పోలీసులపై ప్రశ్నల పరంపర
పల్నాడు జిల్లా నరసరావుపేట, తిరుపతి జిల్లా చంద్రగిరి, అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ సందర్భంగానూ.. ఆ తర్వాత జరిగిన దమనకాండపై సిట్ అధికారులు రెండో రోజైన ఆదివారం కూడా విచారణ జరిపారు.
రెండో రోజూ కొనసాగిన సిట్ విచారణలు
క్షేత్రస్థాయిలో పరిశీలన
పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో జరిగిన దాడులపై ఆరా
ఈనాడు యంత్రాంగం
తిరుపతి జిల్లా రామిరెడ్డిపల్లెలో వైకాపా అభ్యర్థి మోహిత్రెడ్డి గన్మెన్ను విచారిస్తున్న డీఎస్పీ రవిమనోహరాచారి
పల్నాడు జిల్లా నరసరావుపేట, తిరుపతి జిల్లా చంద్రగిరి, అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ సందర్భంగానూ.. ఆ తర్వాత జరిగిన దమనకాండపై సిట్ అధికారులు రెండో రోజైన ఆదివారం కూడా విచారణ జరిపారు. ఘర్షణలకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి? సకాలంలో దాడులను ఎందుకు అరికట్టలేకపోయారు? ఆ తర్వాత ఎంతమందిపై చర్యలు తీసుకున్నారని స్థానిక పోలీసు అధికారులను ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్లు పరిశీలించారు. దాడులు జరిగిన ప్రాంతాలకు వెళ్లి అక్కడి పరిస్థితిపై అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా కూడా స్థానిక పోలీసులు కొందరు తమ పక్షపాత ధోరణిని కనబరిచారని విపక్ష నాయకులు ఆరోపించారు.
జనసేన నాయకులు సిట్ అధికారులను కలవడానికి వస్తే పోలీసులు అడ్డుపడ్డారు. వారిని గంటల తరబడి బయటే కూర్చోబెట్టారు. మరోవైపు అధికారపార్టీ నేతలు రాగానే వారిని సిట్ అధికారుల వద్దకు తీసుకువెళ్లారు. ఎన్నికల సంఘం చీవాట్లు పెడుతున్నా పోలీసుల తీరులో మార్పు రాకపోవడం.. ఇంకా వైకాపాకు కొమ్ముకాస్తుండటంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.
నరసరావుపేట గ్రామీణ పోలీసుస్టేషన్ నుంచి బయటకు వస్తున్న మంత్రి అంబటి రాంబాబు, అనుచరులు
మంత్రికేమో వెంటనే అనుమతి..
జనసేన నేతలకు 4గంటల నిరీక్షణ
ఈనాడు డిజిటల్, నరసరావుపేట: పల్నాడు జిల్లా నరసరావుపేటలో సిట్ అధికారులను కలిసేందుకు మంత్రి అంబటి రాంబాబుకు వెంటనే అనుమతినిచ్చి, జనసేన నేతలను నాలుగు గంటలకు పైగా బయటే నిలిపివేశారు. ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో రెండోరోజు ఆదివారం సిట్ సభ్యులు నరసరావుపేట గ్రామీణ ఠాణాలో విచారణ చేపట్టారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో మంత్రి అంబటి రాంబాబు ఠాణాకు వచ్చి సిట్ సభ్యులను కలిశారు. నకరికల్లు మండలంలో జరిగిన ఘర్షణలకు సంబంధించి సత్తెనపల్లి రూరల్ సీఐ రాంబాబుపై ఫిర్యాదు చేశారు. ఆయనకు స్థానిక ఎస్సై రోశయ్య ఆహ్వానం పలికారు. సాయంత్రం 6 గంటల తర్వాత వైకాపా వర్గీయుల చేతిలో దెబ్బలు తిన్న నరసరావుపేట మండలం పమిడిపాడుకు చెందిన జనసేన నాయకులు పదిమంది వరకూ వస్తే ఎస్సై రోశయ్య లోపలకు రానివ్వకుండా, సిట్ సభ్యులను కలవనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో వారంతా బయటే ఆగిపోయారు. తమకు కలిసే అవకాశం ఇవ్వాలని ప్రాధేయపడితే సరేనని నాలుగు గంటల పాటు బయటనే ఉంచారు. వైకాపా వర్గీయుల ఫిర్యాదు మేరకు తమకు 41ఏ నోటీసులు పంపారని, కానీ తాము వైకాపా చేతిలో దెబ్బలు తిన్నామని, కౌంటర్ ఫిర్యాదు చేస్తే రూరల్ పోలీసులు తీసుకోవడం లేదని, ఈ విషయాన్ని సిట్ సభ్యులకు తెలిపేందుకు వస్తే రూరల్ ఎస్సై కలవనియ్యకుండా అడ్డుకున్నారని జనసేన నేతలు వాపోయారు.
లోపలకు రానివ్వకపోవడంతో బయటే వేచిచూస్తున్న జనసేన నేతలు
- నరసరావుపేట రూరల్ స్టేషన్లో ఆదివారం ఉదయం 10 గంటలకు మొదలైన సిట్ సభ్యుల విచారణ రాత్రి వరకూ కొనసాగింది. రూరల్ సర్కిల్ పరిధిలో మొత్తం నాలుగు ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిలో.. దొండపాడు పోలింగ్ కేంద్రం వద్ద తెదేపా ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంఎల్ఏ అభ్యర్థి చదలవాడ అరవిందబాబుల కార్లపై రాళ్ల దాడి జరిగింది. అంతేకాకుండా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లనివ్వకుండా ఇద్దరినీ అడ్డుకోవడమే కాకుండా తోసేశారు. నూజండ్ల మండలం పమిడిపాడులో వైకాపా వర్గీయులు తెదేపా వారిపై దాడి చేశారు. వీటిపై వీడియోలను సిట్ సభ్యులు పరిశీలించారు. రూరల్ ఎస్సై అధికారపార్టీతో అంటకాగుతున్నారనే ఆరోపణలున్న నేపథ్యంలో దాడులకు సంబంధించి ఎవరెవరిపై ఎలాంటి కేసులు నమోదు చేశారు? వారికి 41ఏ నోటీసులు ఇచ్చారా? అదుపులోకి తీసుకున్నారా వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎఫ్ఐఆర్లను పరిశీలించారు. ఉదయం నుంచి రాత్రి వరకూ ఒక్క నరసరావుపేట గ్రామీణ ఠాణాలో పత్రాలనే పరిశీలించారు.
- శ్రీకాకుళం ఏసీబీ ఏఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో సిట్ సభ్యులు రెండోరోజు రెంటచింతల మండలంలో రెంటాల, తుమృకోట, పాలవాయిగేటు గ్రామాల్లో అల్లర్లు జరిగిన ప్రదేశాలను సందర్శించారు.
- కారంపూడిలో ఉదయం 10 గంటలకు శ్రీకాకుళం ఏసీబీ ఏఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో సిట్ సభ్యులు ఘటనా స్థలాలను పరిశీలించారు. అనంతరం ఠాణాకు వెళ్లి రికార్డులు తనిఖీలు చేశారు. ఈ నెల 14న జరిగిన ఘటన ఠాణాకు సమీపంలోనే జరిగినా ఎందుకు త్వరగా అదుపు చేయలేకపోయారు? పరిస్థితి చేయిదాటేవరకూ ఏం చేశారని పోలీసులను ప్రశ్నించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ ఇరుపార్టీల్లో ఎంతమందిని అరెస్టు చేశారని అడిగి, కొన్ని ఎఫ్ఐఆర్ పత్రాల జిరాక్స్ ప్రతులు తీసుకెళ్లారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు దాచేపల్లి పోలీసుస్టేషన్కు చేరుకున్నారు. సీఐ సురేంద్రబాబును విచారించారు. రెండు ఘటనల్లో బాధితులను పోలీసులే కొట్టి, హింసించిన ఘటనపై సీఐని ప్రశ్నించినట్లు సమాచారం. అనంతరం ఎఫ్ఐఆర్లను పరిశీలించారు. రెంటచింతల మండలం తుమృకోటలో కొందరు వైకాపాకు చెందినవారు దాచేపల్లికి వచ్చి సిట్ సభ్యులను కలిసి దాడి విషయాలను తెలిపారు.
తప్పుడు కేసులు పెట్టారు
సిట్ ఎదుట కూచివారిపల్లె గ్రామస్థుల ఆవేదన
పులివర్తి నానిపై దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు
కూచివారిపల్లెలో విచారిస్తున్న డీఎస్పీ రవిమనోహరాచారి
ఈనాడు-తిరుపతి, న్యూస్టుడే, తిరుపతి (నేరవిభాగం), చంద్రగిరి (గ్రామీణ): తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని రామిరెడ్డిపల్లెలో తెదేపా పోలింగ్ ఏజెంటుపై వైకాపా నేత కొటాల చంద్రశేఖర్రెడ్డి నేతృత్వంలో వైకాపా శ్రేణులు దాడిచేశాయని, అనంతరం కూచివారిపల్లెలో కర్రలు, రాడ్లతో బీభత్సం సృష్టించారని గ్రామస్థులు తమ ఆవేదన వెలిబుచ్చారు. దాడి చేసిన వ్యక్తులను వదిలేసి బాధితులపైనే పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని సిట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ బృందం విచారణ చేపట్టింది. తిరుపతి జిల్లాలో జరిగిన ఘటనలపై డీఎస్పీ రవిమనోహరాచారి, సీఐ ప్రభాకర్ ఆదివారం విచారణ జరిపారు. చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై శ్రీపద్మావతి వర్సిటీలో జరిగిన దాడి ఘటన, పోలీసులు తీసుకున్న చర్యలను ముందుగా సిట్ అధికారులు పరిశీలించారు. ఎస్వీయూ పోలీస్స్టేషన్కు వెళ్లి విచారించారు. ఘటన తర్వాత పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఎంతమందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు? ఎంతమందిని అరెస్టు చేశారనే విషయాలు పరిశీలించారు. మరోవైపు పులివర్తి నానిపై దాడి ఘటన జరిగిన తర్వాత ఎంతసేపటికి అక్కడికి చేరుకున్నారన్న వివరాలూ పోలీసులను అడిగి తెలుసుకున్నారు. దాడి సమయంలో పులివర్తి నాని కొంతమంది పోలీసు అధికారులకు ఫోన్ చేశారని, ఎందుకు స్పందించలేదని వారిని అడిగినట్లు తెలుస్తోంది. అనంతరం నానిపై దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. దాడి ఎలా జరిగింది? నిందితులు ఎలా పారిపోయారు? ఘటనకు వినియోగించిన ఆయుధాల వివరాలు తీసుకున్నారు.
అనంతరం చంద్రగిరి మండలంలోని రామిరెడ్డిపల్లె, కూచివారిపల్లెలో పర్యటించి.. 13వ తేదీ రాత్రి దాడులు జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. దహనమైన కొటాల చంద్రశేఖర్రెడ్డి ఇంటిని, వాహనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు అక్కడ జరిగిన ఘటనలను సిట్ అధికారులకు వివరించారు. రాత్రి 9.03 సమయంలో సుమారు 40 మంది గ్రామంపై పడి అరగంట పాటు దాడిచేశారని.. ప్రతిదాడి జరిగిందన్నారు. ఘటనపై గ్రామంలో అందరం ఓ చోట కూర్చుని ధర్నా చేశామని, ఇదే సమయంలో నాని కుమారుడు వినీల్ అక్కడికి వచ్చినట్లు తెలిపారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో చంద్రశేఖర్రెడ్డి ఇంటికి ఎవరో నిప్పు పెట్టారని ఘటనతో తమకు సంబంధం లేదని వివరించారు. అనంతరం వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్రెడ్డి గన్మెన్ ఈశ్వర్ను విచారించి వివరాలు తీసుకున్నారు.
నివేదికను అధికారులకు అందజేస్తాం
- రవి మనోహరాచారి, డీఎస్పీ
‘ఎన్నికల రోజుతోపాటు మర్నాడు పద్మావతి వర్సిటీ వద్ద పులివర్తి నానిపై దాడి ఘటనలకు సంబంధించిన అన్ని అంశాలపై క్షేత్రస్థాయిలో విచారించాం. నానిపై దాడి జరిగిన ప్రాంతాలను, ఎఫ్ఐఆర్లను పరిశీలించాం. రామిరెడ్డిపల్లె, కూచివారిపల్లె గ్రామస్థులతో మాట్లాడాం’ అని సిట్ అధికారి, డీఎస్పీ రవిమనోహరాచారి తెలిపారు. ఎన్నికల అనంతరం జరిగిన గొడవలు.. విధ్వంసాలు.. హత్యాయత్న ఘటనలకు భద్రతా వైఫల్యం, నిర్లక్ష్యమే కారణమని సిబ్ బృందం గుర్తించినట్లు సమాచారం. సుమారు ఏడుగంటలపాటు విచారణ చేపట్టిన బృందం ఆదివారం రాత్రి సిట్ ఐజీకి నివేదిక సమర్పించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్