హమ్మయ్య.. స్వేచ్ఛ దొరికింది!
వ్యక్తిగత స్వేచ్ఛ అంటే.. శ్వాస తీసుకోవడం లాంటిదే... అయితే, రాష్ట్రంలో మంగళవారం ఉదయం వరకు మనసారా మాట్లాడుకోవడానికి కూడా భయపడే కనిపించని నిర్బంధ పరిస్థితులు ఉండేవి.
ఊపిరి పీల్చుకుంటున్న అధికారులు, ప్రజాప్రతినిధులు
నిన్నటి వరకు వీవోఐపీ కాల్స్లో మాట్లాడాలన్నా భయమే
సర్కారు మారడంతో సాధారణ కాల్స్ చేస్తున్న అధికారులు, నేతలు
గత ప్రభుత్వ హయాంలో ట్యాపింగ్పై తీవ్ర ఆరోపణలు
సమగ్ర విచారణ చేయించాలని వివిధ వర్గాల డిమాండు
ఈనాడు, అమరావతి: వ్యక్తిగత స్వేచ్ఛ అంటే.. శ్వాస తీసుకోవడం లాంటిదే... అయితే, రాష్ట్రంలో మంగళవారం ఉదయం వరకు మనసారా మాట్లాడుకోవడానికి కూడా భయపడే కనిపించని నిర్బంధ పరిస్థితులు ఉండేవి. ప్రభుత్వం మారిన గంటల వ్యవధిలోనే... ఒక్కసారిగా స్వేచ్ఛ లభించినట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల నేతలు ఊపిరి పీల్చుకుంటున్నారు. రెండు రోజుల కిందటి వరకు ఫోన్ చేసినా పలకరించని, ఎస్ఎంఎస్లను కూడా చూడని అధికారులు ఇప్పుడు తమంతట తామే స్వేచ్ఛగా కాల్ చేసి మాట్లాడుతున్నారు. రాజకీయ నేతలు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఐదేళ్ల వైకాపా పాలన సమయంలో... ఎవర్ని కదిలించినా తమ ఫోన్ ట్యాప్ చేస్తున్నారనే కలవరమే! ఏదైనా సమావేశంలో నలుగురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కలిసినా పొడిపొడి మాటలే. ఎవరు వింటున్నారో, వెంటాడుతున్నారో అనే అనుమానమే! అంతెందుకు... కుటుంబ సభ్యులతోనూ స్వేచ్ఛగా మాట్లాడలేని పరిస్థితి. కార్యాలయానికి వచ్చిన వారితో మాట్లాడాలన్నా భయమే వెంటాడింది. బతుకుపై ఆశ కోల్పోయిన ప్రజలకు.. ఇప్పుడు స్వేచ్ఛ లభించిందని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. వైకాపా అధికారాన్ని కోల్పోవడంతోనే... ఒక్కసారిగా స్వేచ్ఛ లభించిన ఆనందం నిజంగానే అన్ని వర్గాల్లోనూ కన్పిస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరుతున్న తరుణంలో... ఫోన్ ట్యాపింగ్పై సమగ్ర విచారణ చేయించాలనే డిమాండ్లు వివిధ వర్గాల నుంచి వస్తున్నాయి.
ఇక్కడా న్యాయమూర్తుల ఫోన్ల ట్యాపింగ్ ఆరోపణలు?
వైకాపా సర్కారు హయాంలో.. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల నేతల ఫోన్లను ఇష్టారాజ్యంగా ట్యాప్ చేశారనే ఆందోళనలు వెల్లువెత్తాయి. ఏపీ హైకోర్టులోని న్యాయమూర్తుల ఫోన్లను సైతం ట్యాప్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతో.. ఐపీఎస్ అధికారి సారథ్యంలో ట్యాపింగ్ చేశారని, దీనిపై సీబీఐ ఆధ్వర్యంలో సమగ్ర విచారణ చేయించాలని కోరుతూ 2020లో హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఇప్పటికే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో కొందరు పోలీసు అధికారులు అరెస్టై జైలుకు వెళ్లారు. న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేశారంటూ పత్రికల్లో వచ్చిన వార్తలను అక్కడి హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది.
ఆధారాలు నాశనం చేశారా?
ప్రభుత్వం మారినందున వైకాపా అనుకూల అధికారుల్లో కలవరం మొదలైంది. ఇందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేశారనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ మాదిరేే... ఏపీలోనూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ వైకాపా నుంచి ఇటీవలే తెదేపాలో చేరిన మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తాజాగా ఆరోపించారు. ఇంటెలిజెన్స్ విభాగాధిపతి ఆధ్వర్యంలో తమ ఫోన్లు ట్యాప్ చేశారని గతంలో వైకాపా ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కూడా ఆరోపించారు.
ఐదేళ్లూ భయం నీడన బతుకే...
వైకాపా అధికారంలోకి వచ్చాక... నెలా, రెండు నెలలపాటు అధికారులు స్వేచ్ఛగా మాట్లాడినా... తర్వాత మీరు ఫలానా వారితో ఎందుకు మాట్లాడుతున్నారనే ప్రశ్నలు పెద్దల నుంచి వచ్చాయి. దీంతో తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారనే అనుమానాలు అధికారులందర్నీ వెంటాడాయి. అప్పటి నుంచి ఉన్నతాధికారులు తరచూ ఫోన్లు మార్చారు. ఆర్థికంగా తట్టుకోగలిగిన వారైతే... 15 రోజులు, నెల, రెండు నెలలకో ఫోన్ మార్చారు. ట్యాపింగ్ మాత్రమే కాదు... ఫోన్లో మాల్వేర్ చొప్పించి యాప్లను ఇన్స్టాల్ చేసి, మైక్రోఫోన్ ద్వారా సంభాషణలు వింటున్నారనే అనుమానాలూ అధికారుల్లో ఉండేవి. అందుకే ఎవరైనా తమను కలిసేందుకు వచ్చినా.. ఫోన్లను దూరంగా ఉన్న గదిలో పెట్టి రావాలని చెప్పేవారు. తన ఫోన్లో నుంచి ఏమైనా రికార్డు చేయొచ్చనే భయంతో దాన్నీ సోఫా సందుల్లో కుక్కేసేవారు. తరచూ ఫోన్లను ఫార్మాట్ చేసే విధానమూ నేర్చుకున్నారు.
ప్రజా సంఘాల నేతలనూ వెన్నాడారు!
వైకాపా హయాంలో ఉద్యోగ సంఘాలు, ప్రజాసంఘాల నేతలనూ పోలీసులు వెంటాడారు. ఆంగన్వాడీ, ఆశ, సీపీఎస్ ఉద్యోగ సంఘాల నేతలు ఎవరైనా ఇద్దరు తాము చేయాలనుకున్న ధర్నాల గురించి ఫోన్లలో మాట్లాడుకుంటే... పోలీసులు అక్కడ వాలిపోయేవారు. ఫోన్ ట్యాపింగ్ లేకుంటే ఇంత పక్కా సమాచారం ఎలా తెలుస్తుందని వారు ప్రశ్నించారు. వీటన్నింటికి సమాధానం చెప్పకుండా.. వారిని అణగదొక్కారు.
మరి... సురక్షిత మార్గమేంటి?
ఫోన్లు ట్యాప్ కాకుండా చూసుకోవడానికి ఉన్నతాధికారులు... మొదట సాధారణ కాల్స్ నుంచి వాట్సప్కు మారారు. అదీ సురక్షితం కాదని తెలిసి.. సిగ్నల్ యాప్లోకి వెళ్లారు. టెలిగ్రామ్ ద్వారా కొన్నాళ్లు కాల్ చేసి మాట్లాడారు. ఐఫోన్ కొనుక్కుని ఫేస్టైమ్ వినియోగించారు. ఇలా వీవోఐపీ (వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్) మార్గంలో ఎన్ని చేసినా.. ట్యాపింగ్ను తప్పించుకోవడం కష్టమేనని తెలుసుకుని ఫోన్కు దూరంగా ఉండటమే అలవాటు చేసుకున్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులతో వ్యక్తిగత విషయాలు మాట్లాడే సమయంలోనూ ఫోన్ను పక్కగదిలో దూరంగా పెట్టేసి వచ్చేంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నారు. కొందరైతే ఏడాదికి రూ.10 వేలు ఖర్చు చేసి ఐటీ సంస్థలు సమాచార భద్రతకు ఉపయోగించే వీపీఎన్ (వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్) విధానంలోకి మారారు.
సమగ్ర విచారణ చేయిస్తేనే...
ఫోన్ ట్యాపింగ్పై అధికారికంగా ఎక్కడా ఆధారాలు దొరక్కుండా కొన్ని ప్రైవేటు సంస్థలకు బాధ్యతలు అప్పగించి వారి ద్వారా వ్యవహారం చక్కబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడ నుంచి ట్యాప్ చేసినా.. ఎవరు చేయించినా ప్రస్తుత టెక్నాలజీ కాలంలో వెలికితీయడం అసాధ్యమేమీ కాదు. కొత్త ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి, సమగ్ర విచారణకు ఆదేశించాలని రాజకీయ నాయకులు, అధికారులు డిమాండు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల