929 మంది వాలంటీర్లను తొలగించాం
ఎన్నికల ప్రవర్తన నియమావళి (కోడ్)ని ఉల్లంఘించినందున 929 మంది వాలంటీర్లను తొలగించామని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ హైకోర్టుకు నివేదించారు.
62,571 మంది ఉద్యోగాలకు రాజీనామా చేశారు
రాజీనామాలను ఆమోదించొద్దని ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వలేం
హైకోర్టుకు తెలిపిన ఎన్నికల సంఘం
ఈనాడు, అమరావతి: ఎన్నికల ప్రవర్తన నియమావళి (కోడ్)ని ఉల్లంఘించినందున 929 మంది వాలంటీర్లను తొలగించామని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ హైకోర్టుకు నివేదించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 62,571 మంది వాలంటీర్లు రాజీనామా చేశారన్నారు. పిటిషనర్ కోరిన విధంగా ఎన్నికలు ముగిసేవరకూ రాజీనామాలను ఆమోదించొద్దని ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వలేమన్నారు. ఐఏఎస్ అధికారులే ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీచేస్తున్నారని తెలిపారు. ఈ వ్యాజ్యంలో కౌంటర్ వేయడానికి సమయం కోరారు. అందుకు అంగీకరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. ఏపీలో ఎన్నికలు ముగిసేవరకూ వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా రాష్ట్రప్రభుత్వానికి ఉత్తర్వులు జారీచేసేలా ఈసీని ఆదేశించాలని కోరుతూ భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధ్యక్షుడు బి. రామచంద్రయాదవ్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలుచేసిన విషయం తెలిసిందే. బుధవారం ఈ వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది.
ఖజానాపై భారం: ప్రభుత్వ న్యాయవాది
రాష్ట్రప్రభుత్వం తరఫు న్యాయవాది సుమన్ వాదనలు వినిపిస్తూ.. ‘ఈసీ ఆదేశాల నేపథ్యంలో వాలంటీర్లకు ఎన్నికల విధులు అప్పగించలేదు. వాళ్లు ఏ పనీ లేకుండా ఖాళీగా కూర్చుంటున్నారు. అయినా గౌరవవేతనం చెల్లిస్తున్నాం. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై భారం పడుతోంది’ అన్నారు.
ఈసీ మౌనం తగదు: న్యాయవాది ఉమేశ్చంద్ర
పిటిషనర్ తరఫు న్యాయవాది పీవీజీ ఉమేశ్చంద్ర వాదనలు వినిపిస్తూ.. ‘రాజీనామాలు చేసిన వాలంటీర్లు అధికారపార్టీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఈసీ మౌనంగా ఉండటం తగదు. ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి రాజీనామాలను ఆమోదించొద్దంటూ ఆదేశాలు ఇచ్చే అధికారం ఈసీకి ఉంది. ఈసీ కౌంటర్ దాఖలు చేశాక ఈ విషయాన్ని తేల్చాలి. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లే అవకాశం ఉంది’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటాం
వరదలతో కోస్తా జిల్లాల్లో నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. నష్టాల తీవ్రతపై అవసరమైతే నిబంధనలు సడలించి అయినా అదనపు సాయం అందించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?