భయపెడుతున్న ఏపీ రెవెన్యూ, ద్రవ్యలోటు
రెవెన్యూ ఖర్చుల నియంత్రణ, అప్పుల నియంత్రణపైనే రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికప్పుడు రెవెన్యూ లోటు పెరిగిపోతూ ఉంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం రెవెన్యూ లోటు లేకుండా చూడాలి.
ఎప్పటికప్పుడు అధిక రెవెన్యూ ఖర్చులు
నియంత్రణ అంతంత మాత్రమే
ఈనాడు, అమరావతి: రెవెన్యూ ఖర్చుల నియంత్రణ, అప్పుల నియంత్రణపైనే రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికప్పుడు రెవెన్యూ లోటు పెరిగిపోతూ ఉంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం రెవెన్యూ లోటు లేకుండా చూడాలి. ప్రతి బడ్జెట్లోనూ ఆర్థికమంత్రి రెవెన్యూ లోటును నియంత్రిస్తామని సభకు హామీ ఇచ్చినా అందుకు తగ్గ చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. మరోవైపు ప్రభుత్వ పథకాల ఖర్చులనే వేరేచోట పేర్కొంటూ మొత్తమ్మీద రెవెన్యూ ఖర్చులు తక్కువ చేసి చూపించి రెవెన్యూ లోటును తగ్గిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 2023-24 ఆర్థిక సంవత్సరం మార్చి నెలాఖరు వరకు ఉన్న పరిస్థితిపై కాగ్ తన లెక్కలు వెలువరించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.37,468.75 కోట్లు రెవెన్యూ లోటుగా లెక్కలు తేల్చారు. బడ్జెట్ అంచనాల్లో తొలుత రూ.22,316 కోట్ల రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా వేశారు. చివరికి వచ్చేసరికి అంచనాలనూ సవరించారు. తాజా సవరణ ప్రకారం రూ.31,534.94 కోట్లు రెవెన్యూ లోటు ఉంటుందని పేర్కొనగా అంతకు మించిపోయింది. మరోవైపు వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం రుణాలు తీసుకుంటోంది. కొన్ని పథకాల ఖర్చులను ఆ కార్పొరేషన్ల ఖర్చులుగానే చూపిస్తోంది. ప్రభుత్వ పథకాల ఖర్చులను బడ్జెట్ వెలుపల చూపకూడదని ఆర్థిక సంఘం నిబంధనలున్నా రాష్ట్రంలో కొన్ని కార్యక్రమాలకు ఎక్కడ నుంచి నిధులు సమీకరిస్తున్నారో అక్కడే వాటి ఖర్చుగా చూపుతున్నారు. దీనివల్ల రెవెన్యూ ఖర్చులు బడ్జెట్లోకి రాకుండా పోతున్నాయి. అన్నీ కలిపితే రెవెన్యూ లోటు మరింత పెరిగిపోయే ప్రమాదం ఉన్నా ఇలా సర్దుబాటు చేసేస్తున్నారు.
ద్రవ్యలోటులోనూ అదే దోవ..
ఆంధ్రప్రదేశ్లో ద్రవ్యలోటు కూడా లెక్కకు మిక్కిలి పెరిగిపోతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును ప్రభుత్వం రూ.61,765.14 కోట్లుగా చూపించింది. బడ్జెట్ వెలుపల చేస్తున్న రుణాల మొత్తాలు ఈ లెక్కలోకి రావట్లేదు. అవీ కలిపితే ఎంత లేదన్నా రూ.లక్ష కోట్ల వరకు చేరిపోయే ప్రమాదం ఉంది. కాగ్ ఫిబ్రవరి నెలాఖరు లెక్కల ప్రకారం రూ.77,208.45 కోట్లు ద్రవ్యలోటుగా చూపినా మార్చి నెలాఖరుకు సవరించారు. కార్పొరేషన్ల రుణాలు తీర్చేందుకు ప్రభుత్వ ఖజానా నుంచే అసలు, వడ్డీ చెల్లిస్తున్నా ఈ లెక్కల్లో వాటికి చోటు దక్కట్లేదు. కాగ్ ప్రతి నెలా కార్పొరేషన్ల నుంచి సమీకరించిన రుణాల మొత్తం వివరాలు తమకూ తెలియజేయాలని కోరుతోంది. మరో ఆర్థిక సంవత్సరం గడిచినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ లెక్కలను కాగ్కు అందించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భోగాపురంలో ‘భూ’చాళ్లు!
భోగాపురం మండలం బసవపాలెంలో ఓ రైతుకు 1.30 ఎకరాల డి-పట్టా భూమి ఉంది. ఓ వ్యక్తి ఈ భూమి కొనడానికి ఈయనతో రూ. 12 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. -
ఎండ తీవ్రతకు 4 బస్సులు దగ్ధం
ఒడిశాలోని రాయగడ జిల్లా బిసంకటక్లో శనివారం ఎండ తీవ్రతకు నాలుగు బస్సులు దగ్ధమైనట్లు అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. -
నేటి నుంచి టోల్ మోత.. అర్ధరాత్రి నుంచి పెరగనున్న ఛార్జీలు
ఎన్హెచ్ఏఐ టోల్ప్లాజాల వద్ద టోల్ రుసుములు జూన్ 3 (ఆదివారం అర్ధరాత్రి) నుంచి పెరగనున్నాయి. -
బోర్డింగ్ పాస్ తీసుకున్నాక విమానం రద్దు
తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో తరచూ విమాన సర్వీసులు రద్దు అవుతుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
హైకోర్టులో వైకాపాకు ఎదురుదెబ్బ
పోస్టల్ బ్యాలట్ల చెల్లుబాటుపై స్పష్టత ఇస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) మే 30న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యంలో వైకాపాకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. -
‘జల’దరిస్తున్న విజయవాడ
కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ బంగ్లాలకు శుద్ధి చేసిన, స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తుంటారు. నీటిలోనూ నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటిస్తారు. -
వివేకా హత్య కేసును ఛేదించే క్రమంలోనే.. నాపై తప్పుడు ఫిర్యాదు.. ఆపై బదిలీ
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో హంతకులు తప్పించుకోవచ్చని భావించి, క్షేత్రస్థాయి అధికారులకు జాగ్రత్తలు చెబుతున్న సమయంలోనే తనపై ఎన్నికల సంఘానికి తప్పుడు ఫిర్యాదులు చేసి బదిలీ చేయించారని డైరెక్టర్ జనరల్ హోదాలో ఇటీవల పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వెల్లడించారు. -
పెట్టుబడి సాయం ఏమైపోయింది?
సంక్రాంతికి ఇస్తామన్న పెట్టుబడి సాయం.. నాలుగున్నర నెలలు గడచినా ఇప్పటికీ అధికశాతం రైతుల ఖాతాల్లో జమ కాలేదు. -
అన్న పానీయాల్లో నాణ్యత ‘గోవిందా గోవింద!’
కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరుని నిలయం తిరుమల. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకునిగా లక్షలమంది భక్తుల పూజలందుకునే స్వామి కొలువైన ఈ పుణ్యక్షేత్రం నిత్యకల్యాణం, పచ్చతోరణం. దేశ, విదేశాల్లోని హిందూ భక్తులు నిత్యం వేలల్లో తిరుమల సందర్శించి మొక్కులు తీర్చుకుంటారు. -
డోలాయమానంలో 7 కొత్త వైద్య కళాశాలల ప్రారంభం
వైకాపా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో 2025-26 సంవత్సరంలో కొత్తగా ఏర్పాటు కావాల్సిన 7 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో తరగతుల ప్రారంభంపై సందేహాలు ముసురుకున్నాయి. -
పాముకాటుకు, ముల్లుకు తేడా తెలీదా డాక్టరూ!
అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారి వైద్యుల నిర్లక్ష్యం వల్ల తమకు దూరమయ్యాడని బాధిత తల్లిదండ్రులు ఫ్లెక్సీతో వినూత్నంగా నిరసన తెలిపారు. -
అతిసారానికి మరో ఇద్దరి బలి
విజయవాడలో అతిసారం మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కలుషిత జలాలు తాగడం వల్ల ఇప్పటికే నగరంలో ఎనిమిది మంది చనిపోగా.. తాజాగా శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం ఇద్దరు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. -
ఉప్పాడ సముద్ర తీరంలో బంగారం వేట
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలోని సాగర తీరానికి బంగారు రేణువులు కొట్టుకొస్తున్నాయని స్థానికులు వాటి వేటలో పడ్డారు. -
మరో రెండ్రోజుల్లో రాష్ట్రానికి ‘నైరుతి’
రాబోయే 2 లేదా 3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. -
3వ రోజుకు చేరిన భారతి సిమెంటు ఉద్యోగుల ఆందోళన
తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ.. వైఎస్సాఆర్ జిల్లా కమలాపురం మండలం నల్లింగాయపల్లెలోని భారతి సిమెంటు పరిశ్రమ వద్ద ఉద్యోగులు చేపట్టిన ఆందోళన శనివారం మూడో రోజుకు చేరింది. -
బ్యాంకులు ప్రజలకు ఇంకా దగ్గర కావాలి
టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల వేతన సవరణ జూన్ 1 శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. కొత్త వేతనాలు జులైలో అందనున్నాయి. -
సంక్షిప్త వార్తలు (7)
విదేశీ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్కు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైకాపా నేతలు స్వాగతం పలికారు. -
ఎన్నికల విధుల నుంచి కారంపూడి సీఐ తొలగింపు
పల్నాడు జిల్లా కారంపూడి సీఐ నారాయణస్వామిని ఎన్నికల విధుల నుంచి తొలగించారు. -
ఇదీ సంగతి!
-
ఉద్యోగులను తీవ్రవాదుల్లా చూడటం తగదు
హక్కుల కోసం పోరాడే ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రవాదుల్లా చూడటం తగదని ఉద్యోగ, ఉపాధ్యాయ, సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర ఛైర్మన్ కె.సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు
శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 20 గంటలు పడుతోంది. శనివారం సాయంత్రానికి క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి.