Andhra Pradesh Assembly Elections: తాడిపత్రిలో డీఎస్పీ చైతన్య దమనకాండ
అనంతపురం జిల్లా తాడిపత్రిలో డీఎస్పీ వీఎన్కే చైతన్య తెదేపా నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడ్డారు. తెదేపా నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి గృహాన్ని బుధవారం తెల్లవారు జామున ప్రత్యేక బలగాలతో ముట్టడించి వీరంగం సృష్టించారు.
తెల్లవారుజామున జేసీ ప్రభాకర్రెడ్డి ఇంటిపై ప్రత్యేక బలగాలతో దాడి
సీసీ కెమెరాలు పగలగొట్టి.. తెదేపా కార్యకర్తలు, సిబ్బందిపై దాష్టీకం
ఎస్సీ వర్గానికి చెందిన దివ్యాంగుడు కిరణ్ తలపై బలంగా కొట్టిన డీఎస్పీ
కిరణ్ పరిస్థితి విషమం..
జేసీ ఇంటి చుట్టుపక్కల ఉంటున్న తెదేపా వర్గీయుల గృహాలపైనా దాడులు
పలువురికి గాయాలు
తాడిపత్రి, న్యూస్టుడే: అనంతపురం జిల్లా తాడిపత్రిలో డీఎస్పీ వీఎన్కే చైతన్య తెదేపా నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడ్డారు. తెదేపా నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి గృహాన్ని బుధవారం తెల్లవారు జామున ప్రత్యేక బలగాలతో ముట్టడించి వీరంగం సృష్టించారు. జేసీ ఇంటితో పాటు ఆ చుట్టుపక్కల ఇళ్లల్లో నిద్రిస్తున్న తెదేపా సానుభూతిపరుల ఇళ్లపై సైతం విరుచుకుపడ్డారు. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో హఠాత్తుగా దాడి చేసి చితకబాదారు. వారు పనివాళ్లా, సిబ్బందా, తెదేపా వర్గీయులా అన్న తేడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టారు. వారిని బలవంతంగా వ్యాన్లోకి ఎక్కించి తరలించారు.
ఈ క్రమంలో జేసీ ప్రభాకర్రెడ్డి నివాసానికి సమీపంలోనే ఉంటున్న కిరణ్ అనే ఎస్సీ వర్గానికి చెందిన దివ్యాంగుడి తలపై డీఎస్పీ చైతన్య లాఠీతో బలంగా కొట్టడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. కిరణ్ పరిస్థితి విషమంగా మారడంతో ఆస్పత్రికి తరలించారు. వీఎన్కే చైతన్య ప్రస్తుతం కడప జిల్లా రాజంపేటలో పని చేస్తున్నారు. గతంలో తాడిపత్రి డీఎస్పీగా పని చేసినప్పుడు వైకాపాకు కొమ్ముకాస్తూ.. తెదేపా నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి, అరెస్ట్లు చేసి తీవ్రస్థాయిలో అణచివేతకు పాల్పడ్డారు. తాడిపత్రిలో రెండు రోజులుగా వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి వర్గాల మధ్య జరుగుతున్న దాడుల నేపథ్యంలో.. బందోబస్తు మిషతో చైతన్యను మంగళవారం రాత్రి ఇక్కడికి తీసుకొచ్చారు. అర్ధరాత్రి దాటాక సుమారు 2 గంటలకు ప్రత్యేక బలగాలతో జేసీ ప్రభాకర్రెడ్డి ఇంటిపై విరుచుకుపడ్డారు. అక్కడికి వస్తూనే.. వారి దమనకాండకు సాక్ష్యాల్లేకుండా ఉండేందుకు సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. కొన్నింటిపై వస్త్రాలు కప్పేశారు. అనంతరం జేసీ నివాసంలో హాల్లో పడుకున్న కార్యకర్తలు, పరిసరాల్లో ఉన్న ఇళ్లల్లో నిద్రపోతున్న తెదేపా వర్గీయులు, జేసీ వద్ద డ్రైవర్లుగా పని చేస్తున్న వారిని బయటకు లాక్కుని వచ్చి చితకబాదారు. ఈ ఘటనలో దివ్యాంగుడైన కంప్యూటర్ ఆపరేటర్ కిరణ్, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కిరణ్ పరిస్థితి విషమంగా మారడంతో ఆసుపత్రికి తరలించారు.
దివ్యాంగుడినని చెప్పినా వినిపించుకోలేదు
‘‘తాడిపత్రిలో రెండు రోజులుగా పెద్దారెడ్డి వర్గీయులు దాడులు చేస్తున్నారు. వాటితో నాకు సంబంధం లేదు. రాత్రి రెండు గంటల సమయంలో ఇంటిలో నిద్రిస్తున్న నా దగ్గరకు స్పెషల్ పార్టీ పోలీసులు వచ్చి డీఎస్పీ చైతన్య పిలుస్తున్నారని చెప్పారు. వాహనంలో ఎక్కగానే డీఎస్పీ చైతన్య నా తలపై గట్టిగా లాఠీతో కొట్టారు. నన్ను ఎందుకు కొడుతున్నారు..? నేను దివ్యాంగుడినని మొర పెట్టుకున్నా వినకుండా చావబాదారు. తలకు గాయమై రక్తస్రావం అవుతున్నా బలవంతంగా అక్కడే ఉంచారు. సీఐ చూసి రక్తం ఎక్కువగా పోతోందని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు అనంతపురం ఆసుపత్రికి తీసుకొచ్చారు. డీఎస్పీ చైతన్య గతంలో తాడిపత్రిలో పని చేస్తున్న సమయంలో మాపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేసేవారు. ఇప్పుడు మళ్లీ అదే రీతిలో దాడి చేశారు.’’
కిరణ్, జేసీ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్
జేసీ ప్రభాకర్రెడ్డికి అస్వస్థత
తాడిపత్రిలో మంగళవారం తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య జరిగిన రాళ్ల దాడి ఘటనను అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో జేసీ ప్రభాకర్రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు తమ ఇంట్లో పనిచేసే వారిని కూడా అరెస్టు చేసి తీసుకెళ్లడం అన్యాయమని అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి పేర్కొన్నారు. ఆయన బుధవారం పట్టణ పోలీస్ స్టేషన్కు వెళ్లి డీఎస్పీ గంగయ్యతో మాట్లాడారు.
తెదేపా, వైకాపా నాయకులు, కార్యకర్తలపై కేసులు
తాడిపత్రిలో రెండు రోజుల నుంచి జరుగుతున్న రాళ్ల దాడులు, ఏజెంట్లపై దాడి సంఘటనల్లో తెదేపా, వైకాపా నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేశామని పట్టణ సీఐ మురళీకృష్ణ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.