రాయలసీమలో పూర్తిగా విస్తరించిన ‘నైరుతి’

నైరుతి రుతుపవనాలు రాయలసీమ జిల్లాల్లో పూర్తిగా విస్తరించినట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే 3-4 రోజుల్లో కోస్తాంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్,

Updated : 05 Jun 2024 06:56 IST

ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు రాయలసీమ జిల్లాల్లో పూర్తిగా విస్తరించినట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే 3-4 రోజుల్లో కోస్తాంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వివరించింది. మరోవైపు దక్షిణ కోస్తాపై కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. బుధవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని తెలిపింది. మంగళవారం తిరుపతి, చిత్తూరు, శ్రీకాకుళం, కర్నూలు, అన్నమయ్య, వైఎస్సార్, పల్నాడు, ప్రకాశం తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. సాయంత్రం 6 గంటల వరకు అత్యధికంగా తిరుపతి జిల్లా గునుపూడులో 59 మి.మీ. వర్షపాతం నమోదైంది. సోమవారంతో పోలిస్తే మచిలీపట్నం, నందిగామ, గన్నవరం, అమరావతి, ఒంగోలు, కావలి, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, కడప, అనంతపురం, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 3 నుంచి 7 డిగ్రీలు పెరిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని