సంక్షిప్తవార్తలు(9)
దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మంగళవారం పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తెదేపా శ్రేణులకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.
‘ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించండి’
ఈనాడు డిజిటల్, అమరావతి: దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మంగళవారం పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తెదేపా శ్రేణులకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిల్లో ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించాలని ఓ ప్రకటనలో కోరారు.
వ్యవసాయ విస్తరణ సేవలకే వీఏఏల నియామకం
ఈనాడు, అమరావతి: గ్రామస్థాయిలో వ్యవసాయ విస్తరణ సేవలు అందించడానికే వ్యవసాయంలో పట్టభద్రులైన వారిని సహాయకులు(వీఏఏ)గా నియమించామని ఆ శాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ తెలిపారు. వీఏఏలు ఎటువంటి ఒత్తిడి లేకుండా సంవత్సరం పొడవునా పనులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ‘రైతు సేవకు దూరంగా ఆర్బీకేలు’ శీర్షికన ఆదివారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనంపై ఆయన వివరణ ఇచ్చారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల్ని ఏపీ సీడ్స్, మార్క్ఫెడ్ నుంచి తెప్పించి ఇస్తున్నామని చెప్పారు.
ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు మనవడి మృతి
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: ఆంధ్రకేసరిగా పేరొందిన స్వాతంత్య్ర సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు మనవడు గోపాలకృష్ణ(65) హైదరాబాద్లోని ఆయన నివాసంలో సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. ప్రకాశం పంతులు రెండో కుమారుడైన హనుమంతరావు కుమారుడే గోపాలకృష్ణ. ఆయన వాణిజ్య పన్నుల శాఖ విభాగంలో రికార్డు సహాయకుడిగా విధులు నిర్వహిస్తూ ఉద్యోగ విరమణ పొందారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధ పడుతూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే తుదిశ్వాస విడిచారు.
మండల కేంద్రాలకు బ్యాగ్లు చేర్చేందుకు చర్యలు
-ప్రవీణ్ప్రకాశ్
ఈనాడు, అమరావతి: విద్యాకానుకలో భాగంగా ఇచ్చే బ్యాగ్లను సకాలంలో మండల కేంద్రాలకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ తెలిపారు. పరిశ్రమల నుంచి 250 ట్రక్కుల్లో బ్యాగ్లు రాష్ట్రానికి వస్తున్నాయని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రవాణాకు అడ్డంకులు రాకుండా ఉండేందుకు అండర్ టేకింగ్ ఇచ్చామన్నారు.
జూన్ పింఛన్లను ఇంటి వద్దే ఇవ్వాలి
సీఎస్ను డిమాండ్ చేసిన మాజీమంత్రి దేవినేని ఉమా
ఈనాడు డిజిటల్, అమరావతి: వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు జూన్ ఒకటి నుంచి ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేసేలా ఆదేశాలివ్వాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డిని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. ‘ఎన్నికలు ముగిశాయి..ఇకనైనా కుట్రలు, కుతంత్రాలు ఆపండి’ అని హితవు పలికారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఎన్నికల్లో సీఎం జగన్కు లబ్ధి చేకూర్చాలనే కుట్రతో జవహర్రెడ్డి, సెర్ప్ సీఈవో మురళీధర్రెడ్డి..పింఛన్దారులను ఇబ్బందిపెట్టారు. వారి సొమ్మును దారి మళ్లించారు. ఈ ఏడాది మార్చి చివరి వారంలో సుమారు రూ.13 వేల కోట్లను జగన్ తన తాబేదారులకు, ఏప్రిల్లో రూ.3 వేల కోట్లను వైకాపా అనుకూల కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారు. తద్వారా తెదేపాపై బురద జల్లాలని చూశారు. వీరి కుట్రలకు సుమారు 60 మంది పింఛన్దారులు చనిపోయారు. వచ్చే నెలైనా లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్లు అందజేయాలి. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు పింఛన్ల పంపిణీ వివరాల్ని బయటపెట్టాలి’ అని దేవినేని ఉమా డిమాండ్ చేశారు.
పదో తరగతి రీవెరిఫికేషన్ జవాబుపత్రాల విడుదల
ఈనాడు, అమరావతి: పదోతరగతి పబ్లిక్ పరీక్షల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ జవాబుపత్రాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్లో భాగంగా 55,966 జవాబు పత్రాలకు దరఖాస్తు చేయగా.. అందులో 43,714 జవాబుపత్రాలను ఇటీవల అందించామని, తాజాగా మరో 10,542 పత్రాలను సోమవారం వెబ్సైట్లో ఉంచామని పేర్కొన్నారు. మిగతా 1,710 జవాబు పత్రాలను త్వరలో విడుదల చేస్తామని చెప్పారు.
నితిన్గడ్కరీకి చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈనాడు డిజిటల్, అమరావతి: భాజపా సీనియర్ నేత, కేంద్రమంత్రి నితిన్గడ్కరీకి తెదేపా అధినేత చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని సోమవారం ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు. తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా నితిన్గడ్కరీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
రహదారి ప్రమాద మృతుల కుటుంబాల్ని ఆదుకోవాలి
-చంద్రబాబు
ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రహదారి ప్రమాదాల్లో పది మంది మృతి చెందడంపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎం.కొంగరవారిపల్లి వద్ద, కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో, కాకినాడ జిల్లా రామవరం వద్ద జరిగిన రహదారి ప్రమాదాలపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాల్ని ఆదుకోవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సోమవారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.
యెర్నేని సీతాదేవి మృతిపై గవర్నర్, చంద్రబాబు విచారం
ఈనాడు, అమరావతి: మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి మృతిపై గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మాజీ మంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి మృతిపై తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, విద్యా శాఖ మంత్రిగా పాలనలో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల