అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం..
జిల్లా మొత్తంగా నియోజకవర్గ వైకాపా ప్రజాప్రతినిధి దందా
ఇల్లు కట్టాలంటే రూ.లక్ష నుంచి రూ.5 లక్షలు ముట్టజెప్పాల్సిందే..
జగనన్న లేఅవుట్లలో పరిపరి విధాలుగా దోపిడీ
సర్కారు ఖజానాకే చిల్లు పెట్టిన ఘనుడీ నేత..
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం..
సముద్ర తీరం, గోదావరి తీరం కలగలిసిన ప్రాంతం అది. పశ్చిమ గోదావరి చివర్లో ఉన్న ఆ ‘పురం’ అక్కడి ప్రధాన వాణిజ్య కేంద్రం. బ్రిటిష్ హయాంలోనే ఆ ఊరికి ఎంతో పేరున్నా.. జిల్లా కేంద్రంగా అన్ని అర్హతలున్నా.. ఆ ప్రజాప్రతినిధి కృషి లేకపోవడంతో పునర్విభజనలో అవకాశం దక్కలేదు. ఈ నియోజకవర్గంలో ‘రాజు’గా వెలుగొందుతున్న ఆ నేతకు ప్రతిదీ ప్రసాదమే.. అన్నీ ఆరగించడమే! ఉభయగోదావరి జిల్లా ఇసుక ర్యాంపులన్నీ ఆయన గుప్పిట్లోనే పెట్టుకున్నారు. ఆయన పనులన్నీ అధికారికంగానే కనిపించినా.. పరోక్షంగా లబ్ధి పొందుతారు. నరసాపురం, సఖినేటిపల్లి మధ్య గోదావరి పంటుకు వేలంపాట తప్పించి.. కొంతకాలం నిధుల పంట పండించుకొని ఖజానాకు జెల్లకొట్టారు.
జిల్లాలోని అన్ని ర్యాంపుల్లో దందా
ఇసుక అంటేనే పెద్ద ఆదాయ వనరు. వైకాపా సర్కారు ఏర్పడిన కొత్తలోనే ఆయనకు మంచి అవకాశం దక్కింది. రెండేళ్ల పాటు ఇసుకాసురుడి అవతారం ఎత్తారు. పార్టీలోని ఒక కీలక నాయకుడి అండదండలతో ఆ నియోజకవర్గంతోపాటు జిల్లాలోని అన్ని ర్యాంపుల్లో సొంత మనుషులను పెట్టుకుని దందా సాగించారు. రాష్ట్రంలో ఒకవైపు భవన నిర్మాణ కార్మికులు, సామాన్యులు ఇసుక దొరక్క నానా అవస్థలు పడుతుంటే.. ఆయన మాత్రం నిత్యం వేలాది ట్రాక్టర్లు, లారీల్లో సరిహద్దులు దాటించారు. అందులో పెద్దల వాటా పోగా.. మిగతా మొత్తంతో కోట్లకు పడగలెత్తారా నేత.
అక్రమాలకు అవే పెద్ద లేఅవుట్లు!
జగనన్న ఇళ్ల పట్టాలు ఆ ప్రజాప్రతినిధికి కాసుల వర్షం కురిపించాయి. నియోజకవర్గంలో జగనన్న లేఅవుట్ల కోసం ఎంజీపాలెం వద్ద స్థలాలను సేకరించారు. అంతకుముందే అక్కడ లేఅవుట్ వస్తుందని తెలుసుకొని, ఆ భూముల యజమానులతో అనధికారికంగా కొనుగోలు ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత ఒప్పంద ధరకు మించి ఎకరానికి రూ.10 లక్షలకు పైగా ఎక్కువ ధరకు ప్రభుత్వంతో కొనిపించారు. ఆ అదనపు సొమ్ములన్నీ ఆయనే మూటగట్టుకున్నారు. పైగా ఈ లేఅవుట్ను చదును చేసేందుకు మట్టి తోలడం మరో దందా. తక్కువ సరఫరా చేసి.. ఎక్కువ లారీలు నమోదు చేసి ఆ బిల్లులనూ స్వాహా చేశారు. బయట నుంచి తవ్వి తెచ్చిన మట్టిని.. ఇతరులకు పెద్ద మొత్తానికి అమ్ముకోవడం ఇంకో బాగోతం.
పోలీసులకు ఆయనే ప్రభువు
నియోజకవర్గంలో పోలీసులు ఏదైనా కేసు నమోదు చేయాలంటే.. ముందు ఈ నేత అనుమతి తీసుకోవాల్సిందే. వైకాపా నాయకులు, కార్యకర్తల అరాచకాలపై కేసులుండవు. కొంత కాలం కిందట ఈ ప్రజాప్రతినిధికి ఓ ఎస్సై అనుంగు శిష్యుడిలా ఉండేవారు. పోలీస్స్టేషన్లోనే పంచాయితీలు చేసేవారు. అలా కొద్ది రోజుల్లోనే భారీగా సంపాదించుకున్నారు. ఎంతగా అంటే.. ఆ నేత ఇంటి నిర్మాణంలో పెద్ద ఎత్తున ప్రయోజనం కల్పించే స్థాయిలో ఈ దోపిడీ సాగింది. ఇప్పటికీ పోలీసు స్టేషన్లలో పంచాయితీలు చేసే వారంతా ఆయన అనుచరగణమే.
ఆపత్కాలంలోనూ కాసుల వేట
కొవిడ్తో ప్రజల జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయి. ఆ సమయంలో పేదలకు నిత్యావసరాల పంపిణీ, అన్నదానం ముసుగులో భారీ దందాకు తెరతీశారీ ప్రజాప్రతినిధి. సేవా కార్యక్రమాల పేరిట నియోజకవర్గంలోని కొందరు బడా వ్యాపారులు, దుకాణదారులు, ఇతర సంస్థలు, పారిశ్రామికవేత్తలు, ప్రవాసాంధ్రుల నుంచి భారీగా విరాళాలు వసూలు చేశారు. కానీ, ఆ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించకుండా మిగుల్చుకున్నారనేది ఆరోపణ. అంతేకాకుండా కొన్ని ప్రైవేటు ఆసుపత్రులతో ఒప్పందాలు చేసుకొని.. వాటి అక్రమాలు బయటకు తెలియకుండా యంత్రాంగాన్ని కట్టడి చేశారు. అలా ఒక్కో ఆసుపత్రి నుంచి రూ.లక్షల్లో వసూలు చేశారు.
వంతెనను మళ్లించి.. భూముల ధర పెంచి..
ఈ నియోజకవర్గంలో రెండు జిల్లాలను కలిపే గోదావరిపై ఒక కీలక వంతెన, రహదారి విషయంలో చాలా తెలివిగా వ్యవహరించారీ ప్రజాప్రతినిధి. అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి మార్గాన్ని ఎసైన్డు, డీ పట్టా, జిరాయితీ భూముల మీదుగా మళ్లించారు. అంతకుముందే చాలా తక్కువ మొత్తానికి ఆ భూములను తన బినామీల పేరిట ఆయన సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత జిల్లా యంత్రాంగంపై ఒత్తిడి చేసి ఆ భూములను రెగ్యులర్ చేయించుకున్నారు. కొన్ని ప్రైవేటు భూములనూ అనుచరుల సాయంతో కొనుగోలు చేయించారు. అలా మొత్తంగా దాదాపు 150 ఎకరాలకు పైగా దక్కించుకున్నారు. వంతెన వస్తుండటంతో ఆ భూముల ధరలు పెరిగి పెద్ద ఎత్తున లబ్ధి పొందారు.
ఇల్లు కట్టాలంటే.. డబ్బు కొట్టాలి
నరసాపురంలో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వ నిబంధనలన్నీ పాటించినా ఈ ప్రజాప్రతినిధి దందాకు తలొగ్గాల్సిందే. లేదంటే ఇల్లు స్లాబు దశకు వచ్చే వరకు చూసి.. సరిగ్గా స్లాబు వేసే రోజు అధికారులను పంపి అడ్డుకుంటారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. ఏదో ఒక కారణం చూపి కూల్చేస్తామని భయపెడతారు. ‘ఆయనను కలవండి.. ప్రసాదం సమర్పించుకోండి’ అంటూ ఉచిత సలహా ఇస్తారు. చిన్న ఇల్లయితే రూ.లక్ష, అపార్టుమెంట్ అయితే రూ.5 లక్షల వరకు ఇచ్చుకోవాల్సిందే. ఈ పట్టణంలో జరిగే అభివృద్ధి పనులు సైతం ఆ నేతకు చెందిన బినామీ గుత్తేదారులే చేస్తారు. పట్టణాన్ని ఆనుకొని గోదావరి తీరంలో ఉన్న ఏటిగట్టు వరదలకు జారిపోయే ప్రమాదం ఏర్పడింది. దాన్ని బలోపేతం చేసేందుకు దాదాపు రూ.26 కోట్ల అంచనా విలువతో పనులు మంజూరయ్యాయి. ఆ పనులు చేశాక.. కరకట్ట ఇంతవరకు అయిదు సార్లు జారిపోయిందంటే నాణ్యతను అంచనా వేయవచ్చు. ఉభయగోదావరి జిల్లాల మధ్య ఇక్కడ గోదావరి నదిపై పంటు ఉంటుంది. నిత్యం వందలాది మంది ఈ పంటుపై రాకపోకలు సాగిస్తుంటారు. సాధారణంగా మండల పరిషత్తు ఆధ్వర్యంలో ఈ పంటుకు వేలం పాట నిర్వహిస్తారు. పాట లేని రోజుల్లో మండల పరిషత్తు ఆధ్వర్యంలోనే నిర్వహించి ఆ సొమ్ము ప్రభుత్వానికి చెల్లిస్తారు. గత అయిదేళ్లలో దాదాపు ఏడాది పాటు పంటును వేలం లేకుండా నిర్వహించిన రోజులున్నాయి. ఆ సమయంలో రాబడిలో కొంత వాటాను ఈ ప్రజాప్రతినిధి స్వాహా చేశారని చెబుతుంటారు.
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దళిత యువకుడికి పోలీసుల చిత్రహింసలు.. డిగ్రీ పరీక్షలు రాయకుండా నిర్బంధం
‘పోలీసులు నన్ను అక్రమంగా నిర్బంధించి తీవ్రంగా హింసించారు. డిగ్రీ పరీక్షలు రాయనివ్వకుండా నా భవిష్యత్తును నాశనం చేశారు’ అని దళిత విద్యార్థి శశాంక్ వాపోయారు. -
గులకరాయి ఘటనను ఎన్నికల్లో లబ్ధికి వినియోగించుకోకుండా అడ్డుకోండి
గులకరాయి ఘటనను ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం సీఎం జగన్ సహా వైకాపా నేతలు వాడుకుంటున్నారనీ, దీనిని నిలువరించాలని కోరుతూ విజయవాడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు నమోదవుతోంది. వడగాలులు సైతం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో తలెత్తిన ఒక భూవివాదంలో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు బొత్స సందీప్ పేరు తెరపైకి వచ్చింది. -
మీ భూమి మీది కాదు
ఆ ఆస్తి మాదే... రికార్డుల్లో మా పేరే ఉంది, మాకేం భయం... అనుకుంటే పొరపాటే. రాత్రికి రాత్రే రికార్డులు మారిపోవచ్చు. -
పింఛను కుట్ర.. తీస్తోంది ప్రాణం
సీఎం గారూ.. పండుటాకులు ఎంత ఘోష అనుభవిస్తున్నారో కనిపిస్తోందా? అభాగ్యులు పడే వేదన వినిపిస్తోందా? పదవిలో ఉండి ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయకుండా వికృత రాజకీయ క్రీడ నడుపుతూ పింఛనుదారులపై ఇంత కిరాతకంగా వ్యవహరిస్తారా? -
సీఈఓ మౌనం.. వైకాపాకు లాభం!
ఫుట్బాల్ క్రీడలో రిఫరీలా.. ఎన్నికల ప్రక్రియలో నియమ నిబంధనలు అమలు చేసే పాత్ర పోషిస్తూ తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఎన్నికల సంఘం ఆ బాధ్యతల నిర్వహణలో విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. -
జగన్ వంచనకు ఏడు ప్రాణాలు బలి
పింఛన్ల రాజకీయ క్రీడ ఏడుగురిని బలి తీసుకుంది. ప్రభుత్వ నిరంకుశ వైఖరి, పంపిణీలో నిర్లక్ష్యంతోపాటు ముఖ్యమంత్రి జగన్, ఉన్నతాధికారుల వైఫల్యం పేద కుటుంబాలకు పెద్దదిక్కును దూరం చేస్తున్నాయి. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
ఇటీవల కన్నుమూసిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
వైద్య కళాశాలల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి ఆహ్వానం
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. -
సీఎం జగన్ను ఓడించడమే మా లక్ష్యం
ఈ ఎన్నికల్లో సీఎం జగన్ను ఓడించడమే 35మాదిగ సంఘాల ఐక్యవేదిక లక్ష్యమని.. ఆ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు అన్నారు. -
యువత పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోంది
‘ఓటేసే ముందు మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి.. ఎవరు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారో.. వారినే ముఖ్యమంత్రిగా చేయండి’ అని సౌదీ అరేబియాలోని ఆరామ్కో సంస్థతో కలిసి ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ నిర్వహిస్తున్న రావి రాధాకృష్ణ ఓటర్లకు పిలుపునిచ్చారు. -
పేదల ఇళ్లపై దా‘గూడు’ మూతలు!
ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన్నాటి నుంచి... అభివృద్ధి మరచి తెదేపాపై అక్కసుతో వ్యవహరించిన జగన్... పేదలకిచ్చే ఇళ్లలోనూ ఆ అవలక్షణాన్నే ప్రదర్శించారు. -
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
సీఎం జగన్ను ఓటమి భయం పట్టుకుందా? కొన్ని నెలల క్రితం ‘వైనాట్.. 175’ అంటూ ధీమా ప్రదర్శించిన ఆయనలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందా? ఎందుకీ ఎదురుగాలి.. అని మదన పడుతున్నారా? -
వేసవిలో భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు
వేసవి సెలవుల్లో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. -
‘ఉత్తర్వుల ఎత్తివేత’పై త్వరగా విచారించండి
మాజీ మంత్రి వివేకా హత్య విషయంలో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై వ్యాఖ్యలు చేయెద్దంటూ వెలువరించిన ఉత్తర్వులను ఎత్తివేయాలని (స్టే వెకేట్) కోరుతూ మృతుడి కుమార్తె నర్రెడ్డి సునీత, పీసీసీ అధ్యక్షురాలు, కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి (బీటెక్ రవి)లు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై త్వరగా విచారణ చేసి, ఈ నెల 8లోపు నిర్ణయం వెల్లడించాలని కడప జిల్లా న్యాయస్థానాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పింఛన్ పెంచలే.. కానుకకు కరుణించలే!
ముఖ్యమంత్రి జగన్ తన ఐదేళ్ల పాలనాకాలంలో దివ్యాంగులపై ఎనలేని వివక్ష చూపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం దివ్యాంగ పింఛనుదారులు 8.07 లక్షల మంది ఉన్నారు. -
అవినాష్రెడ్డి ముందస్తు బెయిలు రద్దుకు నిరాకరణ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి బెయిలును రద్దు చేయడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి గడువు పొడిగించాలి
పోలింగ్ ముందు రోజు వరకు పోస్టల్ బ్యాలట్ వినియోగానికి అనుమతించాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్, ఏపీ ఉపాధ్యాయ సంఘం వేర్వేరు ప్రకటనల్లో ఎన్నికల సంఘాన్ని కోరాయి. -
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
సీఎం జగన్ ఎక్కడ సిద్ధం సభలు నిర్వహించినా... అక్కడ విధ్వంసం పరిపాటిగా మారింది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో శుక్రవారం సిద్ధం సభ జరిగింది. -
‘అ’భివృద్ధి ‘నిల్’.. అవినీతి ఫుల్!
ఆయనో యువ ప్రజాప్రతినిధి.. బెట్టింగ్ అనగానే టక్కున గుర్తుకొస్తారు. జిల్లాలోని సహజ వనరులను సొంతవాటిలా భావించారు.. ఈ ఐదేళ్లలో యథేచ్ఛగా కొల్లగొట్టేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అఫ్గాన్ దౌత్యవేత్త బంగారం స్మగ్లింగ్.. కేసు నమోదు
-
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం