శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సురేష్‌రెడ్డి, రాష్ట్ర విభజన సమయంలో యాక్టింగ్‌ సీజేగా పనిచేసి ఇటీవల పదవీవిరమణ పొందిన జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నారు.

Published : 20 May 2024 04:34 IST

ఆలయం ఎదుట ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సురేష్‌రెడ్డి, జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ తదితరులు

తిరుమల, న్యూస్‌టుడే: ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సురేష్‌రెడ్డి, రాష్ట్ర విభజన సమయంలో యాక్టింగ్‌ సీజేగా పనిచేసి ఇటీవల పదవీవిరమణ పొందిన జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తులకు తితిదే అధికారులు స్వాగతం పలికి శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం, తితిదే అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. వీరితోపాటు జిల్లా ప్రొటోకాల్‌ న్యాయమూర్తి ఎం.గురునాథ్, ప్రొటోకాల్‌ మున్సిఫ్‌ న్యాయమూర్తి పి.కోటేశ్వరరావు, పీఆర్వో ధనంజయ నాయుడు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని