా అడ్డంకుల సృష్టించేందుకూ తన అంధ భక్తులైన ఖాకీలనే ఉపయోగించుకున్నారు జగన్. జనసేనాని పవన్ కల్యాణ్ పర్యటనలకు అలాగే అడ్డంపడ్డారు. అధికారపక్షాలతో అంటకాగే పోలీసు అధికారులు ఆ తరవాత చాలా సమస్యలు ఎదుర్కొంటారని సాక్షాత్తూ సుప్రీంకోర్టే మొన్నామధ్య హెచ్చరించింది. తన భక్తిగీతాలాపనలో మునిగిపోయేలా యంత్రాంగాన్ని తీర్చిదిద్దుకున్న జగన్ పుణ్యమా అని ఏపీ ఖాకీలకు ఇటువంటి హితోక్తులేవీ చెవినపడలేదు. విపక్ష సభ్యులపై అక్రమ కేసుల బనాయింపు ఆగలేదు. నోరూవాయి లేని అభాగ్యులను వేధించి, వారిలో కొందరిని ఆత్మహత్యలకు పురికొల్పిన పోలీసులు- ఎన్నో కుటుంబాలను కన్నీళ్లలో ముంచేశారు. రాష్ట్రాన్ని తాలిబన్ల రాజ్యం చేశారని జనమంతా చీదరించుకుంటుంటే జగన్ ఏమో పోలీసుల పనితీరు మెరుగుపడిందని మురిసిపోయారు. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే, ఒంటె అందానికి గాడిద మూర్ఛబోయిందట! జగన్, పోలీసుల అనుబంధమూ అచ్చం అలాగే ఉంది!
వైకాపా యూనిఫామ్ వేస్తే పోలా!
జగమెరిగిన జనకంటకుడు జగన్ జమానాలో శాంతి లేదు... ప్రజలకు భద్రత అంతకంటే లేదు. ‘‘నిబంధనలను తొక్కిపెట్టి ఎలా అరెస్టు చేస్తారు? ఠాణాకు తీసుకెళ్లి కొట్టడమేంటి... రాష్ట్రంలో ఏం జరుగుతోంది... ఇలాగైతే సామాన్యుల పరిస్థితి ఎలా?’’ అంటూ కట్టలుతెంచుకున్న ఖాకీ క్రౌర్యంపై రాష్ట్ర హైకోర్టే నిప్పులు చెరిగింది. ‘‘రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా లేదా అని అనుమానమేస్తోంది’’ అని మరో కేసులో ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆవేదన వెలిబుచ్చింది. జగన్ ఏలుబడిలో హద్దులుమీరిన రాజ్యహింసపై న్యాయపాలిక అభిశంసనలు ఇవి! అయినా వైకాపా అధినేతలో ఉలుకులేదు... పలుకులేదు. పోలీస్ యూనిఫామ్కు రాజకీయ మరకలు అంటించిన జగన్- ఖాకీ బట్టలు వేసుకునేందుకు రాష్ట్ర పోలీసుల్లో చాలా మందిని అనర్హులను చేశారు. వాటికి బదులు తెల్ల చొక్కా, బులుగు ప్యాంటు, బులుగు బెల్టు, ఆకుపచ్చ టోపీ ధరిస్తే- జగన్ కిరాయిసైన్యంగా వారి ‘డ్యూటీ’కి అతికినట్లు ఉండేది. ముఖ్యంగా ఏపీ సీఐడీకి వైకాపా యూనిఫామ్ బాగా నప్పుతుంది. ప్రజావ్యతిరేక వైకాపా ప్రభుత్వానికి జీహుజూర్ అననివారిని చెండుకుతినే ప్రత్యేక బాధ్యతలను సీఐడీ సిబ్బంది ఈ అయిదేళ్లలో చాలా నిష్ఠగా నిర్వర్తించారు. అందుకోసమే ప్రజాధనంతో జీతాలిచ్చి జగన్ వారిని ప్రేమగా పోషించారు.
అవినాష్పై అలవిమాలిన ప్రేమ
‘‘మీ విధులను నిజాయతీ, చిత్తశుద్ధితో నిర్వర్తించండి’’ అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసులకు జగన్ పాఠాలు చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఏమో వైకాపాకు ఊడిగం చేయడమే పోలీసుల చిత్తశుద్ధికి కొలమానం అన్నట్లుగా ప్రవర్తించారు. ప్రజారక్షకులను ప్రజాస్వామ్య హంతకులుగా మార్చిన ఘనత కూడా జగన్ పార్టీ ఖాతాలో పడింది. తటస్థులు, తెదేపా సానుభూతిపరుల ఓట్ల తొలగింపు కుట్రకు తెరలేపిన ఒక సీఐ, ముగ్గురు ఎస్ఐల బండారం పర్చూరులో బట్టబయలైంది. పోలీసుల దన్నుతో పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకునేందుకూ వైకాపా నాయకులు తెగబడ్డారు. ప్రతిపక్ష నేతలూ కార్యకర్తలు, సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు చేసేవారికి బేడీలు వేసేందుకు జగన్ పెంపుడు పోలీసులు సినిమా సాహసాలెన్నో చేశారు. అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, కొల్లు రవీంద్ర ఇళ్ల దగ్గర వీరంగాలాడి మరీ వారిని అరెస్టు చేశారు. ఫేస్బుక్లో ప్రభుత్వ వ్యతిరేక పోస్టును షేర్ చేసినందుకు రంగనాయకమ్మ అనే వృద్ధురాలిపై అన్యాయంగా కేసు నమోదుచేశారు. ఆ పెద్దావిడ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రాష్ట్రం వదిలి వెళ్లిపోయేంతగా వేధించారు. జగన్ విమర్శకులపై విరుచుకుపడిన అదే పోలీసు వీరులు- వివేకానందరెడ్డి హత్యకేసులో అవినాష్ అరెస్టుకు సహకరించమని సీబీఐ అడిగితే చేతులెత్తేశారు. సీబీఐ అధికారిపైనే కేసు పెట్టించడం ద్వారా ఏపీ పోలీసుల దుష్కీర్తి కిరీటంలో మరో కలికితురాయిని వైకాపా తగిలించింది. సీబీఐని ముప్పతిప్పలు పెట్టి మూడుచెరువుల నీళ్లు తాగించిన జగన్ రాక్షస రాజ్యం ధాటికి వివేకా హత్యకేసు విచారణ తెలంగాణకు బదిలీ అయ్యింది. దాంతో మూటగట్టుకున్న అప్రతిష్ఠ చాలదన్నట్లు- దళితుణ్ని చంపి డోర్డెలివరీ చేసిన జగన్ అంతేవాసికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పి, ఆయనతో ఫొటో దిగి, తమ జీవితాలను చరితార్థం చేసుకున్నారు ఖాకీలు. వైకాపా నేతాగణాలకు పొర్లుదండాలు పెట్టడంలో వారి సిగ్గుమాలినతనం గురించి ఎంత చెప్పినా తరిగేది కాదు. పోలీసు వ్యవస్థను ఇంతగా భ్రష్టుపట్టించిన జగన్ వంటి ముఖ్యమంత్రి- ఇంతకు ముందు ఎవరూ లేరు, భవిష్యత్తులో మరెవరూ రారు!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్