తాడిపత్రిలో రెండోరోజు కొనసాగిన సిట్‌ విచారణ

అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్‌ తర్వాత  జరిగిన అల్లర్లపై సిట్‌ అధికారులు రెండోరోజైన ఆదివారం కూడా విచారణ కొనసాగించారు.

Updated : 20 May 2024 04:53 IST

తాడిపత్రి, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్‌ తర్వాత  జరిగిన అల్లర్లపై సిట్‌ అధికారులు రెండోరోజైన ఆదివారం కూడా విచారణ కొనసాగించారు. రాళ్లదాడి జరిగిన ఓంశాంతినగర్, చింతలరాయునిపాళెంలోని సూర్యముని ఇల్లు, ప్రభుత్వ కళాశాల మైదానం తదితర ప్రాంతాలను క్షుణ్ణంగా అధికారుల బృందం పరిశీలించింది. గొడవలు ఎలా జరిగాయి? పోలీసుల పనితీరు గురించి వివరాలు సేకరిస్తున్నారు. ఉదయం నుంచి గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో ఉంటూ పలువురు పోలీస్‌ అధికారులను విచారించారు.


‘అనుమతుల కోసం ఫీజులు చెల్లించొద్దు’

ఈనాడు డిజిటల్, అమరావతి: గత సంవత్సరం అనుమతుల కోసం ఫీజులు చెల్లించిన కళాశాల యాజమాన్యాలు.. ఈ ఏడాది చెల్లించవద్దని ప్రైవేటు డిగ్రీ కాలేజీల యాజమాన్య సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుండారెడ్డి, రమణాజీ సూచించారు. గతేడాది ఒకేసారి మూడేళ్లకు అనుమతులిచ్చి.. మళ్లీ చెల్లించాలనడం ఏంటని ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 


జేఈఈ మెయిన్‌ పేపర్‌-2 ఫలితాల విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: బీఆర్క్, బీప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్‌ పేపర్‌-2 ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆదివారం విడుదల చేసింది. పరీక్ష రాసిన విద్యార్థులు ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్‌ jeemain.nta.ac.inలో తమ ఫలితాలను చూసుకోవచ్చు. బీఆర్క్‌ పరీక్ష ఫలితాల్లో ఝార్ఖండ్‌కు చెందిన బసాక్, తమిళనాడు విద్యార్థి ముత్తు 100 పర్సంటైల్‌ సాధించారు. ఏపీకి చెందిన యాయవరం శ్రవణ్‌ రామ్, తెలంగాణ విద్యార్థులు వివేక్‌జిత్‌ దాస్, బోడ ప్రభంజన్‌ జాదవ్, బానోత్‌ రిత్వక్‌ 99 పర్సంటైల్‌ స్కోర్‌ చేశారు. బీప్లానింగ్‌లో అరుణ్‌ రాధాకృష్ణ (కర్ణాటక), కలసాని సాకేత్‌ ప్రణవ్‌ (ఏపీ) 100 పర్సంటైల్‌ సాధించారు. ఏపీ విద్యార్థి కాలిగాట్ల దేవీప్రసాద్‌ 99.99 పర్సంటైల్‌ సాధించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని