గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు.
‘యానాదోళ్ల అమ్మాయి’ అంటూ మేకపాటి రాజమోహన్రెడ్డి దుర్భాషలు
ఫిర్యాదు అంది 5 రోజులవుతున్నా కేసు పెట్టని పోలీసులు
న్యాయసలహాకు పంపించామంటూ జాప్యం
ఎన్నికల కోడ్ ఉన్నా.. వైకాపా కోడ్నే అమలు చేస్తున్న నెల్లూరు పోలీసులు
ఈనాడు-నెల్లూరు, న్యూస్టుడే-ఆత్మకూరు: ‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. ఇప్పుడు డబ్బులిస్తే ఆ పార్టీలో చేరారని అంటున్నారు’’ అని ఆత్మకూరు పురపాలక ఛైర్పర్సన్ గోపారం వెంకట రమణమ్మను ఉద్దేశించి మాజీ ఎంపీ, వైకాపా నేత మేకపాటి రాజమోహన్రెడ్డి ఈ నెల 17న మర్రిపాడు మండలం అల్లంపాడులో నిర్వహించిన రచ్చబండలో వ్యాఖ్యానించారు. దీనిపై వెంకటరమణమ్మ ఈ నెల 20న పోలీసులకు ఫిర్యాదుచేసినా ఇప్పటివరకూ కేసే నమోదుచేయలేదు. ఫిర్యాదును న్యాయసలహా కోసం పంపించామని, అది అందాక కేసు విషయం చూస్తామని చెబుతున్నారు. మున్సిపల్ ఛైర్పర్సన్గా ఉన్న గిరిజన మహిళను వైకాపా నేత దూషిస్తే ఎందుకు కేసు నమోదుచేయట్లేదు? 5 రోజుల సమయం చాల్లేదా? వైకాపా నేతలపై ఫిర్యాదులొస్తే కేసు నమోదుచేయరా? అన్న విమర్శలు వస్తున్నాయి.
వైకాపా నాయకులు చెప్పిందే చట్టం
గతంలో ఆత్మకూరు నియోజకవర్గంలో అధికారపార్టీ అక్రమాలను ప్రశ్నించినవారిపై అక్రమంగా కేసులు నమోదుచేసిన ఉదంతాలు చాలా ఉన్నాయి. రెండేళ్ల క్రితం ఆత్మకూరు మండలం అప్పారావుపాళెంలో వైకాపా నాయకులు ఇరిగేషన్ పనులు చేయకుండానే నిధులు స్వాహా చేసేందుకు యత్నించారని.. తెదేపా సానుభూతిపరుడు మల్లికార్జుననాయుడు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పరిశీలనకు ఇరిగేషన్ ఎస్ఈ కృష్ణమోహన్ వచ్చినప్పుడు.. విచారణ సక్రమంగా జరగకూడదనే ఉద్దేశంతో వైకాపా నాయకులు వాగ్వాదానికి దిగారు. అదే గ్రామంలో పంచాయతీ సమావేశం జరగ్గా.. అక్కడకు మల్లికార్జుననాయుడు వెళ్లారు. అక్కడ పంచాయతీ కార్యదర్శి అధికారపార్టీ నాయకుల ప్రోద్బలంతో ఆయన్ను అడ్డుకున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారు.
మర్రిపాడు మండలంలో ఓ వ్యక్తి ప్రభుత్వభూమిని ఆక్రమించి కొన్నేళ్లుగా సాగు చేసుకుంటుండగా.. దానికి వైకాపా నాయకులు పట్టాలు పుట్టించుకుని, మరొకరికి విక్రయించారు. దీనిపై బాధితుడు ప్రశ్నించగా.. గొడవకు దిగి ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించారు. వార్తలను రాసిన విలేకరిపైనా అక్రమంగా కేసు నమోదుచేశారు. దీనిపై విచారణ చేసి డీఎస్పీ స్థాయి అధికారి క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే.. కోర్టుకు ఛార్జిషీటు సమర్పించారనే ఆరోపణలు ఉన్నాయి.
ఆర్డీఓ ఫిర్యాదునే పక్కనపెట్టి..
కలువాయి మండలంలో కొందరు రెవెన్యూ అధికారులతో చేతులు కలిపి.. అటవీ భూములకు పట్టాలు పుట్టించారు. వాటిని చూపి ప్రభుత్వం నుంచి రూ.1.43 కోట్ల పరిహారం పొందారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో విచారణ చేసిన ఆత్మకూరు ఆర్డీవో వాస్తవమని తేల్చారు. దీనికి సహకరించిన తహసీల్దార్లు వై.నాగరాజు, వి.లావణ్య, ఎస్.ఎం.హమీద్లను సస్పెండ్ చేశారు. మరో 9మందిపై క్రిమినల్ కేసు పెట్టాలని ఆర్డీవో కరుణకుమారి 2023 జనవరి 23న కలువాయి పోలీసుస్టేషన్లో ఫిర్యాదుచేశారు. ఈ కేసులో అక్రమార్కులు వైకాపా నాయకులను ఆశ్రయించడంతో.. ఆ కేసును పక్కన పడేశారు. పైగా అక్కడ డీఎస్పీ కోటారెడ్డి.. ఆర్డీవో ఫిర్యాదుపైనే అనుమానాలు వ్యక్తం చేయడం వైకాపా నాయకుల పట్ల ఆయన స్వామిభక్తికి నిదర్శనం. నెల్లూరులో తొమ్మిదేళ్లు ఎస్బీలో పనిచేసిన ఆయనకు.. ఆత్మకూరు డీఎస్పీగా పోస్టింగ్ ఇప్పించినవారికి కృతజ్ఞతగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
కులం పేరుతో అవమానకరంగా మాట్లాడారు
‘‘వైకాపా విధానాలు నచ్చక ఇటీవల నేను తెదేపాలో చేరాను. ఈ నెల 17న మేకపాటి రాజమోహన్రెడ్డి అల్లంపాడులో జరిగిన కార్యక్రమంలో నా కులం పేరెత్తి అవమానకరంగా మాట్లాడారు. ప్రజలందరి ముందు నన్ను అవమానించారు. ‘యానాది కులంలో పుట్టిన..’ అంటూ కులం పేరుతో దూషించడమే కాకుండా డబ్బులకు అమ్ముడుపోయానని నన్ను దూషించారు. ఈ విషయం పేపరు, సామాజిక మాధ్యమాల ద్వారా తెలిసి నేను మానసికంగా కుంగిపోయాను. వారు ధనవంతులు, బలవంతులు కావడంతో నిరుపేదరాలైన నాకు భయంగా ఉంది.’’
ఆత్మకూరు పురపాలక ఛైర్పర్సన్ గోపారం వెంకట రమణమ్మ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దళిత యువకుడికి పోలీసుల చిత్రహింసలు.. డిగ్రీ పరీక్షలు రాయకుండా నిర్బంధం
‘పోలీసులు నన్ను అక్రమంగా నిర్బంధించి తీవ్రంగా హింసించారు. డిగ్రీ పరీక్షలు రాయనివ్వకుండా నా భవిష్యత్తును నాశనం చేశారు’ అని దళిత విద్యార్థి శశాంక్ వాపోయారు. -
గులకరాయి ఘటనను ఎన్నికల్లో లబ్ధికి వినియోగించుకోకుండా అడ్డుకోండి
గులకరాయి ఘటనను ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం సీఎం జగన్ సహా వైకాపా నేతలు వాడుకుంటున్నారనీ, దీనిని నిలువరించాలని కోరుతూ విజయవాడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు నమోదవుతోంది. వడగాలులు సైతం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో తలెత్తిన ఒక భూవివాదంలో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు బొత్స సందీప్ పేరు తెరపైకి వచ్చింది. -
మీ భూమి మీది కాదు
ఆ ఆస్తి మాదే... రికార్డుల్లో మా పేరే ఉంది, మాకేం భయం... అనుకుంటే పొరపాటే. రాత్రికి రాత్రే రికార్డులు మారిపోవచ్చు. -
పింఛను కుట్ర.. తీస్తోంది ప్రాణం
సీఎం గారూ.. పండుటాకులు ఎంత ఘోష అనుభవిస్తున్నారో కనిపిస్తోందా? అభాగ్యులు పడే వేదన వినిపిస్తోందా? పదవిలో ఉండి ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయకుండా వికృత రాజకీయ క్రీడ నడుపుతూ పింఛనుదారులపై ఇంత కిరాతకంగా వ్యవహరిస్తారా? -
సీఈఓ మౌనం.. వైకాపాకు లాభం!
ఫుట్బాల్ క్రీడలో రిఫరీలా.. ఎన్నికల ప్రక్రియలో నియమ నిబంధనలు అమలు చేసే పాత్ర పోషిస్తూ తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఎన్నికల సంఘం ఆ బాధ్యతల నిర్వహణలో విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. -
జగన్ వంచనకు ఏడు ప్రాణాలు బలి
పింఛన్ల రాజకీయ క్రీడ ఏడుగురిని బలి తీసుకుంది. ప్రభుత్వ నిరంకుశ వైఖరి, పంపిణీలో నిర్లక్ష్యంతోపాటు ముఖ్యమంత్రి జగన్, ఉన్నతాధికారుల వైఫల్యం పేద కుటుంబాలకు పెద్దదిక్కును దూరం చేస్తున్నాయి. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
ఇటీవల కన్నుమూసిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
వైద్య కళాశాలల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి ఆహ్వానం
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. -
సీఎం జగన్ను ఓడించడమే మా లక్ష్యం
ఈ ఎన్నికల్లో సీఎం జగన్ను ఓడించడమే 35మాదిగ సంఘాల ఐక్యవేదిక లక్ష్యమని.. ఆ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు అన్నారు. -
యువత పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోంది
‘ఓటేసే ముందు మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి.. ఎవరు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారో.. వారినే ముఖ్యమంత్రిగా చేయండి’ అని సౌదీ అరేబియాలోని ఆరామ్కో సంస్థతో కలిసి ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ నిర్వహిస్తున్న రావి రాధాకృష్ణ ఓటర్లకు పిలుపునిచ్చారు. -
పేదల ఇళ్లపై దా‘గూడు’ మూతలు!
ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన్నాటి నుంచి... అభివృద్ధి మరచి తెదేపాపై అక్కసుతో వ్యవహరించిన జగన్... పేదలకిచ్చే ఇళ్లలోనూ ఆ అవలక్షణాన్నే ప్రదర్శించారు. -
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
సీఎం జగన్ను ఓటమి భయం పట్టుకుందా? కొన్ని నెలల క్రితం ‘వైనాట్.. 175’ అంటూ ధీమా ప్రదర్శించిన ఆయనలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందా? ఎందుకీ ఎదురుగాలి.. అని మదన పడుతున్నారా? -
వేసవిలో భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు
వేసవి సెలవుల్లో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. -
‘ఉత్తర్వుల ఎత్తివేత’పై త్వరగా విచారించండి
మాజీ మంత్రి వివేకా హత్య విషయంలో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై వ్యాఖ్యలు చేయెద్దంటూ వెలువరించిన ఉత్తర్వులను ఎత్తివేయాలని (స్టే వెకేట్) కోరుతూ మృతుడి కుమార్తె నర్రెడ్డి సునీత, పీసీసీ అధ్యక్షురాలు, కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి (బీటెక్ రవి)లు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై త్వరగా విచారణ చేసి, ఈ నెల 8లోపు నిర్ణయం వెల్లడించాలని కడప జిల్లా న్యాయస్థానాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పింఛన్ పెంచలే.. కానుకకు కరుణించలే!
ముఖ్యమంత్రి జగన్ తన ఐదేళ్ల పాలనాకాలంలో దివ్యాంగులపై ఎనలేని వివక్ష చూపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం దివ్యాంగ పింఛనుదారులు 8.07 లక్షల మంది ఉన్నారు. -
అవినాష్రెడ్డి ముందస్తు బెయిలు రద్దుకు నిరాకరణ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి బెయిలును రద్దు చేయడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి గడువు పొడిగించాలి
పోలింగ్ ముందు రోజు వరకు పోస్టల్ బ్యాలట్ వినియోగానికి అనుమతించాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్, ఏపీ ఉపాధ్యాయ సంఘం వేర్వేరు ప్రకటనల్లో ఎన్నికల సంఘాన్ని కోరాయి. -
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
సీఎం జగన్ ఎక్కడ సిద్ధం సభలు నిర్వహించినా... అక్కడ విధ్వంసం పరిపాటిగా మారింది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో శుక్రవారం సిద్ధం సభ జరిగింది. -
‘అ’భివృద్ధి ‘నిల్’.. అవినీతి ఫుల్!
ఆయనో యువ ప్రజాప్రతినిధి.. బెట్టింగ్ అనగానే టక్కున గుర్తుకొస్తారు. జిల్లాలోని సహజ వనరులను సొంతవాటిలా భావించారు.. ఈ ఐదేళ్లలో యథేచ్ఛగా కొల్లగొట్టేశారు.
తాజా వార్తలు (Latest News)
-
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష