బాధితుల గొంతు వినిపించడం నేరమా?
ఎన్డీయే అభ్యర్థులకు ఓటు వేశామనే అక్కసుతో తమపై వైకాపా మూకలు దాడికి తెగబడి తలలు పగలకొట్టి రక్తపాతం సృష్టించారంటూ బాధితులు చెబితే.. ఆ విషయాన్ని టీవీ ఛానళ్లలో ప్రసారం చేయడం నేరమా? వారికి జరిగిన అన్యాయాన్ని, వారి ఆవేదనను రిపోర్టింగ్ చేయడం వర్గాల మధ్య శత్రుత్వం పెంచడమా?
అన్యాయాన్ని వివరిస్తే వర్గాల మధ్య శత్రుత్వం పెంచడం అవుతుందా?
ఆవేదనను ప్రసారం చేసినందుకు టీవీ ఛానళ్లపై కేసులు
ఈనాడు, విశాఖపట్నం: ఎన్డీయే అభ్యర్థులకు ఓటు వేశామనే అక్కసుతో తమపై వైకాపా మూకలు దాడికి తెగబడి తలలు పగలకొట్టి రక్తపాతం సృష్టించారంటూ బాధితులు చెబితే.. ఆ విషయాన్ని టీవీ ఛానళ్లలో ప్రసారం చేయడం నేరమా? వారికి జరిగిన అన్యాయాన్ని, వారి ఆవేదనను రిపోర్టింగ్ చేయడం వర్గాల మధ్య శత్రుత్వం పెంచడమా? ఇది నేరపూరిత కుట్రా? బాధితుల ఆవేదనను ఛానళ్లలో చూపిస్తే మీడియా సంస్థలపై కేసు పెడతారా? బర్మా కాలనీకి సంబంధించిన సుంకర ధనలక్ష్మి కుటుంబంపై జరిగిన దాడి వ్యవహారంలో విశాఖపట్నం పోలీసులు ఇదే చేశారు. ఆ బాధితుల ఆవేదనను ప్రసారం చేసినందుకు ఈటీవీ, ఏబీఎన్ ప్రతినిధులపై, బాధితులతో కలిసి ప్రెస్మీట్లో మాట్లాడినందుకు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ భాజపా అభ్యర్థి విష్ణుకుమార్రాజుపై ఈ నెల 17న కంచరపాలెం పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు. తమ ఎదుట హాజరు కావాలని మీడియా ప్రతినిధులకు సీఆర్పీసీ 91 సెక్షన్ కింద నోటీసులిచ్చారు. అయితే ఈ వ్యవహారంపై
విశాఖ పోలీసులు విచారిస్తే వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం లేదని, ఎన్నికల సంఘం వెంటనే జోక్యం చేసుకుని సిట్ ద్వారా విచారణ జరిపించాలని, బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు డిమాండు చేస్తున్నాయి.
సిట్ దర్యాప్తుతోనే వాస్తవాలు వెలుగులోకి..
- ధనలక్ష్మి కుటుంబంపై జరిగిన దాడి ఘటనపై మొత్తం రీ ఇన్వెస్టిగేట్ చేయాలని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు డిమాండు చేస్తున్నాయి. ఈ కేసును విశాఖపట్నం పోలీసులు దర్యాప్తు చేస్తే అసలు వాస్తవాలు వెలుగుచూసే అవకాశం లేదనే వాదన వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల రోజున, ఆ తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనలపై ఏర్పాటైన సిట్ దర్యాప్తు పరిధిలోకి ఈ కేసును తీసుకురావాలని కోరుతున్నాయి.
- కంచరపాలెం పోలీసులు తమను లంచం అడిగారని బాధితులు ప్రెస్మీట్లో చెప్పారు. దీనిపై విశాఖపట్నం పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయట్లేదు? ఈ అంశంపై కూడా దర్యాప్తు చేయాలి. దీన్ని సిట్ పరిధిలోకి తీసుకురావాలని ప్రజాసంఘాలు డిమాండు చేస్తున్నాయి.
- ఈ అంశాలపై విశాఖపట్నం నగర పోలీసు కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్ను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. పోలీసు పీఆర్వోతో మాట్లాడితే.. సీపీ అందుబాటులోకి రారని సమాధానమిచ్చారు.
మాచర్ల, చంద్రగిరి ఘటనలకు ఏ మాత్రం తీసిపోదు..: విశాఖపట్నంలో సుంకర ధనలక్ష్మి కుటుంబంపై జరిగిన దాడి.. మాచర్ల, చంద్రగిరి, తాడిపత్రిల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు ఏ మాత్రం తీసిపోదని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఇది కచ్చితంగా ఎన్నికల హింస కిందే పరిగణించాలని పేర్కొంటున్నాయి. కానీ పోలీసులు మాత్రం ఇది ఎన్నికల హింస కాదని చెప్పేందుకే తాపత్రయపడుతున్నారని విమర్శిస్తున్నాయి. విశాఖలో ఘటన జరిగిన రోజున బాధితులు భయభ్రాంతులకు గురై ఆందోళనలో ఉన్నారు. ఆ సమయంలో వారు ఏం చెప్పారో, పోలీసులు ఏం రాసుకున్నారో ఎవరికీ తెలీదు. కానీ అదేదో కుటుంబ గొడవలు అన్నట్లుగా తేల్చేశారని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ‘‘మీ మీద న్యూసెన్స్ కేసు పెట్టకూడదంటే రూ.2 లక్షల లంచం ఇవ్వాలి’’ అంటూ కంచరపాలెం పోలీసులు డిమాండు చేశారని బాధితులే చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తు చేయాలని డిమాండ్లు వస్తున్నాయి.
పత్రికా స్వేచ్ఛ కూడా రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమే. ప్రజలకు సమాచారాన్ని చేరవేయడం, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడటంలో పత్రికలది అత్యంత కీలకమైన పాత్ర. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించడమంటే భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించడమే
రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్(1950) కేసులో సుప్రీంకోర్టు.
విశాఖ ఘటనను ప్రసారం చేసిన మీడియాపై కేసు నమోదు
ఈనాడు, విశాఖపట్నం: విశాఖపట్నం జీవీఎంసీ 49వ వార్డులో బర్మాక్యాంపు వద్ద సుంకర ధనలక్ష్మి, ఆమె కుమార్తెలు నూకరత్నం, రమ్య, కుమారుడు మణికంఠపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు మీడియాపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనను ప్రసారం చేసినందుకు ఈటీవీ, ఏబీఎన్ ప్రతినిధులపైనా, బాధితులతో కలిసి ప్రెస్మీట్లో మాట్లాడినందుకు విశాఖ ఉత్తర నియోజకవర్గ భాజపా అభ్యర్థి విష్ణుకుమార్రాజుపైనా ఈ నెల 17న కంచరపాలెం పోలీసుస్టేషన్లో కేసు పెట్టారు. ఐపీసీ 153ఏ, 188, 505(2), 120బీ రెడ్విత్ 34, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125 తదితర సెక్షన్ల కింద కేసు బనాయించారు. వ్యక్తుల మధ్య గొడవను వర్గాల మధ్య వైరంగా సృష్టించడంతో పాటు.. నిందితుణ్ని వైకాపా వ్యక్తిగా, బాధితులు తెదేపా వారిగా ప్రసారం చేయడం ద్వారా ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెంచి శాంతి భద్రతల సమస్యకు కారణమయ్యారని పేర్కొన్నారు. దీనిపై తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని మీడియా ప్రతినిధులకు సీఆర్పీసీ 91 సెక్షన్ కింద నోటీసులిచ్చారు. ఆదివారం ఉదయం 10:30 గంటలకు హాజరు కావాలని మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ నోటీసులు ఇవ్వడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే