Hepatitis: కర్నూలు, కోనసీమల్లో హెపటైటిస్ ముప్పు
శరీరంలో నిద్రాణంగా దాగి ఉన్న హెపటైటిస్ వైరస్లు కాలేయానికి పెనుముప్పు తెస్తున్నాయి. రక్త మార్పిడి, లైంగిక సంపర్కం, సిరంజ్ల వినియోగంలో సురక్షిత విధానాలు అవలంబించకపోవటం వంటివి ఈ వైరస్ల వ్యాప్తికి దోహదం చేస్తున్నాయి.
విశాఖ, గుంటూరు జిల్లాల్లోనూ కేసులు
బాధితుల్లో తెలంగాణ ప్రజలు కూడా..
నిద్రాణంగా ఉండి కాటేస్తున్న వైరస్లు
కాలేయానికి పెనుప్రమాదం అంటున్న వైద్యులు
ఈనాడు, అమరావతి: శరీరంలో నిద్రాణంగా దాగి ఉన్న హెపటైటిస్ వైరస్లు కాలేయానికి పెనుముప్పు తెస్తున్నాయి. రక్త మార్పిడి, లైంగిక సంపర్కం, సిరంజ్ల వినియోగంలో సురక్షిత విధానాలు అవలంబించకపోవటం వంటివి ఈ వైరస్ల వ్యాప్తికి దోహదం చేస్తున్నాయి. రాష్ట్రంలోని కర్నూలు, కోనసీమ, విశాఖ జిల్లాల్లో ఈ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 11 మధ్య రాష్ట్రంలోని 16 బోధనాసుపత్రుల్లో జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలతో వచ్చినవారికి పరీక్షలు చేసినప్పుడు హెపటైటిస్- బి కేసులు 205, హెపటైటిస్- సి కేసులు 61 బయటపడ్డాయి. ఇందులో గుంటూరు జీజీహెహెచ్లో 30, విజయవాడలో 17, శ్రీకాకుళంలో 12 హెపటైటిస్- బి కేసులు బయటపడ్డాయి. విశాఖపట్నం కేజీహెచ్లో 15, కర్నూలు జీజీహెచ్లో 17 చొప్పున కేసులు రికార్డయ్యాయి. ఫిబ్రవరి 12 నుంచి.. 18 మధ్య హెపటైటిస్- బి కేసులు 15 గుర్తించారు. హెపటైటిస్- సి కేసులు విశాఖలో 14, కర్నూలులో 17 కేసుల చొప్పున తేలాయి. పాలిచ్చే తల్లుల్లోనూ ఈ కేసులు బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
కర్నూలులో రెండేళ్లలో 3,200 కేసులు
కర్నూలు ప్రభుత్వాసుపత్రికి గత రెండేళ్ల కాలంలో వివిధ అనారోగ్య సమస్యలతో వచ్చిన 18,460 మంది రోగులకు హెపటైటిస్-బి నిర్ధారణ పరీక్షలు చేయగా ఏకంగా 2,536 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. వీరిలో 742 మంది మందులు వాడుతున్నారు. ఇప్పటికే పలువురు చనిపోయారు. 491 మందికి చికిత్స అందిస్తున్నారు. 1,884 మందికి హెపటైటిస్-సి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయగా 1,199 మందిలో ఆ వ్యాధి మూలాలు ఉన్నట్లు వెల్లడైంది. తదుపరి మళ్లీ పరీక్షలు చేసి, 692 మందికి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో అత్యధికులు తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల, ఐజ, అలంపూర్ ప్రాంతాలవారు, ఏపీలోని నంద్యాల జిల్లా ప్యాపిలి మండలానికి చెందినవారు ఉన్నారని కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాల గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగ అసోసియేట్ ఆచార్యులు డాక్టర్ మోహన్రెడ్డి తెలిపారు.
కోనసీమ జిల్లాలో 600 కేసులు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో గడిచిన ఏడాది కాలంలో సుమారు 600 హెపటైటిస్ కేసులు నమోదయ్యాయి. అమలాపురం ఏరియా ఆసుపత్రిలో ఈ మధ్యకాలంలో హెపటైటిస్-బి కేసులు 39, సి కేసులు 146 రికార్డయ్యాయి. ఇక్కడ నెలకు సుమారు 20-23 హెపటైటిస్-సి పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రామచంద్రాపురం ఏరియా ఆసుపత్రిలో హెపటైటిస్-బి కేసులు భారీగా వస్తున్నాయి. కొత్తపేట సీహెచ్సీలో హెపటైటిస్-సి కేసులు 48 వచ్చాయి. ఈ ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా 50 సంవత్సరాలు పైబడిన వారిలో కనిపిస్తున్నాయి.
కాలేయ వైఫల్యం, క్యాన్సర్లకు దారితీసే ప్రమాదం
హెపటైటిస్ బి, సి వైరస్ల బారిన పడినవారికి తరచూ కాళ్ల వాపులు, నీరసం వస్తుంటాయి. పచ్చకామెర్లు, రక్తపువాంతులు అవుతుంటాయి. క్రమంగా పనిచేసుకోలేని స్థితికి చేరుకుంటారు. ఈ వైరస్లు దేహంలో దీర్ఘకాలంపాటు తిష్ఠవేసి, కాలేయ వైఫల్యానికి, క్యాన్సర్లకు దారితీస్తున్నాయి. ‘లివర్ సిరోసిస్’ అనే వ్యాధి బారినపడతారు. మూత్ర సంబంధ సమస్యలు తలెత్తుతాయి. జైళ్లల్లోనూ ఈ కేసులు ఉంటున్నాయి.
బ్లేడ్లు, సిరంజిల వాడకంతో వ్యాప్తికి అవకాశం
- డాక్టర్ జగన్మోహన్, హెచ్ఓడీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, విజయవాడ బోధనాసుపత్రి
క్షౌరశాలల్లో ఒకరికి వినియోగించిన బ్లేడ్లు, షేవింగ్ కిట్లను మరొకరికి వాడితే హెపటైటిస్ వైరస్లు వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉంది. దీంతోపాటు డిస్పోజబుల్ సిరంజ్లు అందుబాటులోకి రాకముందు ఒకే సిరంజిని, సూదిని సైతం పలువురికి వినియోగించే సంస్కృతి చాలాచోట్ల కొనసాగింది. కొన్నిచోట్ల ఇప్పటికీ సిరంజ్లు బయటపడేస్తున్నారు. కిడ్నీలు దెబ్బ తింటే.. కనీసం డయాలసిస్ సౌకర్యం ఉంది. లివర్ దెబ్బతింటే అటువంటి సౌకర్యం లేదు. మందుల ద్వారానే జాగ్రత్తపడాలి. హెపటైటిస్-బి వైరస్ నియంత్రణకు మాత్రమే ప్రస్తుతం టీకా అందుబాటులో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.