రాఘవేంద్రస్వామి సన్నిధిలో అన్నామలై

మాజీ ఐపీఎస్‌ అధికారి, తమిళనాడు భాజపా అధ్యక్షుడు అన్నామలై సతీసమేతంగా కర్నూలు జిల్లా మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామిని శనివారం దర్శించుకున్నారు.

Published : 26 May 2024 05:12 IST

మఠం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులతో అన్నామలై దంపతులు 

మంత్రాలయం, న్యూస్‌టుడే: మాజీ ఐపీఎస్‌ అధికారి, తమిళనాడు భాజపా అధ్యక్షుడు అన్నామలై సతీసమేతంగా కర్నూలు జిల్లా మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామిని శనివారం దర్శించుకున్నారు. ముందుగా గ్రామదేవత మంచాలమ్మను, అనంతరం రాఘవేంద్రస్వామి మూలబృందావనాన్ని దర్శించుకున్నారు. వారికి పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు..  శేషవస్త్రం, తలపాగా, పూలమాల, ఫలమంత్రాక్షతలు అందించి ఆశీర్వదించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని