శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. దర్శనానికి దాదాపు 30 గంటలకుపైగా సమయం పడుతోంది.

Updated : 18 May 2024 06:29 IST

సర్వదర్శనానికి రింగ్‌రోడ్డులోని శిలాతోరణం వరకు క్యూలైన్‌లో వేచిఉన్న భక్తులు

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. దర్శనానికి దాదాపు 30 గంటలకుపైగా సమయం పడుతోంది. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా శుక్రవారం సాయంత్రానికి క్యూ లైన్లలో వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2లోని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రింగ్‌ రోడ్డులోని గోగర్భం డ్యామ్‌ కూడలి వరకూ భక్తులు లైన్‌లో వేచి ఉన్నారు. దీంతో సాయంత్రం నుంచి కొత్తగా వచ్చే భక్తులను సర్వదర్శనం క్యూలైన్‌లోకి అనుమతించలేదు.  శనివారం ఉదయం 6 గంటలకు క్యూ లైన్ల వద్దకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు తిరుమలలో మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తోంది. చలి కూడా పెరిగింది. క్యూ లైన్‌లోని భక్తులకు తితిదే తాగునీరు, అన్నప్రసాదం అందిస్తోంది. గురువారం శ్రీవారిని 76,369 మంది భక్తులు దర్శించుకున్నారు. గదుల కోసం రద్దీ కొనసాగుతోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు