ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం.
మైనింగ్ కమీషన్ల ఆరోపణలతో కాసు మహేష్రెడ్డి సతమతం
ఎన్నికల కోడ్ వచ్చే ముందే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
అయిదేళ్లు కాలయాపన చేయడంపై ప్రజల నుంచి విమర్శలు
ఉత్కంఠ రేపుతున్న గురజాల పోరు
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం.
గురజాలకు చెందిన సిమ్ కార్డుల విక్రయదారు
పరిశ్రమల ఏర్పాటు.. ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. విద్యుత్తు ఛార్జీలు భారీగా పెంచారు. ఒక ఫ్యాన్, ఒక లైట్కు నెలకు రూ.500 బిల్లు వస్తోంది.
పిడుగురాళ్లలోని ఓ హోటల్లో క్యాష్ కౌంటర్ ఉద్యోగి
గతంలో తెదేపా ఎమ్మెల్యేపై మైనింగ్ మాఫియా డాన్ అని ఆరోపణలు గుప్పించిన కాసు.. ఎమ్మెల్యే అయిన తర్వాత అవే ఆరోపణలకు కేంద్ర బిందువయ్యారు. పోనీ అభివృద్ధిని వేగవంతం చేశారా అంటే అదీ లేదు.
పిడుగురాళ్లకు చెందిన ఓ ఆటోమొబైల్ వ్యాపారి
ఎత్తిపోతల పథకాల ద్వారా దాచేపల్లి, మాచవరం మండలాల్లోని కొన్ని గ్రామాలకు సాగునీరు ఇస్తామని జగన్తో పాటు ఎమ్మెల్యే హామీలిచ్చారు. అవి మాయమాటలని అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు అర్థమైంది.
దాచేపల్లి మండలం గామాలపాడుకు చెందిన రైతు
ఈనాడు, అమరావతి: పల్నాటి పౌరుషాల గడ్డ గురజాల నియోజకవర్గంలో ఎన్నికలంటే రణరంగమే.. హత్యలు, దౌర్జన్యాలతో ఇప్పటికే నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ ప్రాంతంలో ఎన్నికల పోరుకు తెదేపా, వైకాపా అభ్యర్థులు ‘సై’ అంటున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కాసు మహేష్రెడ్డి గెలిచిన నెల రోజుల్లోనే వైకాపా శ్రేణులు తెదేపా కార్యకర్తలపై దాడులకు తెగబడ్డాయి. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని అనేకమంది గ్రామాలు విడిచివెళ్లారు. అడ్డుకోవాల్సిన ఎమ్మెల్యే దాడులను ప్రోత్సహించారన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. ఆయనే మరోసారి వైకాపా అభ్యర్థిగా బరిలో ఉన్నారు. తెదేపా అభ్యర్థిగా యరపతినేని శ్రీనివాసరావు ఏడోసారి పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి లేమి.. మైనింగ్ వ్యాపారుల నుంచి కమీషన్ల వసూలు.. ఫ్యాక్షనిజానికి మళ్లీ ఆజ్యం పోశారన్న ఆరోపణలు మహేష్రెడ్డికి మైనస్గా మారాయి. ఈ అంశాలను యరపతినేని ఎండగడుతూ, తాను గెలిస్తే ఏం చేస్తానో తెలిపేలా ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మరోవైపు వైకాపా నుంచి తెదేపాలో చేరిన మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణామూర్తి బీసీ సదస్సులు నిర్వహిస్తూ.. తెలుగుదేశం గెలుపునకు ప్రచారం చేస్తున్నారు. ఈసారి జనసేనతో పొత్తు ఉండటంతో యరపతినేనికి కాపు సామాజికవర్గం మద్దతు దక్కింది. ముఖ్యంగా దాచేపల్లిలో వారి బలం అధికం. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థికి 12 వేలకుపైగా ఓట్లు వస్తే.. అందులో సగం దాచేపల్లి మండలం లోనివే. పలు గ్రామాల్లో వైకాపా శ్రేణులు రెండు వర్గాలుగా విడిపోవడం, వర్గ విభేదాలు తదితర కారణాలతో గెలుపుపై తెదేపా ధీమాగా ఉంది. ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి నియోజకవర్గంలోని గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల పట్టణాలతో పాటు జానపాడులో పర్యటించి వివిధ వర్గాల ఓటర్లతో మాట్లాడారు. అభివృద్ధిపై అధిక శాతం మంది ప్రజలు పెదవి విరుస్తుండటం గమనార్హం.
హత్యా రాజకీయాలకు నిలయంగా మార్చి..
వైకాపా అధికారంలోకి వచ్చాక గురజాలను హత్యా రాజకీయాలకు నిలయంగా మార్చారు. గురజాల మండలం అంబాపురంలో తెదేపా నేత విక్రమ్ను వైకాపా శ్రేణులు నరికి చంపాయి. దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచి, తెదేపా నేత అంకుల్ను హత్య చేశారు. ఈ అయిదేళ్లలో 11 మందిని వైకాపా హత్యలు చేసిందని, వారిలో కొందరిని వేధించి ఆత్మహత్యలు చేసుకునేలా చేశారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. వాటిల్లో అనేక హత్యలు వ్యక్తిగత కక్షలతో జరిగాయని పోలీసులతో వైకాపా నేతలు చెప్పిస్తున్నారన్నది వారి వాదన. మొత్తానికి సమసిపోయిందనుకున్న ఫ్యాక్షనిజానికి మళ్లీ కాసు ఆజ్యం పోస్తున్నారన్న ప్రచారం ఉంది. గ్రామాలు వదిలి వెళ్లిన వారు ఇప్పుడిప్పుడే సొంతూళ్ల మొఖం చూస్తున్నారు.
అభివృద్ధి నిల్.. కమీషన్లు ఫుల్
గతంలో యరపతినేనిని మైనింగ్ మాఫియా డాన్ అని ఆరోపించిన కాసు.. అధికారంలోకి వచ్చాక సున్నపు రాయి మైనింగ్ను తన ఆదాయ వనరుగా మార్చుకున్నారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. పిడుగురాళ్లకు మంజూరైన వైద్య కళాశాల పూర్తి కాకున్నా.. ఎన్నికలు వస్తున్నాయని, ప్రజలను మభ్యపెట్టేందుకు ఓ చిన్న బ్లాక్ను కట్టి ప్రారంభించారు. ఏళ్లుగా నాన్చి.. పిడుగురాళ్ల బైపాస్ను కూడా ఇటీవలే ప్రారంభించడం గమనార్హం. దీనికి సంబంధించి ఇంకా వంతెనలు పూర్తి కాలేదు. జానపాడు రోడ్డులో ఈ మధ్యే ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇవన్నీ ఎన్నికల కోడ్ వచ్చే ముందే చేయటం విమర్శలకు తావిస్తోంది. గురజాలను పల్నాడు జిల్లా కేంద్రంగా చేసే అంశాన్ని ఎమ్మెల్యే కాసు పట్టించుకోలేదన్న అసంతృప్తి ఓటర్ల నుంచి వ్యక్తమవుతోంది. అదే సమయంలో తెదేపా అధికారంలోకి వస్తే గురజాల కేంద్రంగా జిల్లా చేస్తామని, నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తదితర హామీలతో వ్యక్తిగత మేనిఫెస్టోను యరపతినేని జనంలోకి తీసుకెళ్తున్నారు.
ఇంటింటికీ నీళ్లు ఏవీ?
నియోజకవర్గంలో ఇంటింటికీ రక్షిత నీరు సరఫరా చేస్తామని కాసు గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు.. తీరాచూస్తే కేంద్ర పథకం జలజీవన్ మిషన్ కింద ఒకట్రెండు గ్రామాలకు ఇచ్చి సరిపెట్టారు. బుగ్గవాగు నుంచి పైపులైన్ ద్వారా పిడుగురాళ్ల, దాచేపల్లితో పాటు 57 గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పిస్తామని కోతలు కోశారు. పిడుగురాళ్లలో ఒక్క ఇంటికీ ఇవ్వలేదు. మూడు ఓవర్ హెడ్ ట్యాంకుల పనులు నిలిచిపోయాయి. ఎత్తిపోతల పథకాల ద్వారా మాచవరం, దాచేపల్లి మండలాల్లోని టెయిలెండ్ భూములకు సాగునీరు ఇస్తామని ప్రగల్భాలు పలికిన జగన్ ఆ ఊసే మర్చిపోయారు. పిడుగురాళ్లలో సున్నం వ్యాపారులపై గతంలో నమోదైన కేసుల్ని ఎత్తివేస్తామని ఇచ్చిన హామీనీ నెరవేర్చలేదు. దాచేపల్లి ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ఎన్నో అవకాశాలున్నా, వైకాపా సర్కారు పట్టించుకోలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు