ఎన్నికల హింస ఘటనలపై ‘సిట్’ ఏర్పాటు
రాష్ట్రంలో ఎన్నికలకు ముందు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు ప్రత్యేక విచారణ బృందం(సిట్) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర డీజీపీ హరీష్కుమార్ గుప్తా శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.
13 మంది పోలీసు అధికారులతో బృందం
విధి విధానాలను నిర్దేశిస్తూ డీజీపీ ఆదేశాలు
కేంద్ర ఎన్నికల సంఘానికి రెండు రోజుల్లో నివేదిక
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికలకు ముందు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు ప్రత్యేక విచారణ బృందం(సిట్) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర డీజీపీ హరీష్కుమార్ గుప్తా శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 13 మంది సభ్యులతో ప్రత్యేక బృందాన్ని నియమించారు. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారించి నివేదిక ఇవ్వాలని డీజీపీ ఆదేశించారు. సంబంధిత నివేదికను రెండురోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తామని తెలిపారు.
సిట్ బృందంలో సభ్యులుగా..
- రమాదేవి, ఏసీబీ ఎస్పీ
- సౌమ్యలత, ఏసీబీ అదనపు ఎస్పీ
- రమణమూర్తి, శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ
- పి.శ్రీనివాసులు, సీఐడీ డీఎస్పీ
- వల్లూరి శ్రీనివాసరావు, ఒంగోలు ఏసీబీ డీఎస్పీ
- రవి మనోహరచారి, తిరుపతి ఏసీబీ డీఎస్పీ
- వి.భూషణం, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (గుంటూరు రేంజ్)
- కె.వెంకటరావు, ఇన్స్పెక్టర్(ఇంటెలిజెన్స్), విశాఖపట్నం
- రామకృష్ణ, ఏసీబీ ఇన్స్పెక్టర్
- జీఐ శ్రీనివాస్, ఏసీబీ ఇన్స్పెక్టర్
- మోయిన్, ఇన్స్పెక్టర్, ఒంగోలు పీటీసీ
- ఎన్.ప్రభాకర్, ఇన్స్పెక్టర్, అనంతపురం ఏసీబీ
- శివప్రసాద్, ఇన్స్పెక్టర్, ఏసీబీ
సిట్కు పూర్తి అధికారాలు..
- ప్రధాన ఘటనలకు సంబంధించిన దర్యాప్తును సిట్ సమీక్షిస్తుంది. పోలింగ్ రోజు, ఆ తర్వాత శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో జరిగిన ఘటనలపై సిట్ ప్రత్యేక దృష్టి సారిస్తుంది.
- కేసు విచారణ సంబంధిత ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్(ఐవో) నిర్వహించినా.. దర్యాప్తు తీరును సిట్ పర్యవేక్షిస్తుంది.
- అదనపు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడానికి ఉన్న అవకాశాలను గుర్తించి ఐవోకు సిఫార్సు చేస్తుంది. అవసరమైతే ప్రతి కేసులోనూ జోక్యం చేసుకుంటుంది.
- ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్లో మార్పులు చేసి, కొత్తగా ఎఫ్ఐఆర్ చేసేలా సిఫార్సు చేస్తుంది. విచారణకు సంబంధించి ఇంకా అవసరమైన చర్యలపై నిర్ణయం తీసుకుంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
3వ రోజుకు చేరిన భారతి సిమెంటు ఉద్యోగుల ఆందోళన
తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ.. వైఎస్సాఆర్ జిల్లా కమలాపురం మండలం నల్లింగాయపల్లెలోని భారతి సిమెంటు పరిశ్రమ వద్ద ఉద్యోగులు చేపట్టిన ఆందోళన శనివారం మూడో రోజుకు చేరింది. -
సంక్షిప్త వార్తలు
విదేశీ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్కు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైకాపా నేతలు స్వాగతం పలికారు. -
ఎన్నికల విధుల నుంచి కారంపూడి సీఐ తొలగింపు
పల్నాడు జిల్లా కారంపూడి సీఐ నారాయణస్వామిని ఎన్నికల విధుల నుంచి తొలగించారు. -
ఇదీ సంగతి!
-
ఉద్యోగులను తీవ్రవాదుల్లా చూడటం తగదు
హక్కుల కోసం పోరాడే ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రవాదుల్లా చూడటం తగదని ఉద్యోగ, ఉపాధ్యాయ, సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర ఛైర్మన్ కె.సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు
శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 20 గంటలు పడుతోంది. శనివారం సాయంత్రానికి క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. -
అంజన్నకు లక్ష అరటిపండ్ల అలంకరణ
వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణం రెండో బైపాస్ రోడ్డులో ఉన్న అభయాంజనేయస్వామి దేవాలయంలో 27 అడుగుల విగ్రహానికి శనివారం లక్ష అరటి పండ్లతో అలంకరణ చేశారు. -
గులకరాయి కేసులో నిందితుడి పూచీకత్తులకు కోర్టు ఆమోదం
గులకరాయి కేసులో నిందితుడు సతీష్ బెయిల్పై విడుదలయ్యేందుకు సమర్పించిన పూచీకత్తులను కోర్టు ఆమోదించింది. -
బోర్డింగ్ పాస్ తీసుకున్నాక విమానం రద్దు
తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో తరచూ విమాన సర్వీసులు రద్దు అవుతుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
అల్యూమినియం పరిశ్రమలో.. 35 మంది కార్మికులకు అస్వస్థత
తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం రాజులపాళెం సమీపంలోని సీఎంఆర్ ఎకో అల్యూమినియం పరిశ్రమలో శనివారం విషవాయువు వెలువడి 35 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. -
ఎండ తీవ్రతకు 4 బస్సులు దగ్ధం
ఒడిశాలోని రాయగడ జిల్లా బిసంకటక్లో శనివారం ఎండ తీవ్రతకు నాలుగు బస్సులు దగ్ధమైనట్లు అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. -
రాష్ట్రంలో వడదెబ్బకు ఐదుగురి మృతి
వడదెబ్బకు గురై ప్రకాశం జిల్లాలో శనివారం ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. -
మరో రెండ్రోజుల్లో రాష్ట్రానికి ‘నైరుతి’
రాబోయే 2 లేదా 3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. -
నేటి నుంచి టోల్ మోత.. అర్ధరాత్రి నుంచి పెరగనున్న ఛార్జీలు
ఎన్హెచ్ఏఐ టోల్ప్లాజాల వద్ద టోల్ రుసుములు జూన్ 3 (ఆదివారం అర్ధరాత్రి) నుంచి పెరగనున్నాయి. -
సముద్ర తీరంలో బంగారం వేట
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలోని సాగర తీరానికి బంగారు రేణువులు కొట్టుకొస్తున్నాయని స్థానికులు వాటి వేటలో పడ్డారు. -
అతిసారానికి మరో ఇద్దరి బలి
విజయవాడలో అతిసారం మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కలుషిత జలాలు తాగడం వల్ల ఇప్పటికే నగరంలో ఎనిమిది మంది చనిపోగా.. తాజాగా శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం ఇద్దరు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. -
పాముకాటుకు, ముల్లుకు తేడా తెలీదా డాక్టరూ!
అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారి వైద్యుల నిర్లక్ష్యం వల్ల తమకు దూరమయ్యాడని బాధిత తల్లిదండ్రులు ఫ్లెక్సీతో వినూత్నంగా నిరసన తెలిపారు. -
డోలాయమానంలో 7 కొత్త వైద్య కళాశాలల ప్రారంభం
వైకాపా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో 2025-26 సంవత్సరంలో కొత్తగా ఏర్పాటు కావాల్సిన 7 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో తరగతుల ప్రారంభంపై సందేహాలు ముసురుకున్నాయి. -
అన్న పానీయాల్లో నాణ్యత ‘గోవిందా గోవింద!’
కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరుని నిలయం తిరుమల. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకునిగా లక్షలమంది భక్తుల పూజలందుకునే స్వామి కొలువైన ఈ పుణ్యక్షేత్రం నిత్యకల్యాణం, పచ్చతోరణం. దేశ, విదేశాల్లోని హిందూ భక్తులు నిత్యం వేలల్లో తిరుమల సందర్శించి మొక్కులు తీర్చుకుంటారు. -
భోగాపురంలో ‘భూ’చాళ్లు!
భోగాపురం మండలం బసవపాలెంలో ఓ రైతుకు 1.30 ఎకరాల డి-పట్టా భూమి ఉంది. ఓ వ్యక్తి ఈ భూమి కొనడానికి ఈయనతో రూ. 12 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. -
‘జల’దరిస్తున్న విజయవాడ
కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ బంగ్లాలకు శుద్ధి చేసిన, స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తుంటారు. నీటిలోనూ నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటిస్తారు.