అన్నదాతా! సుఖీభవ
‘‘నేను రైతుబిడ్డను. వ్యవసాయానికి ఎంతో రుణపడి ఉన్నాను. ఆ రుణం తీర్చుకునేందుకు నేను ఎంచుకున్న మార్గం అన్నదాత’’.. అని కర్షకుల ప్రస్తావన వచ్చినప్పుడు రామోజీరావు చెప్పేవారు.
ఇదే రైతుబిడ్డ రామోజీరావు సంకల్పం
‘‘నేను రైతుబిడ్డను. వ్యవసాయానికి ఎంతో రుణపడి ఉన్నాను. ఆ రుణం తీర్చుకునేందుకు నేను ఎంచుకున్న మార్గం అన్నదాత’’.. అని కర్షకుల ప్రస్తావన వచ్చినప్పుడు రామోజీరావు చెప్పేవారు. ఈ మాటలకు ఆయన కడవరకు కట్టుబడి ఉన్నారు. అన్నదాతకు కొండంత అండగా నిలిచేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ విడిచిపెట్టలేదు. మాధ్యమం ఏదైనా ఆయన ప్రాథమ్యం రైతు సంక్షేమమే. నాటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ‘జైకిసాన్’ అని నినదిస్తే.. దాన్ని ఆచరణలో చూపిన వ్యక్తి రామోజీరావు.
ఈనాడు, హైదరాబాద్: రైతుబిడ్డగా పుట్టిన రామోజీరావు ‘‘అన్నదాతా! సుఖీభవ’’ అనే మాటను నినాదాలకే పరిమితం చేయలేదు. ఆరుగాలం కష్టపడే కర్షకుల ఇంట సిరులపంట పండించాలన్న సంకల్పంతో అక్షరసేద్యం చేశారు. అన్నదాత, ఈనాడు, ఈటీవీ.. ఇలా వేర్వేరు మాధ్యమాల ద్వారా వ్యవసాయదారుల సాధికారతకు, సంక్షేమానికి తన వంతు కృషి చేశారు. 1969లో ‘అన్నదాత’ మాసపత్రికను ప్రారంభించారు. ఆ తర్వాత వచ్చిన ‘ఈనాడు’లో రైతేరాజు, ఈటీవీలో అన్నదాత, ఈటీవీ-2లో జైకిసాన్.. ఇలా పలు కార్యక్రమాలతో రైతుల పక్షపాతిగా కొనసాగారు. ‘అన్నదాత’ వ్యవసాయ పరిజ్ఞానాన్ని కూలంకషంగా అందించగా.. వ్యవసాయ ఉత్పత్తులను లాభసాటిగా అమ్ముకోవడంలో ‘జైకిసాన్’ రైతులకు మార్గదర్శకంగా నిలిచింది. ఈనాడులోని ‘రైతేరాజు’ శీర్షిక ఒకరకంగా రైతన్నల వేదం. ఇలా రైతులకు రామోజీరావు సమర్పించిన అక్షర సుమాలు ఒక్కొక్కటీ చరిత్ర సృష్టించి, కష్టజీవుల రుణం తీర్చుకొంటూ వచ్చాయి.
- తెలుగు రైతులకు ఆచరించదగిన సూచనలు చేసే మార్గదర్శిగా నిలిచింది ‘అన్నదాత’. ఆయా సీజన్లలో, నెలల్లో సాగుకు ఉపయోగపడే, ఆచరణసాధ్యమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒక నెల ముందుగానే అందజేసేది. ఉత్తరాలు, ఫోన్కాల్స్ ద్వారా రైతులు అడిగిన సందేహాలను శాస్త్రవేత్తల సహకారంతో నివృత్తి చేసేది. పశుపోషకుల పరిజ్ఞానాన్ని పెంపొందించడంలోనూ అన్నదాత సహకారం ఎంతో! 1995లో మరో అడుగు ముందుకేసి, ఎలక్ట్రానిక్ మీడియాలో ఈటీవీ ద్వారా అన్నదాత కార్యక్రమ ప్రసారాలను ప్రారంభించి కొత్తచరిత్రకు శ్రీకారం చుట్టారు. రైతులకు పంటల సాగుపై సమస్త సమాచారాన్ని అందించడం ద్వారా ‘అన్నదాత’ ఒక విప్లవమే తెచ్చింది. సాగుకు సంబంధించి అన్నిరకాల మెలకువల్ని ప్రత్యేకంగా చూసి ఎందరో రైతులు సేద్యంలో పురోగమించారు. ఈటీవీ ప్రాంతీయ భాషా ఛానళ్ల ద్వారా అన్నదాత కార్యక్రమం దేశంలో ఎందరో రైతులకు మార్గదర్శిగా నిలిచింది. ఇదే స్ఫూర్తితో ప్రారంభించిన మరో వ్యవసాయ కార్యక్రమం ‘జైకిసాన్’ రూపకల్పనా ఒక సంచలనమే. పంటల సాగుకు సంబంధించిన సూచనలకు అన్నదాత కేంద్రమైతే.. రైతు సమస్యలు, ప్రభుత్వ విధానాలు, మార్కెటింగ్ సమస్యలు, వాటి పరిష్కారాలను సూచించడానికి ‘జైకిసాన్’ వేదికగా నిలిచింది. దేశంలో టీవీ మాధ్యమం ద్వారా ఈ రెండు కార్యక్రమాలు రైతులకు అత్యుత్తమ సేవలందిస్తున్నాయని అంతర్జాతీయ వేదికపై కొందరు నిపుణులు పరిశోధనా పత్రాలు సమర్పించడం రామోజీరావు కృషికి సరైన గుర్తింపు.
- రామోజీరావు దృష్టిలో రైతు ఎప్పుడూ రాజే. అందుకే 1974లో ‘ఈనాడు’ దినపత్రిక ప్రారంభించిన తరవాత కొన్నాళ్లకు ‘రైతేరాజు’ పేరుతో ప్రత్యేక కాలమ్ ప్రవేశపెట్టారు. ప్రతిరోజూ రాష్ట్రంలోని రైతులకు సకాలంలో లభించవలసిన శాస్త్రీయ సమాచారం, సలహాలను అత్యంత ప్రజాదరణ గల పత్రిక ద్వారా అందించాలనే ఆకాంక్షతో రూపుదిద్దుకున్నదే ఈ శీర్షిక. రాష్ట్రంలోని పాడిపంటలు, అనుబంధ వృత్తులు, కార్యక్రమాలు, రైతుల స్థితిగతుల్లో ఉన్న వైవిధ్యానికనుగుణంగా ఆయా ప్రాంతాలకు సకాలంలో అవసరమైన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అందించాలన్నదే ఆయన సంకల్పం.
- అన్నదాతల సంక్షేమం గురించి రామోజీరావు ఆలోచనలు ఇంతటితో ఆగిపోలేదు. కష్టపడి పనిచేయడం, దేవునిపై భారం వేయడం తప్ప పోరాటాలు తెలియని కర్షకుల గొంతుకగా నిలిచారు. నకిలీ విత్తనాల మోసాలు, దళారుల దందాలతో అన్నదాతకు జరుగుతున్న అన్యాయంపై ఈనాడు, ఈటీవీ ద్వారా గళమెత్తారు. ప్రకృతి విపత్తులతో నష్టపోయి, సాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్న రైతులను సర్కారీ వ్యవస్థలకన్నా ముందే వెళ్లి పలకరించి భరోసా కల్పించారు. కరవు కాటకాలు, తుపానుల సందర్భంగా రైతులకు జరిగిన నష్టాన్ని పాలకుల కళ్లకు కట్టేలా చూపించి.. పరిహారం దక్కేలా చూడటంలో తన వంతు కృషి చేశారు. ఇలా ప్రతి దశలోనూ రైతు అభ్యున్నతి కోసం పరితపించి, పనిచేసిన రామోజీరావు తెలుగురైతుల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
-
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్