‘ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి’

రాష్ట్రంలో ఎన్నికల లెక్కింపు ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సుల కోసం వచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ) ముకేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు.

Updated : 08 Jun 2024 06:21 IST

ఆలయం ఎదుట కుటుంబసభ్యులతో సీఈఓ ముకేశ్‌ కుమార్‌ మీనా

తిరుమల, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఎన్నికల లెక్కింపు ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సుల కోసం వచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ) ముకేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు. కుటుంబసభ్యులతో కలిసి తిరుమలకు వచ్చిన ఆయన శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం, అధికారులు తీర్థప్రసాదాలు వారికి అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల సీఈఓ మాట్లాడారు. ‘ఎన్నికల లెక్కింపు ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల ప్రక్రియను ప్రొఫెషనల్‌ పద్ధతిలో నిర్వహించాం. కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉంది’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని