హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి.
గుణగణాలను గుర్తించండి
సీఎం జగన్ కొత్త పల్లవి
ఆఖరి రోజు బస్సు యాత్రకు సిక్కోలులో స్పందన కరవు
ఈనాడు- విశాఖపట్నం, ఈనాడు డిజిటల్- శ్రీకాకుళం, టెక్కలి, న్యూస్టుడే: ‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. హీరో గుణగణాలు, చేసే మంచి కారణంగా మనవాడని అనుకుంటాం. మోసం, కుట్రలను చేసేవాడిని విలన్ అంటాం..’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో మొదలైన జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 22వ రోజు శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో బుధవారం ముగిసింది. ముగింపు సభలోనూ సంక్షేమ పథకాలపై ఊకదంపుడుకే ప్రాధాన్యమిచ్చారు. తనకు ఓటేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయంటూ బెదిరించే ధోరణిలో జగన్ ప్రసంగం సాగింది.
మోసాన్ని నిజాయతీతోనూ గెలవొచ్చు
‘మోసాన్ని మోసంతో జయించాలన్న రాజనీతిని మీ బిడ్డ అమలు చేయడు. మోసాన్ని నిజాయతీతోనూ జయించవచ్చని నిరూపించడానికి సిద్ధం’ అంటూ జగన్ టెక్కలిలో కొత్త రాగం అందుకున్నారు. ‘మీ నాయకుడు ఎవరని అడిగితే తలెత్తుకోలేని నాయకుడు కావాలా? కాలరెగరేసుకుని చెప్పుకొనే జగన్లాంటి నాయకుడు కావాలా?’ అంటూ ప్రశ్నించారు. ఏపీ పేరు చెబితేనే రాజధాని లేని రాష్ట్రమని అంతా నవ్వుకుంటున్నారు. రహదారులపై గుంతలను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఉద్యోగాల్లేక యువత పక్క రాష్ట్రాలకు వలస వెళుతోంది. ఇవన్నీ చూసి ఎలా తలెత్తుకుంటాం జగన్ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ప్రత్యేక హోదాపై మీరేం చేశారు?
2014లో చంద్రబాబు కూటమి మ్యానిఫెస్టోను విస్మరించింది, ప్రత్యేక హోదా తేలేదని జగన్ అన్నారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని జగన్ 2019 ఎన్నికల ముందు చెప్పారు. మరి అధికారం ఇచ్చిన అయిదేళ్లు ఏం చేశారో చెబితే అందరూ తెలుసుకునే వాళ్లు కదా? అన్న విమర్శలొచ్చాయి. అధికారం దక్కిన మొదటి రోజు నుంచి ప్రతి రంగాన్ని ఎలా సిద్ధం చేశానో గమనించాలని జగన్ ప్రజలను కోరారు. గ్రామస్థాయిలో వ్యవసాయ రంగాన్ని సిద్ధం చేశానన్న సీఎం.. కొత్తగా ఎకరానికి నీరిచ్చిన దాఖలాల్లేవు. రైతుకు వెన్నెముకలాంటి సాగునీటి ప్రాజెక్టుల కోసం ఎంత వెచ్చించారు? ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారో సభలో చెప్పలేదు. శ్రీకాకుళంలో వంశధార కరకట్ట నిర్మాణం, కాలువల ఆధునికీకరణ, ఆఫ్షోర్ రిజర్వాయర్, రంగసాగరం ఎత్తిపోతల పూర్తి చేస్తామంటూ రెండేళ్ల కిందట ఆయనిచ్చిన హామీలకే దిక్కులేదన్న విమర్శలు వచ్చాయి.
మీకు తెలిసిన డోర్ డెలివరీ ఇదికాదు కదా?
ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు ఇంటింటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వ వ్యవస్థ ‘సిద్ధం’ అని జగన్ పేర్కొన్నారు. జగన్ బృందానికి తెలిసిన డోర్ డెలివరీ అంటే దళిత యువకుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన చరిత్ర అని మరిచినట్లున్నారని టెక్కలి సభ వద్దనే కొందరు యువత విమర్శనాస్త్రాలు సంధించారు. ఇదే విధంగా ఉత్తరాంధ్రపై.. ప్రధానంగా ‘నా విశాఖ’ అంటూ ప్రేమ గుప్పించారు. నమ్మి ఓట్లు వేసిన జనానికి అయిదేళ్లలో విధ్వంసం చూపించారు. జగన్ చేయలేని ఏ స్కీంను చంద్రబాబు కాదు కదా ఆయన జేజమ్మ కూడా చేయలేరని జగన్ వ్యాఖ్యానించారు. ఆయన స్కీంలు ఏమోకానీ, స్కాంలు ఎవరూ చేయలేరని ప్రతిపక్షాలు సామాజిక మాధ్యమాల్లో కౌంటర్ ఇచ్చాయి.
మరోసారి నరకమే
మేమంతా సిద్ధం సభను జాతీయ రహదారిని ఆనుకుని బీఎస్జేఆర్ డిగ్రీ కళాశాల పక్కన ఏర్పాటుచేశారు. సభకు మూడు కి.మీ. దూరంలో పరశురామపురం జంక్షన్ వద్ద మధ్యాహ్నం జగన్ బస ఏర్పాటుచేశారు. సాయంత్రం సభాప్రాంగణానికి ఆయన బయలుదేరారు. ఆ సమయంలో జాతీయ రహదారిపై తర్లిపేట, కన్నెవలస వరకు సుమారు ఐదు కి.మీ.మేర 3 గంటలపాటు ట్రాఫిక్ నిలిచింది. మరోవైపు జగతిమెట్ట కూడలి పైవంతెన, ఇరువైపులా సర్వీసు రోడ్లలో సుమారు కిలోమీటరున్నర మేర వాహనాలు నిలిచాయి.
విశాఖతోపాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలనుంచి వందల సంఖ్యలో ఆర్టీసీ బస్సులను సిద్ధం సభకు తరలించారు. ఎండ తీవ్రతకు ప్రయాణికులు అవస్థలు పడ్డారు. సభకు వచ్చిన ఒక్కొక్కరికీ రూ.300-400 ఇచ్చారు. కొన్ని ప్రాంతాల వారికి కూపన్లు ఇచ్చి తిరుగు ప్రయాణంలో డబ్బులిస్తామని చెప్పారు. ఇంతచేసినా సభ ప్రారంభానికి ముందే జనం వెనుదిరిగారు. చాలా మంది సభకు వెళ్లకుండా బస్సుల్లోనే ఉండిపోయారు.
జగన్ బస్సు యాత్ర ఆఖరి రోజు తుస్సుమంది. బుధవారం ఎచ్చెర్ల మండలం అరిణాం అక్కివలస నుంచి యాత్ర ప్రారంభమైంది. శ్రీకాకుళం కొత్త రోడ్డు వద్ద వైకాపా శ్రేణులు స్వాగతం పలికాయి. చాలా తక్కువగా జనం ఉండటంతో బస్సులోంచి కిందికి దిగడంతో పాటు టాప్పైకి ఎక్కి అభివాదం చేయలేదు. చాపురంలోనూ జనాల్లేక యాత్ర వెలవెలబోయింది. పాత్రునివలసలో క్యాడర్, జనాలు కనిపించలేదు. పెద్దపాడు వద్ద జనం లేకపోవడంతో సర్వీసు రోడ్లలో ట్రాఫిక్ను నిలిపేశారు. ఇక్కడ నిలిచిన వాహనదారులకు జగన్ అభివాదం చేశారు. మడపాం టోల్గేట్ వద్ద జగన్ రాక ఆలస్యమై అక్కడున్నవారు ఎండవేడి తాళలేక ఇబ్బందులు పడ్డారు.
సీఎం వస్తున్నారు.. సభకు వెళ్లండి
నందిగాం, న్యూస్టుడే: ‘ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బస్సు యాత్రలో భాగంగా టెక్కలి వస్తున్నారు. బుధవారం ఉదయం పని చేయండి. సాయంత్రం పనిలోకి రావొద్దు. మీ అందరి మస్తర్లు వేస్తాం. అందరూ సమావేశానికి వెళ్లండి’ అని ఉపాధిహామీ పథకం క్షేత్ర సహాయకులు వేతనదారులకు సూచించారు. కొందరు వేతనదారులు వారి ఆదేశాలను ప్రశ్నిస్తూ ‘మేం పనిలోకి వస్తాం. వచ్చిన వారికే మస్తరు వేయాలి’ అని పట్టుబట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.