‘ప్రమాదాలు ఆందోళనకరం..’ పట్టించుకోని అధికారగణం!
రాష్ట్రంలో వరస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాహనాలు నడిపే వారి నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణలోపం ఫలితంగా వందల మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఐదు రోజుల కిందట చిలకలూరిపేట వద్ద ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టడంతో మంటలు ఎగిసి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న అమాయకులు
తనిఖీలు, పర్యవేక్షణ చేయని రవాణా, పోలీస్, ఎన్హెచ్ శాఖలు
ఈనాడు, అమరావతి
రాష్ట్రంలో వరస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాహనాలు నడిపే వారి నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణలోపం ఫలితంగా వందల మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఐదు రోజుల కిందట చిలకలూరిపేట వద్ద ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టడంతో మంటలు ఎగిసి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మరిచిపోక ముందే.. శనివారం అనంతపురం జిల్లా గుత్తి వద్ద ఓ కారు ప్రమాదానికి గురై ఆరుగురు మరణించారు. రాష్ట్రంలో సగటున నెలకు 1,600 ప్రమాదాలు జరిగితే.. 660 నుంచి 680 మంది ప్రాణాలు కోల్పోతున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంత ప్రాణనష్టం జరుగుతున్నా ప్రమాదాల నియంత్రణపై ప్రభుత్వం దృష్టిపెడుతున్న దాఖలాలు కనిపించడం లేదు.
ప్రమాదం.. కారణం
బాపట్ల జిల్లా చిన్నగంజాం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు వేగంగా వెళ్లి, చిలకలూరిపేట సమీపంలో పసుమర్రు వద్ద టిప్పర్ను ఢీకొంది. టిప్పర్ డీజిల్ ట్యాంక్ పగలడంతో ఒక్కసారిగా మంటలంటుకొని బస్సు, టిప్పరు దగ్ధమైపోయాయి. ఆ రెండు వాహనాల డ్రైవర్లు, బస్సులోని నలుగురు మంటల్లో చిక్కుకొని చనిపోయారు.
కారణం: బస్సు నడిపిన వ్యక్తే. వాస్తవానికి అతను క్లీనర్. పైగా మద్యం మత్తులో ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్న అతనికి బస్సు యజమాని స్టీరింగ్ ఇచ్చాడు.
ఏం చేయాలి: ఆర్టీసీలో చేసినట్లు ప్రైవేటు ట్రావెల్స్ కూడా డ్రైవర్, క్లీనర్లకు నిత్యం బ్రీత్ ఎనలైజర్లతో తనిఖీలు చేయాలి. అటువంటి తనిఖీలు లేకపోవడంతో చాలా మంది దర్జాగా మద్యం తాగి స్టీరింగ్ పడుతున్నారు.
అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో హైవేపై శనివారం తెల్లవారుజామున కారు వేగంగా అనంతపురం వైపు వెళ్తోంది. నిద్ర మత్తులో ఉన్న డ్రైవర్ రెప్పవాల్చడంతో వాహనం అదుపు తప్పింది. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. అంతే.. కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి మినహా, అందులోని ఆరుగురూ చనిపోయారు.
కారణం: డ్రైవర్ విశ్రాంతి లేకుండా కారు నడపడం.
ఏం చేయాలి: డ్రైవర్లు నిద్ర మత్తులో ఉన్నప్పుడు అప్రమత్తం చేసే సాంకేతికత అందుబాటులో ఉంది. ప్రతి వాహనానికి దాన్ని తప్పనిసరి చేసేలా నిబంధనలు రూపొందించాలి.
ఆర్టీసీ అమరావతి ఏసీ సర్వీస్ బస్సు బుధవారం విశాఖపట్నం నుంచి విజయవాడ వస్తుండగా.. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి డైమండ్ జంక్షన్ సమీపంలో ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు.
కారణం: బస్సు డ్రైవరు వేగాన్ని నియంత్రించలేకపోయాడు.
ఏం చేయాలి: లారీలు, టిప్పర్లకు వెనుక రేడియం స్టిక్కర్లు ఉన్నాయా.. అవి వెనుక వచ్చే వాహన డ్రైవర్లను అప్రమత్తం చేయగలుగుతాయా అనేది తనిఖీల్లో భాగంగా పరిశీలించాలి.
చలానాలు రాయడమే లక్ష్యంగా..
రవాణాశాఖ అధికారులు కొంతకాలంగా రోడ్లపై వాహనాల తనిఖీలు మరిచిపోయారు. ప్రభుత్వం నిర్దేశించిన రాబడి లక్ష్యాన్ని చేరుకోవడానికి జరిమానాలపై దృష్టి పెట్టారు. వేగ నియంత్రణ, మద్యం మత్తులో డ్రైవర్లు వాహనాలు నడపకుండా చూడటం అనే పనులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. పోలీసులూ వాహనాల తనిఖీ వదిలేశారు. అతివేగంగా దూసుకెళ్తున్న వాహనాలను నిఘా కెమెరాలతో గుర్తించి వెంటనే కళ్లెం వేయాలి. సంబంధిత వాహన యజమాని సెల్ఫోన్కు సందేశం పంపి అప్రమత్తం చేయాలి. పోలీసులు ఈ మార్గాలపై దృష్టి పెట్టడం లేదు.
ఎన్హెచ్ అధికారులదీ నిర్లక్ష్యమే
జాతీయ రహదారులపై లారీలను ఎక్కడికక్కడ నిలిపేస్తున్నారు. హోటళ్లు, దాబాలు, ఇతర దుకాణాల వద్ద హైవేకి ఆనుకొని నిలుపుతున్నారు. వేగంగా వచ్చే వాహనాలు వాటిని ఢీ కొడుతున్నాయి. వాస్తవానికి లారీలను హైవేలపై ఉండే ట్రక్ లే బైస్లో మాత్రమే నిలపాలి. ఒక్కో దాంట్లో 10-15 లారీలు నిలపొచ్చు. కానీ, అక్కడ సౌకర్యాలు ఉండటం లేదు. కనీసం లైట్లూ కనిపించవు. దీంతో ఇష్టానుసారంగా లారీలను ఆపేస్తున్నారు. హైవేపై ప్రతి 60-70 కి.మీ.లకు 2, 3 ఎకరాల విస్తీర్ణంలో అన్ని సదుపాయాలతో ట్రక్ పార్కింగ్ ఏర్పాటు చేయాలి. ఇది డ్రైవర్లకు విశ్రాంతి ప్రాంతం వంటిది. రాష్ట్రంలోని హైవేల్లో మూడు, నాలుగు చోట్ల మాత్రమే ఈ ఏర్పాటు ఉంది. టోల్ వసూలు చేస్తున్న గుత్తేదారు వీటిని పట్టించుకోవడం లేదు. అధికారులూ గుర్తుచేయడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం