నీట్ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థుల సత్తా
నీట్-2024 ఫలితాల్లో తమ విద్యార్థులు సత్తా చాటారని శ్రీచైతన్య యాజమాన్యం తెలిపింది.
ఈనాడు, హైదరాబాద్: నీట్-2024 ఫలితాల్లో తమ విద్యార్థులు సత్తా చాటారని శ్రీచైతన్య యాజమాన్యం తెలిపింది. ఆలిండియా ఓపెన్ కేటగిరీలో వి.కల్యాణ్, పి.పవన్కుమార్ రెడ్డి, ముకేశ్ చౌదరి, జి.భానుతేజ సాయి, ఇరాన్ ఖ్వాజీ, దర్శ్ పగ్దార్, ఇషా కొఠారి, ఆదర్శ్ సింగ్ మోయల్, అమీనా ఆరిఫ్ కడివాలాలు 720 మార్కులు గాను 720 మార్కులు పొంది మొదటి ర్యాంకులు సాధించారని చెప్పింది. 715 మార్కులకు పైగా 28 మంది, 710కి పైగా 55 మంది, 700కి పైగా 124 మంది మార్కులు సాధించారని పేర్కొంది. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ అభినందించారు.
నారాయణ విజయ పరంపర
ఈనాడు, హైదరాబాద్: నీట్ ఫలితాల్లో తమ విద్యార్థులు విజయ పరంపరను కొనసాగించారని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ వెల్లడించారు. 720కి 720 మార్కులతో ఆలిండియా ఓపెన్ కేటగిరీల్లో 8 ఫస్ట్ ర్యాంకులతో తమ విద్యార్థులు రికార్డు సృష్టించారన్నారు. సామ్ శ్రేయాస్ జోసెఫ్ ఆలిండియా 1వ ర్యాంకు సాధించగా.. ఆలిండియా ఓపెన్ కేటగిరీలో కె.సందీప్ చౌదరి, షాహ్, పి.ఆదిత్య కుమార్, శశాంక్ శర్మ, ఈషా కొఠారి, ప్రాచిత, దర్శ్ పగ్దార్లు ఫస్ట్ ర్యాంకు సాధించారన్నారు. 13 మంది 715 మార్కులు, 20 మంది 710 మార్కులతో రాణించారని వెల్లడించారు. విద్యార్థులకు, అధ్యాపక బృందానికి అభినందనలు తెలిపారు.
తిరుమల విజయకేతనం
ఈనాడు, అమరావతి: నీట్ ఫలితాల్లో తిరుమల ఐఐటీ, మెడికల్ అకాడమీ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని తిరుమల విద్యాసంస్థల ఛైర్మన్ నున్న తిరుమలరావు వెల్లడించారు. పి.బేబీ అభీజ్ఞ 720 మార్కులకు గాను 715 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో 27వ ర్యాంకును, పి.శివ సంపత్ నాయుడు 715 మార్కులతో 46వ ర్యాంకును సాధించారని తెలిపారు. ఇవేకాక తమ విద్యార్థులు జాతీయ స్థాయిలో 116, 122, 217, 435.. వంటి అత్యున్నత ర్యాంకులు పొందారన్నారు. విద్యార్థులను అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరిలతో కలిసి తిరుమలరావు అభినందించారు.
భాష్యం మెడెక్స్ విజయభేరి
ఈనాడు, అమరావతి: నీట్ ఫలితాల్లో భాష్యం మెడెక్స్ విద్యార్థులు విజయభేరి మోగించారని భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. తమ విద్యార్థి ఎమ్.సాయి జశ్వంత్ రెడ్డి 715 మార్కులతో ఓపెన్ కేటగిరీలో 90వ ర్యాంకు సాధించారన్నారు. వివిధ కేటగిరీలలో టి.మునికార్తీక్ 55వ ర్యాంకు (710 మార్కులు), ఎస్.ప్రణయ్ విక్టర్ 51వ ర్యాంకు (700 మార్కులు)తో పాటు 52 మంది విద్యార్థులు 600లు ఆపైన మార్కులు తెచ్చుకున్నారని వెల్లడించారు. విద్యార్థులు, అధ్యాపకులను ఛైర్మన్ రామకృష్ణ, డైరెక్టర్ హనుమంతరావు, ప్రిన్సిపాల్ బి.హరిబాబులు అభినందించారు.
‘శశి వేలివెన్ను’ ప్రభంజనం
ఈనాడు, అమరావతి: నీట్ ఫలితాల్లో తమ విద్యార్థులు వివిధ కేటగిరీల్లో జాతీయస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని శశి విద్యాసంస్థల ఛైర్మన్ బూరుగుపల్లి రవికుమార్ తెలిపారు. 710 మార్కులతో జి.సాయి మనోజ్ ఆలిండియా 41వ ర్యాంకు, 710 మార్కులతో ఎం.ప్రణవ్ సాయి ఆలిండియా 114వ ర్యాంకు, 705 మార్కులతో ఎల్.సత్యవర్ధన్ ఆలిండియా 109వ ర్యాంకు, 705 మార్కులతో బి.గౌతమి ఆలిండియా 288వ ర్యాంకు సాధించారని వెల్లడించారు. 500లోపు ఆలిండియా ర్యాంకులు ఏడుగురు, 1000 లోపు ర్యాంకులు 12 మందికి, 5 వేల లోపు ర్యాంకులు 52 మందికి, 10 వేల లోపు ర్యాంకులు 94 మందికి వచ్చాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను శశి విద్యాసంస్థల వైస్ఛైర్మన్ బూరుగుపల్లి లక్ష్మీ సుప్రియ అభినందించారు.
నీట్లో శ్రీగోసలైట్స్ అత్యుత్తమ ఫలితాలు
ఈనాడు, హైదరాబాద్: నీట్ ఫలితాల్లో విజయవాడ శ్రీగోసలైట్స్ మెడికల్ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని ఛైర్మన్ నరేంద్రబాబు తెలిపారు. మొత్తం 720 మార్కులకు గాను తమ విద్యార్థులు 9 మంది 700కు పైగా మార్కులు సాధించారని వెల్లడించారు. 520 మంది విద్యార్థులు 600కు పైన మార్కులు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు.
ఎస్ఆర్ విద్యార్థుల ప్రతిభ
హనుమకొండ చౌరస్తా, న్యూస్టుడే: నీట్ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారని ఛైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్రెడ్డి, సంతోష్రెడ్డి తెలిపారు. శృతికీర్తి 662, పి.హర్షిత 652 మార్కులతో ప్రతిభ చాటారని చెప్పారు. కె.రమేష్ 630, ఎం.కీర్తి 626, టి.శాలిని 621, వి.సాయిప్రసాద్ 621 మార్కులు సాధించారని వెల్లడించారు. మరో 105 మందికి పైగా విద్యార్థులు 500, ఆపైగా మార్కులు తెచ్చుకున్నారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!