అంతా ‘సర్దు’కుంటున్నారు
రాష్ట్ర ప్రజానీకం జగన్ అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించడంతో ఆ పార్టీ నాయకులు, వారికి అండగా నిలిచిన అధికారులు భయం భయంగా ‘సర్దు’కుంటున్నారు.
కొన్ని పత్రాలు బయటకు.. డేటా చౌర్యం
అప్రమత్తమైన అధికారులు, పోలీసులతో తనిఖీలు
సజ్జల సహా పలువురు సలహాదారుల రాజీనామా
తమను రిలీవ్ చేయాలంటున్న జగన్ భక్త అధికారులు
ఎవరి బదిలీలు వద్దు... ఎవరినీ పంపవద్దు
ఉన్నతస్థాయిలో నిర్ణయం
ఈనాడు-అమరావతి: రాష్ట్ర ప్రజానీకం జగన్ అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించడంతో ఆ పార్టీ నాయకులు, వారికి అండగా నిలిచిన అధికారులు భయం భయంగా ‘సర్దు’కుంటున్నారు. ఐదేళ్ల పాలనలో జరిగిన అక్రమాలు, తప్పిదాలు ఎక్కడ బయటపడతాయో, ఎక్కడ విచారణలను ఎదుర్కోవాల్సి వస్తుందోనని కంగారుపడుతూ.. ఆధారాలు లేకుండా చేసుకుంటున్నారని తెలుస్తోంది. మరో వైపు డిప్యుటేషన్లపై వచ్చిన అధికారులు జారుకునే పనిలో ఉన్నారు. జగన్ హయాంలో ఆయన అరాచకాలకు మద్దతు పలికిన వారు ఆ పోస్టుల నుంచి నెమ్మదిగా తప్పుకొని తమ మాతృశాఖలకు వెళ్లిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇలాంటి ప్రయత్నాలను నిరోధించాలంటూ గవర్నర్ కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ పత్రాలు, విలువైన వస్తువులు, ఇ-డేటా అంతా భద్రంగా ఉంచాలని ఆదేశించింది. దీంతో సంబంధిత అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. మరో వైపు బదిలీలు, ఇతరత్రా నిర్ణయాలు కూడా వద్దని.. ఎవరి డిప్యుటేషన్లనూ రద్దు చేయవద్దని, ఎవరినీ రిలీవ్ చేయవద్దని ఆదేశాలు వచ్చాయి. దీంతో సర్దుకోవడానికి ప్రయత్నించిన అధికారులు కొందరు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు జగన్ వీరవిధేయులుగా ఉండి వివిధ పోస్టులు సంపాదించుకున్న వారు రాజీనామాలు చేస్తున్నారు.
పత్రాలు మాయం, డేటా చౌర్యం...
సచివాలయంలో కొన్ని పత్రాలను మాయం చేసే పని జరుగుతోంది. ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న దువ్వూరి కృష్ణ కార్యాలయంలో కొన్ని కాగితాలు బయటకు తీసుకువెళ్లినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎలక్ట్రానిక్ ఆఫీసుతో సంబంధం లేకుండా కొన్ని ఫైళ్లను నడిపించిన నేపథ్యంలో వాటిని మాయం చేసే ప్రయత్నాలు సాగుతున్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే సచివాలయంలో డేటా చౌర్యానికి ప్రయత్నించినట్లు సమాచారం. గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి గత ఐదేళ్ల డేటాను కొందరు ఐటీ సలహాదారుల సాయంతో తస్కరించినట్లు గుర్తించారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బుధవారం మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయంలో తనిఖీలు చేశారు. ఐటీ విభాగంలోని ఉద్యోగుల కంప్యూటర్లు, ల్యాప్టాప్లను పోలీసు సిబ్బంది పరిశీలించారు. ఉన్నతాధికారులను ఐటీ శాఖ అప్రమత్తం చేయడంతో సచివాలయశాఖ ఉపయోగించే లాగిన్లను..సర్వర్ను అధికారులు నిలిపివేశారు.
సజ్జల సహా పలువురు రాజీనామా
ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో 20 మంది సలహాదారులు ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తమ రాజీనామా లేఖలు సమర్పించారు. జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ఉన్నతవిద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి, తితిదే ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి తదితరులు తమ పదవులకు రాజీనామా సమర్పించారు. రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల సంస్థ ఛైర్మన్ డాక్టర్ చంద్రశేఖరరెడ్డి కూడా ఇదేబాటలో రాజీనామా సమర్పించారు.
ఉద్యోగుల జీతాల విషయంలోను...
కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న తరుణంలో నిధులు అందుబాటులో ఉన్నా ఆర్థికశాఖ అధికారి ఒకరు జీతాలు చెల్లించకుండా నిలిపివేశారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు అనేక మందికి బుధవారం ఉదయానికి కూడా అందలేదు. గత నెలలో ఒకటో తారీకునే జీతాలు, పెన్షన్లు ఇచ్చేందుకు శ్రద్ధ చూపిన అధికారులు ఈ నెల నిర్లక్ష్యం చేశారు. ఒకటి రెండు తేదీల్లో కేవలం కొద్ది మందికి మాత్రమే జీతాలు జమ చేశారు. దీంతో సచివాలయంలో కొందరు ఉద్యోగులు ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణ వద్దకు వెళ్లి జీతాల విషయం ప్రస్తావించారు. తన వద్ద లాగిన్ లేదని వారికి ఆయన బదులివ్వడంతో వారు అవాక్కయ్యారు. ఈ విషయం తెలిసి కొందరు పెద్దలు జోక్యం చేసుకుని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్తో మాట్లాడారు. రిజర్వుబ్యాంకు నుంచి మంగళవారం రుణంగా తీసుకువచ్చిన రూ.4,000 కోట్ల అందుబాటులో ఉన్నా జీతాలు ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. దీంతో వెంటనే నిధుల లభ్యత మేరకు జీతాలు, పెన్షన్లను చెల్లించారు.
సచివాలయంలోని మంత్రులు, సలహాదారుల ఛాంబర్లకు ఉన్న నేమ్ ప్లేట్లన్లు సాధారణ పరిపాలనశాఖ తొలగిస్తోంది. మరో వైపు ఆ పేషీలను, కార్యాలయాలను తమ ఆధీనంలోకి తీసుకుంటోంది.
అధికారుల్లోనూ జంకు
జగన్ వీరభక్త అధికారగణం ఆయా స్థానాల నుంచి మాతృస్థానాలకు, సొంత ప్రాంతాలకు వెళ్లిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇలాంటి ప్రయత్నాలకు అనుగుణంగా ఎవరూ ఉత్తర్వులు ఇవ్వవద్దని తాజాగా ఆదేశాలు వచ్చాయి. తమను రిలీవ్ చేయాలంటూ అనేకమంది అధికారులు దరఖాస్తు చేసుకుంటున్నారు. మాతృసంస్థకు వెళతానంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి స్టాంపులు రిజిస్ట్రేషన్లశాఖ ఐజీ రామకృష్ణ దరఖాస్తు చేసుకున్నారు. తనను ఆంధ్రప్రదేశ్ నుంచి రిలీవ్ చేయాలని గనులశాఖ ఎండీ వీజీ వెంకటరెడ్డి అభ్యర్థించారు. మరో వైపు సమాచార పౌర సంబంధాలశాఖ కమిషనర్ విజయకుమార్రెడ్డి, ఏపీఎఫ్ఎస్ఎల్ ఎండీ మధుసూదన్రెడ్డి, పరిశ్రమలశాఖ కమిషనర్ చిలకల రాజేశ్వర్రెడ్డి తమను రిలీవ్ చేయాలంటూ ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న నేపథ్యంలో డిప్యుటేషన్పై వచ్చిన వారిని ఎవరినీ రిలీవ్ చేయవద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే అధికారులకు ఎవరికీ సెలవులు ఇవ్వకూడదని నిర్ణయించింది. సీఐడీ చీఫ్ సంజయ్ విదేశాలకు వెళ్లేందుకు వీలుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి ఇచ్చారు. తాజాగా సెలవు ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆయన తన విదేశీ పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. రెవెన్యూశాఖలో ఎలాంటి ఫైళ్లనూ ప్రాసెస్ చేయవద్దని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు ఇచ్చారు. రెవెన్యూశాఖ పరిధిలోని కాంట్రాక్టర్లకు నిధుల విడుదల, భూ కేటాయింపులకు సంబంధించిన దస్త్రాలను నిలిపివేయాలని ఆదేశించారు. రెవెన్యూ మంత్రి పేషీలోని రికార్డులు, దస్త్రాలను కూడా జాగ్రత్త పరచాలని సిబ్బందిని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే