Ramoji Rao: బాధ్యతల వీలునామా!
వీలునామా...ఒక తండ్రి తన పిల్లల మేలుకోరి అందించే ఓ బృహత్తర పత్రం. మామూలు మనుషులైతే తమ ఆస్తిపాస్తుల వివరాలే వీలునామాగా రాస్తారు. మరి మహామనీషి అయిన రామోజీరావు ఏం రాసి ఉంటారు? ఎవరికి రాసి ఉంటారు?
వీలునామా...ఒక తండ్రి తన పిల్లల మేలుకోరి అందించే ఓ బృహత్తర పత్రం. మామూలు మనుషులైతే తమ ఆస్తిపాస్తుల వివరాలే వీలునామాగా రాస్తారు. మరి మహామనీషి అయిన రామోజీరావు (Ramoji Rao) ఏం రాసి ఉంటారు? ఎవరికి రాసి ఉంటారు? ఇంకెవరికి... తాను కన్న బిడ్డల కంటే మిన్నగా ప్రేమించే తన గ్రూపు సంస్థల ఉద్యోగుల కోసమే ఆయన ఓ వీలునామా రాసిపెట్టి ఉంచారు. ప్రతి ఉద్యోగీ ఓ సమర్థ నిబద్ధ సైనికుడై కదలాలని.. సృజనశక్తితో సవాళ్లను అధిగమించాలని చెబుతూనే అన్ని విజయాల్లోనూ తన సైన్యం మీరేనంటూ అందరిలో స్ఫూర్తి రగిలించారు. తాను నిర్మించిన సంస్థలు, వ్యవస్థలు సుదృఢంగా కలకాలం నిలవాలంటే పునాదులు మీరేనని చెప్పారు.
‘నా జీవన గగనంలో మబ్బులు ముసురుకొంటున్నాయి...
వానగా కురవడానికో, తుపానై విరుచుకుపడటానికో కాదు- నా మలి సంధ్యాకాశానికి కొత్త రంగులు అద్దడానికి’ అన్నాడు రవీంద్ర కవీంద్రుడు. దశాబ్దాలుగా కర్మసాక్షి తొలి వేకువ కిరణాల్లోని చైతన్యస్ఫూర్తిని అనునిత్యం గుండెల్లో పొదువుకొని, సప్తాశ్వ రథారూఢుని కాలగమన వేగంతో సృజన పౌరుషానికి పదునుపెట్టుకొని, తరాల అంతరాలు తెలియనంతగా నిరంతర శ్రామికుడిగా పరుగులు పెట్టిన నాకు- విశ్వకవి మాటలు గుర్తుకొస్తున్నాయిప్పుడు!
ముదిమి మీద పడినా, ‘మార్పు నిత్యం... మార్పు సత్యం’ అని ఘోషించే నా మదిలో నవ్యాలోచనల ఉరవడి పోటెత్తుతూనే ఉంది. ఎప్పుడు ఏ తీరో, ఏ నాటికి ఏ తీరమో తెలియని వార్ధక్యాన్నీ సార్థక్యం చేసుకోవాలన్న తపనే- రామోజీ గ్రూప్ కుటుంబపెద్దగా మీ అందరినీ ఉద్దేశించి ఈ లేఖ రాయడానికి నన్ను ప్రేరేపించింది. ఒక విధంగా ఇది భవిష్య ప్రణాళిక. రామోజీ గ్రూప్ సంస్థల సిబ్బందిగా మీ అందరికీ బృహత్ లక్ష్యాల కరదీపిక!
వ్యక్తికి బహువచనం శక్తి. రామోజీ గ్రూప్ సంస్థలన్నీ నా ఆలోచనల అంకురాలే అయినా, కోట్లాది జనవాహినికి ప్రీతిపాత్రమైన శక్తిమంత వ్యవస్థలుగా అవన్నీ ఎదిగి రాజిల్లుతున్న ఘనతలో- వ్యక్తిగా, వ్యష్టిగా మీరు యావన్మందీ వృత్తి నిబద్ధతతో చేసిన కృషి ఎంతో ఉంది. ఆయా సంస్థల అభివృద్ధిలో ప్రత్యక్ష పాత్రధారులై, వృత్తిగత విలువలకు అంకితమై, సంస్థ పేరే ఇంటిపేరుగా సమాజంలో పేరెన్నికగన్న ఉద్యోగులు ఎందరో నాకు తెలుసు... రామోజీ గ్రూప్ సంస్థల్లో పనిచేయడం ఉద్యోగ శ్రేణులకు ఎంత గౌరవమో, మరెక్కడా లేని స్థాయి క్రమశిక్షణ, సమయపాలన, పని సామర్థ్యం... అన్నింటినీ మించి సంస్థతో మమేకమయ్యే విశిష్ట లక్షణం గల సిబ్బంది ఉండటం నాకు గర్వకారణం. కృషితో నాస్తి దుర్భిక్షం- ఇది, దశాబ్దాలుగా నేను త్రికరణశుద్ధిగా ఆచరిస్తున్న వ్యాపార సిద్ధాంతం! కాబట్టే, నా సంస్థలన్నీ ప్రజాప్రయోజనాలతో నేరుగా ముడివడి, విస్తృత మానవవనరుల వినియోగంతో జతపడి- పని ప్రమాణాలతో ఉన్నత విలువలకు పట్టం కడుతున్నాయి. దశాబ్దాలుగా వెన్నంటి నిలిచి, నా ఆశయ సాఫల్యానికి సైదోడుగా నిలిచిన యావత్ సిబ్బందికీ కృతజ్ఞతాంజలి!
చేసే పని, చేపట్టే ప్రాజెక్టు ఏదైనా అద్వితీయంగా రాణించాలి గాని, రెండో స్థానంలో సర్దుకోలేకపోవడం నా జీవలక్షణం. ఆ తపనతోనే, జీవితమనే కొవ్వొత్తిని రెండువైపులా వెలిగించి మార్గదర్శి మొదలు ఈటీవీ భారత్ వరకు అన్నింటినీ అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి, తెలుగుజాతి కీర్తి పతాకను సమున్నతంగా ఎగరేయడానికి అక్షరాలా నేను చేసింది అసిధారా వ్రతం. జీవన పర్యంతం పరితపించి, పరిప్లవించి నేను నిర్మించిన సంస్థలు, వ్యవస్థలు సుదృఢంగా కలకాలం నిలవాలన్నదే నా ఆకాంక్ష. ప్రత్యక్షంగా పాతిక వేలమంది ఉపాధికి, పరోక్షంగా మరో పాతిక వేలమంది జీవన భుక్తికి ఆధారభూతమైన రామోజీ గ్రూప్ సంస్థల భవిష్యత్తుకు పూర్తి భరోసా ఇచ్చేలా పటిష్ఠ యాజమాన్య, మార్గదర్శక పునాదుల్ని సిద్ధం చేశాను. నా తదనంతరం కూడా, సమున్నత సంప్రదాయాలు సర్వదా కొనసాగి రామోజీ సంస్థల ఖ్యాతి ఇంతలంతలయ్యేలా మీరంతా విద్యుక్త ధర్మానికి నిబద్ధమవ్వాలని కోరుకొంటున్నాను.
సమాచారం విజ్ఞానం వినోదం వికాసం- ఏ జాతి భవితనైనా దేదీప్యమానం చేసే నాలుగు కీలక రంగాలివి. రామోజీ గ్రూప్ సంస్థలన్నీ ఆ నాలుగు మూలస్తంభాలపైనే నిలబడి నిరంతర ప్రజాసేవా యజ్ఞంలో పాల్పంచుకొంటున్నాయి. ఏనాటికీ చెక్కుచెదరని ప్రజావిశ్వాసం, సమాదరణలే వెన్నుదన్నుగా పురోగమిస్తున్నాయి. జ్వలనశీల జర్నలిజంలో ‘ఈనాడు’ జైత్రయాత్ర; ‘ఉషోదయ’ ఇతర ప్రచురణల ప్రయోజకత్వం జగద్విదితం. రాష్ట్రాల సరిహద్దులు దాటి విస్తరించిన ‘మార్గదర్శి’ కోట్లాది మదుపరులకు అక్షరాలా కొంగుబంగారం. దేశం నలుమూలలకూ చొచ్చుకుపోతున్న ‘ఈటీవీ’, ఈటీవీ భారత్ నెట్వర్క్లు మన బలం. తెలుగింటి రుచుల రాయబారిగా ‘ప్రియ’ స్థానం పదిలం. రామోజీ ఫిల్మ్ సిటీ దేశానికే తలమానికం.
ఇలా- అన్ని విజయాల్లోనూ నా సైన్యం మీరు...
‘రామోజీ’ ఉద్యోగులంటేనే- క్రమశిక్షణకు మారుపేరు!
ఇకముందూ- మీ ఉద్యోగం సంస్థతో అనుబంధంగా ఒదిగి.. స్వామికార్యం స్వకార్యంలా ఉద్యోగ సోపానంలో ఎదిగి.. సృజన శక్తితో సవాళ్లను అధిగమించి.. రామోజీ గ్రూప్ దిగ్విజయ యాత్ర అప్రతిహతమయ్యేలా.. ప్రతి ఉద్యోగీ ఓ సమర్థ నిబద్ధ సైనికుడై కదలాలి!
చెదరని నమ్మకానికి రామోజీ గ్రూప్ సంస్థలే చిరునామా... దాన్ని నిలబెట్టాల్సిన కర్తవ్యాన్ని మీపై మోపుతూ- ఇది నేను రాస్తున్న బాధ్యతల వీలునామా!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి కోరల్లో.. తిరునగరి
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
-
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?