సంక్షిప్త వార్తలు(11)
తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ మంగళవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం, అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
ఆలయం ఎదుట జస్టిస్ రామకృష్ణ ప్రసాద్, కుటుంబసభ్యులు
తిరుమల, న్యూస్టుడే: తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ మంగళవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం, అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకు ముందు తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారిని న్యాయమూర్తి దర్శించుకున్నారు.
మరో రూ.2 వేల కోట్ల అప్పులు
ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మరో రూ.2,000 కోట్ల రుణం తీసుకుంది. రిజర్వుబ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ అప్పు సమీకరించింది. రూ.1,000 కోట్లు 17 ఏళ్ల కాలపరిమితితో తిరిగి తీర్చేలా 7.40 శాతం వడ్డీకి, మరో రూ.1,000 కోట్లు 20 ఏళ్ల కాలపరిమితితో 7.38 శాతం వడ్డీకి తీసుకుంది. ఈ నిధులు బుధవారం ఖజానాకు చేరనున్నాయి.
జూన్ 2 నుంచి పెరగనున్న టోల్ రుసుములు
చౌటుప్పల్, న్యూస్టుడే: జూన్ 2 నుంచి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టోల్ప్లాజాల వద్ద టోల్ రుసుములు పెరగనున్నాయి. ఏటా ఏప్రిల్ 1న రుసుముల ధరలు పెరగనుండగా... ఈసారి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడింది. టోల్ఛార్జీల పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఎన్హెచ్ఏఐని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఎన్నికలు ముగియగానే రుసుములు సగటున 5 శాతం పెరగనున్నాయి.
24 నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 24 నుంచి ప్రారంభమై జూన్ ఒకటితో పూర్తికానున్నాయి. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, రెండో ఏడాది వారికి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 861 కేంద్రాల్లో మొదటి ఏడాది వారు 3,46,393, రెండో సంవత్సరం వారు 1,21,545 మంది పరీక్షలు రాయనున్నారు.
ఈఏపీసెట్కు 94.31 శాతం మంది హాజరు
గాంధీనగర్, న్యూస్టుడే: ఏపీఈఏపీ సెట్-2024కు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా, హైదరాబాద్లో కలిపి మొత్తం 94.31 శాతం మంది హాజరైనట్లు సెట్ ఛైర్మన్, ఉపకులపతి జీవీఆర్ ప్రసాదరాజు తెలిపారు. ఉదయం 29,904 మందికి 28,087 మంది, మధ్యాహ్నం 30,518 మందికి 28,895 మంది (మొత్తం 94.31శాతం) హాజరయ్యారని ఒక ప్రకటనలో వెల్లడించారు.
24న డీఈఈసెట్
ఈనాడు, అమరావతి: ప్రభుత్వ జిల్లా విద్య, శిక్షణ సంస్థల్లో రెండేళ్ల డీఈడీ కోర్సుల ప్రవేశానికి డీఈఈసెట్ను ఈ నెల 24న నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్య కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 4,949 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
పాలిసెట్ కౌన్సెలింగ్ 23 నుంచి
ఈనాడు, అమరావతి: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ను ఈ నెల 23 నుంచి నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలన 27 నుంచి జూన్ 3 వరకు చేపడతారు. కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్ ఐచ్ఛికాల నమోదుకు 31 నుంచి జూన్ 5 వరకు అవకాశం కల్పించారు. 5 నే ఐచ్ఛికాలు మార్చుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. అదే నెల 7న సీట్ల కేటాయింపు పూర్తి చేస్తారు. 10 నుంచి 14 వరకు ప్రవేశాల ఖరారు కొనసాగుతుంది. విద్యార్థులు సీటు పొందిన కళాశాలల్లో వ్యక్తిగతంగా లేదా ఆన్లైన్ విధానం ద్వారా రిపోర్టు చేయాల్సి ఉంటుంది. జూన్ 10 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది పాలిసెట్లో మొత్తం 1,24,430 మంది అర్హత సాధించిన విషయం తెలిసిందే.
వ్యవసాయ సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
గుంటూరు(జిల్లా పరిషత్), న్యూస్టుడే: ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సార్వత్రిక, దూర విద్యా కేంద్రం ఆధ్వర్యంలో జులైలో నిర్వహించనున్న వ్యవసాయ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ కె.గురవారెడ్డి తెలిపారు. మిద్దె తోటలు, పట్టు పురుగుల పెంపకం, జీవ ఎరువుల తయారీ కోర్సుల ప్రవేశాలకు జూన్ 20 లోపు రూ.1500 చొప్పున ఫీజు చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్సైట్ www.angrau.ac.in ని సందర్శించాలని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
కౌన్సిల్, కమిషన్ పదాలను తొలగించండి
వినియోగదారుల స్వచ్ఛంద సంస్థలకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఆదేశం
ఈనాడు, అమరావతి: వినియోగదారుల స్వచ్ఛంద సంస్థలు తమ పేరులో కౌన్సిల్, కమిషన్ అనే పదాలను ఉపయోగించడం చట్టవిరుద్ధమని పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనిపై రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాల శాఖ దృష్టికి పలు ఫిర్యాదులు వచ్చాయని.. ఏవైనా స్వచ్ఛంద సంస్థలకు అలాంటి పేర్లు ఉంటే వెంటనే తొలగించాలని ఆదేశించారు. ‘వినియోగదారుల రక్షణ చట్టంలో రూపొందించిన నిబంధనల ప్రకారం జాతీయ, రాష్ట్ర, జిల్లా వివాదాల పరిష్కార కమిషన్.. వినియోగదారుల రక్షణకు ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వ సంస్థల్ని సూచిస్తుంది. 1956 కంపెనీల చట్టం ప్రకారం, మరే ఇతర చట్టం పరిధిలో రిజిస్టర్ చేయబడిన వినియోగదారుల సంఘాలను ప్రభుత్వ సంస్థగా పరిగణించరు. చట్టబద్ధమైన నియమాలు, నిర్దిష్టమైన నిబంధనలు రూపొందించే వరకు అలాంటి సంఘాలు కౌన్సిల్, కమిషన్ అనే పదాలను ఉయోగించేందుకు అర్హత లేదు’ అని స్పష్టం చేశారు.
కిర్గిజ్స్థాన్ నుంచి విద్యార్థులను రప్పించాలని కిషన్రెడ్డి లేఖ
ఈనాడు, హైదరాబాద్: కిర్గిజ్స్థాన్లో ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్కు కేంద్ర మంత్రి, భాజపా తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి లేఖ రాశారు. అక్కడ ఘర్షణల్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు చొరవ చూపాలని కోరారు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదివేందుకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎక్కువ మంది అక్కడ ఉన్నారని.. వారంతా స్వస్థలాలకు తిరిగి వచ్చేయాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. వీలైనంత తొందరగా వారిని రప్పించే ఏర్పాట్లు చేయాలని కోరారు.
గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించాలి
కలెక్టర్లకు సీఎస్ ఆదేశం
ఈనాడు, అమరావతి: ఉపాధి హామీ పథకం, స్వచ్ఛభారత్ అనుసంధానంతో గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పెద్దఎత్తున చేపట్టాలని అధికారులను సీఎస్ జవహర్రెడ్డి ఆదేశించారు. గ్రామాల్లో తాగునీరు, విద్యుత్తు సరఫరా తదితర అంశాలపై మంగళవారం ఆయన సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పనుల్లో భూగర్భ జలాల పెంపునకు తోడ్పడే పనులకు అధిక ప్రాధాన్యమివ్వాలని సీఎస్ సూచించారు. తాగునీరు, విద్యుత్తు సరఫరాకు ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఇంధనశాఖ అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి కోరల్లో.. తిరునగరి
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
-
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?