ఇక.. విముక్త విశాఖ!
‘నా విశాఖ..నా విశాఖ’ అంటూ ఎక్కడలేని ప్రేమ గుప్పించారు. అధికారంలోకి రాగానే రుషికొండపై విధ్వంసంతో నగరంలో పాదంమోపారు. ‘పరిపాలనా రాజధాని’ అంటూ విలువైన భూములు, ప్రాజెక్టులు గుప్పిట్లోకి తీసుకున్నారు.
అరాచక వైకాపాకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ప్రజలు
కబంధహస్తాల నుంచి నగరం బయటపడ్డట్టే!
ఫలితాలొస్తుండగానే రుషికొండ భవనాలపైకి వెళ్లిన తెదేపా అభిమానులు
వాస్తుకోసం మూసివేసిన టైకూన్ కూడలి డివైడర్ల తొలగింపు
ఇక మిగిలింది ఆంధ్ర వర్సిటీ ప్రక్షాళన.. కబ్జాల కట్టడి
విశాఖ టైకూన్ కూడలి వద్ద డివైడర్లను తొలగిస్తున్న కూటమి నేతలు
ఈనాడు, విశాఖపట్నం: ‘నా విశాఖ..నా విశాఖ’ అంటూ ఎక్కడలేని ప్రేమ గుప్పించారు. అధికారంలోకి రాగానే రుషికొండపై విధ్వంసంతో నగరంలో పాదంమోపారు. ‘పరిపాలనా రాజధాని’ అంటూ విలువైన భూములు, ప్రాజెక్టులు గుప్పిట్లోకి తీసుకున్నారు. ఏకంగా విశాఖలోని ప్రభుత్వ భూములు, కార్యాలయాలు తనఖా పెట్టి రూ.వేల కోట్ల అప్పులు తెచ్చారు... ఇలా విధ్వంసకర పాలనా విధానాలతో విశాఖ విలవిల్లాడిపోయింది. ప్రశాంత నగరం హత్యలు, కిడ్నాప్లు, గంజాయి మత్తుతో వణికిపోయింది. దీనిపై చైతన్యవంతులైన విశాఖవాసులు సార్వత్రిక ఎన్నికల్లో గట్టి తీర్పు ఇచ్చారు. వైకాపా అభ్యర్థులను ఓటుతో ఓడించి ఇంటికి పంపారు. వైకాపా ఐదేళ్లుగా చేసిన ప్రజావ్యతిరేక పనులు, తీసుకున్న చర్యల నుంచి విముక్తి పొందేందుకు జనం ఎంత కసిగా ఓటేశారో ఫలితాల సరళి చూస్తేనే అర్థమవుతుంది.
రుషికొండకు గుండుకొట్టి...:
సముద్రానికి అభిముఖంగా పచ్చని కొండ. దానిపై పర్యాటకశాఖ భవనాల్లో పర్యాటకులకు వసతి, భోజన సదుపాయాలుండేవి. వైకాపా అధికారంలోకి వచ్చాక బాగున్న భవనాలను కూల్చేశారు. రుషికొండకు గుండుకొట్టి లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తరలించారు. రూ.450 కోట్ల ప్రజాధనం వెచ్చించి విలాసవంతమైన భవనాలు నిర్మించారు. పర్యాటకులకు ఆంక్షలు పెట్టారు. రుషికొండకు రెండో వైపు ఉన్న రహదారిని పూర్తిగా మూసేశారు. హెలిప్యాడ్ కోసం పర్యాటక భవనాలు కూలగొట్టారు. రుషికొండపై జరిగిన విధ్వంసం తీరు ప్రజల మనసులో నాటుకుపోయింది. ఎన్నికల ఫలితాలు కూటమికి అనుకూలంగా రావడం మొదలవ్వగానే..అక్కడి సెక్యూరిటీని తప్పించుకుని ఇద్దరు రుషికొండ భవనాలపైకి వెళ్లి తెదేపా జెండా ఎగుర వేయడం కలకలం రేపింది. ఇకపై ఈ భవనాలు ఎలా ఉపయోగిస్తారో చూడాల్సి ఉంది. రుషికొండ వద్ద ఆంక్షలు తొలగించి, రెండో రోడ్డును తెరవాలంటూ నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.
వాస్తుకోసం మూసిన ఆ రహదారి... ఇప్పుడు తెరిచారు..
నగరంలో సిరిపురం వద్ద టైకూన్ కూడలిని గత ఏడాది మూసివేశారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా దాన్ని మూసివేశామంటూ జీవీఎంసీ, పోలీసు అధికారులు పేర్కొన్నారు. వాస్తవానికి ఆ కూడలి ఎదురుగా వివాదాస్పద సీబీసీఎన్సీ స్థలంలో వైకాపా నేత ఎంవీవీ సత్యనారాయణ భారీ ప్రాజెక్టు చేపడుతున్నారు. దానికి వాస్తు దోషమన్న కారణంతో టైకూన్ కూడలి మూసి వేశారనే చర్చ సాగింది. దీంతో దత్ ఐలాండ్ నుంచి వీఐపీ రోడ్డుకు వెళ్లాలంటే ఫ్లైఓవర్ వరకు వెళ్లి తిరిగి రావాల్సిన పరిస్థితి. దీనిపై జనసేన అధినేత పవన్కల్యాణ్ క్షేత్రస్థాయి పరిశీలన చేసి, డివైడర్లు తొలగించాలంటూ డిమాండ్చేశారు. కూటమి అధికారంలోకి రాగానే అక్రమాలపై తొలి ఉక్కుపాదం మోపారు. బుధవారం టైకూన్ కూడలిలో డివైడర్లను, స్టాపర్లను జేసీబీలతో నేతలు తొలగించారు.
విశాఖ నగరం
‘జి-20’ సమయంలో వ్యూ పాయింట్ పేరుమార్చి...
విశాఖ బీచ్ రోడ్డులో తెన్నేటిపార్కు దాటిన తర్వాత సీతకొండ వద్ద వ్యూపాయింట్ ఉంది. దీనిని గతంలో అబ్దుల్ కలాం వ్యూపాయింట్గా పిలిచేవారు. గతేడాది జి-20 సన్నాహక సదస్సుల నేపథ్యంలో నగరంలో సుందరీకరణ పనులు చేపట్టారు. సదస్సు రెండు రోజుల్లో ప్రారంభమవుతుందనగా రాత్రికి రాత్రే వైఎస్సార్ వ్యూ పాయింట్గా బోర్డు ఏర్పాటుచేశారు. అమర్నాథ్, ఇతర మంత్రులు సైతం లవ్ వైజాగ్ సింబల్ పక్కనే ఉన్న వైఎస్సార్ వ్యూపాయింట్ పేరు వద్ద సెల్ఫీలు దిగి హల్చల్ చేశారు. కూటమి విజయకేతనం ఎగుర వేయడంతో ‘అబ్దుల్ కలాం వ్యూపాయింట్’గా గుర్తుతెలియని వ్యక్తులు మార్చేశారు.
ఇక మిగిలింది ఇవే: సేవ పేరుతో తీసుకుని వైకాపా పెద్దలు వ్యాపారం చేసిన హయగ్రీవ, సెయింట్లూక్స్ వంటి విలువైన స్థలాలపై కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉంది. వివాదాల్లో ఉన్న స్థలాల్లో పాగా వేసిన వైకాపా నేతలు పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. న్యాయ వివాదాల్లో ఉండగానే సీబీసీఎన్సీకి సంబంధించి మాస్టర్ప్లాన్ రోడ్డు విస్తరణలో కోల్పోయిన భూమికి వైకాపా నేత ఎంవీవీ సత్యనారాయణకు రూ.63 కోట్ల టీడీఆర్ బాండ్లను అధికారులు ఇచ్చేశారు. ఎంతో విలువైన దసపల్లా భూములు కూడా చేతులు మారాయి. కబ్జాకు గురైన విలువైన భూములు, 596 జీవో తెచ్చి పేదలను బెదిరించి లాక్కొన్న అసైన్డు భూముల వ్యవహారం కొత్త ప్రభుత్వం తేల్చాల్సి ఉంది. ఎన్నికల ఫలితాలతో ‘విముక్త ఆంధ్రప్రదేశ్’ చేశారు.. ‘విముక్త ఆంధ్ర వర్సిటీ’ ఎప్పుడు చేస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అవుతున్నాయి. వీసీ ప్రసాద్రెడ్డి వర్సిటీని వైకాపా కార్యాలయంగా మార్చేశారన్న ఆరోపణలున్నాయి. శిష్యుడైన జేమ్స్ స్టీఫెన్ను రిజిస్ట్రార్గా నియమించడంలో చక్రం తిప్పారని, ఎన్నికల వేళ కళాశాల యాజమాన్యాలతో వైకాపాకు అనుకూలంగా విద్యార్థులతో ఓట్లు వేయించేలా మీటింగ్లు పెట్టారని, బొత్స ఝాన్సీకి ఓటెయ్యాలంటూ విద్యార్థులతో సర్వే పేరు చెప్పి ఫోన్లు చేయించిన ఉదంతాలు ఉన్నాయని కూటమి నేతలు చెబుతున్నారు. వర్సిటీని ప్రక్షాళన చేస్తేనే విద్యావ్యవస్థకు గౌరవం దక్కుతుందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం