ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిశాయి. శ్రీసత్యసాయి, బాపట్ల, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓమోస్తరు వర్షాలు కురిశాయి.

Updated : 18 May 2024 04:25 IST

ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిశాయి. శ్రీసత్యసాయి, బాపట్ల, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓమోస్తరు వర్షాలు కురిశాయి. రాబోయే నాలుగు రోజుల్లోనూ రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓమోస్తరు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. శనివారం అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని ప్రకటించింది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు శ్రీసత్యసాయి జిల్లా నంబులపూలకుంట మండలంలో 84 మి.మీ, బాపట్ల జిల్లా చెరుకుపల్లిలో 78, నంద్యాల జిల్లా బేతంచెర్లలో 73.5, అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో 56.5, చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో 45.5 మి.మీ వర్షం కురిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని