సంక్షిప్తవార్తలు(11)
పోలింగ్ బూత్లో ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎన్నికల్లో శాశ్వతంగా పోటీ చేయకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షుడు నేతి మహేశ్వరరావు డిమాండు చేశారు.
పిన్నెల్లిని శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ చేయనీయవద్దు
ఏపీ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షుడు నేతి మహేశ్వరరావు
ఈనాడు డిజిటల్, అమరావతి: పోలింగ్ బూత్లో ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎన్నికల్లో శాశ్వతంగా పోటీ చేయకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షుడు నేతి మహేశ్వరరావు డిమాండు చేశారు. పోలింగ్ సరళిని పరిశీలించడానికే ఎన్నికల సంఘం అభ్యర్థులకు నేరుగా వెళ్లే అవకాశం కల్పించిందన్నది వారు గుర్తుంచుకోవాలని బుధవారం ప్రకటనలో సూచించారు.
ఈవీఎం ధ్వంసం ఘటనలో సీఈవో వివరణ సంతృప్తికరంగా లేదు
ఏపీ ఎలక్షన్ వాచ్ కన్వీనర్ నిమ్మగడ్డ
ఈనాడు-అమరావతి: ఈవీఎంను ధ్వంసం చేసిన మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని ఏపీ ఎలక్షన్ వాచ్ కన్వీనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ ఓ ప్రకటనలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీఐ) కోరారు. పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసానికి పాల్పడిన వారిపై సీఈవో తగిన చర్యలు తీసుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఈవీఎం ధ్వంసానికి పాల్పడిన ఘటన జరిగిన వెంటనే పోలీసులను అప్రమత్తం చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్కుమార్ మీనా ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదు. రాష్ట్రంలో ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత సీఈవో ఏకపక్షంగా ప్రకటించడం భావ్యం కాదు. పల్నాడు జిల్లాలో ఈవీఎంల ధ్వంసానికి పాల్పడిన ఘటనలు వెలుగులోకి రాకపోవడానికి అదే కారణం. ఈ చర్యలు పోలింగ్ రోజే తీసుకుంటే బాగుండేది. స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణపై సీఈవో కార్యాలయం ఆశించిన స్థాయిలో దృష్టి పెట్టలేదని భావిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.
168 సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్
డీజీపీ హరీష్కుమార్ గుప్తా
ఈనాడు డిజిటల్, అమరావతి: కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 168 సమస్యాత్మక ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేసి 14 మంది అనుమానితులను అరెస్టు చేసినట్లు డీజీపీ హరీష్కుమార్ గుప్తా బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ‘అన్ని జిల్లాల పరిధిలోని అనుమానిత ప్రాంతాల్లో ఈనెల 21 నుంచి 22 వరకు ఎస్పీల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించాం. ఎలాంటి ధ్రువపత్రాలు లేని 803 వాహనాలు జప్తు చేశాం. 310 లీటర్ల అక్రమ మద్యం, 130 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం. అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించిన ఎలాంటి సమాచారమైనా స్థానిక పోలీసులకు లేదా 112 లేదా 100 నంబర్లను సంప్రదించాలి’ అని డీజీపీ సూచించారు.
ఈవీఎంను ధ్వంసం చేసింది ఎమ్మెల్యేనే
ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు
సీఈసీకి నివేదించిన డీజీపీ
ఈనాడు, అమరావతి: పోలింగ్ రోజున పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసింది ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని గుర్తించామని డీజీపీ హరీశ్కుమార్ గుప్తా పేర్కొన్నారు. వీడియోలో ఉన్నది ఎమ్మెల్యే అయితే ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని ఈసీ ఆదేశించిన నేపథ్యంలో.. డీజీపీ బుధవారం సాయంత్రం సీఈఓ ద్వారా నివేదిక పంపారు. ‘13వ తేదీ మధ్యాహ్నం ఈవీఎం ధ్వంసం జరిగింది. 15న పీఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుర్తుతెలియని వ్యక్తులని కేసు నమోదైంది. సిట్ రంగంలోకి దిగాక.. వెబ్క్యాస్టింగ్ను పరిశీలించే సమయంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసినట్లు గుర్తించాం. కేసులో ఆయన్ను ఏ1గా చేర్చాం. ఎమ్మెల్యేను అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశాం. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు’ అని నివేదికలో వివరించారు.
ఉపాధ్యాయుల బదిలీలకు ప్రత్యేక చట్టం
కసరత్తు చేస్తున్న ప్రభుత్వం
ఈనాడు, అమరావతి: ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలకు ప్రత్యేక చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కర్ణాటకలో అమలవుతున్న చట్టం తరహాలో దీనిని తీసుకురానున్నారు. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాల నుంచి సూచనలు, సలహాలను ప్రభుత్వం ఆహ్వానించింది. వాటిని ఈ నెల 28లోపు పాఠశాల విద్యాశాఖ జేడీకి పంపించాలని సూచించింది. ఉపాధ్యాయులు ఎనిమిదేళ్లు, ప్రధానోపాధ్యాయులు ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకుంటే తప్పనిసరి బదిలీ ఉంటుంది. ఆ బదిలీలను కచ్చితంగా వేసవి సెలవుల్లోనే నిర్వహించాలి. ఒక ఉపాధ్యాయుడు కేటగిరీ-1లో ఒక్కసారి మాత్రమే పని చేయాలనే నిబంధననూ తీసుకురానున్నారు. దీని ప్రకారం ప్రతి ఉపాధ్యాయుడు అన్ని కేటగిరిల్లోనూ పని చేయాల్సి ఉంటుంది. పట్టణం నుంచి మారుమూల పల్లెలోని బడికి వరకు బదిలీల్లో వెళ్లాల్సి వస్తుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. పైరవీ, సిఫార్సు బదిలీలకు ఆస్కారం లేకుండా అన్నీ కౌన్సెలింగ్ బదిలీలే జరిగేలా చట్టంలో నిబంధన పెట్టాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్కు ముందు కీలక మంత్రి, ఆయన పీఏ, కొందరు అధికారులు కలిసి భారీగా పైరవీ బదిలీలు నిర్వహించారు. రాజకీయంగా పలుకుబడి ఉన్న వారు, డబ్బులు ఉన్నవారు బదిలీలు చేయించుకోగలిగారు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా చట్టంలో నిబంధనలు తీసుకురావాలని కోరుతున్నారు.
ఏపీ ఆర్సెట్ ఫలితాలు విడుదల
త్వరలోనే ఇంటర్వ్యూ షెడ్యూల్
ఫలితాలు విడుదల చేస్తున్న వీసీ ఆచార్య శ్రీకాంత్రెడ్డి, సెట్ కన్వీనర్ ఆచార్య దేవప్రసాద్రాజు తదితరులు
తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్టుడే: తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఏపీ ఆర్సెట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. మే 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను సెట్ కన్వీనర్ ఆచార్య దేవప్రసాద్రాజుతో కలిసి వర్సిటీ ఉపకులపతి ఆచార్య వి.శ్రీకాంత్ రెడ్డి తిరుపతిలో విడుదల చేశారు. అన్ని విభాగాలకు కలిపి 8,651 మంది పరీక్షకు హాజరుకాగా 4,352 మంది ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. ఫలితాలను https://cets.apsche.ap.gov.inలో అందుబాటులో ఉంచామని తెలిపారు. ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు రాష్ట్రంలోని 14 విశ్వవిద్యాలయాల్లోని 2,728 పీహెచ్డీ సీట్లలో ప్రవేశాలు కల్పించేందుకు ముఖాముఖిలు నిర్వహిస్తామన్నారు. జూన్ 10 తర్వాత షెడ్యూల్ ప్రకటిస్తామని.. ఆ తర్వాత ర్యాంకులు విడుదల చేస్తామని వీసీ వివరించారు. ఆచార్యులు కిశోర్, కుమారస్వామి, కుసుమహరినాథ్ పాల్గొన్నారు.
పాఠశాలలు తెరిచే నాటికి పుస్తకాల అందించాలి: సీఎస్
ఈనాడు, అమరావతి: పాఠశాలలు తెరిచే జూన్ 12 నాటికి విద్యార్థులకు పుస్తకాలతోపాటు ఏకరూపదుస్తులు, బ్యాగులువంటివన్నీ అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి ఆదేశించారు. 2024-25 విద్యా సంవత్సరం సన్నాహక ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ‘మండల స్థాయి నిల్వ కేంద్రాల ద్వారా పాఠశాలలకు పుస్తకాలు తదితర వస్తువులను అందించాలి. వీటి సరఫరాపై నిత్యం ప్రత్యేకంగా పర్యవేక్షించాలి’ అని సూచించారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో 36,54,539మంది విద్యార్థులు ఉన్నారని, జూన్ 10లోగా విద్యార్థులకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. పాఠ్యపుస్తకాల ముద్రణ 82శాతం పూర్తయిందని, 1-10 తరగతి వరకు ద్విభాష పుస్తకాలను అందిస్తున్నామని తెలిపారు.
సీపెట్ దరఖాస్తులకు 31 వరకు గడువు
ఈనాడు, అమరావతి: ప్లాస్టిక్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 31 వరకు అవకాశం కల్పించినట్లు కేంద్ర పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్, టెక్నాలజీ సంస్థ (సీపెట్) సంయుక్త సంచాలకులు సీహెచ్ శేఖర్ తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు మూడేళ్ల ప్లాస్టిక్ టెక్నాలజీ (డీపీటీ), ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ (డీపీఎంటీ) డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులని పేర్కొన్నారు. బీఎస్సీ విద్యార్థులకు రెండేళ్ల పోస్టుగ్రాడ్యుయేట్ ప్లాస్టిక్ ప్రాసెసింగ్-టెస్టింగ్ (పీజీడీ-పీపీటీ) కోర్సులను అందిస్తున్నట్లు తెలిపారు. కళాశాల ప్రాంగణంలోనే విద్యార్థులకు హాస్టల్ వసతి, అర్హులైన వారికి ఫీజు రీయింబర్స్మెంట్ సదుపాయం ఉందని వెల్లడించారు. జూన్ 9న విజయవాడ, అనంతపురంలో సీపెట్ ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా 150 సీట్లను భర్తీ చేస్తామని.. సందేహాల నివృత్తికి 6300147965 ఫోన్ నంబరులో సంప్రదించాలని సూచించారు.
ఏపీ ఈఏపీసెట్కు 93.87 శాతం హాజరు
గాంధీనగర్, న్యూస్టుడే: జేఎన్టీయూకే కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏపీ ఈఏపీసెట్-2024కు.. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా, హైదరాబాద్లో 93.87 శాతం మంది హాజరైనట్లు సెట్ ఛైర్మన్, వీసీ జీవీఆర్.ప్రసాదరాజు తెలిపారు. ఉదయం సెషన్కు 30,173 మందికి 28,203 మంది.. మధ్యాహ్నం సెషన్కు 30,533 మందికి 28,784 మంది హాజరయ్యారన్నారు.
రాష్ట్రస్థాయి శాంక్షనింగ్ కమిటీ సమావేశం
వ్యవసాయ అనుబంధ పథకాలపై చర్చ
ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రీయ కృషి వికాస, కృషోన్నతి పథకం కింద 2024-25 వార్షిక కార్యాచరణలో భాగంగా.. రూ.1,193 కోట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో వ్యవసాయ అనుబంధ రంగాల్లోని పథకాలను ఒకే గొడుగు కిందకి తీసుకువచ్చే అంశంపై రాష్ట్ర సచివాలయంలో సీఎస్ జవహర్రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రస్థాయి శాంక్షనింగ్ కమిటీ సమావేశం జరిగింది. వ్యవసాయ రంగంలో రూ.134కోట్ల వ్యయంతో కస్టమ్ హైరింగ్ సెంటర్లలో డ్రోన్లు అందుబాటులోకి తేవడం లాంటి పలు అంశాలపై చర్చించారు. కృషోన్నతి యోజన కార్యాచరణ ప్రణాళిక అమలుపైనా సమీక్షించారు.
కిర్గిజ్స్థాన్లోని పరిస్థితిని విద్యార్థులకు చేరవేస్తున్నాం
ఏపీఎన్ఆర్టీఎస్
ఈనాడు, అమరావతి: కిర్గిజ్స్థాన్లో ప్రస్తుతం.. పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు విదేశీ వ్యవహారాలశాఖ తెలియజేసిందని ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ(ఏపీఎన్ఆర్టీఎస్) పేర్కొంది. అక్కడి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. అందుబాటులో ఉన్న సమాచారాన్ని, విదేశాంగశాఖ ఇస్తున్న సలహాలను సకాలంలో తెలుగు విద్యార్థులకు చేరవేస్తున్నట్లు వెల్లడించింది. అక్కడున్న విద్యార్థులు దేశానికి తిరిగి రావాలనుకుంటే ఈనెల 23 నుంచి కిర్గిజ్స్థాన్ రాజధాని బిష్కెక్ నుంచి దిల్లీకి.. ప్రతి రోజూ రెండు విమానాలు నడుస్తాయని విదేశాంగశాఖ తెలిపినట్లు వివరించింది. వైద్య విద్యార్థులు తిరిగి రావడానికి ముందు.. జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించినట్లు వెల్లడించింది. కాగా ఆ దేశంలో ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘నేనుండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు..?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్