సంక్షిప్త వార్తలు(9)
భూముల కేటాయింపులు, గుత్తేదారులకు చెల్లింపులు, అధికారుల బదిలీల దస్త్రాలను ఎట్టి పరిస్థితుల్లో ప్రాసెస్ చేయొద్దని రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్భార్గవ్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
భూ కేటాయింపులు, గుత్తేదారుల చెల్లింపుల ఫైళ్లను ప్రాసెస్ చేయొద్దు
రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్భార్గవ్ ఉత్తర్వులు
ఈనాడు, అమరావతి: భూముల కేటాయింపులు, గుత్తేదారులకు చెల్లింపులు, అధికారుల బదిలీల దస్త్రాలను ఎట్టి పరిస్థితుల్లో ప్రాసెస్ చేయొద్దని రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్భార్గవ్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. మంత్రుల పేషీల్లోని ఎలక్ట్రానిక్, ఫిజికల్ దస్త్రాలను భద్రపరచాలని స్పష్టంచేశారు. ఈ ఉత్తర్వులు అన్ని ప్రభుత్వ శాఖలకూ వర్తిస్తాయని తెలిపారు. రాజ్భవన్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రజత్భార్గవ్ ఈ ఆదేశాలు జారీచేశారు. ఇదే విషయమై రాష్ట్ర యువజన, సాంస్కృతిక, పర్యాటక శాఖ తరఫున కూడా రజత్భార్గవ్ మరో ఉత్తర్వు ఇచ్చారు. ఎంపికచేసిన గుత్తేదారులకు మాత్రమే ప్రభుత్వపరంగా చెల్లింపులు జరుగుతున్నాయని రాజ్భవన్కు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.
డీవైఈవో పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలి
ఈనాడు డిజిటల్, అమరావతి: డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్(డీవైఈవో) మెయిన్స్ పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ)కు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తరగతులు, విధుల కారణంగా పరీక్షకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కాలేదని బుధవారం లేఖ రాశారు. పరీక్షను ఆన్లైన్లో నిర్వహించడం వల్ల గ్రామీణ అభ్యర్థులకు సమయం సరిపోలేదని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్, ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నేతలు వేర్వేరు ప్రకటనల్లో ఏపీపీఎస్సీ కార్యదర్శిని కోరారు.
ఈఏపీసెట్ ఫలితాలు ఎప్పుడు?
ఉన్నత విద్యామండలి ఛైర్మన్ రాజీనామాతో ప్రతిష్టంభన
ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్ ఫలితాల విడుదలలో ఉన్నత విద్యామండలి తీవ్ర జాప్యం చేస్తోంది. దీంతో దాదాపు 3 లక్షల మంది విద్యార్థులకు నిరీక్షణ తప్పడం లేదు. ఎన్నికల్లో వైకాపా ఓడిపోవడంతో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పదవికి హేమచంద్రారెడ్డి.. కొన్ని కీలకమైన దస్త్రాలను మాయం చేసిన అనంతరం రాజీనామా చేశారు. ప్రభుత్వం లేనందున రాజీనామాను ఆమోదించడం కుదరదని, కావాలంటే సెలవులో వెళ్లాలని ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు సూచించడంతో హేమచంద్రారెడ్డి మెడికల్ లీవ్లో వెళ్లారు. ఇన్ఛార్జి ఛైర్మన్ బాధ్యతలను వైస్ ఛైర్మన్ రామమోహన్రావుకు అప్పగించారు. ఈఏపీసెట్ ఫలితాలు విడుదలలో కావాలనే జాప్యం చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే ఈఏపీసెట్ ఫలితాలు విడుదల చేసి, కౌన్సెలింగ్కు సిద్ధమవుతున్నారు. ఇక్కడ ప్రవేశపరీక్ష పూర్తయి, ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ కూడా పూర్తి చేశారు. మరోవైపు ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు విడుదల చేయాలని విద్యార్థుల నుంచి డిమాండ్ పెరుగుతున్నా ఎలాంటి నిర్ణయం ప్రకటించడం లేదు. ఛైర్మన్ లేనందున ఫలితాల విడుదలపై ఇన్ఛార్జి ఛైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు.
దళితులకు నమ్మకద్రోహమే వైకాపా పరాజయానికి కారణం
దళిత బహుజన ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి భాగ్యరావు
ఈనాడు, అమరావతి: దళితులకు ప్రత్యేకంగా ఏళ్లుగా అమలవుతున్న 27 సంక్షేమ పథకాలను రద్దు చేసి తీరని ద్రోహం చేయడమే వైకాపా ఘోర పరాజయానికి కారణమని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యరావు పేర్కొన్నారు. స్వయంఉపాధి రాయితీ రుణాలకుగాను రూపాయి కేటాయించకుండా ఎస్సీ కార్పొరేషన్ విభజన పేరుతో జగన్ నాటకాలాడారని బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. దళితులు, గిరిజనులపై వైకాపా నేతలు ఇష్టానుసారం దాడులకు తెగబడుతున్నా అడ్డుకట్ట వేసేందుకు ఏనాడూ ప్రయత్నించలేదని ఆరోపించారు.
దస్త్రాలు, రికార్డులు జాగ్రత్త!
భూముల కేటాయింపులు, బిల్లుల చెల్లింపులు, బదిలీలు చేయొద్దు
ప్రభుత్వ శాఖలకు గవర్నర్ ఆదేశం
ఈనాడు, అమరావతి: వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాల్లోని దస్త్రాలు, రికార్డులను సురక్షితంగా భద్రపరిచేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయా శాఖలు, విభాగాధిపతులకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నుంచి అందిన ఉత్తర్వుల మేరకు రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి (పొలిటికల్) ఎస్.సురేష్కుమార్ ఆయా శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులకు సర్క్యులర్ పంపించారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు భూముల కేటాయింపులు, గుత్తేదారులకు నిధుల విడుదల, అధికారుల బదిలీలకు సంబంధించిన ఎలాంటి దస్త్రాల్నీ ప్రాసెస్ చేయవద్దని స్పష్టం చేశారు. మంత్రుల పేషీల్లోని దస్త్రాలు, ఈ-ఫైల్స్ రూపంలో ఉన్న అన్ని అధికారిక రికార్డులను సురక్షితంగా భద్రపరచాలని ఆదేశించారు.
బిందుమాధవ్, అమిత్బర్దార్పై సస్పెన్షన్ ఎత్తివేత
ఈనాడు డిజిటల్, అమరావతి: ఐపీఎస్ అధికారులు బిందుమాధవ్, అమిత్బర్దార్పై సస్పెన్షన్ను ఎత్తివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులిచ్చింది. పోలింగ్ రోజు, తర్వాత పల్నాడు, అనంతపురం జిల్లాల్లో జరిగిన హింసాత్మక సంఘటనలను అడ్డుకోవడంలో అప్పట్లో ఆయా జిల్లాలకు ఎస్పీలుగా ఉన్న వీరు విఫలమయ్యారనే కారణంతో మే 16న సస్పెండ్ చేస్తూ ఈసీ ఆదేశాలనిచ్చింది. తాజాగా వాటిని ఉపసంహరించుకుంటున్నట్టు పేర్కొంది.
అదనపు ఏజీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజీనామా
ఈనాడు, అమరావతి: అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ) వై.నాగిరెడ్డి, అదనపు పీపీ శెట్టిపల్లి దుష్యంత్రెడ్డి వారి పదవులకు రాజీనామా చేశారు. అదనపు ఏజీ వారి రాజీనామా లేఖను బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు. పీపీ, అదనపు పీపీ రాజీనామా లేఖలను న్యాయశాఖ కార్యదర్శికి పంపించారు. మరోవైపు హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదులు కొందరు ఛాంబర్లను ఖాళీ చేశారు. వైకాపా ఘోర పరాజయం పొందిన నేపథ్యంలో ఏజీ మంగళవారమే రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ఎస్వీబీసీ ఛైర్మన్ సాయికృష్ణ రాజీనామా
వెంకటగిరి, న్యూస్టుడే: ఎన్నికల్లో వైకాపా ఓటమి చెందడంతో.. తితిదే నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్(ఎస్వీబీసీ) పదవికి డాక్టర్ వీబీ సాయికృష్ణ యాచేంద్ర బుధవారం రాజీనామా చేశారు. 43 నెలల పాటు తనకు సహకరించిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. వేంకటేశ్వర స్వామి కృపతో తన పదవికి న్యాయం చేశానని పేర్కొన్నారు.
హామీలను విస్మరించినందుకే ఘోర పరాజయం
నిరుద్యోగ ఐకాస
ఈనాడు డిజిటల్, అమరావతి: ఉద్యోగాల భర్తీ విషయంలో ఇచ్చిన హామీలన్నింటినీ విస్మరించినందుకే జగన్కి ఎన్నికల్లో నిరుద్యోగులు గుణపాఠం చెప్పారని నిరుద్యోగ ఐకాస విమర్శించింది. త్వరలో కొలువుదీరే ఎన్డీయే ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యల్ని పరిష్కరిస్తుందని బుధవారం ఓ ప్రకటనలో ఆకాంక్షించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల