విభాగాల విలీనంతో ప్రాధాన్యం కోల్పోతున్న వర్సిటీలు
చదువుల పెన్నిధిగా.. పరిశోధనలకు పట్టుగొమ్మలుగా విరాజిల్లాల్సిన విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో మొక్కుబడి విద్యా సంస్థలుగా మారుతున్నాయి.
హేతుబద్ధీకరణ పేరుతో అసంబద్ధంగా విభాగాల కలిపివేత
ఆంధ్ర వర్సిటీలో 200, ఎస్వీయూలో 150 పోస్టులు రద్దు చేసి, ఇతర వాటికి సర్దుబాటు
ఆర్ట్స్ కోర్సులకు.. మంగళం పాడిన దుస్థితి..
ఈనాడు, అమరావతి: చదువుల పెన్నిధిగా.. పరిశోధనలకు పట్టుగొమ్మలుగా విరాజిల్లాల్సిన విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో మొక్కుబడి విద్యా సంస్థలుగా మారుతున్నాయి. హేతుబద్ధీకరణ పేరుతో సాగించిన అసంబద్ధ విధానాల వల్ల చాలా కోర్సులు, విభాగాలు ప్రాధాన్యాన్ని కోల్పోయాయి. విద్యార్థుల నుంచి ఆదరణ లేదంటూ చాలా వర్సిటీల్లో కొన్ని కోర్సులను మూసివేయగా.. మరికొన్నింటిని ఇతర విభాగాల్లో విలీనం చేసేశారు. ఆర్ట్స్ విభాగంలో ఇలాంటి పరిణామాలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. కోర్సులను మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మార్పు చేయకుండా డిమాండ్ లేదంటూ మూసివేయడం లేదా విలీనం చేశారు. కొత్తగా అధ్యాపక పోస్టుల మంజూరు అవసరం లేకుండా చేసేందుకే ఈ చర్యలు చేపట్టారు. ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడకుండా ఉండాలనే ఉద్దేశంతో విభాగాల హేతుబద్ధీకరణ పేరుతో విలీన ప్రక్రియ చేపట్టారు. ఒక విభాగాన్ని మరో దాంట్లో విలీనం చేసినప్పుడు ఆ స్థాయిలోనే అధ్యాపక పోస్టులు ఇవ్వాల్సి ఉండగా.. పని భారం లేదంటూ పోస్టులకు కోత వేశారు. ప్రతి ప్రోగ్రామ్కూ విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) నిబంధనల ప్రకారం ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, నలుగురు సహాయ ప్రొఫెసర్లు ఉండాలి. ఒక్కో విభాగాన్ని ప్రత్యేకంగా ఉంచితే ఈ స్థాయిలో పోస్టులు ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో విలీనం చేశారు. ఒక విధానమంటూ లేకుండా సాగిన హేతుబద్ధీకరణతో వర్సిటీల పరిస్థితి దారుణంగా తయారైంది.
ఇష్టానుసారంగా కోర్సుల విలీనం..
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆంత్రోపాలజీ, సోషియాలజీ, సోషల్ వర్క్ విభాగాలను కలిపేశారు. ఈ మూడింటిని ఒక్క విభాగంగా నిర్ణయించారు. సైన్స్ ఇన్స్ట్రుమెంటేషన్ సెంటర్ను భౌతికశాస్త్రం విభాగంలో, ఆర్కియాలజీని చరిత్ర విభాగంలో విలీనం చేశారు. ఇలా చేయడంతోపాటు పని భారం తక్కువగా ఉందంటూ కొన్ని పోస్టులను తీసేశారు. ఇలా ఒక్క ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనే 200 అధ్యాపక పోస్టులను రద్దు చేశారు. గతంలో మంజూరు చేసిన పోస్టులను హేతుబద్ధీకరణతో పేరుతో మిగులుగా తేల్చి, ఇతర వర్సిటీలకు సర్దుబాటు చేశారు.
- శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తమిళం, సంస్కృతాన్ని దూరవిద్య విభాగంలో కలిపేశారు. సోషల్వర్క్, మానవ హక్కులను సోషియాలజీ విభాగంలో చేర్చారు. ఇలా కలిపేసి పనిభారం లేదంటూ ఈ వర్సిటీలో 150 పోస్టులను రద్దు చేశారు. వీటిని ఇతర వర్సిటీలకు సర్దుబాటు చేశారు.
- ఆచార్య నాగార్జున వర్సిటీలో పొలిటికల్ సైన్సు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ను కలిపేశారు. సోషియాలజీ, సోషల్వర్క్ను ఒకే విభాగంలోకి తీసుకొచ్చారు. బయో కెమిస్ట్రీ, బయో టెక్నాలజీలతోపాటు ఆర్థికశాస్త్రం, గ్రామీణాభివృద్ధిని విలీనం చేసేశారు. గ్రామీణాభివృద్ధి శాఖలో ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉండగా.. విభాగాలను కలిపేసి, పోస్టుల భర్తీలో గందరగోళం సృష్టించారు.
- విక్రమసింహపురిలో ఎంబీఏ, కామర్స్ విభాగాలను కలిపేశారు. మైక్రో బయాలజీ, బయోటెక్నాలజీ విభాగాలను విలీనం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలోనూ ఇదే విధానాన్ని పాటించారు. కామర్స్, మేనేజ్మెంట్ విభాగాలను విలీనం చేయగా.. ఆర్థిక శాస్త్రం, గ్రామీణాభివృద్ధి విభాగాలను కలిపేశారు.
- ద్రవిడ వర్సిటీలో ఎడ్యుకేషన్, మానవ వనరుల విభాగాలను విలీనం చేశారు. చరిత్ర, ఆర్కియాలజీ, కల్చర్ను ఒకే విభాగంగా ఏర్పాటు చేశారు. ఒక్క విభాగం ఇచ్చే పోస్టులనే కేటాయించారు. ఈ వర్సిటీలో 14 పోస్టులను మిగులుగా తేల్చి వీటిని ఇతర వర్సిటీలకు సర్దుబాటు చేశారు.
అటు.. ఇటు మార్పులతో అగాధం..
ఆంధ్ర, శ్రీవేంకటేశ్వర, ద్రవిడ, జేఎన్టీయూ కాకినాడల్లో సిబ్బందికి పని భారం లేదంటూ కొన్ని పోస్టులను రద్దు చేశారు. ఆంధ్ర వర్సిటీలో 200, శ్రీవేంకటేశ్వరలో 150, ద్రవిడలో 14, జేఎన్టీయూ కాకినాడ, జేఎన్టీయూ గురజాడల్లో ఒక్కొక్క పోస్టు చొప్పున గతంలో మంజూరు చేసిన వాటిని రద్దు చేశారు. విచిత్రమేమిటంటే గిరిజన ఇంజినీరింగ్ కళాశాలకు మంజూరు చేసిన పోస్టులను జేఎన్టీయూ గురజాడలో కలిపేశారు. కమ్యూనిటీ డెవలప్మెంట్ అధికారి పోస్టులను అన్ని వర్సిటీల్లోనూ తొలగించారు. జేఎన్టీయూ అనంతపురానికి 10, కృష్ణాకు 48, ఆచార్య నాగార్జునకు 31, ఆదికవి నన్నయకు 59, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీకి 61, రాయలసీమకు 40, శ్రీపద్మావతి మహిళకు 51, శ్రీకృష్ణదేవరాయకు 3, ఉర్దూ వర్సిటీకి 32 చొప్పున అదనంగా కేటాయించారు. ఆదికవి నన్నయకు కొత్త, పాతవి కలిపి 128 పోస్టులు ఇచ్చినా అవి ఏ మూలకూ సరిపోవు. మరిన్ని కావాలని ఆ వర్సిటీ ఎప్పటి నుంచో కోరుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!