శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో ఐకానిక్ తీగల వంతెన
రాష్ట్రంలో మరో తీగల వంతెన నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఏపీ-తెలంగాణ మధ్య నంద్యాల-ఆత్మకూరు-కొల్లాపూర్-నాగర్కర్నూల్-కల్వకుర్తి మార్గంలో సోమశిల వద్ద కృష్ణా నదిపై తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టగా.. అలాంటిదే మరో వంతెనకు ప్రతిపాదిస్తోంది.
జాతీయ రహదారి విస్తరణలో భాగంగా నిర్మాణం
దోర్నాల-శ్రీశైలం మార్గంలో మలుపులు తగ్గించేలా కసరత్తు
డీపీఆర్ సిద్ధం చేయిస్తున్న కేంద్రం
శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో ప్రస్తుతం ఉన్న వంతెన
ఈనాడు: అమరావతి : రాష్ట్రంలో మరో తీగల వంతెన నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఏపీ-తెలంగాణ మధ్య నంద్యాల-ఆత్మకూరు-కొల్లాపూర్-నాగర్కర్నూల్-కల్వకుర్తి మార్గంలో సోమశిల వద్ద కృష్ణా నదిపై తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టగా.. అలాంటిదే మరో వంతెనకు ప్రతిపాదిస్తోంది. అది కూడా ఏపీ-తెలంగాణ సరిహద్దులోని కృష్ణా నదిపైనే నిర్మించనుంది. శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్వేకి సమాంతరంగా ప్రస్తుతం ఉన్న పాత వంతెన స్థానంలో, దానికి సమీపంలో కొత్తగా తీగల వంతెన నిర్మించేందుకు కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధమవుతోంది. గుంటూరు-కర్నూలు రోడ్డులో ఉన్న కుంట జంక్షన్ నుంచి దోర్నాల, శ్రీశైలం క్రాస్రోడ్, సున్నిపెంట, దోమలపెంట మీదగా హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారి-765ని విస్తరిస్తోంది. నల్లమల అటవీ ప్రాంతం పరిధిలో ఈ రహదారి అనేక చోట్ల 5.5 మీటర్ల నుంచి 7 మీటర్ల మేరకే ఉంది. దీనిని 10 మీటర్లకు పెంచుతోంది. ఇప్పటికే కుంట-దోర్నాల మధ్య 24.2 కి.మీ. మేర రూ.245 కోట్లతో విస్తరణ పనులు జరుగుతున్నాయి. దోర్నాల నుంచి శ్రీశైలం క్రాస్రోడ్ (శ్రీశైలం ముఖద్వారం), సున్నిపెంట మీదగా కృష్ణానదిపై వంతెన దాటే వరకు 53.5 కి.మీ. మేర విస్తరించేలా డీపీఆర్ను కేంద్రం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం కృష్ణా నదిపై ఉన్న వంతెన 1972లో నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చింది. దీనికి సమీపంలో ఐకానిక్ తీగల వంతెన నిర్మించనుంది. ఈ వంతెనకే రూ.వెయ్యి కోట్ల వరకు వ్యయమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మలుపుల్లేకుండా నేరుగా వంతెనపైకి..
దోర్నాల-శ్రీశైలం ప్యాకేజీలో అనేక మలుపులు ఉన్నాయి. వీటిని సాధ్యమైనంత తగ్గించేలా కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (మోర్త్) చూస్తోంది. శ్రీశైలం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే మార్గంలో సున్నిపెంట దాటాక ఉండే ఘాట్లో అనేక మలుపులు తిరిగి కృష్ణా నదిపై వంతెన వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. వీటిని తగ్గించేందుకు సున్నిపెంట వద్ద బైపాస్ నిర్మించి, నేరుగా కొత్తగా నిర్మించే తీగల వంతెనపైకి చేరుకునేలా చూడనుంది. దోర్నాల-శ్రీశైలం మధ్యలో పలు చోట్ల ప్రస్తుతమున్న మలుపులను తగ్గించేలా అలైన్మెంట్లో మార్పులు చేయనుంది.
వన్యప్రాణి విభాగం అభ్యంతరాలు
ఈ ప్యాకేజీలో అలైన్మెంట్ మార్పులతో అనేక చోట్ల రక్షిత అటవీ ప్రాంతంలోకి రహదారి వెళ్తుంది. దీనివల్ల వన్యప్రాణులకు ఇబ్బంది కలుగుతుందని అటవీశాఖలోని వన్యప్రాణి సంరక్షణ విభాగం అభ్యంతరాలు వ్యక్తంచేస్తోంది. ఎక్కువ అటవీ భూమి తీసుకోకుండా, ప్రస్తుతమున్న రహదారినే విస్తరించేలా చూడాలని సూచిస్తోంది. కేంద్రం మాత్రం.. ఈ మార్గంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటం, శ్రీశైలానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని అలైన్మెంట్ను మార్చాలనుకుంటోందని అధికారులు చెబుతున్నారు. టీపీఎఫ్ కన్సల్టెంట్స్ అనే సంస్థ ద్వారా ఈ ప్యాకేజీకి సంబంధించిన డీపీఆర్ను సిద్ధం చేయిస్తోంది. ఇది తయారైతే వచ్చే ఏడాదిలోపు పనులు మంజూరయ్యే వీలుందని తెలిసింది. ఈ ప్యాకేజీని తెలంగాణ మోర్త్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జలగన్నలు జారిపోతున్నారు!
కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై తీసుకొచ్చి.. అర్హత లేకపోయినా జగన్ ప్రభుత్వం అందలం ఎక్కించిన అధికారుల్లో చాలామంది నెమ్మదిగా జారుకునే ప్రయత్నం చేస్తున్నారు. -
వైకాపా సోషల్ మీడియాలో ఉద్యోగం.. నైపుణ్యాభివృద్ధి సంస్థ నుంచి జీతాలు
ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ)లో వైకాపా ప్రభుత్వం సాగించిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. -
ఆకాంక్షల అమరావతి
రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, సర్వతోముఖాభివృద్ధికి రాజధాని అనేది నిలువుటద్దం. అలాంటి కీలకమైన రాజధానిని వైకాపా సర్కారు అన్ని విధాలా నాశనం చేసింది. -
ఐదేళ్ల అగచాట్లకు చెల్లు
సీఎం ఇంటి పక్క నివాసమంటే గర్వపడాలి. కానీ మాకు రోజూ వేధింపులే! సీఎం భద్రత కోసమే అయితే.. ఆయన వచ్చీవెళ్లే టైంలో ఆ మార్గంలో ట్రాఫిక్ ఆపేయొచ్చు. -
ఈ నష్టానికి బాధ్యులెవరు?
‘పోలవరంలో ఇంత నష్టం జరగడానికి ఎవరు బాధ్యులు?’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ప్రశ్నించారు. -
ఏపీ శాసనసభ స్పీకర్గా అయ్యన్నపాత్రుడు
శాసనసభ సమావేశాలు ఈ నెల 24న ప్రారంభం కానున్నాయి. ఇవి మూడు రోజులపాటు జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా సభ్యుల ప్రమాణస్వీకారం, సభాపతి, ఉపసభాపతి ఎన్నిక జరుగుతుంది. -
నేనూ ఓ కార్మికుడిగా పనిచేస్తా
ఎన్డీయే ప్రభుత్వంలో తానూ ఓ కార్మికుడిగా పని చేస్తానని ఆ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. -
గనుల శాఖ పర్మిట్ల జారీ నిలిపివేత
రాష్ట్రవ్యాప్తంగా గనుల శాఖకు చెందిన ఆన్లైన్ పర్మిట్ల జారీ ప్రక్రియను నిలిపివేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆదివారం రాత్రి నుంచి సర్వర్ను డౌన్ చేశారు. -
ప్రైవేటు సెక్యూరిటీని నియమించుకున్న జగన్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన భద్రత కోసం ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒక ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా నియమించుకున్న సుమారు 30 మంది సిబ్బంది సోమవారం తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. -
వళవన్.. వైకాపాకు తలాడించెన్!
ఆయన గతేడాది ప్రత్యేక ప్రధానకార్యదర్శి హోదాలో పదవీవిరమణ చేశారు. కానీ జగన్ ప్రభుత్వం మరో ఏడాది సర్వీసు పొడిగించి.. దేవాదాయశాఖలో పోస్టింగ్ ఇచ్చింది. -
ఇటు ఎండ.. అటు వానలు
నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకి 15 రోజులు దాటినా.. పలు ప్రాంతాల్లో వేడి, ఉక్కపోతలు కొనసాగుతున్నాయి. సోమవారం తుని, నరసాపురం, ఉత్తరాంధ్రలో పలు చోట్ల వడగాలులు వీచాయి. -
ఎస్టీ ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంల నియామకం
గిరిజన ప్రాంతాల్లోని 543 ఆశ్రమ పాఠశాలలు, పోస్ట్మెట్రిక్ వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణకు కొత్తగా ఏఎన్ఎంలను నియమించనున్నట్లు గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రకటించారు. -
గంజాయి నియంత్రణకు ప్రత్యేక టాస్క్ఫోర్స్
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో గంజాయి రవాణా కట్టడికి ప్రత్యేకంగా టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు హోం మంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. -
కూటమి విజయంపై అమెరికాలో సంబరాలు
ఏపీలో తెదేపా, జనసేన, భాజపా కూటమి అఖండ విజయం సాధించడం, సీఎంగా చంద్రబాబు...పలువురు మంత్రులు బాధ్యతలు స్వీకరించడంపై అమెరికాలోని ప్రవాసాంధ్రులు వేడుకలు చేసుకున్నారు. -
గనుల శాఖకు మస్కా కొట్టారు!
గనుల శాఖ సాఫ్ట్వేర్ను కొందరు ‘ఘనులు’ ట్యాంపరింగ్ చేశారు. పర్మిట్లు పరిమితంగా తీసుకున్నా.. సాఫ్ట్వేర్లో భారీగా ఉన్నట్టు కనిపించేలా చేశారు. -
ఒత్తిడికి భత్యం.. వృత్తిపరమైన అభివృద్ధికీ భత్యం!
ఒత్తిడి ఎదుర్కొంటున్నందుకు నెలకు గరిష్ఠంగా రూ.8 వేల భత్యం.. వృత్తిపరమైన అభివృద్ధికి నెలకు రూ.గరిష్ఠంగా రూ.3,750 భత్యం.. అధికారులు రీఫ్రెష్మెంట్కు గరిష్ఠంగా నెలకు రూ.3,750 భత్యం.. అధికారులు బ్రీఫ్కేస్ కోసం రెండేళ్లకోసారి రూ.5 వేల భత్యం.. ఇదేమిటి చిత్రవిచిత్రమైన భత్యాలు ఉన్నాయని అనుకుంటున్నారా? ఆర్టీసీలో అంతే. -
రైలు ప్రమాద క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి : పవన్కల్యాణ్
పశ్చిమబెంగాల్లో చోటుచేసుకున్న రైలు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. -
పెద్దపులిని ఢీకొన్న కారు!
వేగంగా ప్రయాణిస్తున్న కారు.. రోడ్డు దాటుతున్న పెద్దపులిని ఢీకొట్టిన ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. -
ఒక్కో కమోడ్ ఖర్చుతో ఆరుగురు పేదలకు ఇళ్లు!
విశాఖలోని రుషికొండపై జగన్ కట్టుకున్న ప్యాలెస్లో అమర్చిన టాయ్లెట్ కమోడ్కి పెట్టిన ఖర్చుతో కనీసం ఆరుగురు పేదలకు ఇళ్లు కట్టొచ్చు! -
వడివడిగా పర్యటన.. సమస్యలపైనే చర్చ
ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి పోలవరం పర్యటనకు వచ్చిన చంద్రబాబు.. ప్రాజెక్టులోని స్పిల్వే, కాఫర్ డ్యాంలు, ప్రధాన డ్యాం ప్రాంతం, డయాఫ్రం వాల్, విద్యుత్కేంద్రం పనులను పరిశీలించారు. -
గొప్ప దార్శనికుడు.. రామోజీరావు
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణంతో భారత చలనచిత్ర రంగానికి రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు పెద్ద వరం అందించారని సినీ గాయకుడు, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జైలు జీవితం కోసం జగన్ ఎదురుచూడటమే తరువాయి: కేశినేని చిన్ని
-
‘సూపర్-8’లో మా వ్యూహం ఇదే: రవీంద్ర జడేజా
-
‘నాన్నా.. ఒక్కసారి రావా’: 9 నెలల క్రితమే అమరుడైన తండ్రి కోసం చిన్నారి వాయిస్ మెసేజ్లు
-
ఎన్నికల ప్రక్రియపై జగన్ పోస్టు.. తెదేపా స్ట్రాంగ్ కౌంటర్!
-
వాటిని నమ్మొద్దు.. జాన్వీ సోషల్ మీడియా ఖాతాలపై టీమ్ క్లారిటీ
-
విజయవాడలో పవన్ కల్యాణ్కు ఘన స్వాగతం