ఓట్ల లెక్కింపు వరకూ ఉండలేం
‘వైకాపా అభ్యర్థులు, ఆ పార్టీ నేతల వేధింపులను భరించలేకపోతున్నాం.. తక్షణమే మెడికల్ లీవ్లు ఇప్పించండి’ అంటూ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులే (ఆర్ఓలు) మొరపెట్టుకోవడం చూసి కేంద్ర ఎన్నికల సంఘం కంగుతింటోంది.
మెడికల్ లీవ్ ఇప్పించండి..
వైకాపా అభ్యర్థుల బెదిరింపులు భరించలేకపోతున్నాం
ఎన్నికల సంఘానికి ఆర్ఓల మొర
రాయలసీమ జిల్లాల నుంచే సుమారు 15 మంది వినతులు
ఇది దేశంలోనే అసాధారణ పరిస్థితి
ఈనాడు, అమరావతి: ‘వైకాపా అభ్యర్థులు, ఆ పార్టీ నేతల వేధింపులను భరించలేకపోతున్నాం.. తక్షణమే మెడికల్ లీవ్లు ఇప్పించండి’ అంటూ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులే (ఆర్ఓలు) మొరపెట్టుకోవడం చూసి కేంద్ర ఎన్నికల సంఘం కంగుతింటోంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో పనిచేసే సుమారు 15 మంది ఆర్ఓలు.. తమకు గంటకో యుగంలా గడుస్తోందంటూ తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తుండటంతో ఏం చేయాలో తెలియక ఎన్నికల సంఘం (ఈసీ) తల పట్టుకుంటోంది. ఓట్ల లెక్కింపు వరకు కూడా ఆగలేమని వారు చెబుతుండటంతో పరిష్కారం ఏమిటనే ఆలోచనలో పడింది. దేశ చరిత్రలో మరే రాష్ట్రంలో చూడని అసాధారణ పరిస్థితి ఇది. పోలింగ్ నాటి నుంచే తమను తప్పించాలంటూ ఆర్ఓలు కోరుతున్నా.. ఇప్పుడు మరింత మంది నుంచి వినతులు వస్తున్నాయని ఈసీ వర్గాలు చెబుతున్నాయి.
అసభ్యకరమైన మాటలు.. తీవ్ర ఒత్తిళ్లు
ఎన్నికల సమయంలో పార్టీలకు అతీతంగా అధికారులు నిష్పాక్షికంగా పనిచేయాలి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల ఆర్ఓలు పోలింగ్ ముందు నుంచే తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. అధికారంలో ఉన్నది తమ పార్టీ అని.. తాము ఏం చెబితే అదే జరగాలని వైకాపా అభ్యర్థులు అక్కడి ఆర్ఓలను హెచ్చరిస్తున్నారు. తమ మాటలు వినకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరిస్తున్నారు. ఏదైనా ఒక పనిచేయకపోతే.. దూషిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో పనిచేసే ఒక ఆర్ఓను.. అక్కడి వైకాపా అభ్యర్థి పలుసార్లు హెచ్చరించారు. రాయలసీమలోని పలుచోట్ల కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో కొందరు రిటర్నింగ్ అధికారులు ఏం చేయాలో తెలియక.. కలెక్టర్ స్థాయిలో ఉన్న వారైనా తమ సమస్యకు పరిష్కారం చూపిస్తారన్న ఆశతో జిల్లా ఎన్నికల అధికారులను కలిసి తమపై అధికారపార్టీ ఒత్తిళ్లు లేకుండా చూడాలని కోరుతున్నారు. అయితే అక్కడా వారి సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. జిల్లా అధికారులు కూడా మౌనంగా తమ పని తాము చేసుకుపోతున్నారు.
ఓట్ల లెక్కింపు.. వైకాపా నేతల బెదిరింపులు
పల్నాడులో ఈవీఎం ధ్వంసం, తాడిపత్రి, తిరుపతి తదితర ఘటనల నేపథ్యంలో.. ఆర్ఓల్లో భయాందోళనలు మొదలయ్యాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో.. ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో అనే ఆందోళన వారిలో నెలకొంది. ఇప్పటి నుంచే వైకాపా అభ్యర్థుల నుంచి ఒత్తిళ్లు మొదలయ్యాయి. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్ల నియమాకం నుంచి.. టేబుళ్ల ఏర్పాట్లు సహా వివిధ అంశాలపై తాము చెప్పినట్లు వినాలంటూ కొందరు వైకాపా అభ్యర్థులు చెబుతున్నారు. కొన్నిచోట్ల వారు చెబుతున్నట్లే ఆర్ఓలు వింటున్నా.. మరికొందరు మాత్రం ఎన్నికల సంఘం నిబంధనలను వివరిస్తున్నారు. అలా చేయలేమని స్పష్టం చేస్తుండటంతో వైకాపా నేతలు ఆగ్రహంతో నోటికొచ్చినట్లు నిందలేస్తున్నారనే ఆవేదన కొందరు ఆర్ఓల్లో వ్యక్తమవుతోంది. దీంతో ఆర్ఓలు తమను తప్పించాలంటూ ఎన్నికల సంఘాన్ని అభ్యర్థిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘నేనుండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు..?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్