అయోధ్యలో తితిదే విధానాల అమలు

అయోధ్యలోనూ తితిదే తరహా పరిపాలనా విధానాలు, భక్తుల రద్దీ నియంత్రణ పద్ధతులు అమలుచేసేందుకు చర్యలు చేపట్టామని అయోధ్య రామమందిర తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యుడు దినేశ్‌ రామచంద్ర తెలిపారు.

Updated : 28 May 2024 06:25 IST

రామమందిర ట్రస్టు సభ్యుడు దినేశ్‌ రామచంద్ర 

శ్రీవారి ఆలయం ఎదుట దినేశ్‌  రామచంద్ర  

తిరుమల, న్యూస్‌టుడే: అయోధ్యలోనూ తితిదే తరహా పరిపాలనా విధానాలు, భక్తుల రద్దీ నియంత్రణ పద్ధతులు అమలుచేసేందుకు చర్యలు చేపట్టామని అయోధ్య రామమందిర తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యుడు దినేశ్‌ రామచంద్ర తెలిపారు. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆయన తమ బృందంతో కలిసి శ్రీవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి అయోధ్యలో ఇప్పటికే పర్యటించారని, తితిదే పరిపాలనా విధానాలపై పవర్‌పాయింట్‌ ప్రదర్శన ఇచ్చారని తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీవారి భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను ప్రత్యక్షంగా పరిశీలించామని చెప్పారు. తితిదే అమలు చేస్తున్న దర్శనం, వసతి, అన్నప్రసాదాల వితరణ వంటి కార్యక్రమాలను అయోధ్యలోనూ అనుసరించేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. ప్రస్తుతం అయోధ్యలో రోజూ లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు శ్రీరాముడిని దర్శించుకుంటున్నారని, రద్దీకి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. 


శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు     

తిరుమల శ్రీవారి సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులు సోమవారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి కృష్ణతేజ అతిథిగృహం వరకు క్యూలైన్‌లో వేచిఉన్నారు. వీరికి దాదాపు 20 గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుందని తితిదే వెల్లడించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని