సంక్షిప్త వార్తలు(8)
భూ మాఫియాకు కొమ్ముకాసిన వారిపై చర్యలు చేపట్టాలి
తూర్పుగోదావరి జిల్లా గౌతమి సేవాదళ్ ఛైర్మన్ డిమాండు
ఈనాడు, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం గ్రామీణం పరిధిలోని కవలగొయ్యిలో రూ.100 కోట్ల విలువైన 15.53 ఎకరాలకు సంబంధించిన దస్త్రాలు మార్చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా గౌతమి సేవాదళ్ ఛైర్మన్ బత్తుల మధుబాబు శుక్రవారం డిమాండు చేశారు. ఈ భూమి విషయంలో రాజమహేంద్రవరంలో పని చేసిన పీపీవీ గోపాలకృష్ణ (తహసీల్దార్), గొలుగూరి బాపిరాజు (డీటీ), కె.రామకృష్ణ, జి.శ్రీనివాసరెడ్డి (సర్వేయర్లు), పోలీసు శాఖకు చెందిన పి.కనకారావు, జి.చెన్నకేశవరావు (సీఐలు), ఆర్.రఘురామ్ (హెచ్సీ) విజయవాడకు చెందిన హరిబాబుకు అనుకూలంగా పని చేశారని, అప్పట్లో దీనిపై అభియోగాలు మోపుతూ సీఐడీ ఛార్జిషీట్ నమోదు చేసి కాకినాడ న్యాయస్థానంలో దాఖలు చేసిందన్నారు. కానీ, వీరిపై చర్యలు తీసుకోకుండా కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అడ్డుకున్నారని ఆరోపించారు. మాజీ సీఐడీ చీఫ్ సంజయ్ సహకారంతో అక్రమార్కులను ఇప్పటికీ అరెస్టు చేయలేదన్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అక్రమార్కులపై చర్యలు తీసుకొని, వారికి సహకరించిన జవహర్రెడ్డి, సంజయ్లపై శాఖాపరమైన విచారణ చేపట్టాలని డిమాండు చేశారు.
తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారుగా... విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్దాస్
ఈనాడు, హైదరాబాద్: సుదీర్ఘ కాలంపాటు నీటిపారుదల, జలవనరుల రంగంలో విధులు నిర్వర్తించిన అనుభవమున్న విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ను తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 1987 బ్యాచ్కి చెందిన ఆదిత్యనాథ్దాస్ ఉమ్మడి రాష్ట్రంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. విభజన అనంతరం ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా, ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2021 సెప్టెంబరులో పదవీ విరమణ చేశారు.
ఇద్దరు సలహాదారుల తొలగింపు
ఈనాడు, అమరావతి: ఆరోగ్యశ్రీ ట్రస్టు సలహాదారు బాధ్యతల నుంచి ఆర్.గోవింద్హరిని, ఎన్నారై-మెడికల్ ఎఫైర్స్ (పీడియాట్రిక్ కేర్) బాధ్యతల నుంచి వాసుదేవ.ఆర్.నల్లిపిరెడ్డిని తప్పిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏంటీ కృష్ణబాబు శుక్రవారం ఆదేశాలు జారీచేశారు.
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్సీ రఘువర్మ
ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ కోరారు. విజయవాడలో శుక్రవారం నిర్వహించిన ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఆర్సీ నివేదిక త్వరగా వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని, మెగా డీఎస్సీ ప్రకటించాలని అన్నారు. అనంతరం అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల మాట్లాడుతూ.. ‘‘గత ప్రభుత్వం ఉద్యోగులను వేధింపులకు గురి చేసింది. ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టకుండా బోధన భారం మోపింది. పాఠశాలల విలీన ప్రక్రియతో ప్రాథమిక బడుల ఉసురుతీసింది. వీటన్నింటినీ కొత్త ప్రభుత్వం సరిదిద్దాలి’’ అని కోరారు. సమావేశంలో పూర్వ ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాదరావు పాల్గొన్నారు.
ఐటీఐల్లో కాంట్రాక్టు ఉద్యోగుల సేవలు పొడిగింపు
ఈనాడు, అమరావతి: ప్రభుత్వ ఐటీఐల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న 651 మంది కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సహాయ శిక్షణ అధికారులు, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఆఫీస్ సబార్డినెట్స్, రాత్రి కాపలాదారుల సేవలను పొడిగించింది.
పాలిటెక్నిక్ కళాశాలల్లో అకడమిక్ ఆడిట్
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి అకడమిక్ ప్రమాణాలు పెంచేందుకు ఆడిట్ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బ్రాంచిల వారీగా అకడమిక్ ఆడిట్ బృందాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ బృందాలు సెమిస్టర్కు ఒకసారైనా కళాశాలలకు వెళ్లి అకడమిక్ ఆడిట్ నిర్వహిస్తాయి. బోధన, అభ్యసన విధానాలు, అధ్యాపకుల సంఖ్య, పనిభారం, పారిశ్రామిక శిక్షణ, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర అంశాలను ఈ కమిటీలు పరిశీలిస్తాయి.
‘నీరు-చెట్టు బిల్లులపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారు’
ఈనాడు డిజిటల్, అమరావతి: గత తెదేపా ప్రభుత్వ హయాంలో నీరు-చెట్టు పథకంలో చేపట్టిన చెరువులు, కాలువల్లో పూడికతీత పనుల పెండింగ్ బిల్లుల గురించి తెదేపా అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు పెండింగ్ బిల్లుల గ్రీవెన్స్సెల్ ఇన్ఛార్జి ఆళ్ల వెంకటగోపాలకృష్ణారావు తెలిపారు. విజయవాడలో శుక్రవారం ఆయన మాట్లాడారు. చంద్రబాబును గురువారం రాత్రి ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిసినట్లు పేర్కొన్నారు. గతంలో నీరు చెట్టు పథకం పనుల బిల్లులను వైకాపా ప్రభుత్వం కక్షపూరితంగా నిలిపివేసిందని గుర్తుచేశారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించినా, ప్రభుత్వం పూర్తిస్థాయిలో చెల్లించలేదని తెలిపారు. రూ.425 కోట్ల బకాయిలపై చంద్రబాబుకు నివేదిక అందజేయగా, ఆయన సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. బకాయిలపై సమీక్షించి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారని వివరించారు.
‘ఖాళీలన్నీ కలిపి మెగా డీఎస్సీ ఇవ్వాలి’
ఈనాడు, అమరావతి: పాఠశాలల్లోని అన్ని ఖాళీలను కలిపి మెగా డీఎస్సీగా మార్చాలని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి కోరారు. మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే చేస్తానని చంద్రబాబు ప్రకటించినందున ఒకేసారి అన్ని ఖాళీలకు డీఎస్సీ ప్రకటించాలని పేర్కొన్నారు. ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లోనూ ఎస్జీటీ, భాషోపాధ్యాయ, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని విన్నవించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్