చంద్రబాబును కలిసిన సీఎస్, డీజీపీ

తెదేపా అధినేత, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) జవహర్‌రెడ్డి, డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

Published : 06 Jun 2024 05:05 IST

ఉండవల్లిలో తెదేపా అధినేత చంద్రబాబును కలిసి పుష్పగుచ్ఛాలు అందజేస్తున్న సీఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా

ఈనాడు డిజిటల్, అమరావతి: తెదేపా అధినేత, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) జవహర్‌రెడ్డి, డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. చంద్రబాబుకు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు నీరబ్‌కుమార్‌ ప్రసాద్, కృష్ణబాబు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని