రామోజీరావు మరణం తెలుగు సమాజానికి తీరని లోటు
మా కుటుంబం ఈ స్థాయిలో ఉందంటే ఆయన ఒక కారణం. ఆయన స్థాపించిన సంస్థల్లో లక్షలమంది ఉపాధి పొందుతున్నారు. ఏ ఉద్యోగిని కదలించినా అదే స్ఫూర్తిని కలిగి ఉన్నారంటే ఆయన ఎంత బలంగా ఆ సంస్థలను నడిపించారో అర్థం చేసుకోవచ్చు.
తెదేపా కేంద్ర కార్యాలయంలో రామోజీరావు చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నాయకులు వర్ల రామయ్య, బొండా ఉమా, అశోక్బాబు, కొండ్రు మురళి తదితరులు
మా కుటుంబం ఈ స్థాయిలో ఉందంటే ఆయన ఒక కారణం. ఆయన స్థాపించిన సంస్థల్లో లక్షలమంది ఉపాధి పొందుతున్నారు. ఏ ఉద్యోగిని కదలించినా అదే స్ఫూర్తిని కలిగి ఉన్నారంటే ఆయన ఎంత బలంగా ఆ సంస్థలను నడిపించారో అర్థం చేసుకోవచ్చు. వయసు, ఆరోగ్యం సహకరించకపోయినా పోరాటపటిమ వదిలిపెట్టలేదు. అది మా అందరికీ స్ఫూర్తిదాయకం.
రామ్మోహన్నాయుడు
ఆయన ఒక లెజెండ్. ఒక పోరాటయోధుడు. ఏపీలో దుర్మార్గపాలనను ఓడించాలన్న తపనతో ప్రజల కోసం పోరాటం చేశారు. ఈనాడు, ఈటీవీ ద్వారా ప్రముఖపాత్ర పోషించారు. ఎన్నికల ఫలితం వచ్చిన తర్వాత.. తన పోరాటం ఫలించిందని, ఇక పని పూర్తయిందని అనుకున్నారో ఏమో. అందుకే ఆయనను మనం కోల్పోయాం. సమాజానికి తీరని లోటు ఏర్పడింది.
ఎం.శ్రీభరత్
నేనీ స్థాయిలో ఉన్నానంటే ఆయన స్ఫూర్తే కారణం. ఎంతోమంది యువకులకు మార్గదర్శకులుగా ఉన్నారు. జర్నలిజంలోనే కొత్త ఒరవడి తీసుకొచ్చిన వ్యక్తి. ఈనాడు ద్వారా ప్రజల దగ్గరకు వెళ్లారు. ఎంతోమందికి జీవనోపాధి చూపారు. మచ్చలేని వ్యక్తి. ఎన్నికలకు ముందు, ఫలితాలు వచ్చేముందు కూడా మాట్లాడాను. మిషన్ పూర్తయింది. విజయం సాధించాం అన్నారు. కానీ, ఆ తర్వాతిరోజే ఆస్పత్రిలో చేరి, మనకు లేకుండా పోవడం దురదృష్టకరం.
కంభంపాటి రామ్మోహన్రావు
లక్షలమందికి ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి. ఎదిగిన ప్రతి మెట్టూ ఉన్నత విలువలతో కూడుకున్నది. సమాజంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకున్న వ్యక్తి. ఎప్పుడు కలిసినా యువతకు స్ఫూర్తిదాయకమైన సందేశాలను ఇచ్చేవారు. తెలుగుజాతి ఒక మహోన్నతమైన వ్యక్తిని కోల్పోయింది.
ఏలూరి సాంబశివరావు
రామోజీ ఫౌండేషన్ ద్వారా పెదపారుపూడికి రూ.20 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. దేశంలో ఎక్కడ ఏ కష్టం వచ్చినా ఫౌండేషన్ ద్వారా సేవలు అందించారు. మార్గదర్శి ఎన్నో పేద కుటుంబాలకు వెలుగునిచ్చింది. ఈనాడు పత్రిక జాతీయస్థాయిలో అక్షరవిప్లవాన్ని తీసుకొచ్చింది. ఏ రంగంలోనైనా రామోజీరావు ఆయనకు ఆయనే సాటి.
దేవినేని ఉమామహేశ్వరరావు
చెమ్మగిల్లిన కళ్లతో రామోజీరావు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న వీరంతా కాకినాడ గ్రామీణంలోని రమణయ్యపేట ఆదర్శ ఆశ్రమంలోని వృద్ధులు. గతంలో ఈ ఆశ్రమానికి రామోజీరావు ఇన్వర్టర్, బాటరీ సౌకర్యం కల్పించినట్లు వారు గుర్తుచేసుకున్నారు.
తెలుగువారి ఖ్యాతిని ఇనుమడింపజేశారు
నక్కా ఆనంద్బాబు
పత్రిక, టీవీ, సినీ రంగాల్లో రామోజీరావు తనదైన ముద్ర వేశారు. తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేశారు. క్రమశిక్షణతో అంచెలంచెలుగా ఆయన ఎదిగిన తీరు అందరికీ ఆదర్శం.
రామోజీరావు మరణం తెలుగు పత్రికా రంగానికి తీరని లోటు. తెలుగు భాష సాహిత్యాభివృద్ధికి విపుల, చతుర, తెలుగు వెలుగు వంటి పత్రికలను తీసుకొచ్చి కవులు, రచయితలు, సాహిత్యాభిమానుల మనసుల్లో ఆయన స్థానం సంపాదించుకున్నారు. కొత్తగా రాస్తున్న ఎంతో మంది కవులు రామోజీ స్థాపించిన పత్రికల ద్వారానే పరిచయం అయ్యారు. ఆయన మరణం తెలుగు సాహిత్య సమాజానికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.
కెంగార మోహన్, సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు
కె.సత్యరంజన్, సాహితీ స్రవంతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పేరు
వర్ల రామయ్య
రామోజీరావు అనే పేరు తెలుగువారి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. మొదటి నుంచీ ఆధునిక భావాలతో ప్రపంచీకరణకు కృషి చేసిన మహానుభావుడు. కృష్ణా జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి, నేడు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మృతి తెలుగు ప్రజలకు తీరని లోటు.
ప్రజాశ్రేయస్సు కోసం పరితపించేవారు
పంచుమర్తి అనురాధ
ప్రజాశ్రేయస్సు కోసం రామోజీరావు నిరంతరం తపించేవారు. ఈనాడులో ప్రచురితమయ్యే ప్రతి అక్షరం బడుగు బలహీన వర్గాలకు రక్షణగా నిలిచింది. విలువలతో కూడిన వ్యవస్థల్ని, ప్రజల శ్రేయస్సుకు తొలి ప్రాధాన్యాన్ని ఇచ్చే వ్యాపార సంస్థల్ని ఆయన స్థాపించారు.
జనహితమే ఆయన అభిమతం
వేపాడ చిరంజీవిరావు
ఆయన ప్రజాపక్షపాతి. జనహితమే ఆయన అభిమతం. స్వయం కృషితో అత్యున్నత స్థితికి చేరి చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్నారు.
‘ముందడుగు’తో స.హ.చట్టంపై ప్రజా చైతన్యం
- న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు
సమాచార హక్కు చట్టం గురించి ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు ఎంత వ్యయమైనా ఆలోచించని దార్శనికుడు రామోజీరావు అని ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు అన్నారు. ‘ఈనాడు’ నిర్వహించిన ‘ముందడుగు’ కార్యక్రమానికి ఉమ్మడి రాష్ట్రంలో రీసోర్స్ పర్సన్గా కొనసాగే అవకాశాన్ని ఆయన తనకు ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. రాజమహేంద్రవరం ప్రెస్క్లబ్లో నిర్వహించిన కార్యక్రమంలో రామోజీరావుకు ఆయన నివాళి అర్పించారు.
తెలుగు జాతికి మార్గదర్శకులు
- ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు
కొన్ని దశాబ్దాలపాటు తెలుగు భాష కోసం.. తెలుగు ప్రజల కోసం రామోజీరావు ఎంతో కృషి చేశారు. తెలుగు జాతికి మార్గదర్శకుడిగా నిలిచారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి కృషి చేసిన మహనీయుడు.
ప్రజా చైతన్యానికి దోహదం
- ఈశ్వరయ్య, కేవీవీప్రసాద్, ఏపీ రైతు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు
అక్షర యోధుడిగా జర్నలిజానికే వన్నెతెచ్చిన మేధావి రామోజీరావు. ఈనాడు పత్రిక ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో ఆయన పాత్ర ఎనలేనిది. తెలుగు చరిత్రలో ఎప్పటికీ చెదిరిపోని సంతకం ఆయనది.
మద్య నిషేధ ఉద్యమంలో ఆయన తోడ్పాటు మరువలేనిది
- గేయానంద్, రామారావు, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు
మద్య నిషేధ ఉద్యమంలో జనవిజ్ఞాన వేదికకు రామోజీరావు అందించిన తోడ్పాటు మరువలేనిది. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర మహాసభ విజయనగరంలో జరిగినప్పుడు ఆయనే ముఖ్యఅతిథిగా వచ్చి ప్రసంగించారు. తెలుగువారి సామాజిక, రాజకీయ రంగాలను అన్ని విధాలుగా ప్రభావితం చేశారు.
తెలుగు భాష వ్యాప్తికి కృషి
- గుంటుపల్లి శ్రీనివాస్, సామాజికవేత్త
తెలుగు భాష వ్యాప్తి, ఆధునికీకరణ కోసం ఆయన చేసిన కృషిని తెలుగుజాతి ఎప్పటికి మర్చిపోదు. సాధారణ రైతు కుటుంబం నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన తీరు అందరికీ ఆదర్శం. నియంతృత్వ ప్రభుత్వాలకు తలవంచకుండా ఎదురునిలబడి పోరాడారు.
రామోజీరావు జీవితం నేటి యువతరానికి స్ఫూర్తి
- ఫరూక్ షిబ్లీ, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు
రామోజీరావు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన జీవితం నేటి యువతరానికి స్ఫూర్తిదాయకం. స్వయంకృషితో అనేక రంగాల్లో విజయం సాధించారు.
నిబద్ధతకు నిలువెత్తు రూపం
- టి.మనోహర్నాయుడు, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ
నిబద్ధతకు నిలువెత్తు రూపం రామోజీరావు. తెలుగు ప్రజలకు మార్గదర్శిగా నిలిచిన అక్షర యోధుడు. తెలుగు వర్ణమాలను ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టారు.
భావితరాల పత్రికా ప్రతినిధులకు మార్గదర్శి
- డాక్టర్ చింతామోహన్, కేంద్ర మాజీ మంత్రి
దేశ పత్రికా రంగంలోనే ఓ కొత్త ఒరవడిని సృష్టించిన రామోజీరావు.. భావితరాల పత్రికా ప్రతినిధులకు మార్గదర్శిగా నిలిచారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియో రామోజీ ఫిలింసిటీని తెలుగు నేలపై నెలకొల్పారు.
తెలుగువారి కీర్తిని ప్రపంచానికి చాటారు
- కత్తి నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ
‘క్రమశిక్షణ, శ్రమించేతత్వం, దార్శనికతతో తెలుగువారి కీర్తిని రామోజీరావు ప్రపంచానికి చాటారు. పత్రికా రంగాన్ని కొత్త పుంతలు తొక్కించారు. ఆయన జీవితం ఎందరికో ఆదర్శం.
అక్షర జ్ఞానంలో సంపన్నులు
- బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్సీ
రామోజీరావు అక్షర జ్ఞానంలో సంపన్నులు. ఈనాడు, ఈటీవీ, ప్రియా పచ్చళ్లు, ఉషాకిరణ్ మూవీస్, రామోజీ ఫిల్మ్ సిటీ తదితర సంస్థల అధినేతగా తనదైన ముద్ర వేశారు. టెలివిజన్ రంగంలో రారాజుగా వెలుగొందారు. ఆయన మృతి తెలుగు జాతికి తీరని లోటు.
ఈనాడు పత్రిక ప్రారంభించి రామోజీరావు తెలుగునాట సంచలనం సృష్టించారు. చెడుపై యుద్ధం చేసి నిరంతరం ప్రజలకు అండగా నిలిచారు. ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా వేలమంది జర్నలిస్టులను తయారుచేసి మంచికి స్థానం కల్పించిన మీడియా మొఘల్ ఆయన.
- ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్
రామోజీరావుకు ఘన నివాళి అర్పించండి
పార్టీ శ్రేణులకు తెదేపా అధిష్ఠానం పిలుపు
ఈనాడు డిజిటల్, అమరావతి: రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మృతి నేపథ్యంలో గ్రామ గ్రామాన సంతాప కార్యక్రమాలు నిర్వహించాలని తెదేపా శ్రేణులకు ఆ పార్టీ అధిష్ఠానం పిలుపునిచ్చింది. అన్ని వర్గాల ప్రజలూ పాల్గొనేలా చూడాలని శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.
తెదేపా కార్యాలయంలో నేతల నివాళులు
మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు.. రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తెలుగు జాతికి ఆయన చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. ఈనాడు ద్వారా తెలుగు భాషాభివృద్ధికి రామోజీరావు కృషి చేశారని తెలిపారు. కార్యక్రమంలో అచ్చెన్నాయుడు, బొండా ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, పల్లె రఘునాథ్రెడ్డి, అశోక్బాబు, దువ్వారపు రామారావు, బుచ్చిరాంప్రసాద్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
- గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు, తెదేపా అధికార ప్రతినిధులు గురజాల మాల్యాద్రి, ఆనం వెంకటరమణారెడ్డి, మీడియా కోఆర్డినేటర్ సతీష్ తదితరులు రామోజీరావు మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
దుబాయ్లో రామోజీరావుకు నివాళి
దుబాయ్లో రామోజీరావు చిత్రపటానికి నివాళి అర్పించిన తెలుగువారు
ఈనాడు డిజిటల్, అమరావతి: రామోజీరావు మృతి పట్ల దుబాయ్లోని తెలుగువారు సంతాపం ప్రకటించారు. పత్రికాధిపతిగా, రామోజీ ఫిల్మ్ సిటీ రూపశిల్పిగా ఆయన సేవలను కొనియాడారు. దుబాయ్లోని తెలుగు రెస్టారెంట్లో శనివారం జరిగిన సంతాప కార్యక్రమంలో రామోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం